మీఠా చావల్ (దసరా స్పెషల్)
కావలసిన పదార్ధాలు:
బాసుమతి బియ్యం - 1 కప్పు
పంచదార - 1/2 కప్పు
ఉప్పు - చిటికెడు
నెయ్యి - 2,3 స్పూన్స్
యాలుకలు - 3
లవంగాలు - 2,3
ఫలావు ఆకు - 1
కేసరి - చిటికెడు
ఫుడ్ కలర్ - కొద్దిగా
తయారీ విధానం:
ముందు బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. తరువాత కుక్కర్ వేడిచేసి నెయ్యి వేసి అందులో ఫలావు ఆకు లవంగాలు, యాలుకలు వేసి అవి వేగాక వాటిలో బియ్యం వేసి కొలత నీరు, పంచదార, ఉప్పు ఒక్కొక్కటిగా వేసి (బియ్యానికి 1 కప్పుకి 1 1/2 కొలత నీరు పోయాలి) అందులో ఫుడ్ కలర్ వేసి.. 2,3 విజిల్స్ కి కుక్కర్ ని మంటమీద నుండి దించి చల్లారాక బౌల్ లోకి తీసుకొని మరో చెంచా నెయ్యి పైన వేసి కేసరితో అలంకరించుకోవాలి.
--భారతి