బీఆర్‌ఎస్‌కి గుండుసున్నా ఇచ్చిన రవిప్రకాష్ సర్వే

ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక్క ఎంపీ స్థానం.. అది కూడా మెదక్ ఎంపీ స్థానం దక్కుతుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వున్నాయి. అయితే బిఆర్ఎస్ వర్గాల్లో ఆ ఒక్క స్థానం ఆశలను కూడా జర్నలిస్టు రవిప్రకాష్ తుస్సుమనిపించారు. బుధవారం నాడు ఆయన తన సొంత మీడియా ఛానల్లో తెలంగాణలో ఏయే పార్టీకి ఎన్నెన్ని స్థానాలు వస్తాయన్న అంశాలతో కూడిన కథనాన్ని ప్రసారం చేశారు. ఇందులో ఆయన తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు, భారతీయ జనతాపార్టీకి 8 స్థానాలు దక్కుతాయని, ఎం.ఐ.ఎం. హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందని తేల్చారు. బిఆర్ఎస్‌కి ఒక్క స్థానం కూడా దక్కదని బాంబు పేల్చారు. ఇలాంటి దయనీయ పరిస్థితిలో ఏ పార్టీ వున్నా ఎవరైనా సరే  ‘అయ్యోపాపం’ అంటారు. బిఆర్ఎస్ విషయంలో మాత్రం ఎవరూ ఆ మాట అనడం లేదు.. అంత పాతాళానికి పడిపోయింది బిఆర్ఎస్ పార్టీ.