English | Telugu
బీజేపీ కార్పోరేటర్లకు రూ.5 కోట్లు ఆఫర్ !
Updated : Dec 24, 2020
తెలంగాణ పోలీసులు నిజంగా హీరోలేనని మరోసారి స్పష్టం చేశారు బండి సంజయ్. 15 నిమిషాలు ఓల్డ్ సిటీని అప్పగిస్తే జల్లెడ పడుతారని చెప్పారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్ వాళ్లను బయటకు తీస్తారని చెప్పుకొచ్చారు బండి సంజయ్. ఖమ్మంకు చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. టీఆర్ఎస్ సర్కార్ పై , సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ పతనం మొదలైందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారం ఖాయమని చెప్పారు.