Read more!

పోలీసులు లాఠీలతో చావగొట్టారు... కేసీఆర్ కరెంటు ఇచ్చారు...

 

మెదక్ జిల్లా రామాయపేట మండలంలోని నార్సింగి గ్రామానికి చెందిన రైతులు గత వారం రోజులుగా తమకు రోజుకు ఒక్క గంట కూడా కరెంటు ఇవ్వలేదన్న ఆవేదనతో జాతీయ రహదారి 44 మీద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రభుత్వ ఆదేశాలతో రైతుల మీద లాఠీఛార్జ్ చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల మీద పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ సంఘటనలో తెలంగాణ రైతుబిడ్డలు దారుణంగా గాయపడ్డారు. కాగా, ఈ సంఘటన మీద తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రైతులను చావబాదించినందుకు సారీ చెప్పారు. కాగా, ఈ సంఘటన మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్పందించారు. కరెంటు ఇప్పుడు ఇస్తున్నట్టుగా దారుణంగా కాకుండా రోజుకు 6 గంటలు కరెంట్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశించేదేదో రైతులు రోడ్డు మీద పడకముందు, పోలీసులు వాళ్ళని చావగొట్టకముందు ఆదేశిస్తే బాగుండేది కదా ముఖ్యమంత్రి గారూ!!