English | Telugu
టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పై నిర్భయ కేసు
Updated : Jun 17, 2020
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి పై నిర్భయ కేసు ఫైల్ ఐంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్న నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారని అభియోగం. దీని పై నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం తో నిర్భయ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కాగా ఒక మాజీ మంత్రి పై నిర్భయ కేసు పెట్టడం ఇదే మొదటి సారి. ఇప్పటికే మరో మాజీ మంత్రి అచ్చెన్నను ఎసిబి, మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి, అయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపధ్యం లో టీడీపీ కి ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి.