Read more!

500వ ప్రతిష్ఠాత్మక టెస్ట్ మ్యాచ్.. బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

 

క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక టెస్ట్ మ్యాచ్ భారత్, కివీస్ ల మధ్య జరగనుంది. దాదాపు 84 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో 500వ ప్రతిష్ఠాత్మక టెస్టు కావడం దీని ప్రత్యేకం. ఈ మ్యాచ్ కు కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ మైదానం వేదికైంది. ఇక టాస్ గెలిచిన కోహ్లీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎందుకంటే పేరుకే ఇది గ్రీన్ పార్క్ కానీ.. మైదనంలో ఎక్కడా పెద్దగా పచ్చిక కనిపించదు. అందుకే ఆడుతున్న కొద్ది పిచ్ మందుకొడిగా మారి స్పిన్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అంతేకాదు బ్యాటింగ్ చేయడానికి కూడా కష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే మరో ఆలోచన లేకుండా కోహ్లీ ముందు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక టాస్ గెలిచిన భారత్ జట్టు.. ఛటేశ్వర్ పూజార, కేఎల్ రాహుల్ ను ఒపెనర్లుగా బరిలో దించనుంది.