ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. ప్రధాని మోడీ
posted on Apr 19, 2024 @ 10:29AM
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్సభ స్థానాలతో పాటు అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ జరుగుతోంది.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఓట్ల పండుగ తొలి దశ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు యువత, తొలిసారి ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ ట్వీట్ చేశారు.
తొలి దశ పోలింగ్ ఆరంభానికి కొద్ది ముందు ప్రధాని ఎన్నికలలో ప్రతి ఓటు ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఓటు హక్కు ఉన్నవారందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. రికార్డు స్థాయిలో ఓటు వేయాలని కోరుతున్నానని పేర్కొన్నారు.