English | Telugu
నక్సలైట్లలో చేరి నా పరువు కాపాడుకుంటా.. రాష్ట్రపతికి శిరోముండనం బాధితుడి లేఖ
Updated : Aug 11, 2020
జులై 22న సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా శిరోముండనాన్ని సీరియస్ గా భావిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఈ కేసు విషయంలో ఏడుగురి మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ లో 6వ ముద్దాయి ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తికాగా, 7వ ముద్దాయి పోలీసు అధికారి అయిన ఎస్ఐ కాగా అతడిని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి, జైలుకు కూడా పంపారు. అయితే ఎఫ్ఐఆర్ లో 1 నుంచి 6 వరకూ ఉన్న ముద్దాయిలను మాత్రం ఇంతవరకూ అరెస్ట్ చేయలేదు. ఈ కేసులో వీరే ప్రధాన నిందితులు. అంతే కాకుండా ఇక్కడ ఎస్ఐ ఉద్యోగంలో చేరి కేవలం 48 గంటలు అయింది. ఆయనకూ, నాకూ ఎటువంటి వ్యక్తిగత గొడవలు లేవు. అసలు ఈ శిరోముండనం కేసు విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ముద్దాయిలను అరెస్ట్ చేయలేదు. నాకు ఏవిధమైన సహాయమూ చేయలేదు. నేను దళితుడిని కావడం వల్లే నాకు న్యాయం జరగడంలేదు. "నేను నా పరువు కాపాడుకుంటాను... దయవుంచి నక్సల్స్లో చేరడానికి నాకు అనుమతి ఇవ్వండి. ఇక్కడ శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి" అని రాష్ట్రపతికి రాసిన ఆ లేఖలో ప్రసాద్ పేర్కొన్నారు. అయితే ఈ కేసు రాష్ట్రపతి దృష్ఠికికూడా వెళ్ళిన నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.