కరుణానిధి భార్య, కుమార్తెకి బెయిలు మంజూరు
posted on Aug 20, 2014 @ 6:37PM
2జీ కుంభకోణంలో 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో టెలికం మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఏడుగురు నిందితులకు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. రాజా, కనిమొళి కోర్టుకు హాజరయ్యారు. అలాగే కరుణానిధి భార్య, కనిమొళి సవతి తల్లి దయాళు అమ్మాళ్కు కూడా బెయిల్ లభించింది. దయాళు అమ్మాళ్కు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం 5 లక్షల వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. అయితే, ఈ కేసులో తన పేరును తొలగించాలన్న దయాళు అమ్మాళ్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దయాళు అమ్మాల్, రాజా, కనిమొళిలతో పాటు మరో ఏడుగురికి బెయిల్ మంజూరయింది.