Read more!

30ఏళ్ల తరువాత ప్రతి ఒక్కరూ తప్పక తినాల్సిన ఆహారాలు ఇవే..!

శరీరం ఆరోగ్యంగా ఉండటంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే ఆహారం విషయంలో చాలా శ్రద్ద అవసరం. అయితే వయసు పెరిగే కొద్దీ శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి.  యవ్వనంలోకి అడుగు పెట్టిన తరువాత ఇక 30ఏళ్లు దాటగానే శరీరంలో శక్తి స్థాయిలు క్రమంగా తగ్గిపోతూ వస్తాయి. మరీ ముఖ్యంగా అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, థైరాయిడ్, మధుమేహం వంటి సమస్యలు 30ఏళ్ల తరువాత  శరీరంలో మెల్లిగా డవలప్ అవుతాయి. ఇవేవీ రాకూడదు అంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. మరీ ముఖ్యంగా పెళ్లి, పిల్లలు, ఉద్యోగ బాధ్యతలు,  శారరీక మార్పులు కూడా దీనికి దోహదం చేస్తాయి. అందుకే 30ఏళ్ల తరువాత ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారాల గురించి తెలుసుకుని వాటిని తీసుకోవడం ఎంతో ముఖ్యం.

కాల్షియం..

శరీరం,  ఎముకల పటిష్టతకు కాల్షియం అత్యంత ముఖ్యమైన పోషకం. 30ఏళ్ల తరువాత  కాల్షియం అధికంగా ఉండే వాటిని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఎముకల బలహీనతకు కారణమయ్యే బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం పాల ఉత్పత్తులు, ఆకు కూరలు,  బలవర్ధకమైన ఆహారాలు ఆహారంలో చేర్చుకోవాలి.

విటమిన్-డి..

శరీరం,  ఎముకల పటిష్టతకు కాల్షియం ఎంత అవసరమో, అదే విధంగా విటమిన్ డి కూడా అవసరం. ఇది  కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది.  విటమిన్-డి కోసం లేత ఎండలో గడపచ్చు, కొవ్వు చేపలు, బలవర్థకమైన పాల ఉత్పత్తులు, పుట్టగొడుగులు  మొదలైనవి తినవచ్చు.

మెగ్నీషియం..

మెగ్నీషియం గురించి చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. కండరాల పనితీరుకు, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి,  ఎముకలను దృఢంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనది. దీని కోసం  గింజలు, తృణధాన్యాలు,  ఆకు కూరలు తినవచ్చు.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్..

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి,  మెదడు పనితీరును ప్రోత్సహించడానికి అవసరమైన పోషకాలు. అంతే కాకుండా శరీరంలో వాపులను తగ్గించి మెదడు శక్తిని పెంచేలా పనిచేస్తుంది. దీని కోసం అవిసె గింజలు, సాల్మన్ చేపలు,  వాల్‌నట్స్ వంటి వాటిని తీసుకోవడం పెంచవచ్చు.

విటమిన్-బి12

నాడీ వ్యవస్థను మెరుగుపరచడానికి,  ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి ఈ పోషకం అవసరం. ఇది కండరాలు,  ఎముకలకు బలాన్ని అందించడానికి పనిచేస్తుంది. దీని కోసం  మాంసం, చేపలు, గుడ్లు,  బలవర్థకమైన ఆహారాలు తినవచ్చు.

పొటాషియం..

30ఏళ్ల తరువాత  రక్తపోటు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  రక్తపోటును నియంత్రించడం ద్వారా  గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం అరటిపండు, బత్తాయి, బచ్చలికూర, బీన్స్ వంటి వాటిని తీసుకోవాలి.

ఫైబర్, ప్రోటీన్..

సరైన జీర్ణక్రియను నిర్వహించడానికి,  ఉదర సంబంధ సమస్యలను నివారించడానికి,  రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి ఫైబర్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది కాకుండా బరువును నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది. దీని కోసం ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు,  బీన్స్ మొదలైనవాటిని చేర్చుకోవచ్చు. అదేవిధంగా, శరీర అభివృద్ధికి ప్రోటీన్ చాలా అవసరం.

                                            *నిశ్శబ్ద.