English | Telugu
ఏపీ ప్రభుత్వానికి మరో దెబ్బ.. వైసీపీ ఎంపీ కి కేంద్రం వై కేటగిరి భద్రత..!
Updated : Aug 6, 2020
ఐతే రఘురామరాజు కోరినట్లుగా కేంద్రం రక్షణ కల్పించటం ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు సవాల్ గా మారుతోంది. గడచినా కొద్దీ నెలలో ఇలా జరగడం ఇది రెండో సారి. గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ సైతం రాష్ట్రంలో తనకు భద్రత లేదంటూ కేంద్రానికి ఫిర్యాదు చేసారు. ఆ సమయంలోనూ ఆయనకు భద్రత కల్పించేందుకు కేంద్ర హోం శాఖ సూచనలు చేసింది. ఇది ఇలా ఉండగా పార్టీ పరంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఇరకాటంలో పెట్టే విధంగా అనేక అంశాల పైన రఘురామరాజు బహిరంగ లేఖలు రాస్తున్నా ఆయన పైన ఇప్పటివరకు ఎటువంటి క్రమశిక్షణా చర్యలు కూడా వైసిపి తీసుకోలేకపోయింది.