English | Telugu
ఏపీ రాజధాని అమరావతి పై బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందా..!
Updated : Jul 6, 2020
ఇది జరిగిన రెండు రోజుల్లోనే ఒక టీవీ డిబేట్ లో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తమ పార్టీ అమరావతికి సంఘీభావం తెలుపుతుందని ఐతే ఈ విషయంలో కేంద్రం మాత్రం జోక్యం చేసుకోదని అన్నారు. ఇపుడు తాజాగా ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దేవధర్ అమరావతికి మద్దతు ప్రనటించారు. ఐతే ఈ అంశం లో కేంద్రం జోక్యం చేసుకోదని తేల్చి చెప్పారు. దీంతో అటు అమరావతికి భూములిచ్చిన రైతులలోను, ఇటు రాష్ట్ర ప్రజలలోను అయోమయం నెలకొంది. ఒక పక్క అమరావతికి మద్దతు అంటున్న బీజేపీ నేతలు మరో పక్క కేంద్రం జోక్యం విషయంలో మాత్రం రెండు రకాలుగా మాట్లాడుతూ ఉండడం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.