ఏపీ పండుగగా వాల్మీకి జయంతి... ఇందులో మతలబు లేదుగా?
posted on Oct 9, 2019 @ 10:15AM
కొన్ని నిర్ణయాలు ఎంతకాదన్నా రాజకీయ లబ్ది కోసమే తీసుకున్నట్లుగా కనిపిస్తాయి. ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి, ఓట్లుగా మలుచుకోవడానికి ప్రభుత్వాలు వేసే ఎత్తుగడులుగా కనిపిస్తాయి. మరి ఈ నిర్ణయం ఎలాంటిదో తెలియదు గానీ, వాల్మీకి జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా ఆశ్వయుజ పౌర్ణమి రోజు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 13న వాల్మీకి జయంతోత్సవాలు నిర్వహించన్న ప్రభుత్వం.... అందుకోసం 13 జిల్లాలకు 25లక్షల రూపాయలను విడుదల చేసింది.