LATEST NEWS
రేవంత్ రెడ్డి తన కేబినెట్ నుంచి కొండా సురేఖను  బర్త్ రఫ్ తరువాత ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు అన్న ఉత్కంఠ తెలంగాణ రాజకీయవర్గాలలో నెలకొంది. బీజేపీవైపు ఆమె అడుగులు పడే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషణలకు కూడా చేశారు. అయితే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ వ్యక్తిత్వాన్ని, నాయకత్వ శైలిని ఆమె కొనియాడతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.  గతంలో బీఆర్ఎస్ పార్టీ  కొనసాగిన కాలంలో   కేసీఆర్‌తో  తమ కుటుంబానికి ఉన్న సంబంధాల గురించి తాజాగా వివరించిన  కొండా సురేఖ.. కేసీఆర్ చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. తాను ఆయనతో ఎప్పుడు భేటీ అయినా ఎంతో ఆప్యాయంగా, హుందాగా రిసీవ్ చేసుకునేవారని  గుర్తుచేసుకున్నారు. పార్టీలో సుదీర్ఘకాలం పాటు కలిసి పనిచేసినప్పటికీ, కేసీఆర్ వ్యవహారశైలి తమకు ఎప్పుడూ ఎలాంటి అసంతృప్తి కలిగించలేదన్న కొండా సురేఖ.. బీఆర్ఎస్ అధినాయత్వంతో  తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని చెప్పడమే కాకుండా.. కేసీఆర్ నాయకత్వంలో తనకు ఎటువంటి ఇబ్బందులూ ఎన్నడూ ఎదురు కాలేదన్నారు.  ఈ సందర్భంగా కొండా సురేఖ తన భర్త కొండా మురళికి గతంలో దక్కిన ఎమ్మెల్సీ పదవికి  కేసీఆర్ హయాంలోనే  దక్కిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో కొండా మురళికి శాసనమండలికి వెళ్లే అవకాశం వచ్చినప్పుడు..  పార్టీలోని కొందరు సీనియర్ నేతలు  అడ్డుకునేందుకు  ప్రయత్నించారనీ, ముఖ్యంగా  కడియం శ్రీహరి వంటి సీనియర్ నాయకులు మురళికి ఆ పదవిని దక్కకుండా చేసేందుకు తెరవెనుక పావులు కదిపారని తాజాగా ఆరోపించారు. అయితే  కేసీఆర్ మాత్రం వాటన్నిటినీ తోసి రాజని,  కొండా మురళి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకారం అందించారని కొండా సురేఖ గుర్తు చేసారు.   ప్రస్తుత పరిస్థితుల్లో కొండా సురేఖ కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తడం రాజకీయంగా ఆమె అడుగులు ఎటుపడుతున్నాయన్నదానిపై ఒక స్పష్టత ఇచ్చేయడమేనన్నారు. గతంలో  బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన కొండా సురేఖ.. ఇప్పుడు అదే పార్టీ అధినేతపై ప్రశంసల వర్షం గుప్పించడం వెనుక ఆమె గులాబీ గూటికి చేరే వ్యూహం ఉందని పరిశీలకులు అంటున్నారు.    [Strategy Behind Konda Surekha Praises KCR, Konda, Brs, Konda Murali, MLC, Telangana Politics, Telugu One]
రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న రేవంత్  మంత్రివర్గ ప్రక్షాళన వ్యవహారం.. కేబినెట్ నుంచి కొండా సురేఖ బర్త్ రఫ్ తో కొత్త వివాదానికి తెరలేచింది.  తనకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన పరిణామాలపై కొండా సురేఖ మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.   కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్గతంగా నడుస్తున్న పరిణామాలు, నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు , రాష్ట్ర కాంగ్రెస్ లో పాత, కొత్త విభేదాలను మరోసారి తాజాగా కొండా సురేఖ తన వ్యాఖ్యల ద్వారా తెరపైకి తీసుకువచ్చారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, రేవంత్ రెడ్డి మూలాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయని, ఆయనలొ  ప్రవహిస్తున్నది టీడీపీ రక్తమేనన్న కొండా సురేఖ..  కక్షసాధింపు రాజకీయాలు, వెన్నుపోటు కుట్రలు  తెలుగుదేం రక్తంలోనే ఉన్నాయన్నారు.  తనను టార్గెట్ చేసే క్రమంలో చిన్నారెడ్డిని కూడా రాజకీయంగా బలి చేశారని కొండా సురేఖ ఆరోపంచారు. రక్షా బంధన్ సందర్భంగా తాను స్వయంగా సీఎం నివాసానికి వెళ్లి రాఖీ కట్టానని గుర్తు చేసిన కొండా సురేఖ ఆ సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి   ఈ వివాదం గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదని చెబుతూ సెంటిమెంట్ పండించడానికి ప్రయత్నించారు. తనను కేబినెట్ నుంచి తప్పించే ఆలోచన  కాంగ్రెస్ అధిష్టానానికి లేదనీ, అయితే  కొందరు నేతలు స్వార్థ రాజకీయాల కారణంగానే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు.  కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు అంతర్గతంగా ఏకమై తనపై పెద్ద కుట్ర పన్నారని  ఆరోపించారు. ముఖ్యమంత్రితో వేం నరేందర్ రెడ్డి మైండ్ గేమ్ ఆడిస్తూ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారన్నారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకు గతంలో తాను రాసిన లేఖలను మీడియాకు విడుదల చేశారు.  పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు పంపిన ఆ లేఖల్లో ప్రభుత్వ తీరుపై కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రిగా తనకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని, తన శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలను కూడా తన ప్రమేయం లేకుండానే మంత్రులు, అధికారులు చక్కబెట్టేశారని ఆ లేఖల్లో ఆరోపించారు.    [Konda Surekha Sensational Comments, Revanth Reddy, Congress Government, Telangana Politics, TDP Blood Comments, Telugu One]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం ఒక వారంలోనే వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశ,  పోలవరం ఎడమ కాలువను ప్రారంభించి, రాష్ట్ర సాగునీటి చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికారు. మరోవైపు, ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది. ఇక పోలవరం ఎడమ కాలువ పనులను చేపట్టింది.. సీఎంగా ఉన్న సమయంలో వైసీపీ అధినేత జగనే అంటూ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ శతధా ప్రయత్నిస్తోంది.  అయితే వైసీపీ ఎకో సిస్టమ్ లో ఒక మాటకు కట్టుబడి ఉండటం అన్నది కనిపించదు. ఈ క్రెడిట్ వార్ లోనూ అదే జరుగుతోంది. పార్టీ అధినేత జగన్ అమరావతి విషయంలో, మూడు రాజధానుల విషయంలో, అలాగే మావిగన్ అంటూ పూటకో మాట, రోజుకో ప్రతిపాదనా అన్నట్లుగా వ్యవహరించిన తీరుగానే.. వైసీపీ సోషల్ మీడియా కూడా క్రెడిట్ వార్ లో రోజుకో మాట మారుస్తోంది. పోలవరం ఎడమ కాలువ జగన్ ఖాతాలో వేసేందుకు ప్రయత్నిస్తూ పోస్టులు వెల్లువెత్తించిన మరుసటి రోజే మాట మార్చి.. పోలవరం ఎడమ కాలువ పనుల్లో లోపాలున్నాయనీ, కొన్ని చోట్ల నీరు లీక్ అవుతోందంటూ కొత్త ప్రచారాన్ని తలకెత్తుకుంది.  ఒకవేళ నిజంగానే పనుల్లో లోపాలు ఉంటే, ఆ లోపాలు జగన్ హయాంలోనే జరిగినవి అని వైసీపీ చెప్పుకుంటున్నట్లే లెక్క.. ఎందుకంటే పోలవరం ఎడమ కాలువ తమ అధినేత క్రెడిటే అని వాదిస్తోంది కనుక.  ప్రాజెక్టు తమదే అని చెప్పుకుంటూనే, అందులో లోపాలు ఉంటే మాత్రం అవి చంద్రబాబు, తెలుగుదేశంల నిర్వాకమేనని సోషల్ మీడియా వేదికగా వైసీపీ చేస్తున్న ప్రచారం ఫ్లాప్ అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  [YCP Social Media  Flawed, YS Jagan, YSR Congress social media strategy, Polavaram Left Canal, Chandrababu Naidu, AP irrigation projects, Telugu One]
తెలంగాణ రాజకీయాల్లో   మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంత కాలం తనకు కేబినెట్ లో స్థానం కావాలంటూ గళమెత్తిన ఆయన తాజాగా సీఎం పదవే తన లక్ష్యమని ప్రకటించి సంచలనానికి తెరలేపారు. గతంలో కేబినెట్ లో తనకు చోటు దక్కకపోవడంపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసి.. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు గుప్పించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తనకు మంత్రిపదవి రాకుండా  అడ్డుకుంటున్నారనీ, హైకమాండ్ తనకు మంత్రిపదవిపై స్పష్టమైన హామీ ఇచ్చిందంటూ రేవంత్ లక్ష్యంగా పలు సందర్భాలలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.  అయితే ఇప్పుడు ఆయన ఒక అడుగు ముందుకు వేసి.. తాను సీఎంను అవుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజన్న రాజ్యం అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అన్నిటికీ మించి పార్టీలోకి కొత్తగా వస్తున్న నాయకులు కాంగ్రెస్‌ను కబ్జా చేయాలని చూస్తున్నారంటూ ఆయన చేసిన విమర్శలు, వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీలో పాత నేతలకు తీరని అన్యాయం జరుగుతోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేయడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే కోమటి రెడ్డికి ఏ వ్యూహం లేదనీ, అహంభావంతోనే విమర్శలు గుప్పిస్తున్నారనీ కాంగ్రెస్ లోని ఒక వర్గం అంటున్నది.  కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు. అదే సమయంలో పరోక్షంగానైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బయటనుంచి వచ్చి పార్టీని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు.  ఇది పార్టీలో రేవంత్ పట్ల వ్యతిరేకులను ఏకతాటిపైకి తీసుకువచ్చే వ్యూహం ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది.  అయితే రేవంత్ మద్దతు దారులు మాత్రం.. కోమటిరెడ్డి రాజకోపాల్ రెడ్డి ఏమీ తొలి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని లేరంటున్నారు. గతంలో కాంగ్రెస్ ను వీడి బీజేపీ గూటికి చేరిన కోమటిరెడ్డి, ఆ తరువాత   2023 ఎన్నికలకు ముందు  కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చి ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేస్తున్నారు. మొత్తం  మీద తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగెపాల్ రెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.    [Komatireddy Rajagopal Reddy Comments Create Sensation, Rajanna Rajyam, Telangana Congress, Munugode MLA, Revanth Reddy, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు’ అనే సూత్రం ప్రకారం కూటమి ఏర్పడినప్పటికీ.. క్షేత్రస్థాయిలో స్థానిక పోరు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు భాగస్వామ్య పార్టీల మధ్య కొత్త సవాళ్లను తెరపైకి తెస్తున్నాయి.ఇలాంటి అంశాలపై ‘వాస్తవ వేదిక’ కార్యక్రమంలో ‘జమీన్ రైతు’ ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్, తెలుగువన్ ఎం.డీ. కంఠమనేని రవిశంకర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైఖరి కూటమి ప్రభుత్వంపై ఆయనకున్న అసంతృప్తిని పరోక్షంగా తెలియజేస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వరుసగా నాలుగు కేబినెట్ సమావేశాలకు హాజరుకాకపోవడం, అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల సమయంలో నియోజకవర్గ పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వడం, అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నప్పటికీ సభకు హాజరుకాకపోవడం వంటి పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.మరోవైపు.. టీడీపీ, జనసేన మధ్య సమాచార వారధులుగా వ్యవహరించిన కీలక నాయకుల వ్యాపార, వ్యక్తిగత ప్రాధాన్యతలు పెరుగుతున్నాయనే భావనతో జనసేన రాజకీయ ప్రయోజనాలపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీల వ్యూహాలు.. అంతర్లీన పరిణామాలు.. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ, జనసేన తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. జనసేన వ్యూహం: నరసరావుపేట, భీమవరం, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో స్థానికంగా తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు జనసేన నాయకులు స్వయంగా మేయర్, చైర్మన్ అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు. ఈ ప్రకటనలకు పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడం.. టీడీపీపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ వైఖరి.. కూటమి భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే.. రాష్ట్రవ్యాప్తంగా తమ సొంత రాజకీయ బలాన్ని మరింత స్థిరీకరించుకోవడం టీడీపీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే కీలక అంశాల్లో సీట్ల పంపకంపై తక్కువ వాటా ప్రతిపాదనలు, ఇరు పార్టీల మధ్య సమాచార లోపం వంటి అంశాలు జనసేనలో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయనే చర్చ జరుగుతోంది.   భవిష్యత్ రాజకీయ ప్రభావం.. టీడీపీ–జనసేన మధ్య అంతర్గత విభేదాలు, స్పష్టమైన సమన్వయం లోపించడం రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో జనసేన శ్రేణులు టీడీపీ అభ్యర్థులకు పూర్తి స్థాయిలో సహకరించని పరిస్థితి ఏర్పడితే.. కూటమి ఎన్నికల ఫలితాలపరంగానే కాకుండా రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అదే సమయంలో.. కూటమి భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే తమ సొంత రాజకీయ గుర్తింపు, మైలేజీని కాపాడుకునేందుకు జనసేన చేస్తున్న ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను మరింత ఆసక్తికర మలుపులు తిప్పే అవకాశం కనిపిస్తోంది.       ( Vasthava Vedika, Dolendra Prasad, Ravi Shankar, AP Politics, Pawan Kalyan, TDP-Janasena Alliance, CM Chandrababu Naidu, AP Municipal Elections, TDP, Janasena, Andhra Pradesh Politics, AP Government, Nara Lokesh, Amaravati Politics, Political Analysis)
ALSO ON TELUGUONE N E W S
తాజాగా ఫోర్బ్స్ ఇండియా ఆగస్టు మ్యాగజైన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెరిశారు. అయితే, ఆ ఆర్టికల్ లో అల్లు అర్జున్‌ని ‘రెబల్ స్టార్’ అని సంబోధించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఒక్క పదంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే మొదలైంది. పెదనాన్న కృష్ణంరాజు నుండి వారసత్వంగా ‘రెబల్ స్టార్’ ట్యాగ్ ప్రభాస్ కి వచ్చింది. నేషనల్ వైడ్ గా అదే ట్యాగ్ తో ఆయన పాపులర్. అలాంటిది ఇప్పుడు ఆ ట్యాగ్ ను ఫోర్బ్స్ లాంటి అంతర్జాతీయ మ్యాగజైన్ టీమ్.. అల్లు అర్జున్‌కి ఆపాదించడం సంచలనంగా మారింది. ఇది ఫోర్బ్స్ ఇండియా ఎడిటోరియల్ టీమ్ చేసిన మిస్టేక్ అయి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీ హీరోల ట్యాగ్స్‌పై పూర్తి అవగాహన ఉండకపోవచ్చు అంటున్నారు. మరోవైపు, పుష్ప 2తో అల్లు అర్జున్ సృష్టించిన ప్రభంజనాన్ని చూసి, డిస్క్రిప్టివ్‌గా ‘రెబెల్ స్టార్’ అని రాసి ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.  ఏది ఏమైనా అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అని కాకుండా.. ‘రెబల్ స్టార్’ ట్యాగ్ తో సంబోధించడం వివాదానికి దారి తీసింది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. "రెబల్ స్టార్ అనేది ప్రభాస్ కి మాత్రమే సొంతం. ఫోర్బ్స్ వెంటనే తప్పు సరి దిద్దుకోవాలి" అని డిమాండ్ చేస్తున్నారు. ఈ కాంట్రవర్సీపై ఇప్పటివరకు ఫోర్బ్స్ ఇండియా కానీ, లేదా అల్లు అర్జున్ టీమ్ కానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించి, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి.       [Forbes India, Allu Arjun, Rebel Star, Controversy, Prabhas, Telugu Film News, Telugu News, Tollywood]  
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రామ్ చరణ్, ఉపాసన తమ ఇంట్లో జరిపిన ప్రత్యేక పూజలకు సంబంధించిన ఒక అందమైన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ఓం నమో భగవతే వాసుదేవాయ" అంటూ ఉపాసన షేర్ చేసిన ఈ పోస్ట్, మెగా అభిమానులతో పాటు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలో మనం ప్రధానంగా గమనించాల్సింది వారి ఇంట్లోని పూజా మందిరపు ఆధ్యాత్మిక వాతావరణం. ఎంతో భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా అలంకరించిన పూజా వేదిక ముందు రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ పిల్లలతో కలిసి కూర్చుని పూజ చేసుకుంటున్నారు. చరణ్, ఉపాసన దంపతులు సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేస్తున్నారు. కుటుంబమంతా ఒకే చోట చేరి, ఎంతో నిరాడంబరంగా, పవిత్రమైన వాతావరణంలో భగవంతుడి ఆశీస్సులు అందుకుంటున్న ఈ దృశ్యం కుటుంబ విలువలకు, హైందవ సంస్కృతికి అద్దం పడుతోంది. ఎంతో బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ, పండుగల వేళ ఇలా సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ, ఇంట్లోనే పవిత్ర పూజలు నిర్వహించడం మెగా ఫ్యామిలీ ప్రత్యేకత. https://www.instagram.com/p/Dc2lJQdsJV5/       [Ram Charan, Upasana Konidela, Krishna Janmashtami, Krishnashtami, Telugu Film News, Telugu News]  
నటీనటులు: సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, కస్తూరి, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు, రాజా రవీంద్ర, షఫీ, శివకుమార్ తదితరులు  లిరిక్స్: చంద్రబోస్ సంగీతం: మహావీర్ ఏలేందర్ డీఓపీ: వెంకట హనుమ ఎడిటింగ్: సాయిబాబు తలారి ఆర్ట్: భార్గవాచారి నౌండ్ల  నిర్మాత: మేరుం భాస్కర్ స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోట విడుదల తేదీ: సెప్టెంబర్ 4, 2026 మూవింగ్ డ్రీమ్స్ ఇండియా బ్యానర్ పై సీనియర్ యాక్టర్స్ సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, కస్తూరి, యువ హీరో నటరాజ్, హీరోయిన్ రాయంచ కొక్కుర, హీరో వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మేరుం భాస్కర్ నిర్మాత. పొలిటికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ:  ధర్మస్థల నియోజకవర్గంలో వరుసగా ఏడు సార్లు గెలిచి, తిరుగులేని నాయకుడిగా చెలామణి అవుతుంటాడు ఎమ్మెల్యే బైర్రాజు(సాయికుమార్). అదే ప్రాంతంలో కాలేజీని నడుపుతూ డ్రగ్స్ దందా చేస్తుంటారు వాసుదేవ్(రాజీవ్ కనకాల), అతని భార్య కస్తూరి. తమ కాలేజీలోని విద్యార్థులకు విశ్వ(శివకుమార్) ద్వారా డ్రగ్స్ ను సప్లై చేస్తూ.. విద్యార్థులను డ్రగ్స్ కు బానిసలుగా చేసి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఇది తెలిసిన అదే కాలేజీలో లెక్చరర్ గా పని చేసే అరుంధతి( వితిక షేరు), ఆమె స్టూడెంట్స్ బద్రి(నటరాజ్), ఈషా (రాయంచ కొక్కుర) తదితరులు విశ్వను ఎదిరిస్తారు. ఈ క్రమంలో బద్రి దారుణ హత్యకు గురవుతాడు. నియోజకవర్గం ఎమ్మెల్యే అండదండలతోనే తన కుమారుడు హత్యకు గురయ్యాడని తెలిసి టీ కొట్టు నడుపుకునే బద్రి తండ్రి ఈశ్వరయ్య(సుమన్) రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యే ఎన్నికల్లో బైర్రాజు మీద స్టూడెంట్స్ మద్దతుతో పోటీకి దిగుతాడు. ధన బలం, మందిబలం ఉన్న బైర్రాజును ఒక సామాన్య టీ అమ్ముకునే ఈశ్వరయ్య ఎలా ఓడించాడు అనేదే మిగతా కథ. విశ్లేషణ:  పొలిటికల్ యాక్షన్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎక్కువగానే ఉంటారు. సరైన కథను ఎంచుకుని దానికి తగ్గట్టుగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేను నడిపితే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. దర్శకుడు జై ఙ్ఞాన ప్రభ తోట కూడా నేటి సమాజంలో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ఓ కాంటెంపరరీ ఇష్యూను బేస్ చేసుకుని కథను రాసి.. దానికి తగ్గట్టుగా పొలిటికల్ టచ్ తో స్క్రీన్ ప్లేను నడిపించాడు.  ఫస్ట్ హాఫ్ అంతా కాలేజీ వాతావరణం, డ్రగ్స్ కు బానిసలుగా మారిన విద్యార్థుల జీవితాలు, డ్రగ్స్ కు బానిసైన విద్యార్థిని మరణం, అది చూసిన ఓ మహిళా లెక్చరర్, కొంత మంది విద్యార్థుల తిరుగుబాటు, ఆ వెంటనే హీరో దారుణ హత్యకు గురికావడం వంటి అంశాలతో నడుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్.. సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది.  సెకండ్ హాఫ్ లో ఈశ్వరయ్య రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ధర్మస్థల నియోజకవర్గం రాజకీయం వేడెక్కుతుంది. అప్పటి దాకా తనకు తిరుగే లేదని విర్రవీగిన బైర్రాజుకు ఈశ్వరయ్య సవాల్ గా మారతాడు. ఈశ్వరయ్య చేసే పొలిటికల్ క్యాంపెయిన్, తన కుమారుణ్ణి దారుణంగా చంపిన వాళ్లను మట్టుబెట్టడం, లెక్చరర్ అరుంధతి ఉగ్రరూపం అన్నీ ప్రేక్షకులకు ఆకట్టుకుంటాయి. చివర్లో వరుణ్ సందేశ్ తో ఒక్క ఓటు విలువ ప్రాధాన్యం గురించి చెప్పిన తీరు.. ప్రజాస్వామ్యంలో  ఓటు ఎంత విలువైనదో తెలియజేస్తుంది. సినిమాలో ఉచిత పథకాల వల్ల కలిగే నష్టం గురించి కూడా ప్రస్తావించారు. అలాగే దుష్టుల స్నేహం ఎంత ప్రమాదకరమో వాసుదేవ్, కస్తూరిల పాత్రలతో చూపించారు. ఇలా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తుంది ధర్మస్థల నియోజకవర్గం. అయితే ఈ తరహా కథలు ఇప్పటికే చూసి ఉండటం కాస్త మైనస్. నటీనటుల పనితీరు: ఈశ్వరయ్య పాత్రలో సుమన్ ఒదిగిపోయారు. టీ అమ్ముకునే సామాన్యుడు నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి బడా నాయకుడిని ఢీ కొట్టే వ్యక్తిగా ఆయన నటన ఆకట్టుకుంది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని నాయకుడిగా చెలామణి అయ్యే బైర్రాజు పాత్రలో సాయికుమార్ ఆకట్టుకున్నారు. విలన్ పాత్రల్లో రాజీవ్ కనకాల, సీనియర్ నటి కస్తూరి మెప్పించారు. విలన్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సత్య ప్రకాష్ కుమారుడు నటరాజ్ ఇందులో స్టూడెంట్ గా నటించి మెప్పించాడు. అతనికి జోడిగా నటించిన రాయంచ కొక్కుర కూడా తన నటనతో ఆకట్టుకుంది. నటుడు శివకుమార్ కూడా తనకు బాగా సూట్ అయ్యే యంగ్ విలన్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. సత్య ప్రకాష్, రాజా రవీంద్ర, షఫీ, కాలకేయ ప్రభాకర్, చివర్లో వరుణ్ సందేశ్ తమ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు జై ఙ్ఞాన ప్రభ తోట ఎక్కడా డివియేట్ కాకుండా తను చెప్పాలనుకున్న కథను మెసేజ్ రూపంలో తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. డెబ్యూ దర్శకుడే అయినా.. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను బాగానే మలిచారు. మహావీర్ ఏలేందర్ అందించిన సంగీతం బాగుంది. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రాసిన పాటలు బాగున్నాయి. వెంకట హనుమ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.  ఫైనల్ గా.. మంచి మెసేజ్ తో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామాను పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి హ్యాపీగా చూసేయొచ్చు.   రేటింగ్: 2.5/5   Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.       [Dharmasthala Niyojakavargam, Telugu Movie Review, Suman, Sai Kumar, Vithika Sheru, Varun Sandesh, Rajeev Kanakala, Kasthuri Shankar, Nataraj, Rayancha Kokkura]  
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'డ్రాగన్'పై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల ఎన్టీఆర్ భుజానికి చిన్న గాయం కావడంతో ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం ఇచ్చారు మేకర్స్. త్వరలోనే తారక్ కోలుకుని మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ గ్యాప్‌లోనే ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, ఆలియా భట్ కీ రోల్స్‌లో కనిపించబోతున్నారట. ఆలియా భట్, ఎన్టీఆర్ కాంబినేషన్ అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా. అందులో సీతగా ఆలియా, భీమ్‌గా తారక్ తమ యాక్టింగ్‌తో గూస్‌బంప్స్ తెప్పించారు. ఇప్పుడు మళ్లీ ప్రశాంత్ నీల్ క్రియేట్ చేస్తున్న ఈ డార్క్ అండ్ రా యాక్షన్ వరల్డ్‌లో ఆలియా ఒక క్రూషియల్ రోల్ చేయబోతోందనే టాక్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక షాహిద్ కపూర్ పేరు వినిపించడం మరో సర్ ప్రైజ్. ‘కబీర్ సింగ్’ లాంటి ఇంటెన్స్ రోల్స్‌లో అదరగొట్టిన షాహిద్ కపూర్‌ను ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్‌తో స్క్రీన్ మీద చూస్తే గూస్‌బంప్స్ గ్యారెంటీ. అసలు షాహిద్ కపూర్ పాత్ర ఏంటి? ఎన్టీఆర్‌ని ఢీ కొట్టే పవర్ ఫుల్ నెగటివ్ క్యారెక్టర్‌లో కనిపిస్తారా? అనేది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ యాక్టర్ బిజు మీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు ఇప్పుడు ఆలియా భట్, షాహిద్ కపూర్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా తోడైతే, ‘డ్రాగన్’ రేంజ్ మరో లెవెల్‌కి వెళ్లడం ఖాయం.       [Jr NTR, Prashanth Neel, Dragon Movie, Alia Bhatt, Shahid Kapoor, NTR Dragon Cast, Telugu Film News, Telugu News, Tollywood]  
'ఇరుముడి' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టిన తర్వాత, ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, కోలీవుడ్‌లోనూ డైరెక్టర్ శివ నిర్వాణ పేరు గట్టిగా వినిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజతో చేసిన 'ఇరుముడి' ప్రాజెక్ట్ తెచ్చిపెట్టిన సక్సెస్ జోరులో ఉన్న శివ నిర్వాణ, తన నెక్స్ట్ మూవీ విషయంలో ఎలాంటి ప్లాన్ వేస్తున్నారనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో శివ నిర్వాణ ఒక హై-వోల్టేజ్ ఎమోషనల్ డ్రామా కథను ప్లాన్ చేస్తున్నారట. అసలు ఈ కాంబినేషన్ ఇప్పుడు సడన్‌గా అనుకున్నది కాదట. 'ఇరుముడి' సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికంటే ముందే ధనుష్‌తో శివ నిర్వాణ కథా చర్చలు జరిపారట. శివ చెప్పిన విభిన్నమైన లైన్ ధనుష్‌కి బాగా నచ్చడంతో, ఈ ప్రాజెక్ట్‌పై ఇద్దరి మధ్య ప్రాథమికంగా డీల్ ఓకే అయిందనే వార్తలు సినీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఒకవైపు హ్యూమన్ ఎమోషన్స్, లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాను ఎంతో హృద్యంగా తెరకెక్కించడంలో దిట్ట అయిన శివ నిర్వాణ, మరోవైపు ఏ పాత్ర ఇచ్చినా తన నటనతో ప్రాణం పోసే వర్సటైల్ యాక్టర్ ధనుష్. వీరిద్దరూ కలిస్తే స్క్రీన్ మీద ఎమోషన్స్ ఏ స్థాయిలో పండుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధనుష్‌కు ఇప్పటికే 'సార్', 'రఘువరన్ B.Tech' వంటి సినిమాల ద్వారా తెలుగులోనూ చాలా బలమైన మార్కెట్ ఉంది. సరైన ఎమోషనల్ కథ పడితే తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయం. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినప్పటికీ, త్వరలోనే ఒక బిగ్ సర్ ప్రైజ్ అనౌన్స్‌మెంట్ ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. 'ఇరుముడి' సక్సెస్ ఇచ్చిన బూస్ట్‌తో శివ నిర్వాణ ఈ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారట.       [Ravi Teja, Irumudi Movie, Shiva Nirvana, Dhanush, Telugu Film News, Telugu News, Tollywood]  
వెండితెరపై వెలిగిపోయిన ఎంతోమంది తారల నిజ జీవితాలు బయటకు కనిపించేంత గ్లామరస్‌గా ఉండవు. 90ల కాలంలో సౌత్ ఇండియాలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి చ‌ర్మిల మ‌నోహ‌ర‌న్ జీవితం కూడా అలాంటిదే. ఒకప్పుడు వరుస విజయాలతో కథానాయకిగా అలరించిన ఆమె, వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేయబడింది. చ‌ర్మిల తమిళం, మలయాళం, కన్నడతో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా మలయాళ సినీ రంగంలో ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, ఆమెకు స్టార్ డమ్ అందించాయి. అయితే కెరీర్ ఊపందుకుంటున్న సమయంలోనే ఆమె తీసుకున్న కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఆమె వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీశాయి. ప్రేమ, పెళ్లి విషయంలో చ‌ర్మిలకు వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. నటుడు కిషోర్ సత్యతో జరిగిన మొదటి వివాహం కొద్ది కాలానికే విడాకులకు దారితీసింది. ఆ తర్వాత వ్యాపారవేత్త రాజేష్‌ను రెండవ వివాహం చేసుకున్నప్పటికీ, మనస్పర్థల కారణంగా ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అంతకుముందు ఒక ప్రముఖ నటుడితో నడిచిన ప్రేమాయణం కూడా బ్రేకప్‌తో ముగిసింది. వ్యక్తిగత జీవితంలో వరుస వైఫల్యాలు ఎదురవ్వడంతో చ‌ర్మిల మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. అదే సమయంలో సినిమాల్లో అవకాశాలు క్రమంగా తగ్గిపోవడం, సరైన ఆదాయ మార్గాలు లేకపోవడంతో ఆమె తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. కొడుకు బాధ్యతలు, అనారోగ్య సమస్యలు, ఇంటి అద్దెలు చెల్లించలేని పరిస్థితులను కూడా ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో చ‌ర్మిల తన కష్టాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎంతోమంది ఆప్యాయంగా పలకరించారని, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తోటి నటులు మాత్రమే తనకు అంతోఇంతో సహాయం అందించారని గుర్తుచేసుకున్నారు. చ‌ర్మిల విషాదకర పరిస్థితిని తెలుసుకున్న సినీ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. రీల్ లైఫ్‌లో ఎంతో సంతోషంగా కనిపించే నటీనటులు రియల్ లైఫ్‌లో ఇలాంటి కష్టాలు పడటం విచారకరమని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం షర్మిల చిన్న చిన్న పాత్రలు, బుల్లితెర షోల ద్వారా మళ్లీ కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాలు ఆమెకు తగిన అవకాశాలు ఇచ్చి ఆదుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో 'నేషనల్ క్రష్'గా పేరు తెచ్చుకున్న అందాల భామ రష్మిక మందన్న సరికొత్త ఘనతను సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ క్రేజీ హీరోయిన్, ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణెను కూడా దాటేసి భారతదేశంలోనే అత్యంత పాపులర్ సెలబ్రిటీగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఐఎమ్‌డిబి (IMDb) విడుదల చేసిన అత్యంత ప్రాచుర్యం పొందిన భారతీయ తారల తాజా జాబితాలో రష్మిక మందన్న ప్రథమ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా సినీ అభిమానుల నుంచి లభించిన ఆదరణ, సోషల్ మీడియా ట్రెండ్స్ మరియు ఆమె నటిస్తున్న సినిమాల క్రేజ్ ప్రాతిపదికన ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు. ఈ రేసులో రష్మిక అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, దీపికా పదుకొణె రెండవ స్థానానికి పరిమితమైంది. అంతేకాకుండా, సౌత్ లేడీ పవర్ హౌస్ సాయి పల్లవి ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. సౌత్ నటీమణులు జాతీయ స్థాయిలో ఈ స్థాయిలో హవా చాటడంపై సినీ వర్గాలు మరియు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'ఛలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక, తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత 'పుష్ప: ది రైజ్' మరియు 'పుష్ప: ది రూల్' సినిమాలతో గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌లో 'యానిమల్' వంటి భారీ బ్లాక్‌బస్టర్‌తో మరింత క్రేజ్ సంపాదించి, పాన్ ఇండియా రేంజ్‌లో తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం రష్మిక లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సరసన నటిస్తూనే, వరుసగా బాలీవుడ్ మరియు సౌత్ బిగ్ ప్రాజెక్టులలో నటిస్తోంది. మరోవైపు సాయి పల్లవి కూడా పాన్ ఇండియా లెవల్లో నటిస్తున్న 'రామాయణ్' వంటి క్రేజీ చిత్రాలతో విశేషమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా రష్మిక అభిమానులు ఈ అరుదైన మైలురాయిని విశేషంగా వేడుక చేసుకుంటున్నారు. "రియల్ నేషనల్ స్టార్ రష్మిక" అంటూ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో హ్యాష్ ట్యాగ్‌లతో పోస్టులు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వరుస హిట్లు, పాన్ ఇండియా ప్రాజెక్టులతో దండయాత్ర చేస్తున్న రష్మిక మందన్న రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియన్ సినీ హిస్టరీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా ఈ నేషనల్ క్రష్ వేగంగా అడుగులు వేస్తోంది.       [Rashmika Mandanna IMDb Ranking, Rashmika Mandanna No 1 National Star, Sai Pallavi Top 4 IMDb, Deepika Padukone vs Rashmika, Telugu Cinema Popular Actresses]
The conversation around Toxic has largely been about the film itself, with audience reactions and criticism dominating social media. Just as that discussion has intensified, old videos of Allu Aravind have suddenly resurfaced, triggering a fresh round of debate. Interestingly, the statements being circulated are not new. They were made years ago and were originally discussed in the context of KGF and Yash’s growing pan-India popularity. Yet, the way they are being presented now creates an entirely different impression, with sections of social media attempting to turn them into an issue involving Yash and Kannada cinema. That raises the obvious question: why revive an old statement at this particular point? Allu Aravind’s comments were about the scale of KGF’s impact and how the film transformed Yash’s visibility beyond Karnataka. There is hardly anything controversial in acknowledging that KGF played a major role in establishing Yash as a pan-India star. Yash himself has repeatedly spoken about how dramatically the film changed his career. Bringing those comments back into the spotlight now inevitably shifts the discussion away from Toxic. Instead of debating the film, its content or its reception, social media is once again being pushed towards the familiar territory of fan wars, language pride and Telugu-Kannada comparisons. The narrative also becomes difficult to justify when viewed against Allu Aravind garu’s own association with Kannada cinema. Through distribution and other industry initiatives, he has supported the reach of Kannada films in Telugu markets, with Kantara being one of the most prominent examples of a Kannada film finding a strong audience in the Telugu states. There was never a genuine Telugu-versus-Kannada issue here. Turning an old statement into a fresh controversy, precisely when Toxic is facing scrutiny, only changes the subject of the conversation. Whether that shift is intentional or not, the effect is the same: the debate moves from the film to a manufactured industry and fan-war narrative. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  కళకి, కులం, మతం, ప్రాంతం ఉండదు. ఉందని అనుకునే వాళ్ళని చూసి సినిమాతో పాటు నటుల అభిమానులు, సినీ లవర్స్, ప్రేక్షకులు నవ్వుకుంటూ అవేమి ఉండవని  ఎంతో మంది నటుల్ని ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు. అలాంటి ఒక నటుడు ప్రకాష్ రాజ్.నటనలో ఎన్ని రకాల కోణాలు ఉన్నాయో, కొత్తగా ఎన్ని కోణాలు పుడతాయో వాటన్నిటిలో లబ్ధప్రతిష్టుడు. కొంత గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకులని తన నటనతో  అలరించేందుకు ‘జగమే సంగీతం’ అనే అద్భుతమైన మ్యూజికల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సెప్టెంబర్ 4, 2026 నుండి ప్రసారం కానున్న ఈ సిరీస్‌లో ప్రకాష్ రాజ్ ‘శాస్త్రి’ అనే అత్యంత కీలకమైన, క్రమశిక్షణ కలిగిన సంగీత విద్వాంసుడి రోల్ లో కనిపించబోతున్నాడు. అయితే ఇదే సమయంలో ప్రకాష్ రాజ్ అభిమానులు, ప్రేక్షకులు, మూవీ లవర్స్  సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ కి  ఒక ప్రత్యేకమైన మనవి చేస్తున్నారు. 'సార్ మీరు చాలా అద్భుతమైన యాక్టర్. మీరు సెల్యులాయిడ్ పై నటిస్తుంటే మేము పొందే ఆనందం అంతా ఇంతా కాదు. కానీ గత కొన్నాళ్లుగా మీరు రాజకీయపరమైన ,సామాజిక అంశాలపై వ్యాఖ్యలు చేస్తూ అనవసర వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ వివాదాలు మీ  అద్భుతమైన నటనని , సినిమాలని  కొంతవరకు పక్కకు నెట్టివేస్తున్నాయి. దయచేసి ఎలాంటి వివాదాల జోలికీ వెళ్లకుండా,  పొలిటికల్ కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టండి" అని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.      Also Read: ఫేక్ కాస్టింగ్ కాల్స్: హెచ్చరించిన నిర్మాణ సంస్థ 'జగమే సంగీతం’ విషయానికి వస్తే  సుప్రసిద్ధ ‘బండిష్ బండిట్స్’ ఆత్మతో తెరకెక్కిన ఈ సిరీస్‌ను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ రూపొందించగా, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. తరతరాల సంగీత వారసత్వాన్ని కాపాడుకోవాలనే తపన, కుటుంబ బాధ్యతలు, మనుషుల మధ్య భావోద్వేగాల చుట్టూ సాగే ఈ కథలో ప్రకాష్ రాజ్ నటన ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.      [ Prakash Raj, jagame sangeetham, Prakash Raj Fans Request, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywoodnews ]    
తమిళంలో క్రైమ్ మరియు సస్పెన్స్ కథాంశాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అదే బాటలో ఇవానా, వెంకట్ సెంగుట్టువన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'మథి మారన్'. మంత్ర వీరపాండియన్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామా ప్రస్తుతం ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ ప్రైమ్'లో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం ఓటీటీ వీక్షకులను ఏ మేర మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే.. సుందరం అనే పోస్ట్‌మ్యాన్‌కు మథి (ఇవానా), నెడుమారన్ (వెంకట్) అనే కవల పిల్లలు ఉంటారు. అయితే నెడుమారన్ శారీరక ఎదుగుదల లేక పొట్టిగా ఉండిపోతాడు. సమాజంలో ఎదురయ్యే అవహేళనలను తట్టుకుంటూ అక్క మథి మద్దతుతో అతను పెరుగుతాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో మథి ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడం, తల్లిదండ్రులు మనస్తాపంతో చనిపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. తన అక్కను వెతుక్కుంటూ చెన్నై నగరానికి చేరుకున్న నెడుమారన్‌కు అక్కడ వరుసగా జరుగుతున్న దారుణ హత్యల గురించిన నిజాలు తెలుస్తాయి. ఓవైపు అక్క జాడ కనుక్కోవడం, మరోవైపు పోలీస్ వ్యవస్థతో కలిసి ఆ హంతకుడిని పట్టుకోవడానికి నెడుమారన్ ఏం చేశాడు? తన తెలివితేటలతో ఆ మిస్టరీని ఎలా చేధించాడు అనేది మిగతా కథాంశం. మనిషి ప్రతిభకు రూపం లేదా ఎత్తు ప్రమాణం కాదని, కేవలం తెలివితేటలే ముఖ్యమనే ఆసక్తికరమైన లైన్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నటుడిగా వెంకట్ తన పాత్రలో ఒదిగిపోగా, ఇవానా గ్లామర్ మరియు నటనతో అలరించింది. సాంకేతికంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు ఛాయాగ్రహణం పర్వాలేదనిపిస్తాయి. అయితే, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ఉండాల్సిన ఉత్కంఠత ఈ చిత్రంలో కాస్త కొరవడింది. సాధారణ పౌరుడైన కథానాయకుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించడం వంటి సన్నివేశాలు సహజత్వానికి దూరంగా అనిపిస్తాయి. స్క్రీన్‌ప్లేలో మెరుపులు లేకపోవడం, నెమ్మదించిన కథనం సినిమా గ్రాఫ్‌ను తగ్గిస్తాయి. ఓటీటీ వేదికలపై సరికొత్త కథలను చూడాలనుకునే ప్రేక్షకులు, తమిళ క్రైమ్ డ్రామాలను ఇష్టపడేవారు ఒకసారి ప్రయత్నించవచ్చు. అయితే కమర్షియల్ హంగులు, రొటీన్ మాస్ ఎలిమెంట్స్ ఆశించేవారికి ఇది అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తానికి 'మథి మారన్' ఒక మంచి ఆశయంతో తీసిన ప్రయత్నం అయినప్పటికీ, లీడ్ సీన్లు మరియు బలహీనమైన కథనం వల్ల సగటు క్రైమ్ డ్రామాగానే మిగిలిపోయింది. వీకెండ్‌లో ఓటీటీలో ఏదైనా భిన్నమైన లైన్ ఉన్న సినిమా చూడాలనుకుంటే ఒకసారి వీక్షించవచ్చు.     [Mathi Maran Movie Review, Mathi Maran Amazon Prime, Ivana Mathi Maran Telugu Review, Mathi Maran OTT Release, Venkat Senguttuvan Mathi Maran]
ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న శరీర బరువు, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే మొండి కొవ్వు ప్రతి ఒక్కరినీ తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్య. ఈ జిడ్డు కొవ్వును కరిగించుకోవడానికి, బరువు తగ్గి సన్నబడటానికి చాలామంది ఎన్నో రకాల వ్యాయామాలు, కఠినమైన డైటింగ్ పద్ధతులు అనుసరిస్తుంటారు. అయితే, అతి సులువైన మరియు ప్రాచుర్యం పొందిన గృహ చిట్కాలలో బ్లాక్ కాఫీ తాగడం ఒకటిగా మారింది. పాలు, చక్కెర మరియు ఎటువంటి స్వీట్నర్లు లేకుండా కేవలం వేడి నీటితో మాత్రమే తయారుచేసే ఈ బ్లాక్ కాఫీ నిజంగానే పొట్ట కొవ్వును కరిగించడంలో ఎంతవరకు సహాయపడుతుంది, దీని వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ రహస్యాలు ఏమిటి మరియు ఇది తాగేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన ఆరోగ్య నియమాలు ఏమిటో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. అసలు బ్లాక్ కాఫీ బరువు తగ్గించడంలో ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే అందులోని కేలరీలు మరియు కెఫిన్ పాత్రను తెలుసుకోవాలి. సాధారణ బ్లాక్ కాఫీలో కేలరీలు దాదాపు శూన్యం. మనం తాగే బ్లాక్ కాఫీలోని కెఫిన్ శరీరంలోని మెటబాలిజం రేటును లేదా జీవక్రియ వేగాన్ని గణనీయంగా పెంచుతుంది. మన జీవక్రియ వేగవంతం కావడం వల్ల శరీరం విశ్రాంతిగా ఉన్న సమయంలో లేదా సాధారణ పనులు చేసుకుంటున్నప్పుడు కూడా ఎక్కువ కేలరీలను వేగంగా బర్న్ చేయగలుగుతుంది. ఇది బరువు తగ్గడానికి ప్రాథమిక పునాదిగా పనిచేస్తుంది. దీనికితోడు, బ్లాక్ కాఫీలో 'క్లోరోజెనిక్ ఆసిడ్' అనే అత్యంత శక్తివంతమైన ముఖ్యాంశ కాంపౌండ్ లభిస్తుంది. ఈ క్లోరోజెనిక్ ఆసిడ్ శరీరంలో కొత్తగా గ్లూకోజ్ ఉత్పత్తి కాకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరం కొత్తగా కొవ్వును తయారు చేసుకోకుండా అడ్డుకోవడమే కాకుండా, ఇప్పటికే కణజాలాల్లో పేరుకుపోయిన పాత కొవ్వును వేగంగా కరిగించి శక్తిగా మార్చడంలో ఇది అద్భుతంగా తోడ్పడుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో బ్లాక్ కాఫీ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆకలిని సమర్థవంతంగా నియంత్రించడం. బ్లాక్ కాఫీ తాగిన వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది అకస్మాత్తుగా వచ్చే ఆకలి కోరికలను తగ్గిస్తుంది మరియు సమయానికి మించి ఆహారాన్ని అమితంగా తినకుండా అరికడుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో అన్-హెల్దీ స్నాక్స్ తినే అలవాటు ఉన్నవారు, ఆ సమయంలో ఒక కప్పు బ్లాక్ కాఫీ తీసుకుంటే కేలరీల వినియోగం చాలావరకు తగ్గుతుంది. అంతేకాకుండా, మీరు వ్యాయామం లేదా జిమ్ వర్కౌట్ చేయడానికి సరిగ్గా 30 నిమిషాల ముందు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి మరియు అదనపు స్టామినా లభిస్తాయి. ఇది వ్యాయామం చేసే సమయంలో కండరాల అలసటను తగ్గించి, శరీరం వేగంగా కొవ్వును బర్న్ చేసేలా ప్రోత్సహిస్తుంది.       does black coffee burn belly fat,black coffee health benefits telugu.  
  మనదేశంలో చాలామందికి ఉదయాన్నే లేవగానే వేడివేడిగా ఒక కప్పు టీ పడాల్సిందే. అలసటను పారద్రోలి శరీరానికి, మనస్సుకు తక్షణ ఉత్సాహాన్ని ఇవ్వడంలో టీ కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు ఒకటి రెండు కప్పుల టీ తాగడం సాధారణ అలవాటు అయినప్పటికీ, చాలామంది రోజులో పదే పదే టీ తాగుతుంటారు. అయితే, ఇలా పరిమితికి మించి ఎక్కువ మొత్తంలో టీ తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయని, శరీరంలో కాల్షియం స్థాయిలు గణనీయంగా పడిపోతాయని సోషల్ మీడియాలో నిరంతరం వార్తలు ప్రచారమవుతుంటాయి. ఈ ప్రచారం వినగానే టీ ప్రేమికుల్లో తీవ్ర ఆందోళన మొదలవుతుంది. అసలు టీ తాగడానికి, ఎముకల ఆరోగ్యానికి మధ్య ఉన్న అసలు సంబంధం ఏమిటి? అతిగా టీ తాగడం వల్ల ఎముకల సాంద్రత తగ్గి ఆస్టియోపోరోసిస్ వంటి ప్రమాదకర సమస్యలు వస్తాయా? ఈ విషయాలపై వైద్య నిపుణులు మరియు పరిశోధకులు వెల్లడించిన శాస్త్రీయ నిజాలను వివరంగా తెలుసుకోవడం ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. పరిశోధనల ప్రకారం టీలో  కెఫిన్  అనే సమ్మేళనం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ప్రతి కప్పు టీలో దాదాపు 30 నుండి 50 మిల్లీగ్రాముల వరకు కెఫిన్ ఉంటుంది. మనం అధిక మొత్తంలో కెఫిన్ తీసుకున్నప్పుడు, అది మూత్రపిండాల (కిడ్నీల) ద్వారా శరీరంలోని కాల్షియం మూత్రం రూపంలో బయటకు విసర్జించబడేలా చేస్తుంది. సాధారణంగా మనం ప్రతి 60 మిల్లీగ్రాముల కెఫిన్ తీసుకున్నప్పుడు, శరీరం నుండి సుమారు 1 నుండి 2 మిల్లీగ్రాముల కాల్షియం నష్టపోతామని వైద్య అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే రోజుకు 4 నుండి 5 కప్పుల కంటే ఎక్కువ మోతాదులో టీ తాగే వారిలో కాల్షియం లోపం ఏర్పడే అవకాశాలు స్వల్పంగా పెరుగుతాయి. ముఖ్యంగా, మనం తీసుకునే రోజువారీ ఆహారంలో కాల్షియం శాతం తక్కువగా ఉన్నప్పుడు, ఈ కెఫిన్ ప్రభావం ఎముకల ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంది. ఎముకల నుండి కాల్షియం కరిగిపోవడం వల్ల వయసు పెరిగే కొద్దీ ఎముకలు లొసుగుబారి, త్వరగా విరిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అయితే ఇక్కడే మరొక ఆసక్తికరమైన సైంటిఫిక్ కోణం దాగి ఉంది. టీలో కేవలం కెఫిన్ మాత్రమే కాకుండా  ఫ్లేవనాయిడ్లు  (Flavonoids) మరియు  ఫైటోఈస్ట్రోజెన్లు  అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల క్షీణతను అడ్డుకోవడంలో మరియు ఎముకల సాంద్రతను (Bone Mineral Density) మెరుగుపరచడంలో ఎంతో సాయపడతాయి. ముఖ్యంగా గ్రీన్ టీ మరియు బ్లాక్ టీలలో ఉండే పాలిఫెనాల్స్ అనే కాంపౌండ్లు ఎముకలను పునర్నిర్మించే  ఆస్టియోబ్లాస్ట్  కణాల పనితీరును వేగవంతం చేస్తాయని, అదే సమయంలో ఎముకలను కరిగించే  ఆస్టియోక్లాస్ట్  కణాల చర్యలను అదుపు చేస్తాయని రీసెర్చ్‌లో తేలింది. కాబట్టి మిితంగా అంటే రోజుకు 2 నుండి 3 కప్పుల టీ తాగే వారిలో ఎముకలు బలహీనపడటం అటుంచి, పైగా ఎముకల ఆరోగ్యం మరింత బలపడుతుందని బహుళ అధ్యయనాలు నిరూపించాయి. మరి టీ తాగే అలవాటు ఉన్నవారు ఎముకల బలాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటిది టీ తాగే పరిమాణాన్ని రోజుకు 2 లేదా 3 కప్పులకు పరిమితం చేసుకోవడం చాలా మంచిది. రెండవది, టీ చేసేటప్పుడు అందులో తగినంత పాలు ఉపయోగించడం వల్ల, టీ ద్వారా కోల్పోయే స్వల్ప కాల్షియంను పాలలోని ఉత్కృష్టమైన కాల్షియం భర్తీ చేస్తుంది. భోజనం చేసిన వెంటనే లేదా ఐరన్, కాల్షియం సప్లిమెంట్లు తీసుకునే సమయంలో టీ తాగకపోవడం ఉత్తమం, ఎందుకంటే టీలోని టాన్సిన్లు పోషకాల శోషణను అడ్డుకుంటాయి. మీ రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు, ఆకుకూరలు, రాగులు మరియు విటమిన్ డి లభించే పదార్థాలను సమృద్ధిగా చేర్చుకుంటే టీ వల్ల ఎముకలకు ఎలాంటి నష్టం జరగదు. కాబట్టి టీని పరిమితంగా, సరైన పద్ధతిలో ఆస్వాదిస్తే ఆరోగ్యానికి ఎలాంటి భయం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. How much tea is safe for bones,tea and bone health myths vs reality.
  మన శరీరం మన ఆరోగ్య స్థితికి సంబంధించి నిరంతరం అనేక రకాల సంకేతాలను ఇస్తూనే ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థలో ఉత్పత్తయ్యే శ్లేష్మం లేదా తెమడ (Phlegm) రంగును బట్టి మన ఊపిరితిత్తులు మరియు గొంతు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో చాలా సులభంగా అంచనా వేయవచ్చు. వర్షాకాలం, చలికాలం లేదా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు దగ్గుతో పాటు తెమడ రావడం సర్వసాధారణం. అయితే చాలామంది ఈ తెమడ రంగును ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. సైంటిఫిక్ అధ్యయనాల ప్రకారం శ్లేష్మం రంగు మన శరీరంలో ఏ రకమైన ఇన్ఫెక్షన్ లేదా వ్యాధి ముదిరిందో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి తెమడ వేర్వేరు రంగుల్లోకి మారడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలను, వైద్య సంకేతాలను ప్రతీ ఒక్కరూ అవగాహన చేసుకోవడం ఎంతైనా అవసరం. సాధారణంగా ఆరోగ్యకరమైన మనుషుల్లో తెమడ స్పష్టంగా, పారదర్శకంగా (Clear Phlegm) లేదా స్వల్పమైన తెలుపు రంగులో ఉంటుంది. నీరు, ప్రొటీన్లు, యాంటిబాడీలు మరియు లవణాలతో కూడిన ఈ పారదర్శక తెమడ శ్వాసకోశ మార్గాలను తేమగా ఉంచడానికి, బయటి నుండి వచ్చే దుమ్ము ధూళిని అడ్డుకోవడానికి సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే ఒకవేళ ఈ తెమడ విపరీతంగా పెరిగితే అలర్జీలు లేదా ఎలర్జిక్ రినిటిస్ వంటి సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇక తెమడ కాస్త చిక్కగా మారి తెల్లటి రంగులోకి (White Phlegm) మారితే, శ్వాసనాళాల్లో వాపు లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని సూచిస్తుంది. ముఖ్యంగా ఆస్తమా, బ్రోన్కైటిస్ లేదా నెమ్ము (Congestion) చేసినప్పుడు పిండం లాంటి చిక్కటి తెల్ల తెమడ రావడం కనిపిస్తుంది. అత్యంత సాధారణంగా చాలామందిలో కనిపిచేది పసుపు లేదా ఆకుపచ్చ రంగు తెమడ (Yellow or Green Phlegm). తెమడ పసుపు రంగులోకి మారడం అనేది మన నిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్‌తో పోరాడటం ప్రారంభించిందనడానికి స్పష్టమైన సంకేతం. శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ (తెల్ల రక్త కణాలు) బాక్టీరియాతో పోరాడి చనిపోయినప్పుడు అందులోని మైలోపెరాక్సిడేస్ అనే ఎంజైమ్ వల్ల శ్లేష్మం పసుపు నుంచి క్రమంగా ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఇది తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, సైనసైటిస్, నిమోనియా లేదా సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు నిదర్శనం. కాబట్టి తెమడ ఆకుపచ్చగా మారి కొన్ని రోజులకు పైగా ఉంటే వెంటనే యాంటీబయోటిక్ చికిత్స కోసం డాక్టర్‌ను సంప్రదించాలి.       Blood in phlegm symptoms and lung health, phlegm color meaning and infection signs.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం. ట్రికట చూర్ణం, ధనియాల పొడి, పసుపు పొడి వంటి మూడు పదార్థాలను సరైన మోతాదులో ఎలా కలపాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? రోజులో ఏ సమయంలో తీసుకుంటే మంచిది? వంటి విషయాలను ఈ వీడియోలో సులభంగా వివరించారు. థైరాయిడ్‌కు సంబంధించిన సమస్యల్లో ఇంటి చిట్కాలను పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. ఇప్పటికే థైరాయిడ్ మందులు వాడుతున్నవారు వైద్యుల సూచన లేకుండా మందులను ఆపకండి లేదా మార్చకండి. థైరాయిడ్ ఆరోగ్యం, ఆయుర్వేద చిట్కాలు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health‌ను ఫాలో అవ్వండి. Disclaimer: ఈ వీడియోలోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు.  
అన్ని జీవరాశులకు ఆహారమే శక్తినవనరు. అయితే మనిషికి మాత్రం ఆహారంలో ఎన్నో ఛాయిస్ లు ఉన్నాయి. కానీ  ఏది పడితే అది, ఎలా పడితే అలా తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. కొందరు అనారోగ్యం చేసినప్పుడు లేదా కొన్ని రకాల ట్రీట్మెంట్ లలో ఉన్నప్పుడు పత్యం చేయమని చెబుతారు.   పత్యం ఆహారంలో ఉన్నప్పుడు వంకాయను తినకూడదని చెబుతూ ఉంటారు.  సాధారణంగా  సాంప్రదాయ ఆయుర్వేదం, నాటు వైద్యంలో కొన్నిరకాల అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి వంకాయ తినకూడదని సిఫారసు చేస్తారు.  సాధారణ రోజుల్లో వంకాయ రుచికరమైన, పోషకాలున్న కూరగాయ అయినప్పటికీ, పత్యం వేళల్లో దీనిని మినహాయించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వంకాయను పత్యం ఉన్నప్పుడు ఎందుకు తీసుకోకూడదో వివరంగా తెలుసుకుంటే.. వంకాయ.. వంకాయను ఆయుర్వేదంలో వాత, పిత్త దోషాలను పెంచే ఆహారంగా పరిగణిస్తారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఉన్నప్పుడు లేదా రోగ నివారణకు పత్యం ఉంటున్నప్పుడు వంకాయ తింటే వాత దోషం పెరిగి నొప్పులు, జాయింట్లలో ఇబ్బందులు వస్తాయి. వంకాయ విత్తనాల్లో , తోలులో కొన్ని రకాల సహజ కాంపౌండ్లు ఉంటాయి. ఇవి సున్నితమైన చర్మం ఉన్నవారిలో, లేదా ఇప్పటికే దద్దుర్లు, దురదలు, అలర్జీలతో బాధపడుతున్న వారిలో సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. ఔషధాల ప్రభావం సరిగ్గా పనిచేయాలన్నా చర్మ సంబంధిత పత్యంలో వంకాయకు దూరంగా ఉండాలి. వంకాయ అరుగుదలకు కాస్త సమయం తీసుకుంటుంది. శరీరంలో అనారోగ్యం ఉన్నప్పుడు జీర్ణక్రియ మందగిస్తుంది. అటువంటి సమయంలో సులభంగా అరగని వంకాయను తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో ఎక్కడైనా గాయాలు, పుండ్లు ఉన్నప్పుడు లేదా శస్త్రచికిత్సలు జరిగినప్పుడు నాటు వైద్యంలో ప్రత్యేక పత్యం సూచిస్తారు. వంకాయ శరీరంలో వేడిని,   దురదను పెంచి పుండ్లు త్వరగా మానకుండా అడ్డుకుంటుందని చెప్తారు. వంకాయ సోలనేసి కుటుంబానికి చెందిన కూరగాయ. ఇందులో సోలనైన్ అనే కాంపౌండ్ ఉంటుంది. సాధారణ ఆరోగ్యంతో ఉన్నవారికి ఇది పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా, పత్యం చేసేవారిలో , మందులు వాడేవారిలో ఇది జీర్ణ వ్యవస్థపై , నాడీ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ కారణాల వల్లనే పత్యం సమయంలో శరీరం త్వరగా కోలుకోవడానికి, ఔషధాలు ఎలాంటి సమస్య లేకుండా పనిచేయడానికి వంకాయకు దూరంగా ఉండాలని పెద్దలు , ఆయుర్వేద వైద్యులు సలహా ఇస్తారు. పత్యం పూర్తయి శరీరం పూర్తి ఆరోగ్యాన్ని పుంజుకున్న తర్వాతే వంకాయను ఆహారంలో తిరిగి చేర్చుకోవడం మంచిది.                          *రూపశ్రీ.
నేటి డిజిటల్ యుగంలో ఆరోగ్య స్పృహ, ఫిట్‌నెస్ పట్ల శ్రద్ద పెరిగాయి. జిమ్‌లకు వెళ్లేవారు, బరువు తగ్గాలనుకునేవారు లేదా కండరాల పుష్టి కోసం ప్రయత్నం చేసేవారు ప్రోటీన్ షేక్స్, హెల్త్ సప్లిమెంట్లు, డిజైనర్ ప్రోటీన్ బార్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కానీ, మన తాతల తండ్రుల కాలంలో ఎలాంటి ప్రొటీన్ పౌడర్లు ఉండేవి కావు. అయినా వారు ఎంతో బలంగా, శక్తివంతంగా, దీర్ఘకాలిక ఆరోగ్యంతో జీవించారు. దానికి కారణం వారు రోజూ తీసుకునే సంప్రదాయ భారతీయ ఆహారమే! మన ప్రాంతీయ వాతావరణం, రుతుపవనాలు , పాతకాలపు వంట పద్ధతుల ఆధారంగా మన పళ్లెంలో చేరే రోజూవారీ ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా లభించేవి. ఆధునిక ఆహార అలవాట్ల వల్ల కాలక్రమేణా మనం మరచిపోయిన, కానీ మన తాతల కాలంలో క్రమం తప్పకుండా తిన్న 10 శక్తివంతమైన ప్రోటీన్ ఆహారాలు ఉన్నాయి.  నిజానికి ఇవన్నీ ప్రోటీన్ సూపర్ ఫుడ్స్.. అవేంటో తెలుసుకుంటే..  ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం:  ఉలవలు.. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఇంట్లో క్రమం తప్పకుండా వాడే ధాన్యాల్లో ఉలవలు ముఖ్యమైనవి. శాకాహారంలో ప్రోటీన్ అత్యధికంగా లభించే ఆహారాల్లో ఇది ఒకటి. మన తాతలు రోజంతా కష్టపడి పనిచేయడానికి అవసరమైన శక్తిని ఈ ఉలవలే ఇచ్చేవి. ఉలవ చారు, ఉలవ పప్పు, చట్నీలు లేదా గుగ్గిళ్ల  రూపంలో వీటిని తీసుకునేవారు. ప్రోటీన్‌తో పాటు ఇందులో ఐరన్, పీచు పదార్థం , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీ రాళ్లను నివారించడంలోనూ, శరీరంలో కొవ్వును తగ్గించడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి. సత్తు పిండి.. ఇది శనగలను వేయించి, మెత్తగా పొడి చేసి తయారుచేసే సంప్రదాయ ఆహారం. ప్రోటీన్ షేక్స్‌కు ఇది పూర్వీకుల కాలం నాటి దేశీ వెర్షన్ అని చెప్పవచ్చు. వేసవికాలంలో సత్తు పిండిని నీళ్లు, నిమ్మరసం, మసాలాలతో కలిపి  తాగేందుకు వాడేవారు. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. నాణ్యమైన ప్రోటీన్ , ఫైబర్ ఉన్న సత్తు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. నల్ల శనగలు.. ఈ రోజుల్లో తెల్ల శనగలు వాడకం పెరిగినప్పటికీ, పూర్వకాలంలో నల్ల శనగలదే హవా రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే గుడాలుగా  తినడం లేదా కూరల్లో వాడటం చేసేవారు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వేయించిన నల్ల శనగలను తీసుకెళ్లేవారు. ఇవి త్వరగా పాడవవు, తింటే కడుపు నిండుగా ఉంటుంది. ఇవి ప్లాంట్ బేస్డ్   ప్రోటీన్‌తో పాటు ఐరన్‌ను సమృద్ధిగా అందిస్తాయి.  బొబ్బర్లు / అలసందలు.. బొబ్బర్లు లేదా అలసందలు ఒకప్పుడు ప్రతీ ఇంట్లోనూ రెగ్యులర్‌గా వండే కూర ధాన్యం. వీటిలో అత్యధిక మోతాదులో ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్ , ఐరన్ ఉంటాయి. నాటు దినుసులు , మసాలాలతో నెమ్మదిగా ఉడికించి చేసే బొబ్బర్ల కూర లేదా గుడాలు శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. మట్కీ / మోత్ బీన్స్.. రాజస్థాన్ వంటి పొడి వాతావరణం కలిగిన ప్రాంతాలలో ఎక్కువగా పండే మట్కీ లేదా మోత్ బీన్స్ చిన్నగా ఉన్నప్పటికీ పోషకాల గని. ఇవి చూడటానికి పెసల సైజ్ లో ఉంటాయి. కానీ వీటి రంగు మాత్రం భిన్నంగా ఉంటుంది.  తక్కువ నీటితో పండే ఈ పంట రైతులకు, ప్రజలకు ప్రధాన ప్రోటీన్ మూలంగా ఉండేది. వీటిని మొలకలెత్తించి తినడం లేదా కారంగా కూర వండుకోవడం చేసేవారు. ధాన్యాలను మొలకెత్తించడం వల్ల వాటిలోని ప్రోటీన్ , ఇతర పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుందని మన పూర్వీకులకు ముందే తెలుసు. మినపప్పు.. నేడు మినపప్పును కేవలం ఇడ్లీ, దోస పిండి లేదా పోపులకే పరిమితం చేశాం. కానీ, పూర్వకాలంలో మినపప్పుతో వడలు, మినప రొట్టెలు, మినప సున్నుండలు వంటి బలమైన పదార్థాలు తయారుచేసి తినేవారు. మినపప్పులో ప్రోటీన్‌తో పాటు క్యాల్షియం, పొటాషియం, ఐరన్ మెండుగా ఉంటాయి. బియ్యం లేదా తృణధాన్యాలతో కలిపి మినపప్పును తిన్నప్పుడు అది శరీరానికి పూర్తిస్థాయి ప్రోటీన్‌ను అందిస్తుంది.  ఇంట్లోనే తయారుచేసిన తాజా పనీర్.. పాకెట్లలో లభించే ప్యాక్ చేసిన పనీర్ కాకుండా, మన అమ్మమ్మలు గేదె లేదా ఆవు పాల నుంచి తాజా నిమ్మరసం పిండి పనీర్ తయారు చేసేవారు. ఈ తాజా పనీర్‌లో ఎలాంటి రసాయనాలు ఉండవు. ఇది నాణ్యమైన ప్రోటీన్ , క్యాల్షియంను ఉచితంగా శరీరానికి అందిస్తుంది. ఎముకల గట్టితనానికి, కండరాల పునరుద్ధరణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.  వేయించిన వేరుశనగలు..   నట్స్ అనగానే ఈ రోజుల్లో బాదం, జీడిపప్పు, పిస్తా గుర్తుకొస్తాయి. కానీ పేదవాడి బాదం పప్పు అయిన వేరుశనగలు పోషకాల్లో దేనికీ తీసిపోవు. సాయంత్రం పూట తినుబండారంగా, లేదా బెల్లంతో కలిపి పల్లీ పట్టీ రూపంలో పూర్వీకులు వీటిని రోజూ తినేవారు. వేరుశనగల్లో ప్రోటీన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. రాజగిరా / అమరాంత్ గింజలు.. రాజగిరాను  ఉపవాసాల సమయంలో ఎక్కువగా తింటుంటారు. కానీ పూర్వకాలంలో దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకునేవారు. రాజగిరా గింజల్లో శరీరం స్వయంగా తయారుచేసుకోలేని 9 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది సంపూర్ణ ప్రోటీన్ కలిగిన అతికొద్ది వృక్షాహారాలలో ఒకటి. రాజగిరా లాడ్డు, జావ, రొట్టెల రూపంలో  తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. నువ్వులు .. పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ నువ్వులలో ఉండే పోషకాలు అపారం. నువ్వుల పొడి, నువ్వుల చట్నీ, నువ్వుల ఉండలు మన సంప్రదాయ ఆహారంలో భాగం. నువ్వులలో కేవలం క్యాల్షియం, మంచి కొవ్వులే కాకుండా విలువైన ప్రోటీన్ కూడా ఉంటుంది. నువ్వులను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కండరాలు బలంగా మారడమే కాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫిట్‌నెస్ అంటే విదేశీ ఆహార అలవాట్లను లేదా ప్యాక్ చేసిన హెల్త్ పౌడర్లను గ్రైండ్ చేయడం కాదు. మన ఇంట్లోనే, మన పూర్వీకులు తిన్న సంప్రదాయ ధాన్యాలు , పప్పు దినుసులలోనే శరీరానికి అవసరమైన అసలైన బలం దాగి ఉంది.  దైనందిన ఆహారంలో మళ్లీ ఈ పాతకాలపు ఆహారాలను భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన శరీరం లభిస్తుంది.