మిరపకాయ మసాలా కూర

 

 

 

కావలసిన పదార్థాలు:

* పెద్దగా ఉన్న పచ్చిమిరపకాయలు – 15
* ఉల్లిపాయ – 1
* టమాటా – 1
* వేరుశనగ గుళ్ళు – 2 టేబుల్ స్పూన్
* ధనియాలు – 1 టీ స్పూన్
* నల్ల నువ్వులు – 1 టెబుల్ స్పూన్
* ఎండు కొబ్బరి – కొంచెం
* అల్లం – చిన్న ముక్క
* వెల్లుల్లి పాయలు – 4-5
* కారం - తగినంత
* పసుపు – కొద్దిగా
* గరంమసాలా పొడి – కొద్దిగా
* ఉప్పు – తగినంత
* నూనె – 2 టేబుల్ స్పూన్లు

 

తయారీ విధానం:
ముందుగా మిరపకాయలు కడిగి శుభ్రం చేసుకుని మధ్యలో చీరుకుని ఉంచుకోవాలి (బజ్జీ మిపకాయలు.. ఎందుకంటే కారం తక్కువగా ఉంటుంది). ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని  మరిగాక మిరపకాయలు వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల మిరపకాయల్లో కారం తగ్గుతుంది. మరో పాత్రని తీసుకొని దానిలో వేరుశెనగ గుళ్లు వేయించుకోవాలి.. అవి వేగాక ధనియాలు నువ్వులు, ఎండుకొబ్బరి కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తరువాత పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఈ పొడిలోనే ఉల్లిపాయ ముక్కలు,టమాటా ముక్కలు,అల్లం,వెల్లుల్లి,పసుపు వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా నూరుకోవాలి. ఇలా తయారు చేసుకున్న స్టఫ్ ను ఉడికించుకున్న మిరపకాయల్లో కూర్చి పెట్టుకోవాలి. మరో పాత్రలో నూనె తీసుకొని అది మరిగిన తరువాత మిరపకాయలు వేసి వేయించుకోవాలి.  మిగిలిన మసాలా ముద్దలో కొంచెం నీరు పోసి వేయించుకొని పక్కన పెట్టుకున్న మిరపకాయల్ని వేసి మిరపకాయలు బాగా ఉడికి మిశ్రమం దగ్గర పడిన తరువాత స్టవ్ ఆపేస్తే సరి. మిరపకాయ మసాలా కూర రెడీ అయినట్టే.