మసాలా వడ

 

 

 

కావాల్సిన పదార్ధాలు:

మినపప్పు - పావు కప్పు

పచ్చి సెనగపప్పు - పావు కప్పు

కంది పప్పు - పావు కప్పు

సోంపు - ఒక టేబుల్ స్పూన్

జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్

అల్లం - కొద్దిగా

వెల్లులి - 7 రెబ్బలు

ఉప్పు - తగినంత

పచ్చిమిర్చి - నాలుగు

కొత్తిమీర తరుగు - కొద్దిగా

ఎండుమిర్చి - రెండు

కరివేపాకు - రెండు రెబ్బలు

ఉల్లిపాయ తరుగు - ఒకటి

పుదీనా తరుగు - కొద్దిగా

నూనె - వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

*మినపప్పు,సెనగపప్పు, కందిపప్పుని 3-4 గంటలు నానబెట్టుకోవాలి.

*నాలుగు గంటలు నానబెట్టిన పప్పుని జల్లెడలో వేసి పూర్తిగా వడకట్టి రెండు నిమిషాలు వదిలేయాలి.

*మిక్సీ జార్ లో సోంపు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లులి, ఎండుమిర్చి, నానబెట్టిన పప్పు వేసి నీరు వేయకుండా పలుకుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి.

*ఒక గిన్నెలోకి బరకగా రుబ్బుకున్న పప్పు, ఉల్లిపాయ తరుగు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి గట్టిగా కలుపుకోవాలి.

*చేతులు తడి చేసుకుని కలిపిన పిండిని తీసుకుని చేత్తో తట్టి మరిగే వేడి నూనెలో వేసి కదపకుండా వదిలేయాలి మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. మూడు నాలుగు నిమిషాల తరువాత నెమ్మదిగా గరిటతో తిప్పుతూ మీడియం ఫ్లేమ్ మీదే ఎర్రగా వేగనివ్వాలి.

*ఎర్రగా వేగిన వడని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ మూడు పప్పుల మసాలా వడ వేడి మీద చాలా క్రిస్పీగా ఉంటాయి.