తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం శ్రీవారిని మొత్తం 65వేల 508 మంది భక్తులు సందర్శించుకున్నారు.

వారిలో 25వేల 995 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 97 లక్షల రూపాయలు వచ్చింది.

ఇక శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 10 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.  టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు  శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు ఎనిమిది గంటల సమయం పడుతోంది.