English | Telugu
ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ లో అపశృతి.. వాలంటీర్ మృతి..
Updated : Oct 22, 2020
వ్యాక్సిన్ మొదటి, రెండో దశ పరీక్షల సందర్భగా అనారోగ్యానికి గురై అతను మరణించినట్టుగా బ్రెజిల్ హెల్త్ అథారిటీ అన్విసా బుధవారం వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన డేటా అందిందని.. దీనిపై దర్యాప్తు చేపట్టామని చెప్పింది. అయితే వాలంటీర్ మృతిచెందిన తర్వాత కూడా వ్యాక్సిన్ పరీక్షలు కొనసాగుతాయని తెలిపింది. బ్రెజిల్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ను పర్యవేక్షిస్తున్న ఫెడరల్ యూనివర్సిటీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిచింది. అయితే ట్రయల్స్ సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి బ్రెజిల్కు చెందిన వ్యక్తి అని తెలిపింది. అయితే చనిపోయిన వాలంటీర్.. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మరణించాడా?, లేక మరేదైనా అనారోగ్య కారణలతో మృతిచెందాడా? అనేదానిపై ఇంకా స్ఫష్టత రావాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా వ్యాక్సిన్ భద్రతపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని ఆక్స్ఫర్డ్ తాజాగా స్పష్టం చేసింది.