తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.

గురువారం (మే 2) ఉదయం శ్రీవారి దర్శనం కోసం 16 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం (మే1) శ్రీవారిని మొత్తం 72 వేల 510 మంది దర్శించుకున్నారు.

వారిలో 30 వేల 441 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 62లక్షల రూపాయలు వచ్చింది.