English | Telugu
తెలంగాణలో మళ్ళీ లాక్ డౌన్ పై క్లారిటీ వచ్చినట్లేనా
Updated : Jul 4, 2020
ఐతే తాజాగా ఈ విషయం పై హైదరాద్ కు చెందిన సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కరోనా కు లాక్ డౌన్ అనేది సమాధానం కాదని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మాస్క్ లు ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటివి పాటిస్తే కరోనా ను అదుపులో పెట్టవచ్చని అన్నారు. మరో పక్క ప్రయివేట్ హాస్పిటల్స్ కు కరోనా ట్రీట్ మెంట్ కు అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వాన్ని కొంతమంది విమర్శించారని ప్రస్తుతం ఈ హాస్పిటల్స్ దోపిడీ షురూ అయిందన్నారు. ఐతే ప్రస్తుతం ఈ హాస్పిటల్స్ వద్ద 10 గంటలు వేచి ఉన్నా కనీసం పేషంట్లను చేర్చుకునే పరిస్థితిలో కూడా అవి లేవని ఆయన అన్నారు. దీంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయన్నారు. దీన్ని బట్టి లాక్ డౌన్ ఆలోచన తెలంగాణ సర్కార్ చేయడం లేదని అర్ధమవుతోంది.
లాక్ డౌన్ విధించే విషయంలో ప్రభుత్వం కోణం మాత్రం వేరుగా ఉందంటున్నారు పరిశీలకులు. గత ఏప్రిల్, మే నెలల్లో విధించిన లాక్ డౌన్ తో ప్రభుత్వం ఆదాయం అడుగంటిందని దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీలలో కూడా కోత విధించవలసి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం బహుశా లాక్ డౌన్ ఆలోచన చేయకపోవచ్చని, ఐతే కంటైన్మెంట్ జోన్లలో మాత్రం స్ట్రిక్టుగా నిబంధనలు అమలు చేస్తారని మరో వాదన.