రోడ్డు ప్రమాదం.. బయటపడిన ‘కట్టల’ పాములు!

విజయవాడ-విశాఖపట్నం జాతీయ రహదారి మీద యాక్సిడెంట్ జరిగింది. కెమెకల్ పొడి బస్తాలను తీసుకెళ్తు్న్న టాటా ఏస్ వెహికల్‌ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దాంతో టాటా ఏస్ వెహికల్‌లో వున్న కెమికల్ పొడి బస్తాలన్నీ రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. అలా  పడిపోయింది కెమికల్ బస్తాలే అయితే మేటర్ మామూలుగానే వుండేది. కానీ అందులోంచి బోలెడన్ని ‘కట్టల’ పాములు బయటపడ్డాయి. మొత్తం ఏడు కోట్ల రూపాయల డబ్బు కట్టలు కెమికల్ పొడి బస్తాల మధ్యలో నుంచి బయటపడ్డాయి. నోట్ల కట్టలను చక్కగా ప్లాస్లిక్ కవర్లలో చుట్టి, అట్టపెట్టెల్లో పెట్టి, కెమికల్ పొడి బస్తాల మధ్యలో పెట్టి రవాణా చేస్తున్నారు. టైమ్ బ్యాడ్ అయి యాక్సిడెంట్ జరిగింది. నోట్ల కట్టల పాములు బయటపడ్డాయి. పోలీసులు ఈ ఏడు కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. టాటా ఏస్ డ్రైవర్ని డబ్బు గురించి ప్రశ్నిస్తే మమ్మెమ్మే... బెబ్బెబ్బే అన్నాడు. ఇంకా లోతుగా విచారణ జరిపితే, ఒక వైసీపీ నాయకుడికి చెందిన సంస్థ నుంచి మరో వైసీపీ నాయకుడికి చెందిన సంస్థకు ఈ వాహనం రవాణా అవుతున్నట్టు తెలిసింది. అంటే, డబ్బు ఎవరిదో అర్థమైపోతుంది కదా..