కేసీఆరే అన్యాయం చేస్తున్నారు.. సోమిరెడ్డి
posted on Jul 10, 2015 @ 1:29PM
టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. కేసీఆరే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని.. మళ్లీ ఆంధ్రావాళ్లు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారని అన్నారు. తెదేపా పార్టీని దెబ్బతీయాలనుకోవడం కేసీఆర్ వల్ల కాదని.. అది అసాధ్యమని.. రెండు రాష్ట్రాల్లోనూ టీడీపీ ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ పదే పదే ఆంధ్రోళ్లు ఆంధ్రోళ్లు అనడం సరికాదని.. తన మాట తీరు మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. కాగా ప్రాణహిత చేవెళ్ల గురించి మాట్లాడుతూ కేసీఆర్.. హరీశ్ రావు కలిసి ప్రాజెక్టు డిజైన్ మార్చడం సరికాదని.. ఇద్దరు కలిసి ప్రాజెక్టు రూపకల్పనను మార్చారని ఎద్దేవ చేశారు. అంతేకాక జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు సరికాదని సోమిరెడ్డి చెప్పారు.