LATEST NEWS
   బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న *యువ సంగ్రామ సభ' కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 18న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్  పార్టీ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. విచారణ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, కార్యక్రమం నిర్వహించేందుకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వెంటనే అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించాయి. అన్ని అంశాలను పరిశీలించిన హైకోర్టు సభ నిర్వహణకు అనుమతి ఇస్తూనే పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. సభ కారణంగా జాతీయ రహదారి లేదా ఇతర ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ హైవేలను దిగ్బంధించరాదని స్పష్టం చేసింది.  అలాగే సభ నిర్వహణ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. అదేవిధంగా, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కార్యక్రమాన్ని నిర్వహిం చాలని, సభ నిర్వాహకులు పోలీసులు సూచించే అన్ని నిబంధనలు, షరతులను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, జనస మ్మర్ద నియంత్రణ వంటి అంశాల్లో పోలీసులకు పూర్తిగా సహకరించాలని కూడా సూచించింది. హైకోర్టు అనుమతితో శనివారం (జూలై 18) సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ సభకు పార్టీ అగ్రనేతలు, యువ నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సభ నిర్వహణకు పోలీసులు కూడా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టే అవకాశముంది. BRS Youth Sangram Sabha, Telangana High Court, Saroornagar Indoor Stadium, BRS Party, KCR, KTR, CM Revanth reddy
పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో  సోనమ్ నిరశన చేపట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలో సోనమ్ వాంగ్‌చుక్ ప్రత్యక్షంగా పాల్గొని నిరాహార దీక్ష చేపట్టడం రాజకీయంగా కూడా ప్రధాన్యత సంతరించుకుంది . సోనమ్ వాంగ్ ఛుక్ చేపట్టిన నిరవధిక నిరశనకు రోజురోజుకూ   ప్రజాదరణతో పాటు నెటిజన్ల మద్దతు కూడా పెరుగుతోంది.   కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా వేదికగా ఉద్భవించి, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయ పోరాటాల్లోకి అడుగుపెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.   ఈ క్రమంలోనే   పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవడమే కాకుండా..  నిరశన దీక్ష చేపట్టి, ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకునే వరకు   దీక్షను విరమించేది లేదని ప్రకటించారు. ఈ పరిణామం కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనకు ఒక్కసారిగా జాతీయ స్థాయి  ప్రాధాన్యత వచ్చింది.   ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్  వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది.  గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి.  ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.   ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వాంగ్ చుక్ నిరశనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది.  అలాగే సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.   ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వెళ్ల  నిరశన దీక్షలో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్‌ను  కలిసి సంఘీభావాన్ని ప్రకటించారు.   ఇలా విపక్షాల మద్దతు, ప్రజా సంఘాల భాగస్వామ్యంతో ఈ ఆందోళన తీవ్ర రూపం దాలుస్తున్నా..  కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇంత వరకూ స్పందించలేదు.  ఇలా స్పందించకపోవడానికి సోనమ్ వాంగ్ చుక్ నిరసన, కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనల ప్రభావం కేంద్రంపై ఇసుమంతైనా లేదని చాటే వ్యూహమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే.. సోనమ్ వాంగ్ చుక్ కు పెరుగుతున్న మద్దతు,  యువత నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహంతో కేంద్రం ఒకింత ఆందోళన చెందుతున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. అంతే కాదు.. సోనమ్ వాంగ్ చుక్ నిరశన విషయంలో ప్రభుత్వ మౌనం, నిర్లక్ష్యం పట్ల నెటిజనులు ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ లీకేజీ అంశంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తు దేశ వ్యాప్తంగా విద్యావేత్తలు, విద్యార్థుల  తల్లిదండ్రులు కూడా వాంగ్ చుక్ నిరశనకు మద్దతు తెలుపుతూ.. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.    public support growing day by day to Wangchuks protest, Cockroach Janta Party, Dharmendra Pradhan Resignation Demand, NEET Paper Leak Controversy, Jantar Mantar Delhi Protest
పర్యావరణ పరిరక్షకుడు, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ దిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ   రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి   రేవంత్ రెడ్డి  సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు  తెలుస్తోంది. నేడో రేపో  రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.  కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా  సాగుతున్న ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలపడానికి తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి హస్తినకు బయలుదేరనుండటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి  నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ నిరశన చేపట్టారు. ఇలా ఉండగా ఆయన నిరవధిక నిరశన శుక్రవారం (జులై 17) నాటికి 20వ రోజుకు చేరింది. ఇలా ఉండగా  పార్లమెంట్ భవనం  ముట్టడించేందుకు కూడా  సోనమ్ వాంగ్‌చుక్   బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కీలక తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్‌చుక్  మద్దతుగా ప్రత్యక్షంగా రంగంలోకి దిగడంతో  ఈ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  ఇప్పటికే ఆప్ అధినేత,  దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్ వద్ద సోనమ్ వాంగ్‌చుక్‌ను కలిసి  మద్దతు  ప్రకటించారు. కేజ్రీవాల్ పర్యటనతో ఈ ఉద్యమానికి   రాజకీయ బలం చేకూరింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తరఫున దక్షిణాదిలో అత్యంత బలమైన నేత  రేవంత్ రెడ్డి స్వయంగా హస్తిన వెళ్లి సోనమ్ వాంగ్‌చుక్  కు, ఆయన పోరాటానికి సంఘీభావం ప్రకటించనుండటంతో..  కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డిని ఈ ఉద్యమ వేదికపైకి పంపించడం ద్వారా ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో రేవంత్ ది బలమైన వాయిస్ అని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటన, సోనమ్ వాంగ్‌చుక్‌తో భేటీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, కాంగ్రెస్ అధిష్టానం నుంచి కానీ ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. అయితే.. కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ పర్యటన ఖరారైందని అంటున్నాయి.     Telangana CM, Jantar Mantar Protest, NEET Paper Leak Controversy, TeluguOne 
  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. అధికార పక్షాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా ఎదుర్కొని బలపడాల్సిన తరుణంలో, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న అనాలోచిత విధానాలు మరియు బలహీనమైన వ్యూహాలు పార్టీని మరింత రక్షణాత్మక ధోరణిలోకి నెడుతున్నాయి. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు పార్టీకి రాజకీయంగా పెద్ద నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ వడ్డే వెంకటేశ్వరరావు మరో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మధ్య ఆసక్తికర చర్చ టోన్‌ నిర్వహించింది. రాజకీయ పరిస్థితి మరియు లోపించిన సునిశితత్వంప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైఎస్సార్సీపీ అనేక క్షేత్రస్థాయి సమస్యలను తన రాజకీయ ఎదుగుదలకు అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమవుతోంది. విజయవాడ లాకప్ డెత్ (సాయికృష్ణ కేస్) వంటి తీవ్రమైన సమస్యలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం పార్టీ వ్యూహాత్మక లోపాన్ని స్పష్టం చేస్తోంది. ఇలాంటి అత్యంత సున్నితమైన అంశాలలో మొదట హడావుడి చేయడం, ఆ తర్వాత బాధితులను లేదా ఆందోళనకారులను సమన్వయం చేసుకోలేక మధ్యలోనే వదిలేయడం జగన్ నాయకత్వానికి బలహీనతగా మారింది. స్థానిక నాయకత్వానికి బాధ్యతలు అప్పగించకుండా, క్షేత్రస్థాయిలో నిరంతర పోరాటాలు నిర్మించకుండా కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమవ్వడం వైస్సార్సీపీకి శాపంగా మారింది.  సమగ్ర అధ్యయనం లేకుండా మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో విమర్శలకు, మీమ్స్ మరియు ట్రోల్స్‌కు దారితీస్తున్నాయి.వైఎస్సార్సీపీ బలహీన వ్యూహాలు మరియు పరిణామాలుపూర్వపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ శైలిని గమనిస్తే, ఆయన ఏ ప్రజాసమస్యపైనైనా పోరాడేముందు క్షేత్రస్థాయిలో పనిచేసే మానవ హక్కుల సంఘాలు, పౌర సమాజ నేతలతో మాట్లాడి పూర్తి అవగాహనతో ముందడుగు వేసేవారు. అయితే, ప్రస్తుత వైఎస్సార్సీపీలో అటువంటి నిర్మాణాత్మక చర్చలు లేకపోవడం ప్రధాన లోపం. రావణ ఎపిసోడ్ వంటి సందర్భాల్లో మొదట మైనారిటీల తరఫున నిలబడతామని ప్రకటించి, ఆపై కేంద్ర నాయకత్వానికి (NDA) దూరం కాకూడదనే భయంతోనో లేదా హిందూ ఓట్ బ్యాంక్ దెబ్బతింటుందనే ఆందోళనతోనో వెనక్కి తగ్గడం ఆ పార్టీలో నెలకొన్న సిద్ధాంతపరమైన గందరగోళాన్ని సూచిస్తోంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారానికి ఒకటి రెండు సార్లు బెంగళూరు నుండి వచ్చి కేవలం పరామర్శలు చేసి వెళ్ళిపోవడం వల్ల శ్రేణుల్లో నమ్మకం సడలుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఒక పద్ధతి ప్రకారం నిరసనలు, ఉద్యమాలు చేపట్టలేకపోవడం వైఎస్సార్సీపీ వైఫల్యానికి అద్దంపడుతోంది. భవిష్యత్తు రాజకీయ ప్రభావంనిర్మాణాత్మక వ్యూహాలు, క్షేత్రస్థాయి శ్రేణులతో బలమైన సమన్వయం లేకపోతే వైఎస్సార్సీపీ భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కేవలం గుడ్డి వ్యతిరేకత ప్రదర్శించే 'యాక్టివ్ అపోజిషన్' వైఖరి పార్టీ ఇమేజ్‌ను మరింత దెబ్బతీస్తుంది. తప్పులను ఆత్మవిమర్శ చేసుకుని, చంద్రబాబు నాయుడు వంటి సీనియర్ నేతల అనుభవ శైలిని గమనించి రాజకీయ పరిణతి సాధించాల్సిన అవసరం జగన్ కి ఎంతైనా ఉంది. పార్టీని గందరగోళం మరియు అయోమయ పరిస్థితుల నుంచి బయటపడేసి, క్యాడర్‌లో భరోసా నింపకపోతే వచ్చే ఎన్నికల నాటికి వైఎస్సార్సీపీ మరింత ప్రాభవాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.  
  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'జూనియర్ ఎన్టీఆర్' (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ కేవలం ఒక సాధారణ ఊహాగానం కాదు.. అది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేయగల ఒక బలమైన శక్తీకరణ..  జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తే తెలుగునాట ఒక పెద్ద రాజకీయ భూకంపాన్ని సృష్టించింది. ఈ అంశంపై టోన్ న్యూస్ "వాస్తవ వేదిక" చర్చా కార్యక్రమంలో తెలుగు వన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్లేషణాత్మకంగా చర్చ నిర్వహించారు. ఒకవైపు సినిమా రంగంలో గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న తారక్, మరోవైపు తన తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వారసత్వాన్ని అందిపుచ్చుకుని క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందనే అంశం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితి చర్చనీయాంశాలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రెండు ప్రధాన రాజకీయ శక్తులు బలంగా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మరియు తెలుగుదేశం పార్టీ (TDP) ల మధ్య సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఆధిపత్య పోరులో, ఒక కొత్త మరియు అత్యంత ప్రజాకర్షణ కలిగిన నాయకుడి అవసరం ఉందనే వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.  చారిత్రకంగా చూస్తే, ఎన్టీఆర్ కుటుంబానికి ప్రజాక్షేత్రంలో ఉండటం అనేది ఒక సంప్రదాయంగా వస్తోంది. స్వర్గీయ ఎన్టీఆర్ ఏ పరిస్థితుల్లోనైతే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందో, నేటి రాజకీయ పరిస్థితులు కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశానికి అనుకూలంగా మారాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, ఆయన నేటివరకు ఎలాంటి ప్రత్యక్ష సామాజిక సేవా కార్యక్రమాలు లేదా పూర్తిస్థాయి రాజకీయ కార్యాచరణను ప్రకటించకపోవడం గమనార్హం. అయినప్పటికీ, ప్రజల్లో జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం పట్ల ఉన్న విశ్వసనీయత ఏమాత్రం తగ్గలేదు. వ్యూహాలు మరియు అంతర్గత సమీకరణాలుజూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం వెనుక అనేక వ్యూహాత్మక కోణాలు దాగి ఉన్నాయి.   తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి సమకాలీన రాజకీయ నేతల పాత్ర కూడా ఈ సరికొత్త సమీకరణాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. తమిళనాడు తరహా రాజకీయ ఫార్ములా—అనగా కేవలం చలనచిత్ర చరిష్మాతో నేరుగా అధికారం సాధించడం—ఇక్కడ సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఆర్థిక బలంతో సంబంధం లేకుండా కేవలం ప్రజాదరణ, బలమైన భావజాలం మరియు సరైన వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తే విజయం సాధ్యమని ఇటీవలి రాజకీయ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.  తారక్ రాజకీయాల్లోకి వస్తే అది తెలుగుదేశం పార్టీ (TDP) లోని అంతర్గత సమతుల్యతను దెబ్బతీస్తుందనే భయంతో, కొందరు దీనిని వ్యతిరేకిస్తూ మరియు ఇది తారక్ స్వయంకృతం కాదనే ప్రచారాలు చేస్తున్నారనే వాదన కూడా ఉంది. భవిష్యత్తు రాజకీయ ప్రభావంభవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే, అది కేవలం ఒక పార్టీకి మాత్రమే పరిమితం కాకుండా మొత్తం రాష్ట్ర రాజకీయ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వైఎస్సార్సీపీ మరియు టీడీపీల ఏకఛత్రాధిపత్యానికి ప్రత్యామ్నాయంగా తారక్ సరికొత్త మూడవ శక్తిగా లేదా టీడీపీకి అసలైన వారసుడిగా తెరపైకి వచ్చే అవకాశం ఉంది.  ఆయనకు ఉన్న అశేష యువత, అభిమాన గణం రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల సమీకరణను మలుపు తిప్పగలవు. ఒకవేళ ఆయన పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే, తెలుగునాట సాంప్రదాయ రాజకీయ సమీకరణాలు పూర్తిగా పక్కకుపోయి, సరికొత్త రాజకీయ శకానికి నాంది పలికే అవకాశం ఉంది. ఈ రాజకీయ భూకంపం ఏ తీరానికి చేరుతుందనేది తారక్ తీసుకునే తుది నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.  
ALSO ON TELUGUONE N E W S
సెలబ్రిటీలంటే కేవలం వెండితెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలో వారు ఎలా ప్రవర్తిస్తారనే దానిపై కూడా అభిమానులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. కొన్నిసార్లు వారు చేసే చిన్నపాటి సున్నితమైన పనులు సమాజంలో చాలా పెద్ద సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. తాజాగా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. గ్లామర్‌కు మాత్రమే కాకుండా, అపారమైన మానవత్వానికి కూడా తను కేరాఫ్ అడ్రస్ అని శ్రియ మరోసారి నిరూపించుకున్నారు. ఒక చిన్నారి పట్ల ఆమె చూపించిన అమితమైన ఆప్యాయత ఇప్పుడు ఇంటర్నెట్‌లో లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంటోంది. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో శ్రియ శరణ్ కెమెరాల ముందుకు వచ్చి ఫోటోలకు ఎంతో ఉత్సాహంగా పోజులిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో, చేతిలో ఐస్‌క్రీమ్ పట్టుకున్న ఒక చిన్నారి ఆమెను చూసి చాలా ఆనందంగా, ఉద్వేగంతో ఆమె వైపు పరుగెత్తుకుంటూ వచ్చింది. అయితే, ఆ హడావుడిలో పాప బ్యాలెన్స్ తప్పి, చేతిలో ఉన్న ఐస్‌క్రీమ్ ఒక్కసారిగా కింద పడిపోయింది. ఎంతో ఇష్టంగా తింటున్న ఐస్‌క్రీమ్ నేలపాలు కావడంతో ఆ చిన్నారి తీవ్ర నిరాశకు గురై అక్కడికక్కడే బావురుమంటూ గట్టిగా ఏడవడం ప్రారంభించింది. అక్కడ ఉన్న వారంతా ఏం జరుగుతుందో అని చూస్తుండగానే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రియ వెంటనే స్పందించారు. తన స్టార్ హోదాని, చుట్టూ ఉన్న కెమెరాలను పక్కనబెట్టి, శ్రియ వెంటనే ఆ చిన్నారి వద్దకు వెళ్లారు. ఎంతో ఆప్యాయంగా ఆ పాపను తన చేతుల్లోకి ఎత్తుకుని ఓదార్చడం మొదలుపెట్టారు. తనను హత్తుకుని, ఎంతో ప్రేమగా బుజ్జగిస్తూ, ముచ్చటైన మాటలతో ఆ చిన్నారిని నవ్వించడానికి శ్రియ ప్రయత్నించారు. శ్రియ చూపించిన ఆత్మీయతతో ఆ పాప ఏడుపు ఒక్క నిమిషంలోనే ఆగిపోయింది. ఆ చిన్నారి పెదవులపై మళ్లీ అందమైన చిరునవ్వు పూసింది. ఈ అరుదైన, హృదయాన్ని హత్తుకునే క్షణాన్ని అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా షేర్ అవుతూ ట్రెండింగ్‌గా మారింది. నేటి డిజిటల్ యుగంలో సెలబ్రిటీల చిన్న చిన్న కదలికలు కూడా నెగెటివ్ కోణంలో చర్చకు వస్తుంటాయి. కానీ ఎలాంటి హంగు, హార్బాటాలు లేకుండా శ్రియ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "రియల్ స్టార్ అంటే ఇలాగే ఉండాలి" అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, "చిన్న పిల్లల మనసును గెలుచుకోవడం అందరికీ సాధ్యం కాదు, శ్రియ మనసు చాలా గొప్పది" అని మరికొందరు కొనియాడారు. కేవలం లైక్‌ల కోసం స్టంట్లు చేసే కాలంలో, మనస్ఫూర్తిగా చేసే ఒక చిన్న సాయం లేదా ప్రేమపూర్వక ప్రవర్తన ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేస్తుందని శ్రియ శరణ్ ఈ సంఘటన ద్వారా చాటి చెప్పారు. ఈ మధుర క్షణం అభిమానుల గుండెల్లో శ్రియపై ఉన్న గౌరవాన్ని మరింత రెట్టింపు చేసింది.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన బ్లాక్‌బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అయితే ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కొన్ని ప్రతిష్టాత్మక సినిమాలు అట్టహాసంగా ప్రారంభమై కూడా మధ్యలోనే నిలిచిపోయాయి. సత్యాగ్రాహి, కోబలి వంటి చిత్రాల జాబితాలో అభిమానులను ఇప్పటికీ తీవ్రంగా నిరాశపరిచే మరో క్రేజీ ప్రాజెక్ట్ 'ప్రిన్స్ ఆఫ్ పీస్' (Prince of Peace). లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, జీసస్ క్రైస్ట్  బయోపిక్‌గా ఈ సినిమాను తెరకెక్కించాలని ఒక అద్భుతమైన భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. యేసుక్రీస్తు పవిత్ర జీవితం, ఆయన చేసిన గొప్ప పనులు, సమాజానికి ఆయన అందించిన ప్రేమ, శాంతి సందేశాలను నేటి తరానికి చాటిచెప్పాలనే బలమైన ఆశయంతో ఈ కథ రూపుదిద్దుకుంది. ఈ మహా ప్రాజెక్ట్ కోసం ప్రముఖ రచయిత జె.కె. భారవి అద్భుతమైన స్క్రిప్ట్ వర్క్‌ను సిద్ధం చేశారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ కథలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం ఒక పవర్‌ఫుల్ రోల్‌ను డిజైన్ చేశారు. అయితే ఇందులో పవన్ కల్యాణ్ పోషించాల్సింది జీసస్ పాత్ర కాదని, కానీ కథను పూర్తిగా మలుపు తిప్పే ఒక అత్యంత కీలకమైన, శక్తివంతమైన పాత్ర అని స్వయంగా దర్శకుడే వెల్లడించారు. ఈ భారీ చిత్రంలో కథానాయికగా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని ఎంపిక చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ చిత్రాన్ని 2010లో అధికారికంగా అనౌన్స్ చేశారు. ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించేందుకు ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చారు. 'ప్రిన్స్ ఆఫ్ పీస్' చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళంతో పాటు ఇంగ్లీష్ భాషలోనూ రూపొందించి అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దే క్రమంలో పవన్ కల్యాణ్, సింగీతం శ్రీనివాసరావు, నిర్మాత కొండా కృష్ణంరాజులతో కూడిన చిత్ర బృందం ఏకంగా ఇజ్రాయెల్, జెరూసలేం, జోర్డాన్, బెత్లహేం వంటి అంతర్జాతీయ చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. యేసుక్రీస్తు నడయాడిన ఆయా పవిత్ర ప్రాంతాలలో లొకేషన్ల వేటను ముమ్మరంగా నిర్వహించారు. విజువల్ వండర్‌గా, అత్యంత సహజంగా ఈ సినిమాను తెరకెక్కించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయి, ఇక రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై సెట్స్ పైకి వెళ్తుందనగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి. ఈ సినిమా అర్ధాంతంగా ఆగిపోవడానికి ప్రధాన కారణం విపరీతంగా పెరిగిపోయిన బడ్జెట్. అంతర్జాతీయ లొకేషన్లు, భారీ విజువల్ ఎఫెక్ట్స్, అగ్ర నటీనటుల రెమ్యునరేషన్ల కారణంగా మొదట అనుకున్న బడ్జెట్ అంచనాలు పూర్తిగా దాటిపోయి నిర్మాణ వ్యయం ఊహించని స్థాయికి పెరిగింది. అంతటి భారీ బడ్జెట్‌ను భరించడం అప్పట్లో అంత సులభం కాకపోవడంతో దర్శక నిర్మాతలు వెనక్కి తగ్గక తప్పలేదు. దీనికి తోడు స్క్రిప్ట్ వర్క్ కోసమే దాదాపు రెండేళ్లకు పైగా సుదీర్ఘ సమయం పట్టడంతో పవన్ కల్యాణ్ కూడా తన తదుపరి కమిట్‌మెంట్స్, ఇతర సినిమాలతో బిజీగా మారిపోయారు. అలా ఒక అంతర్జాతీయ స్థాయి విజువల్ వండర్ కావాల్సిన పవన్, సింగీతంల కలల ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లకుండానే నిలిచిపోయింది.     Pawan Kalyan, Singeetham Srinivasa Rao, Anushka Shetty 
తెలుగు సినీ పరిశ్రమలో సుప్రసిద్ధ గీత రచయితగా తనదైన ముద్ర వేసుకున్న చంద్రబోస్ తన కెరీర్‌లో వేల పాటలతో శ్రోతలను అలరించారు. సందర్భం ఏదైనా సరే, ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా అద్భుతమైన సాహిత్యాన్ని అందించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. భాషాభిమానంతో పాటు జీవితంలో ఎదురైన ఎన్నో అవమానాలను ఆభరణాలుగా మార్చుకుని ఎదిగిన ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. అయితే, తన సుదీర్ఘ కెరీర్‌లో వేలాది హృదయాలను కదిలించేలా పాటలు రాసిన ఈ గొప్ప లిరిసిస్ట్‌ను కూడా కంటతడి పెట్టించిన ఒక ప్రత్యేకమైన పాట ఉంది. అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'రంగస్థలం' లోని 'ఓరయ్యో నా అయ్యో' అనే అత్యంత భావోద్వేగభరితమైన గీతం. ఈ పాట కేవలం ఒక రచన మాత్రమే కాదని, అది తన హృదయంలో ఎప్పటికీ చెరిగిపోని ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని చంద్రబోస్ ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి వివరించారు. ఈ పాట‌ను స్వ‌యంగా చంద్ర‌బోస్ ఆల‌పించ‌డం మ‌రో విశేషంగా చెప్పుకోవ‌చ్చు.  ఈ అద్భుతమైన 'ఓరయ్యో' పాట ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ఈ పాట రచన దుబాయ్‌లో జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, దర్శకుడు సుకుమార్‌ల సమక్షంలో చంద్రబోస్‌కు ఈ పాటను రాసే అవకాశం లభించింది. చిత్ర దర్శకుడు సుకుమార్ ఆ సన్నివేశానికి సంబంధించిన ఎమోషన్‌ను వివరించిన వెంటనే, చంద్రబోస్ మనసు చలించిపోయింది. ఆ క్షణంలో తన మనసులో మెదిలిన తీవ్రమైన దుఃఖాన్ని, భావాలను కాగితంపై నిక్షిప్తం చేసి దేవి శ్రీ ప్రసాద్‌కు అందజేశారు. దేవి శ్రీ ప్రసాద్ ఆ పదాలకు ప్రాణం పోస్తూ అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేయగా, చంద్రబోస్ స్వయంగా ఆ పాటను పాడి వినిపించారు. ఆ సమయంలో పాటను పాడుతుండగానే తన మనసులో ఏదో తెలియని ఒక పెద్ద బాధ, గుండెను పిండేసే దుఃఖం కలిగాయని, కళ్ల నుంచి తెలియకుండానే కన్నీళ్లు ఉబికి వచ్చాయని ఆయన ఆనాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. దుబాయ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, ఆయన తన ఇంట్లో వంటగదిలో వంట చేసుకుంటున్న తన భార్యకు ఈ పాటను వినిపించారు. ఆ పాట వింటూనే ఆమె కంటతడి పెట్టుకోవడం చూసి, ఈ పాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుందని చంద్రబోస్‌కు బలమైన నమ్మకం కలిగింది. ఆ తర్వాత ఆయన అన్నయ్య కూడా ఈ పాట విని తీవ్రమైన భావోద్వేగానికి గురికావడం విశేషం. చంద్రబోస్ తన 25 ఏళ్లకు పైగా సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని జ్ఞాపకాలను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా రంగస్థలం చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చంద్రబోస్ రాసిన పాటల సాహిత్యాన్ని అద్భుతంగా ప్రశంసిస్తూ, “మీ పెన్నుకు వెన్నువంచి నమస్కారం చేస్తున్నాను” అని చెప్పిన మాటలు తన జీవితంలోనే అత్యంత గొప్ప గౌరవంగా భావిస్తానని ఆయన చెప్పారు. ఈ ప్రయాణంలో తానేమీ పూలబాటపై నడవలేదని, కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నానని వెల్లడించారు. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, అలాగే చీత్కారాలే సత్కారాలుగా మార్చుకుని ఎంతో సహనంతో ముందుకు సాగానని యువతకు స్ఫూర్తినిచ్చారు. తెలుగు భాషపై అచంచలమైన ప్రేమ కలిగిన చంద్రబోస్, ఆంగ్ల భాషలో కేవలం రెండున్నర లక్షల పదాలు మాత్రమే ఉండగా, మన తెలుగు భాషలో ఏకంగా ఆరున్నర లక్షల పదాల అపార సంపద ఉందని ఒక అద్భుతమైన గణాంకాన్ని పంచుకున్నారు. భాష బలహీనమైతే సమాజంలో బంధాలు కూడా బలహీనమవుతాయని, తల్లి భాషను కాదంటే కన్నతల్లిని కాదన్నట్టేనని ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి.
తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్, తాజాగా రెండు పరిశ్రమల మధ్య ఉన్న వ్యత్యాసాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో ఒకరికొకరు ఇచ్చుకునే మద్దతు, సహకారం వంటివి బాలీవుడ్‌లో ఎంతమాత్రం కనిపించవని ఆమె తన మనసులోని అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ఆరోగ్యకరమైన వాతావరణం ముంబైలో లోపించిందనే విషయాన్ని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ తనను ఎప్పుడూ ఎంతో ప్రేమగా చూసుకుందని రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు. టాలీవుడ్‌లో తోటి నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఒకరినొకరు ఎంతగానో ప్రోత్సహించుకుంటారని ఆమె కొనియాడారు. ఒకరి సినిమా ట్రైలర్ విడుదలైనా, పాటలు విడుదలైనా మరొకరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తారని రకుల్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్లకు అందరూ కలిసికట్టుగా వెళ్తారని, సినిమాలు మంచి విజయాలు సాధించినప్పుడు సక్సెస్ పార్టీలను కూడా అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారని ఆమె వివరించారు. టాలీవుడ్‌లో తాము ఇతరుల చిత్రాల ప్రత్యేక స్క్రీనింగులు, ప్రీమియర్ షోలకు ఎంతో ఆనందంగా వెళ్తామని, అక్కడ సినిమాలు చూసి ఒకరికొకరు తోడుగా నిలబడతామని ఆమె చెప్పారు. అయితే బాలీవుడ్‌లో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్రమైన పోటీతత్వం, అభద్రతాభావం (ఇన్‌సెక్యూరిటీ) చాలా ఎక్కువగా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఇతరుల సినిమాలను సపోర్ట్ చేయడానికి అక్కడి వారు పెద్దగా ఇష్టపడరని రకుల్ సంచలన నిజాన్ని బయటపెట్టారు. తాను హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్లి అక్కడ స్థిరపడిన తర్వాతే ఈ వ్యత్యాసాన్ని స్పష్టంగా గమనించానని ఆమె అన్నారు. బాలీవుడ్‌లో కూడా టాలీవుడ్ లాంటి ఆరోగ్యకరమైన, స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటే ఇండస్ట్రీకి ఎంతో బాగుంటుందని రకుల్ ఆకాంక్షించారు. కానీ, బాలీవుడ్ జనాల్లో ఉన్న విపరీతమైన అభద్రతాభావం వల్ల అక్కడ అలాంటి సపోర్టివ్ వాతావరణం సాధ్యం కావడం లేదని రకుల్ విశ్లేషించారు. చిత్ర పరిశ్రమ ఏదైనా సరే, ఈ విధమైన పరిస్థితిని మార్చుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఎంతైనా ఉందని ఆమె గుర్తుచేశారు. ఇండస్ట్రీలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే చిత్ర పరిశ్రమలు మరింత బలంగా, ఆరోగ్యకరంగా మారుతాయని తాను బలంగా నమ్ముతానని రకుల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రకుల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.     Rakul Preet Singh, Interview, Tollywood, Bollywood  
టాలీవుడ్ ప్రేక్షకులకు నటి నమిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘సొంతం’, ‘జెమిని’, ‘బిల్లా’, ‘సింహా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్నారు. అప్పట్లో నమిత గ్లామర్‌కు, ఆమెకున్న భారీ ఫాలోయింగ్‌కు ఇండస్ట్రీ సైతం ఫిదా అయిపోయింది. బొద్దు బొద్దుగా ఉంటూ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ క్వీన్, 2017 లో వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు నెమ్మదిగా దూరమయ్యారు. ఆపై 2022 లో 41 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఆమె పూర్తిగా తన వ్యక్తిగత జీవితానికే పరిమితమయ్యారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన నమితను చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఆమె మునుపటి రూపానికి, ఇప్పటి రూపానికి అస్సలు సంబంధమే లేకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల నమిత ఒక జిమ్‌లో వర్కౌట్ చేస్తూ రికార్డ్ చేసిన మిర్రర్ సెల్ఫీ వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో నమిత మునుపటి కంటే చాలా నాజుగ్గా, స్లిమ్‌గా కనిపిస్తున్నారు. గ్రే కలర్ క్రాప్ టాప్, డార్క్ గ్రే టైట్స్ ధరించి అద్దం ముందు నిలబడి సెల్ఫీ తీసుకుంటూ ఆమె ఇచ్చిన పోజులు అభిమానులను స్టన్ చేస్తున్నాయి. పెళ్లయి, ఇద్దరు పిల్లలకు తల్లయ్యాక కూడా నమిత ఇంత కఠినమైన వర్కౌట్స్ చేస్తూ తన బాడీని పూర్తిగా మార్చేసుకోవడం నిజంగా అభినందనీయమంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే "ఈమె మన పాత నమితనేనా? అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం" అంటూ పోస్టులు పెడుతున్నారు. సాధారణంగా గర్భధారణ తర్వాత మహిళల్లో బరువు పెరగడం సహజం. అయితే నమిత తన ప్రసవానంతరం పెరిగిన బరువును తగ్గించుకోవడానికి ఎంతో కష్టపడి కఠినమైన డైట్, క్రమం తప్పకుండా జిమ్ సెషన్లు చేసినట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. నమిత వయసు ప్రస్తుతం 45 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఇంతటి డెడికేషన్ చూపించి భారీగా బరువు తగ్గడం సామాన్యమైన విషయం కాదు. ఈ కొత్త అవతారంలో ఆమె మళ్లీ వెండితెరపై సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ కూడా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో నడుస్తోంది. ఏది ఏమైనా, నమిత లేటెస్ట్ ట్రాన్స్‌ఫార్మేషన్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. https://www.instagram.com/reel/Da0FN_qp43M/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==  
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం 'పళ్ళబురుసు'. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. పల్లెటూరి స్వచ్ఛమైన వాతావరణం, మట్టి మనుషుల జీవన విధానం నేపథ్యంలో సాగే ఒక ఆసక్తికరమైన కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని ఈ గ్లింప్స్ ద్వారా స్పష్టమవుతోంది. ఉదయ్ చౌహాన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణాని ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విడుదలైన 34 సెకన్ల టైటిల్ గ్లింప్స్ లో పల్లెటూరి ఉదయపు అందాలు, పచ్చని పొలాలు, కాలువ ప్రవాహం వంటి విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ గ్లింప్స్ లో వినిపించే సంభాషణలు సినిమాపై మరింత కుతూహలాన్ని పెంచుతున్నాయి. ఒక వృద్ధుడు(సుధాకర్ రెడ్డి) పొలంలో నిలబడి "ఆ.. ఏందిరా పళ్ళబురుసా.. తేలేదు ఆ కొడుకు" అని అరవడం, అలాగే బైక్ పై వెళ్తున్న యువకులు "పల్లబురుసు ఇంకా తేలేదా" అని మాట్లాడుకోవడం చూస్తుంటే ఈ 'పళ్ళబురుసు' అనే పదం చుట్టూనే కథ మొత్తం తిరుగుతుందని అర్థమవుతోంది. గ్లింప్స్ చివర్లో సుధాకర్ రెడ్డి వేప పుల్లతో పళ్ళు తోముతూ.. "వీడు పళ్ళబురుసు లేడు, నాకు నొప్పి తక్కువ కాదు." అంటాడు. ఇక మురళీధర్ గౌడ్ బైక్ స్టార్ట్ చేస్తూ "నా బిడ్డ పెళ్లి.. మా అయ్య లొల్లి.. ఏందో ఈ పళ్ళబురుసు" అంటూ తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్ తో గ్లింప్స్ ను ముగించారు.  ఈ చిత్రానికి పవన్ సీహెచ్ సంగీతం అందిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉంది. ఈ సినిమాను 2026 ఆగస్టు 14వ తేదీన థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.     Annapurna Studios, Pallaburusu, Title Glimpse, TeluguOne  
  టాలీవుడ్‌లో విభిన్నమైన క్యారెక్టర్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు తిరువీర్ ఈ రోజు  టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ తో కలిసి ‘ఓ సుకుమారి’(O sukumari)తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. భరత్ దర్శన్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంతో వచ్చిన ఈ కామెడీ డ్రామా మూవీపై టాలీవుడ్‌లో మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. హీరోయిన్‌ను ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుందనే ఒక వింత వినూత్నమైన ఆలోచన ప్రధాన కాన్సెప్ట్‌. ఈ రోజు థియేటర్ల వద్ద పబ్లిక్ టాక్ ,రివ్యూస్ చూస్తే మిశ్రమ స్పందన కనిపిస్తోంది. చాలా మంది ప్రేక్షకులు బాగోలేదని సోషల్ మీడియా వేదికగా కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కథనంలో లోపాలు. ఒక క్రేజీ ఐడియాతో కథని మొదలుపెట్టినప్పటికీ, దర్శకుడు దానిని పూర్తి స్థాయిలో వినోదాత్మకంగా ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాడనేది సగటు సినిమా అభిమాని మాట. ఫస్ట్ హాఫ్ ఒక మాదిరిగా ఉన్నా    సెకండాఫ్‌లో కథనం చాలా నెమ్మదిగా సాగడం ప్రేక్షకులకి కాస్త బోర్ కొట్టించింది. ప్రతి పాత్రకు ఒక ముగింపు ఇవ్వాలనే తాపత్రయంలో క్లైమాక్స్ వైపు వెళ్లేసరికి సినిమా చాలా ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. రేటింగ్స్ పరంగా చూసుకున్నా చాలా వెబ్‌సైట్లు  5 కి 2 , 1 .5  రేటింగ్స్ ఇస్తున్నాయి. Also read: అల్లు అర్జున్‌కి అవమానం.. చిరంజీవి ఏం చేసాడంటే? తిరువీర్,  ఐశ్వర్య రాజేష్ తో పాటు మిగతా నటీనటుల పెర్ఫార్మ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.  కానీ కథ ప్రకారం కథనాన్ని, క్యారక్టరయిజేషన్స్ ని రాసుకోవడంలో దర్శకుడు భరత్ దర్శన్ విఫలమయ్యాడని మెజారిటీ ప్రేక్షకులు చెప్తున్నారు.  Thiruveer,  o sukumari, Aishwarya Rajesh, tollywood
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటనపై తనకున్న అంకితభావాన్ని మరోసారి నిరూపించుకున్నారు. తన రెండవ బిడ్డను ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్న ఈ బాలీవుడ్ బ్యూటీ, ప్రస్తుతం 7 నెలల ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటికీ, ఆమె తన వృత్తిపరమైన బాధ్యతలను ఏమాత్రం విస్మరించకుండా షూటింగ్‌లలో పాల్గొంటున్నారు.  కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రాకా' చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తన ప్రసూతి సెలవులకు (మెటర్నిటీ లీవ్) వెళ్లడానికి ముందే తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేయాలని దీపికా పట్టుదలతో ఉన్నారు. సినిమా వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, 'రాకా' సినిమా షెడ్యూల్‌ను వేగంగా ముగించడం కోసం దీపికా పదుకొణె ఏకంగా నైట్ షిఫ్ట్‌లలో కూడా పనిచేస్తున్నారు. అంతేకాకుండా, ఏడు నెలల గర్భవతిగా ఉండి కూడా శారీరకంగా ఎంతో శ్రమతో కూడిన భారీ యాక్షన్ సీక్వెన్స్‌లలో ఆమె నటిస్తుండటం సెట్స్‌లోని చిత్ర యూనిట్ సభ్యులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంట్లో అప్పటికే ఉన్న చిన్న పాపను చూసుకుంటూ, మరోవైపు తన రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్న తరుణంలో కూడా ఆమె ఏకకాలంలో రెండు భారీ ప్రాజెక్టులను బ్యాలెన్స్ చేస్తున్నారు. అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న 'రాకా' చిత్రంతో పాటు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'కింగ్' సినిమాలోనూ దీపికా కీలక పాత్ర పోషిస్తున్నారు. గర్భవతిగా ఉన్న సమయంలో దీపికా పదుకొణె ఇలాంటి కఠినమైన యాక్షన్ సీన్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తన మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో కూడా గ్లోబల్ హిట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ' క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాప్ డ్రామా 'సింగం అగైన్' చిత్రంలో అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్ లలో ఆమె పాల్గొని మెప్పించారు. దీపికా మాత్రమే కాకుండా, చిత్రసీమలో నేటి తరం కథానాయకులు వివాహం, మాతృత్వం తర్వాత హీరోయిన్ల కెరీర్ స్పాన్ తక్కువగా ఉంటుందనే పాత ఆలోచనలను బద్దలు కొడుతున్నారు. గతంలో నటి కియారా అద్వానీ తన కుమార్తె సరాయా గర్భంలో ఉన్నప్పుడు 'టాక్సిక్' సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. అలాగే స్టార్ హీరోయిన్ అలియా భట్ సైతం తన మొదటి కుమార్తె రాహా గర్భంలో ఉన్న సమయంలోనే హాలీవుడ్ డెబ్యూ చిత్రం 'హార్ట్ ఆఫ్ స్టోన్' కోసం అత్యంత రిస్కీ యాక్షన్ సన్నివేశాలలో నటించి సరికొత్త సరిహద్దులను చెరిపేశారు.     Deepika Padukone, Raaka Movie, Allu Arjun, Atlee  
  రంగస్థలంతో తెలుగు సినిమాకి సరికొత్త సొగసుని అద్దారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్. దీంతో ఆ ఇద్దరు కలిసి చేస్తున్న RC17 (వర్కింగ్ టైటిల్) పై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.  తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే కథగా ప్రచారం జరుగుతుండగా అక్టోబర్ లో లాంచింగ్ ఉంటుందనే టాక్ వినపడుతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ చాలా బలంగా, రా అండ్ రస్టిక్ గా ఉంటాయనే విషయం తెలిసిందే. అందుకే  తెలంగాణ బ్యాక్‌డ్రాప్ రూటెడ్ స్టోరీకి భాగ్యశ్రీ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని సుకుమార్ భావిస్తున్నారట. మరి సుకుమార్ భావిస్తున్నట్టుగా ఏ క్యారక్టర్ లో అయినా ఒక రేంజ్ పెర్ఫార్మ్ ఇవ్వగలదని భాగ్యశ్రీ నిరూపిస్తూ ఉంది. ఉదాహరణకి గ్రామీణ నేపథ్యంలోనే తెరకెక్కి విజయదుందుభి మోగిస్తున్న లెనిన్. భారతి క్యారక్టర్ లో భాగ్యశ్రీ ప్రదర్శించిన పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. అలాంటి భాగ్యశ్రీ బోర్సే కనుక  చరణ్ మూవీలో  ఫైనలైజ్ అయితే, ఆమె కెరీర్ మరో లెవెల్ కి వెళ్లడం ఖాయం.  Also read: జన నాయగన్ దెబ్బకి రిలీజ్ డేట్ మార్చుకున్న చిత్రాలు ఇవే!  ఈ వార్త విన్న మెగా అభిమానులు సోషల్ మీడియాలో #RC17 కాస్టింగ్ పై జోరుగా డిస్కషన్స్ మొదలుపెట్టారు. భాగ్యశ్రీ గ్లామర్, చరణ్ మాస్ ఇమేజ్ స్క్రీన్ పై సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ఇప్పటికే ఈ స్క్రిప్ట్ వెర్షన్స్ ని లాక్ చేసి, ప్రీ ప్రొడక్షన్ పనులని  90% పూర్తి చేసినట్లు టాక్ వస్తోంది. మైత్రి మూవీస్ నిర్మిస్తుంది. ram charan, Bhagyashri Borse, sukumar, mythri movie makers
ప్రపంచవ్యాప్తంగా సినిమా పిచ్చి ఉన్న అభిమానులను మనం ఎంతో మందిని చూసి ఉంటాం. తమకు ఇష్టమైన హీరోల సినిమాలు వస్తే థియేటర్ల ముందు కటౌట్లు కట్టడం, పాలాభిషేకాలు చేయడం లాంటివి చూశాం. కానీ ఒక హాలీవుడ్ దర్శకుడి సినిమా కోసం ఏకంగా తన ప్రెగ్నెన్సీనే వాయిదా వేసుకున్న ఒక మహిళ ఉదంతం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సినిమా చరిత్రలోనే ఇది ఒక నమ్మశక్యం కాని సరికొత్త క్రేజ్‌గా నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరో, ఎందుకు అలా చేసిందో తెలిస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న క్రిస్టోఫర్ నోలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసే ప్రతి సినిమా ఒక విజువల్ వండర్‌గా ఉంటుంది. తాజాగా నోలన్ దర్శకత్వంలో వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ది ఒడిస్సీ'. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూశారు. ఆ సినీ పిచ్చి ప్రపంచంలో భాగమైన కాలిఫోర్నియాకు చెందిన 29 ఏళ్ల టెక్ ఎడిటర్ ఆంబర్ కనాగన్ అనే మహిళ నోలన్‌కు వీరాభిమాని. ఆమెకు ఇప్పటికే ఒక బిడ్డ ఉన్నాడు. తన భర్తతో కలిసి రెండో సంతానం కోసం ప్లాన్ చేసుకుంటున్న సమయంలో, క్రిస్టోఫర్ నోలన్ కొత్త సినిమా 'ది ఒడిస్సీ' విడుదల తేదీ ఖరారైంది. దాంతో ఆమె ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాను ఎలాగైనా సరే విడుదలైన మొదటి రోజే, అదీ 70 ఎంఎం భారీ ఐమాక్స్ (IMAX 70mm) స్క్రీన్‌పైనే చూడాలని ఆంబర్ బలంగా నిశ్చయించుకుంది. అయితే ఆమె నివసిస్తున్న ప్రాంతానికి దగ్గరలో ఐమాక్స్ థియేటర్ లేదు. ఆ స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఆమె ఏకంగా 3 గంటల పాటు సుదీర్ఘంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ తాను ప్రెగ్నెంట్ అయితే, ఆ సమయంలో అంత దూరం ఒంటరిగా కారు నడుపుకుంటూ వెళ్లడం ఏమాత్రం సాధ్యం కాదు. ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే అలసట, ప్రయాణ ఇబ్బందుల వల్ల తన డ్రీమ్ ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవుతుందని ఆమె భయపడింది. అందుకే, నోలన్ సినిమాను థియేటర్లో చూసేంత వరకు తన ప్రెగ్నెన్సీని కొన్ని నెలల పాటు వాయిదా వేసుకోవాలని భర్తను ఒప్పించింది. ఒక వైపు భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'ది ఒడిస్సీ' సినిమాకు థియేటర్ల దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్, రివ్యూలు వస్తున్నాయి. ఇండియాలో కూడా మన టాప్ స్టార్ల సినిమాల రేంజ్‌లో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆంబర్ కనాగన్ చేసిన ఈ సాహసోపేతమైన ప్రకటన మీడియాలో మరియు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "సినిమాపై అభిమానంలో ఇది నెక్స్ట్ లెవెల్ పిచ్చి" అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. ఒక అద్భుతమైన సినిమా అనుభూతి కోసం జీవితంలో ఎంతో ముఖ్యమైన మాతృత్వాన్ని కూడా కొన్ని రోజులు పక్కన పెట్టిన ఆంబర్ క్రేజ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
   పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.  అయితే.. ఇలా పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం సరైనదేనా?  దీని వల్ల కలిగే పర్యవసానాలు ఏంటి? తెలుసుకుంటే.. మంచి, చెడు.. పిల్లలు అనేది వారి వయసును పరిగణలోకి తీసుకునే.. అలాంటి పిల్లల మెదడు ఇంకా ఎదిగే దశలో ఉంటుంది.  ఈ కారణంగా పిల్లలకు మంచి ఏది చెడు ఏది అనే విషయాలు అర్థం చేసుకునేంత ఆలోచన ఉండదు. తల్లిదండ్రులు పిల్లల ముందు బట్టలు మార్చుకుంటే.. తమ ముందు ఎవరు అలా బట్టలు మార్చుకున్నా లేదా విప్పినా అది పెద్ద విషయమేమీ కాదని అనుకుంటారు. ఇదెప్పుడూ మంచిది కాదు. ప్రైవసీ.. ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన విషయం. తల్లిదండ్రులైనా సరే.. పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం ద్వారా వారికి శరీరం వాల్యూ తెలియదు. శరీరం బట్టలు లేకుండా ఉన్నప్పుడు ఒకరికి కనిపించకూడదని, ఇతరుల ముందు ఎల్లప్పుడూ శరీరాన్ని వస్త్రాలతో కప్పి ఉంచాలని.. ఇలాంటి చిన్న విషయాలు వారు తెలుసుకోలేరు.  ఈ కారణంగా వారికి  శరీరం గురించి అవగాహన రాదు. హద్దలు.. పిల్లలకు కూడా వ్యక్తిగత హద్దులు అనేవి ఉండాలి.  తమ ముందు ఎవరు ఎలా ఉండాలి?  తాము ఎవరి ముందు ఎలా ఉండాలి వంటివి పిల్లలు అర్థం చేసుకోవాలంటే అది తల్లిదండ్రుల ద్వారా మాత్రమే సాధ్యం  అవుతుంది.  తల్లిదండ్రులు పిల్లల ముందు దుస్తులు మార్చుకుంటే.. తమ ముందు ఎవరు మార్చుకున్నా పర్వాలేదని,  తాము కూడా ఎవరి ముందైనా బట్టలు మార్చుకోవచ్చని అనుకుంటారు. తల్లిదండ్రులు చేసే పని వల్ల వారికి హద్దులు అనేవి అర్థం కావు. తప్పులు.. తల్లిదండ్రులు పిల్లల ముందు బట్టలు మార్చుకుంటే పిల్లలు తప్పు మార్గంలో వెళ్లే అవకాశం ఉంటుంది. ఎవరైనా బట్టలు మార్చుకొనేటప్పుడు కూడా తాము చూడటం తప్పు కాదని అనుకుంటారు. ఇది ఇతరుల ప్రైవసీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఇతరులకు విలువ కూడా ఇవ్వకుండా తయారవుతారు. ఈ వయసుకు తప్పనిసరి.. పిల్లలకు వయసు అనుసరించి ప్రైవసీ నేర్పాలి. ముఖ్యంగా మూడు సంవత్సరాల తర్వాత పిల్లలకు ప్రైవసీ నేర్పాలి.  ఇతరుల ముందు బట్టలు మార్చుకోవడం,  విప్పడం  చేయరాదని, ఇతరులు బట్టలు మార్చుకొనేటప్పుడు చూడరాదని పిల్లలకు చెప్పాలి.  ఇదంతా తల్లిదండ్రులు తమ నుండే మొదలు పెట్టాలి.                                    *రూపశ్రీ  
  ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భారం అనుకునేవారు.  వారిని పెంచి పెద్ద చేయాలి,  మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి.  ఆడపిల్ల పుట్టిందంటే పెద్ద ఆర్థిక భారంగా భావించేవారు. కానీ నేటికాలంలో ఆడపిల్లే కావాలని ఆశ పడే తల్లిదండ్రులు ఉన్నారు.  ముఖ్యంగా.. ఆడపిల్లను యువరాణిలాగా,  అపురూపంగా పెంచే వారు ఉన్నారు.  తల్లిదండ్రులు ఇద్దరిలో ఆడపిల్ల విషయంలో తండ్రే ఎక్కువ ప్రేమ చూపిస్తాడని అందరూ అంటారు. అందుకే ఆడపిల్లను డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని అంటుంటారు.  అయితే ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి కొన్ని అలవాట్లు వదులుకోవాలి.  లేదంటే ఆడపిల్ల ఎదుగుదల దెబ్బతింటుంది, పైగా ఆడపిల్ల భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది.  ఇంతకూ ఆడపిల్ల తండ్రులు వదులుకోవలసిన అలవాట్లు ఏంటో తెలుసుకుంటే.. కోపంగా అరవడం.. చాలామంది మగాళ్లకు కోపంతో గట్టిగా అరవడం అనే అలవాటు ఉంటుంది. కానీ ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఇంట్లో ఇలా కోపంగా, గట్టిగా అరిస్తే ఆడపిల్లలకు భయం పెరిగి నమ్మకం తగ్గుతుంది.  తనకు ఏదైనా బాధ లేదా సమస్య అనిపిస్తే తండ్రితో మనసు విప్పి చెప్పుకోలేదు. అందుకే కోపంగా అరిచే అలవాటు ఉంటే ఆ అలవాటు మానేయ్యాలి. భార్యను తక్కువ చేయడం.. భార్య మీద అరవడం, బార్యను తక్కువ చేసి మాట్లాడటం వంటివి చాలా మంది మగాళ్లకు ఉండే అలవాటు. అయితే కూతురు ఉన్నప్పుడు ఇలా  భార్యను తక్కువ చేసి మాట్లాడటం, భార్య మీద అరవడం వంటివి చేయరాదు. ఎందుకంటే భార్య విషయంలో మగాడు చేసే ప్రవర్తన వల్ల కూతురికి తండ్రి మీద గౌరవం తగ్గిపోతుంది. అతను ఎప్పటికీ కూతురి దృష్టిలో ఉన్నతంగా ఉండలేడు. అందుకే కూతురి ముందు భార్యను తిట్టడం, చిన్నతనంగా మాట్లాడటం, అవమానించడం చేయకూడదు. ఆడపిల్లలను తక్కుగా మాట్లాడటం.. చాలామంది మగాళ్లు ఆడపిల్లల విషయంలో అనే మాట.. నువ్వు ఆడపిల్లవు అది చేయకు ఇది చేయకు అని.  నువ్వు చేయలేవు అని అనడం.  ఇలా మాట్లాడటం వల్ల ఆడపిల్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఆడపిల్ల తన జీవితంలో ఎలాంటి ఉన్నత లక్ష్యాలు సాధించకపోగా, భయస్థురాలిగా ఉండిపోతుంది. అందుకే ఆడపిల్లలను ప్రోత్సహించాలి తప్ప తక్కువ చేసి మాట్లాడకూడదు. పద్దతుల పేరుతో కఠినం.. సమాజంలో ఎంతో మంది తల్లిదండ్రులు పద్దతులను  మగపిల్లల కంటే ఆడపిల్లలను పెంచడంలోనే ఎక్కువ ప్రయోగిస్తారు. పద్దతుల పేరుతో ఆడపిల్లలను కఠినంగా, వారిని భయపెడుతూ పెంచుతారు.  కానీ ఆడపిల్లలను పద్దతుల పేరుతో భయపెట్టి కాదు.. ప్రేమతో పెంచాలి. సమస్యలు, పరిష్కారం.. ఆడపిల్లకు సామర్థ్యం ఉండదని, ఏ సమస్యను వారు ఎదుర్కోలేరని తల్లిదండ్రులు అనుకుంటారు. ఈ కారణంగానే ఆడపిల్ల ఏదైనా సమస్య అనగానే తండ్రే పరిష్కరించడం ఆడపిల్లను సేఫ్ జోన్ లో ఉంచడం చేస్తారు.  దీని వల్ల ఆడపిల్ల చేతకాని దాని లాగా,  సమస్యలు వచ్చినప్పుడు దిక్కుతోచక నిస్సహాయంగా ఉండిపోతుంది. అందుకే అన్ని సమస్యలు తండ్రి పరిష్కరించకుండా కొన్ని ఆడపిల్ల కూడా పరిష్కరించేలా అవకాశం ఇవ్వాలి.  ఇది జీవితంలో కొండంత ధైర్యాన్ని, సమస్యలను ఎదుర్కునే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.                                        *రూపశ్రీ.
  ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.. బయట ఎన్ని సమస్యలు ఉన్నా,  ఎంత ఇబ్బందులు ఎదుర్కున్నా ఇంటికి రాగానే సంతోషం బోలెడు ప్రశాంతత,  జీవితంలో ఊరట కలుగుతోంది అంటే.. ఆ కుటుంబం ఎంతో ఆరోగ్యంగా ఉందని అర్థం. కానీ కొన్ని కుటుంబాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు. ఇలా ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోతే కుటుంబ సభ్యులు చాలా వరకు మానసికంగా డిస్టర్బ్ అవుతుంటారు. అయితే  కుటుంబ వాతావరణం అనారోగ్యంగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో తరాల అంతరం వల్ల కుటుంబంలో వాతావరణం సరిగా లేకుండా ఉండే అవకాశం ఉంది, అలాగే కుటుంబ అలవాట్ల వల్ల కూడా వాతావరణం దెబ్బతింటుంది. కానీ కుటుంబ జీవితంలో నిర్లక్ష్యం చేయకూడని విషయాలు కొన్ని ఉన్నాయి.  వాటిని తెలుసుకుంటే.. కుటుంబం తిరిగి ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు.  ఇంతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. ఎమోషన్స్ దుర్వినియోగం.. కుటుంబంలో సులభంగా గుర్తించగలిగే ప్రమాదకరమైన విషయాలు ఏవీ ఉండవు. కానీ చాలా సున్నితంగా ఉంటూనే మనుషుల్ని బాధపెడతారు. ఎమోషన్స్ తో ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యులు తమదే తప్పు అన్న భావనను కుటుంబంలో  వ్యక్తికి కలిగిస్తారు. కొన్నిసార్లు, వారు బాధితులుగా నటిస్తూ ఎదుటివారిని ఎక్కువగా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాతావరణం ఉన్న ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం, సంతోషం ఉండవు. నిర్ణయాల దగ్గర బంధనం..  కుటుంబంలో జీవిత నిర్ణయాల గురించి మిమ్మల్ని అడగకుండా, తమకు తాము నిర్ణయాలు తీసుకుని ఆఖరిగా మీకు చెబుతూ ఉంటే.. ఒకవేళ అదే నిజమైతే, ఇది నిర్లక్ష్యం చేయకూడని విషయమని లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు. . ఈ నియంత్రణ చిన్నతనం నుండి కౌమారదశ వరకు ఆరోగ్యకరంగానే ఉంటుంది. , కానీ  పెద్దయ్యాక కుటుంబ సభ్యుల నుండి ఇదే వైఖరి కొనసాగడం మంచిది కాదు. హద్దులు లేకపోవడం.. ప్రతిఒక్కరూ ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించుకున్నప్పుడే కుటుంబ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. అలా చేయడంలో విఫలమైతే, కాలక్రమేణా విషపూరితమైన సంబంధాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా, ఈ విషయాలు  వ్యక్తి యొక్క భావోద్వేగ ఎదుగుదలకు చాలా కీలకమైనవి. గొడవల పరిష్కారం.. పరిష్కారం కాని కుటుంబ వివాదాలు చాలా కుటుంబాలలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి పదేపదే మరో వాదనకు లేదా ఘర్షణకు దారితీసి, పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి. దీనివల్ల, ఆ విషయం పరిష్కారమైన తర్వాత కూడా ఎమోషనల్ దూరం పెరగవచ్చు. పట్టించుకోకపోవడం.. కుటుంబంలో మీ భావాలను లేదా అభిప్రాయాలను ఎప్పుడూ  పట్టించుకోవడం జరిగితే అది కుటుంబ సభ్యుల నుండి దూరాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఎప్పుడైతై ఎమోషనల్ సపోర్ట్ లేదా అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం జరుగుతుందో అప్పుడు ఆ ఇంట్లో వ్యక్తి పరాయివాడుగా ఫీలవుతారు.                                     *రూపశ్రీ.  
మోకాళ్ల నొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మెట్లు ఎక్కడం, నడవడం, ఎక్కువసేపు నిలబడటం వంటి రోజువారీ పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఈ వీడియోలో యోగా ఆచార్య ధాకారం గారు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే సులభమైన యోగా ఆసనాలు మరియు వ్యాయామాలను వివరంగా చూపించారు. ఈ యోగా పద్ధతులను సరైన విధంగా, క్రమం తప్పకుండా చేస్తే మోకాళ్ల కండరాలు బలపడటంతో పాటు కీళ్ల కదలిక మెరుగుపడుతుంది. మోకాళ్లలో గట్టిదనం తగ్గి, నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఇవి ఉపయోగపడవచ్చు. వయస్సుతో వచ్చే మోకాళ్ల సమస్యలు, ఆస్టియోఆర్థ్రైటిస్ ప్రారంభ దశలో ఉన్నవారు లేదా ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేసే వారు కూడా ఈ వ్యాయామాల గురించి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: మోకాళ్ల నొప్పికి కారణాలు మోకాళ్ల కండరాలను బలపరిచే యోగా వ్యాయామాలు నొప్పిని తగ్గించే సులభమైన స్ట్రెచింగ్ పద్ధతులు నడవడం, మెట్లు ఎక్కడం సులభం కావడానికి ఉపయోగపడే సూచనలు మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకునే యోగా చిట్కాలు గమనిక: మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న వారు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య లేదా శస్త్రచికిత్స అనంతర పరిస్థితి ఉంటే, ఈ వ్యాయామాలను ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి
నేటికాలంలో అందరినీ ఇబ్బంది పెట్టే అతిపెద్ద సమస్య కాలుష్యం.   గాలి కాలుష్యం, ఆహార కాలుష్యం, నీటి కాలుష్యం.. ఇలా ప్రతిదీ కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉన్నాయి.  బయటకు వెళ్లినప్పుడు వాహనాల పొగతో పాటు ఎన్నో కారణాల వల్ల గాలి కాలుష్యం అవుతుంది. అయితే చాలామంది ఇళ్లలో కూడా గాలి స్వచ్చంగా లేకపోవడం వల్ల శ్వాస సంబంధం సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇంట్లో గాలి కాస్త డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది.   కొన్ని రకాల మొక్కలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల  గాలిని శుద్ది చేసి గాలిని స్వచ్చంగా మారుస్తాయి. అంతేకాదు. ఆక్సిజన్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తాయి.  ఇంట్లో ఆక్సిజన్ స్థాయిలను మెరుగు పరిచి,  గాలిని శుద్ది చేసే ఆ మొక్కలు ఏవో తెలుసుకుంటే.. ఇండోర్ మొక్కలు ఎందుకు ప్రయోజనకరంగా పరిగణించబడతాయి..? ఇంట్లో పెంచే మొక్కలను ఇండోర్ మొక్కలు అని అంటారు.  ఈ మొక్కలు  గాలిని సహజంగా శుద్ది చేసే పరికరాలుగా  పనిచేస్తాయి. అవి కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించి, ఆక్సిజన్‌ను విడుదల చేయడం ద్వారా గాలిలోని హానికరమైన కాలుష్య కారకాలను తొలగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, అవి ఇంటి అలంకరణకు కూడా ఎంతో మంచివి.  చాలా మంది ఇళ్లలో అలంకరణ కోసం మొక్కలను పెంచుతారని అనుకుంటారు. కానీ.. ఇవి అలంకరణ కోసం మాత్రమే కాకుండా ఇంట్లో గాలిని శుద్ది చేయడానికి కూడాపెంచుతారు. ఇంట్లో గాలిని శుద్ది చేసి ఆక్సిజన్ పెంచే మొక్కలు.. పీస్ లిల్లీ.. ఇంటి లోపల చక్కగా పెరిగే ఒక  మొక్క పీస్ లిల్లీ..  ఈ మొక్కల పువ్వులు చాలా విభిన్నంగా ఉంటాయి. గాలి చాలా బాగా శుద్ది చేయడంలో ఈ మొక్కలు చాలా గొప్పగా సహాయపడతాయి.  కలబంద.. కలబంద ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా ఉండే మొక్క, అయితే ఇళ్లలో వాడే  డిటర్జెంట్లు, పెయింట్లు,  గమ్ లలో  ఉండే కొన్ని సాధారణ రసాయనాలు గాలిలో కలిసిపోయి ఉంటాయి. అలాంటి  గాలిని శుద్ధి చేసి, ఇంటిని తాజాగా ఉంచే సామర్థ్యం కలబందకు ఉంది. స్నేక్ ప్లాంట్.. నీరు, వెలుతురు, సూర్యరశ్మి సరిగా లేకపోయినా, చాలా తక్కువగా ఉన్నా సరే..అలాంటి వాతావరణంలో కూడా స్నేక్ ప్లాంట్ పెరుగుతుంది. దీనికున్న ప్రత్యేక లక్షణం .. ఇది రాత్రిపూట కూడా కార్బన్ డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మారుస్తుంది, అందువల్ల ఇది పడకగదిలో పెంచడానికి కూడా చాలా అనువైన మొక్క. మనీ ప్లాంట్.. వాస్తు పరంగా , శాస్త్రీయంగా కూడా చాలా ప్రాచుర్యం పొందిన మొక్క మనీ ప్లాంట్, భారతీయులలో చాలా ఇళ్లలో మనీ ప్లాంట్ ఉంటుంది. ఇది ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదని,  ఆర్థిక ఎదుగుదల ఉంటుందని అనుకుంటారు. ఇంటిలోని మూసి ఉన్న గదులలోని కలుషిత గాలిని శుభ్రపరచడానికి , ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. స్పైడర్ ప్లాంట్.. పొడవాటి, చారల ఆకులతో ఉండే ఈ మొక్క వేగంగా పెరుగుతుంది . దీనికి పెద్దగా సంరక్షణ కూడా అవసరం లేదు. గాలి నుండి కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులను తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పైన చెప్పుకున్న మొక్కలను ఇంట్లో  పెంచుకుంటే ఇంటి వాతావరణం,  ఇంటి గాలి చాలా శుద్ధంగా మారుతుంది.                                   *రూపశ్రీ.  
ఉద్గీత ప్రాణాయామం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు..రోజుకు 5 నిమిషాలు చాలు.! రోజుకు కేవలం 5 నిమిషాలు ఉద్గీత ప్రాణాయామం (ఓం ధ్యానం) చేస్తే శరీరం, మనసు ఎలా మారుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో ప్రముఖ సీనియర్ యోగా థెరపిస్ట్ & ఆయుర్వేద డైటీషియన్ శ్రీమతి స్రవంతి రఘు గారు ఉద్గీత ప్రాణాయామాన్ని సరైన పద్ధతిలో ఎలా చేయాలో సులభంగా వివరిస్తారు. అలాగే దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, శాస్త్రీయంగా నిరూపితమైన అంశాలు, ఒత్తిడి తగ్గడం, మానసిక ప్రశాంతత పెరగడం, ఏకాగ్రత మెరుగుపడడం, మంచి నిద్రకు సహాయపడడం వంటి విషయాలను వివరంగా తెలియజేస్తారు. అంతేకాకుండా, ఉద్గీత ప్రాణాయామాన్ని ఎవరు చయాలి? ఎవరు చేయకూడదు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రారంభ స్థాయి వారు ఎలా ప్రారంభించాలి? వంటి ముఖ్యమైన సందేహాలకు కూడా సమాధానాలు ఈ వీడియోలో పొందుపరిచారు. యోగా, ధ్యానం, సహజ ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతతపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఉపయోగకరమైన వీడియో ఇది. ఈ వీడియోను పూర్తిగా వీక్షించి, ఉద్గీత ప్రాణాయామాన్ని సరైన విధంగా అభ్యసించి ఆరోగ్యకరమైన జీవనశైలికి నాంది పలకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)