English | Telugu
నాగ్ అంటే సెట్స్మీద ఆడవాళ్లంతా పడిచచ్చేవాళ్లు!
Updated : Sep 15, 2022
'బ్రహ్మాస్త్ర' మూవీలో నాగార్జునతో కలిసి నటించిన అనుభవాన్ని షేర్ చేసుకుంది మౌనీ రాయ్. ఒక న్యూస్ పోర్టల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తను నాగార్జునతో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు వెల్లడించింది. బల్గేరియాలోని డెవిన్లో తమ మధ్య సీన్లను చిత్రీకరించారని ఆమె చెప్పింది. షూటింగ్ జరిగేటప్పుడు సెట్స్పై ఉన్న ఆడవాళ్లంతా ఆయనంటే పడిచచ్చిపోయేవాళ్లని, ఆయన దగ్గరకు వెళ్లాలని అర్రులు చాస్తూ వచ్చేవారని తెలిపింది మౌనీ. ఆఖరుకి కాస్ట్యూమ్ టీమ్లోని ఒకమ్మాయి, నాగ్ను చూసినప్పుడల్లా తనకు 'తూ మిలే దిల్ ఖిలే' అనే పాట బ్యాగ్రౌండ్లో వినిపిస్తున్నట్లు, వయొలిన్లు మోగుతున్నట్లు అనిపిస్తుందని చెప్పిందని వెల్లడించింది.
నాగ్ను ప్రశంసలతో ముంచెత్తింది మౌని. ఆయన చాలా అందగాడనీ, లోపలా, బయటా ఆయన చాలా మంచి మనిషని చెప్పుకొచ్చింది. "ఆయన బ్రిలియంట్ యాక్టర్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అమోఘం" అందామె.
అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన 'బ్రహ్మాస్త్ర'లో నంది అస్త్రాన్ని పొందిన అనీశ్ శెట్టి అనే ఆర్టిస్ట్గా నాగార్జున నటించాడు. ఇక జునూన్ అనే నెగటివ్ రోల్ను మౌనీ రాయ్ పోషించింది. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధిస్తోంది. అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ కూడా ఈ మూవీలో కీలక పాత్రలు చేశారు.