కొడాలి నాని పరిస్థితి డౌటే?!

వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్యం దెబ్బతిందన్న వార్తలు నాలుగు రోజుల క్రితం వచ్చిన సంగతి తెలిసిందే. నాన్‌స్టాప్ మద్యం తీర్థం, గుట్కా ప్రసాదం కారణంగా నాని ఆరోగ్యం చాలా టూమచ్‌గా డ్యామేజ్ అయిపోయిందన్న వార్తలు వచ్చాయి. అనుచరులతో మాట్లాడుతున్న నాని అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో ఆయనకు ఇంటిదగ్గరే చికిత్స జరుగుతోందని ఆ వార్తల సారాశం. ఈ నేపథ్యంలో కొడాలి నాని ఆరోగ్యం రాయిలాగా వుందని, ఆయన ఉక్కుముక్కలా, టేకు చెక్కలా, చింతపిక్కలా వున్నారని ఆయన అనుచరులు చెబుతూ వచ్చారు. ‘నానికి అనారోగ్యం’ అనే వార్తలను వారు ఖండించారు. అలాగే కొడాలి నాని ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్‌లో ఒక వీడియో పోస్టు అయింది. ఒక కుర్చీలో అడ్డదిడ్డంగా కూలబడి వున్న కొడాలి నాని ఫోన్ చూసుకుంటున్నట్టుగా ఆ ఎనిమిది క్షణాల వీడియో వుంది. ‘తనపై వచ్చిన అనారోగ్య వార్తలకు వీడియోతో చెక్ పెట్టిన కొడాలి నాని’ అనే వార్తలను జగన్ అనుకూల మీడియా భారీ స్థాయిలో వ్యాప్తి చేసింది. సరేలే.. మనిషి ఆరోగ్యంగానే వున్నాడుగా అని అందరూ అనుకున్నారు. కానీ, తాజాగా తెలుస్తున్న విషయం ఏమిటంటే, అది పాత వీడియో! ఎప్పటిలో పాత వీడియో ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసి నాని ఇప్పుడు ఆరోగ్యంగానే వున్నాడు అనే కలరింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాని వున్న సైజుకి, ఆ వీడియోలో వున్న సంబంధం లేదు. తన ఆరోగ్యం బాగాలేదని వార్తలు భారీ స్థాయిలో వస్తే, ‘అయ్యా నేను బాగానే వున్నాను. నా ఆరోగ్యం మీద వస్తున్న పుకార్లని నమ్మొద్దు’ అని నాలుగు ముక్కలు చెప్తే సరిపోతుంది కదా.. అలా చెప్పకుండా ఒక అడ్డదిడ్డంగా కూర్చున్న ఎనిమిది క్షణాల నిడివి వున్న వీడియో పోస్టు చేశారంటే అర్థమేంటి? ఏదో సమ్‌థింగ్ రాంగ్ వుందని! అయినా ప్రజలకు తన నుంచి ఒక వీడియో మెసేజ్ పంపుతున్నామంటే ఎంత పద్ధతిగా వుండాలి? కొడాలి నాని ఎక్స్ అకౌంట్లో పెట్టిన ఆ వీడియోలో పద్ధతీ పాడూ లాంటివేవైనా వున్నాయా? కొడాలి నాని ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు. గుడివాడ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఎన్నికల ప్రచారంలో ముక్కుతూనో, మూలుగుతూనో నియోజకవర్గం అంతా తిరిగాడు. ఎన్నికల ముగిసిన తర్వాత ప్రజల్లో తిరగడం గానీ, పోనీ బయటకి వెళ్ళడానికి ఏమైనా ఇబ్బంది వుంటే, తన ఇంట్లోనే ప్రజలతో, కార్యకర్తలతో కలసి మాట్లాడ్డం అంటూ జరగాలిగా.. అలాంటిదేమీ జరగడం లేదు. ఈయన బయటకి వెళ్ళడం లేదు.. ఇంట్లోకి ఎవరినీ రానివ్వడం లేదు.  విశ్వసనీయ సమాచారం ప్రకారం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి డౌట్‌గానే వున్నట్టు తెలుస్తోంది. ఆస్పత్రిలో చేరిస్తే భారీ స్థాయిలో ప్రచారం, ట్రోలింగ్ మొదలైపోతుంది కాబట్టి, ఇంట్లోనే ట్రీట్‌మెంట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కౌంటింగ్ జరిగే జూన్ నాలుగో తేదీ నాటికి కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళి కాసేపు కూర్చునే స్థాయి ఆరోగ్యాన్ని అయినా తిరిగి అందించడానికి డాక్టర్లు తంటాలు పడుతున్నట్టు సమాచారం. కొడాలి నాని ఆరోగ్యం పాడైపోతే పాడైపోయి వుండొచ్చుగానీ, ప్రాణానికేం ప్రమాదం వుండకపోవచ్చు.. ఎందుకంటే, ఆయన కోలుకోవాలని, ప్రాణాలతో వుండాలని రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నాయి మరి!
Publish Date: May 27, 2024 6:35PM

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ బొమ్మ ఎత్తిపోయింది!

వైసీపీ బొమ్మ ఎత్తిపోయింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపుపై సొంత పార్టీ నేతలే నమ్మకం కోల్పోయారు.  రెండు వారాల కిందట ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. పోటీ హోరాహోరీగా జరుగుతుందని అంతా భావించినా పోలింగ్ తరువాత సీన్ అందరికీ అర్ధమైపోయింది.   తెలుగుదేశం కూటమిలో  ఉత్సాహం ఉరకలేస్తుంటే... వైసీపీ శిబిరంలో నైరాశ్యం తాండవిస్తోంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ కొందరు వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి గెలుపు ధీమా ఒలక పోస్తున్నా వారి ముఖాల్లో మాత్రం ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలక నియోజకవర్గాలు గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం, పెనమలూరు, మైలవరంలలో అభ్యర్థుల గెలుపు ఓటములపై సాగుతున్న బెట్టింగుల తీరు ను బట్టి వైసీపీ అభ్యర్థుల దయనీయ స్థితి ఇట్టే అర్ధమైపోతుంది. ఈ నియోజకవర్గాలలో వైసీపీ విజయంపై బెట్టింగులకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొని ఉంది. అదే సమయంలో కూటమి అభ్యర్థుల గెలుపు మీద కంటే వారి మెజారిటీల మీద పెద్ద ఎత్తున బెట్టింగులు కాయడానికి పందెం రాయుళ్లు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా గన్నవరంలో అయితే వల్లభనేని వంశీపై తెలుగుదేశం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు పది వేలకు పైగా మెజారిటీ సాధిస్తారని లక్షల రూపాయలు బెట్టింగులు కడుతున్నారు. అదే సమయంలో యార్లగడ్డకు అంత మెజారిటీ రాదని వైసీపీ వారు బెట్టింగులకు దిగుతున్నారంటే ఓటమి అంగీకరించేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే విధంగా గుడివాడలో కొడాలి నాని పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము విజయం సాధిస్తారంటూ పెద్ద ఎత్తున పందేలు ఒడ్డుతున్నారు. వెనిగండ్ల రాము విజయంపై నూజివీడుకు చెందిన కొందరు 20 లక్షల రూపాయలు పందెం ఒడ్డినట్లు తెలుస్తోంది. అదే సమయంలో నాని విజయంపై పందెం కాయడానికి ఎవరూ ముందుకురాని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి చూస్తుంటే వైసీపీ నేతలు ఈ రెండు నియోజకవర్గాలలోనూ పరాజయాన్ని అంగీకరిచేసినట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.  
Publish Date: May 27, 2024 5:43PM

లాప్‌టాప్‌కి ఛార్జింగ్ పెడుతూ...

చెన్సైలో లేడీస్ హాస్టల్లో లాప్‌టాప్‌కి ఛార్జింగ్ పెడుతూ శరణిత (32) అనే మహిళ మరణించారు. ఎంబీబీఎస్ చదివిన శరణిత కోయంబత్తూరులో డాక్టర్‌గా ప్రాక్టీస్ట్ చేస్తున్నారు. ఆమె భర్త కూడా డాక్టరే. శరణిత ప్రస్తుతం పీజీ చదువుతున్నారు. దానికి సంబంధించిన ఒక పరీక్ష రాయడం కోసం ఆమె చెన్నైకి వచ్చి లేడీస్ హాస్టల్లో వుంటున్నారు. సోమవారం నాడు ఆమెకు భర్త ఫోన్ చేయగా ఆమె లిఫ్ట్ చేయలేదు. ఆయన లేడీస్ హాస్టల్ యాజమాన్యాన్ని అప్రమత్తం చేశారు. వారు తలుపులు పగులగొట్టి లోపలకి వెళ్ళి చూశారు. లోపల చేతుల్లో లాప్‌టాప్, లాప్‌టాప్ ఛార్జర్ పట్టుకుని వున్న శరణిత కుప్పకూలిపోయి కనిపించారు. ఆమె అప్పటికే చనిపోయారు. లాప్‌టాప్ ఛార్జర్ కేబుల్ డ్యామేజ్ అవడం వల్ల కరెంట్ షాక్ కొట్టి ఆమె చనిపోయినట్టు తెలుస్తోంది.
Publish Date: May 27, 2024 5:22PM

కవిత బెయిల్ పిటిషన్  విచారణ మంగళవారానికి వాయిదా 

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో క‌విత బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణను ఢిల్లీ హైకోర్టు మంగ‌ళ‌వారానికి వాయిదా వేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో దాఖ‌లైన బెయిల్ పిటిష‌న్ల‌పై జ‌స్టిస్ స్వ‌ర్ణ‌కాంత శ‌ర్మ రేపు తదుపరి విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు. కాగా, త‌న పిటిష‌న్ల‌లో క‌విత బెయిల్‌తో పాటు అరెస్టు, రిమాండ్‌ను ఆమె స‌వాల్ చేశారు.  క‌విత త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన న్యాయ‌వాది విక్ర‌మ్ చౌద‌రి ఆమె అరెస్టులో ద‌ర్యాప్తు సంస్థ‌లు చ‌ట్టాన్ని ఉల్లంఘించాయ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఈడీ, సీబీఐలు కౌంట‌ర్ అఫిడ‌విట్ల‌ను దాఖ‌లు చేశాయి. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు తదుపరి విచార‌ణ జ‌ర‌గ‌నుంది.  కాగా, ఫ‌లితం ఎలా ఉన్నా వాద‌న‌లు చాలా బాగా ఉన్నాయ‌ని విక్ర‌మ్ చౌద‌రిని జ‌స్టిస్ స్వ‌ర్ణ‌కాంత శ‌ర్మ ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా క‌విత త‌ర‌ఫు న్యాయ‌వాది ప‌లు కీల‌క విష‌యాల‌ను న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆమెపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోబోమంటూ సుప్రీంకోర్టులో ఈడీ అండ‌ర్ టేకింగ్ ఇచ్చింద‌ని.. క‌విత వేసిన రిట్ పిటిష‌న్ సుప్రీంలో పెండింగులో ఉండ‌డంతో విచార‌ణ ముందుకు సాగ‌డం లేదంటూ ఈడీ సుప్రీంకోర్టుకు లేఖ రాసింద‌ని తెలిపారు. తాము ఇచ్చిన అండ‌ర్ టేకింగ్ త‌దుప‌రి వాయిదా వ‌ర‌కే అని అందులో స్పష్టం చేశారని చెప్పారు.  సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండ‌గానే 41 (ఏ) ప్ర‌కారం స‌మ‌న్లు జారీ చేశార‌ని విక్ర‌మ్ చౌద‌రి గుర్తు చేశారు. సీఆర్‌పీసీ 161 ప్ర‌కారం మొద‌ట నోటీసులు ఇచ్చిన‌వారు,  ఆ త‌ర్వాత 41 (ఏ)కు ఎందుకు మారారో తెలియ‌ద‌న్నారు. సుప్రీంలో విచార‌ణ జ‌రుగుతుండ‌గానే ఈడీ బృందం క‌విత ఇంట్లో ఉంద‌ని చెప్పారు. అదే రోజు ఆమెను అదుపులోకి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింద‌ని తెలిపారు.  అలాగే జ్యూడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉండ‌గానే క‌విత‌ను ప్ర‌శ్నించాలంటూ సీబీఐ పిటిష‌న్ వేసింది. ఆ పిటిష‌న్‌ను న్యాయ‌స్థానం అంగీక‌రించింది. కానీ, దీని గురించి ఆమెకు మాత్రం ఎలాంటి స‌మాచారం లేద‌ని చెప్పుకొచ్చారు. సీఆర్‌పీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం సీబీఐ ప్ర‌శ్నించాలంటే క‌విత వాద‌న కూడా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాల్సి ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆ త‌ర్వాత క‌నీసం అరెస్ట్ వారెంట్ కూడా లేకుండానే సీబీఐ అరెస్టు చేసింద‌న్నారు. రేపు మ‌ధ్యాహ్నం కౌంట‌ర్ వాద‌న‌లు వినిపిస్తామ‌ని న్యాయ‌స్థానానికి ఈడీ తెలిపింది
Publish Date: May 27, 2024 5:02PM

తిరుగుబాటు మొదలయ్యింది! ఇప్పుడు భారతి సిమెంట్! 4 త‌రువాత తాడేప‌ల్లి ప్యాలెస్‌!

భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీపై ప్రజలు తిరుగుబాటు చేశారు. కడప జిల్లాలో యర్రగుంట్ల వద్ద ఉన్న ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఒక్క సారిగా రోడ్లపైకి వచ్చి ఆ కంపెనీ లారీలను అడ్డుకున్నారు. భార‌తి సిమెంట్స్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.  కాలుష్యం కారణాలతో … పలు గ్రామాల ప్రజలు కొంత కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతి సిమెంట్ పరిశ్రమ నుంచి వచ్చే వాహనాల కారణంగా దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ వాహనాలను ఆపివేసి వారు త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారు.  ప్రభుత్వం జోక్యం చేసుకొని భారతీ సిమెంట్  కాలుష్యం నుంచి కాపాడాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం భారతి సిమెంట్స్‌గా చలామణిలో ఉన్న రఘురాం సిమెంట్స్‌.. క్విడ్‌ ప్రోకో ద్వారా జ‌గ‌న్ ఆస్థి అయింది.  వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జమానాలో మేళ్లు పొందినవాళ్లు ముడుపులు సమర్పించేసుకోగా.. విజయసాయిరెడ్డి డైరెక్టర్‌గా ఉన్న బ్యాంకు... ఇంటికే వచ్చి రుణం ఇచ్చేసింది.  అప్ప‌ట్లో జ‌గ‌న్ చేతిలో చిల్లిగవ్వ లేకుండానే   సిమెంట్ ఫ్యాక్ట‌రీ పెట్టేశారు. భార‌తి సిమెంట్స్ విష‌యంలో సీబీఐ అభియోగాలు రుజువైతే.. నిందితులకు యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది.   అలా... భారతి సిమెంట్ పరిశ్రమను సీఎం జగన్ తన భార్య భారతి పేరు మీద ఏర్పాటు చేశారు. ఇది ఉత్పత్తి ప్రారంభించక ముందే పదిహేనేళ్ల కిందటే… 51 శాతం వాటాను ఫ్రాన్స్ కు చెందిన వికాట్ అనే కంపెనీకి రూ. రెండు వేల కోట్లకు అమ్మేశారు. అయితే విచిత్రంగా  రెండు వేల కోట్ల రూపాయ‌లు ఇచ్చిన వికాట్.. పేర్లలోనే కనిపిస్తుంది. మొత్తం పరిశ్రమను జగన్ కుటుంబసభ్యులే నిర్వహిస్తూంటారు. ఏపీలో వైసీపీ వచ్చాక భారతి సిమెంట్స్ మాత్రమే అత్యధికంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తూ వస్తోంది. అయితే ఈ ఫ్యాక్టరీ కనీస కాలుష్య ప్రమాణాలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానికులు గతంలో పలుమార్లు ధర్నాలు నిర్వహించారు. అప్పట్లో ఫ్యాక్టరీ యాజమాన్యం ఏవేవో హామీలు ఇచ్చి సర్దుబాటు చేసింది. కానీ అమలు చేయలేదు. ఇప్పుడు ప్రజలు తెరపైకి వస్తున్నారు.  ఇప్పుడు భారతి సిమెంట్స్ పై ప్ర‌జ‌లు తిరుగుబాటు చేశారు. నాలుగో తేదీ తర్వాత తాడేప‌ల్లి ప్యాలెస్‌పై దాడి జ‌ర‌గ‌వ‌చ్చు.  ఏమైనా జరగొచ్చన్న సెటైర్లు ఏపీలో వినిపిస్తున్నాయి.  - ఎం.కె. ఫ‌జ‌ల్‌  
Publish Date: May 27, 2024 4:46PM