English | Telugu
మోదీ ప్రతినిధిగా మాట్లాడుతున్నా.. అమరావతే ఏపీ రాజధాని
Updated : Dec 14, 2020
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధిగా తాను మాట్లాడుతున్నానని సోము వీర్రాజు చెప్పారు. అమరావతిలో రూ. 1800 కోట్లతో నిర్మిస్తున్న ఎయిమ్స్ హాస్పిటల్ ఆగలేదని, దుర్గమ్మ ఫ్లైఓవర్ ను పూర్తి చేశామని తెలిపారు. మోదీ అమరావతి వైపే ఉన్నారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. బీజేపీ కార్యాలయాన్ని కూడా విజయవాడలోనే కడుతున్నామని చెప్పారు. బీజేపీ మాట తప్పే పార్టీ కాదని, అమరావతిలోనే రాజధాని ఉండాలని బీజేపీ తరపున ఉద్యమం చేస్తామని అన్నారు. 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి అధికారం ఇస్తే.. అమరావతిని బాగా అభివృద్ధి చేసి చూపిస్తాం అని వీర్రాజు చెప్పుకొచ్చారు.