Read more!

తాము అధికారంలో రాగానే 25 లక్షల ఉద్యోగాలు: పలమనేరులో చంద్రబాబు 

తాము అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ప్రజాగళం యాత్రలో భాగంగా ఆయన పలమనేరులో మాట్లాడుతూ యువతరం ఆశలను జగన్ వమ్ము చేశారని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి కోసం జగన్ చేసింది శూన్యమన్నారు. అనంతపురంలో కియా పరిశ్రమ ఏర్పాటుకు తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, ఆ ప్రాజెక్టులను తాము అభివృద్ధి చేశామని చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు అభివర్ణించారు. మే 13తో రాష్ట్రానికి పట్టిన జగన్ శని వదిలిపోతుందన్నారు.పలమనేరు ప్రజాగళం సభ జరుగుతున్నప్పుడు టిడిపి కార్యకర్తలు ఒక్కసారిగా సభాప్రాంగణం వద్దకు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో తోపులాట జరిగింది. త్రి కూటమి జెండాలతో సభాప్రాంగణం కళ కళలాడింది.