English | Telugu
మా ఎంపీ సుజనా వ్యాఖ్యలు పార్టీ విధానానికి విరుద్ధం.. స్పష్టం చేసిన ఏపీ బీజేపీ
Updated : Jul 31, 2020
ఐతే తాజాగా ఏపీలో మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై ప్రజలకు మరింత స్పష్టంగా చెపుతూ ఇపుడు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో సుజనా వ్యాఖ్యల పై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. "రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందన్న బీజేపీ ఎంపీ సుజనాచౌదరి గారి వ్యాఖ్య పార్టీ అభిప్రాయం కాదు. ఐతే రాజధాని అమరావతి లోనే కొనసాగాలి అనేది మా అభిమతం.. కానీ ఈ విషయం మాత్రం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బీజేపీ విధానంగా అధ్యక్షులు సోమువీర్రాజు గారు స్పష్టం చేశారు" అని పేర్కొంది.