నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ.. జల జగడం పైనే ప్రధాన చర్చ!!

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. నాలుగో విడత లాక్‌డౌన్ పై కేంద్ర ప్రభుత్వం‌ తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతివ్వడంతో పాటు లాక్‌డౌన్‌ లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధివిధానాలపైనా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా, గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల మధ్య కృష్ణ జలాల వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ అంశం ప్రధానంగా చర్చకొచ్చే అవకాశముందని సమాచారం.