English | Telugu
భారత్ బయోటెక్ లో విదేశీ ప్రతినిధులు! కరోనా టీకా తయారీని వివరించిన డాక్టర్ కృష్ణ ఎల్లా
Updated : Dec 9, 2020
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు మన దేశంలో ఉన్న వివిధ దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు, ఆ దేశాలకు చెందిన వైద్య నిపుణులు, వైద్యారోగ్య రంగంలో పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ తయారీని పరిశీలిస్తున్నారు. హెడ్స్ ఆఫ్ మిషన్ అనే పేరుతో వస్తున్న 80 దేశాలకు చెందిన ప్రతినిధుల్లో అరవై మంది ఆయా దేశాల అంబాసిడర్లు (రాయబారులు) ఉన్నారు. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, డెన్మార్క్, భూటాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్… ఇలా చాలా దేశాలకు చెందినవారు ఉన్నారు. ఇందులో భాగంగా రెండు బృందాలుగా హైదరాబాద్ కు వచ్చారు విదేశీ ప్రతినిధులు. ఒక బృందం జినోమ్వ్యాలీలో భారత్ బయోటెక్ను.. మరో బృందం బయోలాజికల్-ఇ సంస్థను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించాయి. భారత్ బయోటెక్ను గతంలో ఎందరో ప్రముఖులు సందర్శించారు. పదిరోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ కూడా వచ్చి వెళ్లారు.