English | Telugu

టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దివాకర్‌ ట్రావెల్స్‌ మేనేజర్‌ నాగేశ్వరరెడ్డి ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు.

అంతకుముందు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. లారీ ఇంజిన్ నెంబర్లను అక్రమంగా వాడుకొని తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ ఆరోపణలు చేశారు. బీఎస్-3 వాహనాలను బీఎస్- 4 వాహనాలుగా మార్చి తమకు అమ్మారని, నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో, వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు లారీ ఓనర్లను అక్కడి నుంచి పంపించేశారు.

దీనిపై ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు స్పందిస్తూ.. ధర్నా వ్యవహారం వెనక ఉన్న అధికార పార్టీ ఉందని ఆరోపించారు. ఇదంతా జేసీ కుటుంబంపై బుదరజల్లే ప్రయత్నమని, త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు.