
-ఇండియా వ్యాప్తంగా వైరల్ గా మారిన కేరళ స్టోరీ 2
-ప్రకాష్ రాజ్ కోసం ఎదురుచూపులు
-తనదైన స్టైల్లో ట్వీట్
షార్ట్ టైంలో అగ్రనటుడిగా ఎదిగిన ప్రకాష్ రాజ్(Prakash raj)అంతే షార్ట్ టైంలో ఎలాంటి విషయంపై నైనా స్పందిస్తుంటాడు. సదరు స్పందన వల్ల ఎవరు ఇబ్బంది పడతారో తెలియదు కానీ వైరల్ గా మారడం మాత్రం ఖాయం. ఈ కోవలోనే ది కేరళ స్టోరీ పార్ట్ 2(The Kerala story 2)ట్రైలర్ రిలీజైన దగ్గరనుంచి ప్రకాష్ రాజ్ స్పందన కోసం అభిమానులు, నెటిజన్స్ వెయిట్ చేస్తు చేస్తున్నారు.ట్రైలర్ లో ముస్లిం కుటుంబానికి చెందిన కొంత మంది ఒక అమ్మాయి చేత బలవంతంగా బీఫ్(Beef)తినిపించే సన్నివేశం ఉంది. ఇప్పుడు ఈ విషయంపైనే ఇండియా మొత్తం చర్చ జరుగుతుంది. దీంతో ప్రకాష్ రాజ్ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. కొంచం లేటుగా అయినా లేటెస్ట్ గా ఆ తనదైన స్టైల్లోనే స్పందించాడు. సదరు స్పందన ఇదే.
ఎక్స్ వేదికగా శాఖాహార కేరళ సద్యతో పాటు బీఫ్, పోర్క్, చేపల వంటి వంటకాలతో కూడిన ఫోటోలని షేర్ చేస్తు ఇవి నిజమైన కేరళ రాష్ట్ర నిజమైన సంస్కృతిని, వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది.అన్ని రకాల వంటకాలు కలిసి సామరస్యంగా ఉండటమే నిజమైన కేరళ స్టోరీ. దయచేసి ఆస్వాదించండనే క్యాప్షన్ ఉంచాడు . ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also read: Pawan kalyan: ఎందుకు కలిసారు..ఆరా ఆఫ్ ఉస్తాద్ రికార్డ్స్ కొడుతుందా!
ఇటీవల కేరళ ముఖ్యమంతి పినరయి విజయన్(Pinarayi Vijayan)కేరళ స్టోరీ పార్ట్ 2 పై స్పందిస్తు కేరళలో మతసామరస్యం చెడగొట్టడానికి ఇలాంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయని, నిషేదించాలని ప్రజలకి పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే.







.webp)
