Read more!

దొంగనోట్ల ఎల్లంగౌడ్ లొంగిపోయాడా?

 

హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన నకిలీ నోట్ల కేసులో ప్రధాన నిందితుడు ఎల్లంగౌడ్ అరెస్టయ్యాడు. ఎల్లంగౌడ్‌ని ఎస్ఓటీ పోలీసులు మహారాష్ట్రలో అరెస్టు చేశారు. కొద్ది రోజుల క్రితం ఒక పోలీసు కానిస్టేబుల్ మీద కాల్పులు జరిపిన కేసులో ఎల్లం గౌడ్ నిందితుడు. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి పరారీలో వున్న ఎల్లంగౌడ్‌ని ఎంతో పరిశోధించి అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఎల్లం గౌడ్ తన భార్యకు ఫోన్ చేస్తూ వుండటంతో అతని ఫోన్‌ని ట్రేస్ చేసి మహారాష్ట్రలో అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఎల్లంగౌడ్‌ను పోలీసులు అరెస్టు చేయలేదని, అతనే లొంగిపోయాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎల్లంగౌడ్ పట్టుబడటంలో పోలీసుల గొప్ప ఏమీ లేకపోయినా ఆ క్రెడిట్‌ని తమ ఖాతాలో వేసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తు్న్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.