కసబ్ ఉరి, 26/11 దాడుల్లో చనిపోయిన వారికి నివాళి
posted on Nov 21, 2012 @ 1:53PM
ముంబయి దాడుల్లో చనిపోయిన వారందరికి సరైన నివాళి కసబ్ కు ఉరిశిక్ష అమలు చేయడమేనని ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నీకమ్ అన్నారు. ఇది దేశం సాధించిన విజయమని ఆయన అభిప్రాయపడ్డారు. కసబ్ ను పట్టుకొని, విచారించి, ఉరిశిక్ష అమలు చేయడం ...ఈ మొత్తం విధానం ద్వారా భారత్ అంటే ఏమిటో చూపామని, తీవ్రవాద ఘాతుకాలను మనం సహించబోమని, దోషులకు తగిన శిక్ష విధించడంలో వెనుకాడబోమని ప్రపంచానికి తెలిపామని ఆయన పేర్కొన్నారు.