LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం.. రాష్ట్రపతికి పంపనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్‌ నోటిఫికేషన్ విడుదలకానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజ్యసభ చైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్‌ కావడంతో రాజధాని అమరావతిలో సంబరాలు మిన్నంటాయి. అది పక్కన పెడితే.. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి. 17 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. అయితే రాజ్యసభలో సైతం ఈ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి. అలాగే బుధవారం లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చలో  కూడా 11 పార్టీలు పాల్గొన్నాయి. అలాగే ఇటీవల ఏపీ అసెంబ్లీలో ఈ బిల్లును ప్రభుత్వం సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు  ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే  అంతకుముందు వైసీపీ కార్యాలయం కోసం  పార్లమెంటులో 11 నెంబరు గది  కేటాయించారు. దాంతో ఉలిక్కిపడ్డ వైసీపీ ఎంపీలు స్పీకర్‌ కాళ్లు వేళ్లు పట్టుకుని దాన్ని మార్చుకున్నారు. మొత్తం మీద  11 మంది ఎమ్మెల్యేలున్న జగన్ టీమ్‌ని 11 నంబర్ వదలకుండా వెంటాడుతుండటం  సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది.
పార్లమెంటు ఉభయ సభల్లోనూ అమరావతి బిల్లు కు ఆమోదం లభించడంతో అమరావతికి చట్టబద్ధత ఇక లాంఛనమే. నేడో రేపో రాష్ట్రపతి సంతకంతో ఇది చట్టరూపం దాలుస్తుంది. ఈ నేపథ్యంలో అమరావతిలో పండుగ వాతావరణం నెలకొంది. గురువారం (ఏప్రిల్ 2) సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక  2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో     పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు. ఏకైక రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే రోజు వచ్చిందనీ,  అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును కూడా త్వరలోనే సాకారం చేస్తామని హామీ ఇచ్చారు.   ఇక జనసేన నాయకుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందడం   చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సాధించిన గొప్ప విజయమని కొనియాడారు. ఇక గురువారం (ఏప్రిల్ 2) సాయంత్రం జరిగే సంబరాల్లో జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో నెలకొన్న సుదీర్ఘ అనిశ్చితికి తెరపడింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్  ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ రూపొందించిన  ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 కు  రాజ్యసభ గురువారం (ఏప్రిల్ 2) ఏకగ్రీవ  ఆమోదం తెలిపింది. లోక్‌సభలో ఈ బిల్లు బుధవారం (ఏప్రిల్1) ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజ్యసభ కూడా ఈ బిల్లకు పచ్చజెండా ఊపడంతో  అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభించినట్లయింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.   కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా  ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు.  బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్‌ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.  రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన వెంటనే సభ్యులు హర్షధ్వానాలు చేశారు. జై అమరావతి , జై ఆంధ్రప్రదేశ్  నినాదాలతో సభ మార్మోగింది. ఏపీ ప్రజలకు అద్భుతమైన నూతన రాజధాని నిర్మించుకునే అవకాశం లభించిందని సభాపతి అభినందనలు తెలిపారు.   ఈ పరిణామంపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. గడిచిన కొన్నేళ్లుగా రాజధాని విషయంలో సందిగ్ధంలో ఉన్న రైతులకు, ప్రజలకు ఇది పెద్ద ఊరటనిచ్చినట్లయింది. భవిష్యత్తులో అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దబడుతుందని రాష్ట్ర ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన  అమరావతి చట్టబద్ధత బిల్లు పై  వాడి వేడి చర్చ జరుగుతోంది. లోక్‌సభలో ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకించిన వైసీపీ రాజ్యసభలో గురువారం (ఏప్రిల్ 2) చర్చ సందర్భంగా కూడా వాకౌట్ చేసింది.  సభలో బిల్లుపై చర్చ జరుగుతుండగా వైసీపీ సభ్యులు తమ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ సభ నుంచి  వాకౌట్ చేశారు. రాజ్యసభలో వైసీపీ పక్ష నేత వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు. ముఖ్యంగా ఈ బిల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన  ప్రత్యేక హోదా గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. రాజధాని మౌలిక సదుపాయాల కల్పన కోసమే దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఖర్చవుతాయని అంచనాలు చెబుతున్నాయని, ఇప్పటికే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  రెండేళ్ల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ. 3.40 లక్షల కోట్ల మేర అప్పులు చేసిందని, ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్ర అప్పులు రూ. 14 లక్షల కోట్లకు చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఆర్థిక భారాలను దృష్టిలో ఉంచుకునే తాము బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు. 
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే  బిల్లుపై, రాజ్యసభలో  గురువారం (ఏప్రిల్ 2)చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎంపీ రేణుకా చౌదరి  ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. అమరావతికి చట్టబద్ధత  అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.  రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా రైతులపై పోలీసులు లాఠీచార్జీలు చేసినా, వారు వెనకడుగు వేయకుండా నిలబడ్డారన్న ఆమె, వారి త్యాగాల పునాదులపైనే అమరావతి పునర్నిర్మాణం జరగాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన రేణుకా చౌదరి..   జగన్ సర్కార్ మూడు రాజధానుల  విధానం వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు తరలిపోయాయి, రాష్ట్ర భవిష్యత్  అంధకారంలో పడిందని విమర్శించారు. కేవలం కాగితాల మీద బిల్లులు పెట్టడం కాకుండా, నిర్దేశిత గడువులోగా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నారు.  కాగా అమరావతిపై జరిగిన చర్చలో పాల్గొన్న రేణుకా చౌదరి.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా తెలుగు రాష్ట్రాలతో కేంద్రం చెలగాటం ఆడుతోందన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు, కడప ఉక్కు కర్మాగారం వంటి కీలక హామీలను పక్కన పెట్టడాన్ని ఎత్తి చూపుతూ విమర్శించారు.  మొత్తానికి, అమరావతికి పూర్వ వైభవం రావాలని ఆశిస్తూనే, కేంద్రం తన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలన్నారు.   
ALSO ON TELUGUONE N E W S
నందమూరి బాలకృష్ణ, ర‌మ్య‌కృష్ణ‌, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన 'వంశానికొక్కడు' చిత్రంలోని ఒక అత్యంత భావోద్వేగభరితమైన స‌న్నివేశాల‌తో కూడిన  ఈ వీడియో మీకు అందిస్తున్నాం. ఒక పేద కుటుంబంపై ధనవంతులు, స్వార్థపరులు చేసే కుట్రలు, తద్వారా ఆ కుటుంబం అనుభవించే నరకయాతన చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ముఖ్యంగా చెల్లెలికి జరిగిన అన్యాయంపై అన్నగా రాజా (బాలయ్య) స్పందించే తీరు, తల్లి పడే కడుపుకోత ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తాయి. జీవితం అంటేనే ఒక పోరాటం. అది పేదవాడికి మరింత కఠినం. కష్టపడి పైకి రావాలని తపించే ఒక సామాన్య యువకుడి కుటుంబంపై విధి వెక్కిరించినట్లుగా, కొందరు స్వార్థపరులు ఆడిన నాటకంలో ఒక నిండు ప్రాణం బలైపోతుంటే చూస్తూ తట్టుకోవడం ఎవరికైనా సాధ్యమేనా? 'వంశానికొక్కడు' చిత్రంలోని ఈ సన్నివేశం కేవలం సినిమా కాదు, సమాజంలోని అసమానతల మీద సంధించిన అస్త్రం. కథలోకి వెళ్తే, రాజా (బాలకృష్ణ) తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పడే తపన అంతా ఇంతా కాదు. ఒకవైపు చెల్లెలికి ప్రాణాపాయం, మరోవైపు చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి. సహాయం కోసం వెళ్తే అక్కడ ఎదురయ్యే అవమానాలు గుండెలను పిండేస్తాయి. తను నమ్ముకున్న స్నేహితుడే వెన్నుపోటు పొడిస్తే, ఆ అన్న పడే ఆవేదన వర్ణనాతీతం. చెల్లెలి కడుపునొప్పి వెనుక ఉన్న విషాద నిజం తెలిసినప్పుడు ఆ కుటుంబం కుప్పకూలిపోయిన తీరు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. ముఖ్యంగా తల్లి పాత్రలో ఆమని మరియు అన్నగా బాలయ్య పండించిన భావోద్వేగాలు అద్భుతం. "పుత్రభిక్ష కోసం నీ గుమ్మం ముందు నిలబడ్డాను" అని వేడుకునే తల్లి ఆవేదనలో ఎంతటి కడుపుకోత ఉందో మనకు అర్థమవుతుంది. ఆడాళ్ళ జీవితాలతో ఆడుకునే రాక్షసుల వెనుక కూడా ఒక స్త్రీ ఉందనే చేదు నిజాన్ని బాలయ్య పలికిన సంభాషణలు సమాజానికి అద్దం పడతాయి. తన చెల్లెలి జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన వారిపై తిరగబడే సమయంలో బాలయ్య చూపిన రౌద్రం, అంతలోనే గుండెల్లోని బాధ కలగలిపి అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు "అప్పట్లో సినిమాలు అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, గుండెలను హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉండేవి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య నటనలోని తీవ్రత, చెల్లెలి పట్ల ఆయనకు ఉన్న ఆత్మీయత ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ఇటువంటి హృదయ విదారక సన్నివేశాలు మళ్ళీ తెలుగు తెరపై చూడలేమంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఈ సినిమా నేటికీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి మ‌రిన్ని మంచి వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
- మహాభారత గాథకు AI హంగులు..  - వినూత్నంగా Amba's Revenge మూవీ అనౌన్స్‌మెంట్! - తెలుగు తెరపై సాంకేతిక విప్లవం..  తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ కొత్త ప్రయోగాలకు వేదికగా నిలుస్తుంది. ఇప్పటికే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన టాలీవుడ్, ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమైంది. కృత్రిమ మేధ (Artificial Intelligence) ఆధారంగా రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా Amba's Revenge ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హనుమాన్ జ‌యంతిని పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయగా, ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన మరియు భావోద్వేగపూరితమైన 'అంబ' పాత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పురాతన కాలం నాటి ఇతిహాస గాథకు ఆధునిక సాంకేతికతను జోడించి, ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు చిత్ర బృందం నడుం బిగించింది. కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా, పాత్రల రూపకల్పన, కథనం మరియు ప్రొడక్షన్ డిజైన్‌లోనూ ఏఐ టూల్స్‌ను విస్తృతంగా ఉపయోగిస్తుండటం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత. శ్రీ లలితకళా ఫిలిమ్స్ మరియు నక్క తోక ఫిల్మ్స్ బ్యానర్లపై శ్రీకాంత్ రెడ్డి కుందూరు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాణి మాడిసన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపడుతున్నారు. టెక్నాలజీ పరంగా సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ, ఒక ఇతిహాసాన్ని ఈ కాలపు ప్రేక్షకులకు నచ్చేలా మలచడమే తమ లక్ష్యమని నిర్మాణ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్ఆర్’ వంటి చిత్రాలు విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు Amba's Revenge టోటల్ AI మేకింగ్‌తో ఆ స్థాయి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏఐ సాయంతో నటీనటుల గెటప్స్ నుంచి లొకేషన్ల వరకు ప్రతిదీ రియలిస్టిక్‌గా, అదే సమయంలో అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ వినూత్న ప్రయత్నంపై సినీ ప్రియుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా పురాణాలను ప్రస్తుత టెక్నాలజీతో చూపెట్టడం వల్ల యువతకు కూడా మన సంస్కృతిపై ఆసక్తి పెరుగుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఈ ఏఐ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్తులో సినిమా మేకింగ్ విధానమే మారిపోతుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రంలో నటించబోయే తారాగణం మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను గోప్యంగా ఉంచారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మరియు రిలీజ్ డేట్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ప్రతీకార గాథ వెండితెరపై ఎలాంటి విన్యాసాలు చేస్తుందో చూడాలి.
- టాలీవుడ్‌లో పైరసీ కలకలం - సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నిర్మాత‌లు - నిర్మాతలకు కోలుకోలేని దెబ్బ  తెలుగు చలనచిత్ర పరిశ్రమను దశాబ్దాలుగా పీడిస్తున్న పైరసీ భూతం మరోసారి పంజా విసిరింది. వెండితెరపై భారీ అంచనాలతో విడుదలైన పెద్ద సినిమాలను సైతం విడచిపెట్టకుండా, బాక్సాఫీస్ కలెక్షన్లకు గండి కొడుతున్న పైరసీ వెబ్‌సైట్లపై టాలీవుడ్ పెద్దలు ఇప్పుడు యుద్ధం ప్రకటించారు. ఇటీవల విడుదలైన అగ్ర హీరోల చిత్రాలు యథేచ్ఛగా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడంతో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించింది. చిత్ర పరిశ్రమ మనుగడకే ముప్పుగా మారిన ఈ వెబ్‌సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన భారీ చిత్రాలతో పాటు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా పైరసీ కోరల్లో చిక్కుకోవడం పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రభాస్ 'రాజా సాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు', 'అనగనగా ఒక రాజు', 'నారీనారీ నడుమ మురారి' వంటి సినిమాల హై క్వాలిటీ ప్రింట్లు విడుదలైన కొన్ని గంటల్లోనే వెబ్‌సైట్లలో దర్శనమిచ్చాయి. ఈ లీకేజీల వల్ల నిర్మాతలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోందని ఛాంబర్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిలిం ఛాంబర్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. పైరసీకి పాల్పడుతున్న మొత్తం 7 ప్రధాన వెబ్‌సైట్లను నిందితులుగా గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీటిలో ఇండస్ట్రీని ఏళ్ల తరబడి వేధిస్తున్న మూవీరుల్జ్ (Movierulz) కు చెందిన ఐదు డొమైన్లతో పాటు, సినీవుడ్ (Cinewood), తమిళ్ ఎంవీ (Tamil MV) వంటి సైట్లు ఉన్నాయి. ఈ పోర్టల్స్ ద్వారా సినిమాలను అక్రమంగా స్ట్రీమింగ్ చేస్తున్న వారి ఐపీ అడ్రస్లు, డొమైన్ వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సాధారణంగా ఒక సినిమా విడుదలైన వెంటనే సోషల్ మీడియా వేదికలైన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో ఈ పైరసీ లింకులు వైరల్ అవుతున్నాయి. కేవలం థియేటర్లలో మొబైల్ ఫోన్ల ద్వారా చిత్రీకరించడమే కాకుండా, విదేశాల్లోని సర్వర్లను ఉపయోగించి హై డెఫినిషన్ (HD) క్వాలిటీలో సినిమాలను అప్‌లోడ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి చర్యల వల్ల సినిమాను నమ్ముకున్న వేలమంది కార్మికుల పొట్ట కొడుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ విభాగం ప్రేక్షకులకూ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కేవలం పైరసీ వెబ్‌సైట్లు నిర్వహించే వారే కాకుండా, ఆ లింకులను సోషల్ మీడియాలో ఇతరులకు షేర్ చేయడం కూడా చట్టరీత్యా నేరమని స్పష్టం చేసింది. ఇలాంటి వెబ్‌సైట్లను సందర్శించే వారిపై కూడా నిఘా ఉంటుందని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సినిమాను ప్రేమిస్తే థియేటర్లలోనే చూడాలని, పైరసీని ప్రోత్సహించవద్దని అటు ఫిలిం ఛాంబర్, ఇటు హీరోల అభిమాన సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు ఈ సైట్ల మూలాలను వెతికి పట్టుకుని, వాటిని శాశ్వతంగా బ్లాక్ చేస్తారని ఇండస్ట్రీ ఆశిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో, పైరసీపై తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు ఏ మేరకు ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి. పరిశ్రమను కాపాడుకోవడానికి నిర్మాతల మండలి మరియు సైబర్ క్రైమ్ విభాగం సంయుక్తంగా ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
- ఆడవాళ్లపై జడ్జిమెంట్స్ ఏంటని ప్రశ్న! - భర్త గురించి మంచు లక్ష్మి బోల్డ్ కామెంట్స్! - పితృస్వామ్య పోకడలపై గళమెత్తిన మంచు లక్ష్మి..  - వైరల్ అవుతున్న మంచు ల‌క్ష్మి కామెంట్స్‌ టాలీవుడ్ లెజెండరీ నటుడు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి, కేవలం వారసత్వంతోనే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. నటిగా, నిర్మాతగా, టాక్ షో హోస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న లక్ష్మి, ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడటంలో ముందుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె పితృస్వామ్య వ్యవస్థ మరియు సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. సమాజంలో మహిళలను జడ్జ్ చేసే తీరుపై లక్ష్మి ఘాటుగా స్పందించారు. "మన సమాజంలో మగవాడు ఏ నిర్ణయం తీసుకున్నా అది బోల్డ్ అవుతుంది, అదే ఒక మహిళ తీసుకుంటే మాత్రం అది వివాదాస్పదంగా మారుతుంది" అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. పురుషులు చేస్తే అది గొప్పగా చూసే జనం, మహిళల విషయంలో మాత్రం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తారని, ఒక సామెతను గుర్తు చేస్తూ (పేరు ఎత్తకుండా) చాలా చమత్కారంగా కానీ గట్టిగానే సమాజంపై విమర్శలు కురిపించారు. మహిళలు ఇలాగే ఉండాలి, ఇలాగే నడవాలి అని నియమాలు ఎవరు పెట్టారని ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం మరియు తన భర్తతో ఉన్న బాండింగ్ గురించి కూడా లక్ష్మి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. పెళ్లి జరిగిన సమయంలోనే తన భర్తకు ఒక విషయాన్ని స్పష్టం చేశానని ఆమె తెలిపారు. "నువ్వు ఏదైతే చేయగలవో, నేను కూడా అదే చేయగలనని ఆయనకు ముందే చెప్పాను. అందుకే ఆయన ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నా లేదా ప్రవర్తించాలన్నా కొంచెం జంకుతారు. ఒకవేళ ఆయన ఏదైనా తప్పు చేస్తే, నేను కూడా అలాగే చేస్తానేమో అన్న భయం ఆయనలో ఎప్పుడూ ఉంటుంది" అని సరదాగా చెబుతూనే, సంబంధాల్లో సమానత్వం ఎంత ముఖ్యమో చాటిచెప్పారు. గత కొన్నాళ్లుగా మంచు లక్ష్మి వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల వచ్చిన 'ఆదిపర్వం', 'దక్ష: ది డెడ్లీ కాన్సిపిరసీ' వంటి సినిమాలతో తన నటనతో మెప్పించిన ఆమె, మార్చి చివర్లో విడుదలైన 'లేచింది మహిళా లోకం' అనే చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ చిత్రసీమలో కూడా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. మంచు లక్ష్మి చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె ధైర్యాన్ని మరియు ముక్కుసూటి తనాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా మహిళా అభిమానులు "లక్ష్మి గారు చెప్పింది అక్షర సత్యం" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తన అభిప్రాయాలను ఎవరికీ భయపడకుండా వెల్లడించే ఆమె శైలికి యువతలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం లక్ష్మి మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ (OTT) లో కూడా తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే తన తదుపరి చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తన తండ్రి మోహన్ బాబు లెగసీని కాపాడుకుంటూనే, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని నిర్మించుకుంటున్న లక్ష్మి రాబోయే రోజుల్లో ఇంకెలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
  - చిరు ఇంట భక్తి పారవశ్యం - మెగాస్టార్ పూజా గదిలో వింత - అయోధ్య రామయ్యను గుర్తు చేసిన ఆంజనేయ స్వామి - సోషల్ మీడియాలో మెగాస్టార్ వీడియో సెన్సేషన్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఆయన నడిచే దారి, పాటించే సంప్రదాయాలు కోట్లాది మందికి ఆదర్శంగా నిలుస్తుంటాయి. చిరంజీవికి ఆధ్యాత్మికతపై ఉన్న మక్కువ మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా హనుమంతుడిపై ఆయనకు ఉన్న అపారమైన భక్తి గురించి ఎన్నో సందర్భాల్లో మనం విన్నాం. తాజాగా హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ తన నివాసంలోని పూజా మందిరంలో చోటు చేసుకున్న ఒక అపురూప దృశ్యాన్ని అభిమానులతో పంచుకున్నారు. హ‌నుమాన్ జ‌యంతి వేళ‌.. మెగాస్టార్ చిరంజీవి ఇంటి పూజా మందిరంలో అద్భుతం చోటు చేసుకుంది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకుతున్న దృశ్యం భక్తులను పరవశానికి గురిచేస్తోంది. సప్త వర్ణాల కాంతితో స్వామివారి పాదాల నుంచి పైవరకు స్పృశిస్తూ వెళ్లడం విశేషం. ప్రకృతి సిద్ధంగా జరిగిన ఈ అద్భుతాన్ని చూసి మెగాస్టార్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. ఇది తన పూర్వజన్మ సుకృతమని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు మెగాస్టార్‌. ఇటీవల అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి నుదిటిపై సూర్య కిరణాలు ప్రసరించి 'సూర్య తిలకం'గా మారిన అద్భుతాన్ని దేశమంతా వీక్షించింది. ఇప్పుడు మెగాస్టార్ ఇంట్లో కూడా అచ్చం అలాంటి దృశ్యమే ఆవిష్కృతం కావడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ అద్భుతం తన ఇంట్లో జరుగుతుందని చిరంజీవి వివరించారు. కోణార్క్ లేదా అరసవల్లి లాంటి పురాతన ఆలయాల్లో మాత్రమే ఇలాంటి విశేషాలు మనం చూస్తుంటాం, కానీ ఒక సినీ నటుడి ఇంట్లో శాస్త్రీయంగా నిర్మించిన పూజా గదిలో ఇలా జరగడం విశేషం. మెగా కుటుంబంలో కేవలం చిరంజీవి మాత్రమే కాదు, ఆయన తనయుడు రామ్ చరణ్, తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఆధ్యాత్మిక విషయాల్లో ఎంతో నిబద్ధతతో ఉంటారు. చరణ్ అయ్యప్ప దీక్షను ఎంత నిష్ఠగా పాటిస్తారో మనకు తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ కూడా హనుమంతుడి భక్తుడిగా పలుమార్లు తన విశ్వాసాన్ని చాటుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ స్వయంగా తన ఇలవేల్పుకు ప్రకృతి చేస్తున్న ఈ అభిషేకాన్ని చూపించడంతో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే లక్షలాది వ్యూస్ సాధించింది. "ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ మీపై ఉండాలి బాస్" అంటూ ఫ్యాన్స్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా, ఉదయాన్నే దైవ చింతనలో గడపడం చిరంజీవికి అలవాటు. ప్రస్తుతం ఆయన వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే భారీ సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ఆధ్యాత్మిక నేపథ్యంతో ముడిపడి ఉన్న క్రమంలో, చిరు ఇంట్లో ఇలాంటి సంఘటన జరగడం విశేషమని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మెగాస్టార్ నివాసంలోని ఈ అద్భుత దృశ్యం ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రకృతి, భక్తి కలగలిసిన ఈ వీడియో అభిమానులకు పండగలా అనిపిస్తోంది. ప్రస్తుతం ‘విశ్వంభర’ షూటింగ్‌లో బిజీగా ఉన్న చిరంజీవి, ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతున్నారు. ఈ అద్భుత దృశ్యం సినిమా విజయంపై మరింత సానుకూల సంకేతాలను ఇస్తోందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
    -వరుస హిట్స్  -యూత్ లో క్రేజ్ -రేపు మరోసారి రాకాసతో లాండింగ్    -తన సినీ జర్నీ ఏంటి  నయన్ సారిక(Nayan Sarika)ఇప్పుడు ఈ పేరు సినీ పరిభాషలో గోల్డెన్ లెగ్ కి రహదారి. అంతలా తన అందం, సహజత్వమైన పెర్ఫార్మ్ తో యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వస్తుంది.  చాలా కాలం తర్వాత హీరోయిన్ కి అభిమానులు అనేది ఏర్పడటానికి నయన్ నే అంకురార్పణ చేసిందని చెప్పవచ్చు. పైగా షార్ట్ పీరియడ్ లో.   రేపు 'రాకాస' తో మరో సారి థియేటర్స్ లో అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఆమె సినీ జర్నీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతు ఉంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.   2024 లో ఆనంద్ దేవరకొండ తో కలిసి ' గం గం గణేశా’తో సెల్యులాయిడ్ పై అడుగుపెట్టింది నయన్ సారిక. మొదటి సినిమాతోనే మంచి పెర్ఫార్మ్ ప్రదర్శించే నటిగా గుర్తింపు రావడంతో ఆ తర్వాత  'క’, ‘ఆయ్’ వంటి చిత్రాలతో వరుస హిట్స్ ని అందుకుంది. అందుకోవడమే కాదు ఆ సినిమాల్లో ఆమె ప్రదర్శించిన సహజ నటన, పల్లెటూరి అమ్మాయి లుక్, ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఆకర్షించాయి.దీంతో  ఫ్యాన్  బేస్  సొంతం చేసుకుంది.ముఖ్యంగా ‘ఆయ్’లో ఆమె చేసిన పెర్ఫార్మెన్స్ యూత్ లో భారీ క్రేజ్ సృష్టించింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి బడా హీరోలు నటనను అభినందించడం గమనార్హం. 'క' సినిమాలో ఆమె నటన ఎంతగానో మెప్పించింది. ఇటీవల శ్రీవిష్ణు సరసన ‘విష్ణు విన్యాసం’లో డిఫరెంట్ క్యారక్టర్ లో కామెడీని పండించి   ఇంకో మెట్టు పైకి ఎదిగింది. ఈ చిత్రం రిలీజ్ అయిన వెంటనే ట్రెండింగ్‌లో నిలిచి, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. అందంతో పాటు నటనలో కూడా మెరుగైన ప్రదర్శన ఇస్తున్న నయన్ సారిక తన ఎంపిక చేసుకున్న కథల ద్వారా ప్రేక్షకుల నమ్మకాన్ని సంపాదించింది. యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించిన ఈ హీరోయిన్ భవిష్యత్‌లో మరిన్ని ఆసక్తికర ప్రాజెక్టులు చేపట్టడం ఖాయం అని చలనచిత్ర పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఆమె అందం, స్మైల్, ఎనర్జీతో పాటు సీరియస్ రోల్స్‌లో కూడా మెరుగైన నటన ఇవ్వడం టాలీవుడ్‌కు కొత్త ఎనర్జీని అందిస్తోంది. Also read: Telangana: తెలంగాణా థియేటర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం.. రేపటి సినిమాల పరిస్థితి ఏంటి  మరి రేపు రాకాస(Raakaasa)తో మరో హిట్ అందుకోవడం ఖాయమనే టాక్ వినపడుతుంది.ట్రైలర్, టీజర్ లో  నయన్ సారిక కొత్త లుక్, ఎనర్జీటిక్ పెర్ఫార్మెన్స్‌తో మెరుస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. రాకాసి ప్రమోషన్స్ లో తెలుగు సంస్కృతి, గోదారోళ్ల మర్యాదలపై ఆకర్షణ వ్యక్తం చేస్తూ, తనను తాను ‘తెలుగమ్మాయి’గా భావించడం ప్రశంసనీయంగా మారింది. నయన్ సారిక భవిష్యత్‌లో పెద్ద స్థాయి ప్రాజెక్టులు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నయన్ స్వస్థలం మహారాష్ట్రలోని షోలాపూర్.    
    -రంగంలోకి ఎగ్జిబిటర్స్  -వాళ్ళని బతికించడమే లక్ష్యమా! -మరికొందరు అదే బాటలోకి వస్తారా స్టిల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ నలుగురు స్నేహితులు కలిసినా అరె మావా ఈ రోజు సినిమాకి వెళ్దామా అని మాట్లాడుకుంటూ ఉంటారు. పైగా సింగల్ స్క్రీన్ లో సినిమా చూస్తే వచ్చే మాజానే వేరు కావడంతో తమకి అందుబాటులో ఉన్న థియేటర్ కి పరుగులు పెడతారు. ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న ఆనవాయితీ కూడా. రీసెంట్ గా తెలంగాణకి సంబంధించిన సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యాజమాన్యం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ వార్త సినీ సర్కిల్స్ , మూవీ లవర్స్ లో  హాట్ టాపిక్ గా మారింది. మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటో చూద్దాం. ఇప్పటివరకు థియేటర్ల యజమానులు అలియాస్ ఎగ్జిబిటర్స్ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా నిర్ణీత అద్దెని వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ అద్దె ప్లేస్ లో సినిమా తమ థియేటర్ లో ప్రదర్శిస్తున్న అన్ని రోజులు  పర్సెంటేజ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఫస్ట్ వీక్   60%,సెకండ్ వీక్ 50%, థర్డ్ వీక్  40%  చొప్పున తీసుకోవాలని తెలంగాణ ఫిలిం, ఏషియన్ సునీల్ తీర్మానించారు. ఈ మేరకు ప్రస్తుతం 23 థియేటర్లు ముందుకొచ్చి ఈ విషయాన్నీ ప్రకటించాయి. ఇది సక్సెస్ అయితే మరిన్ని థియేటర్లు ఇదే బాట పట్టే అవకాశం ఉంది. దీనివల్ల నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి మరియు ఎగ్జిబిటర్లకి మధ్య ఒక ఆరోగ్యకరమైన వ్యాపార వాతావరణం ఏర్పడుతుందని సినిమా మంచి కోరుకునే వాళ్లంతా ఆశపడుతున్నారు. ఏప్రిల్ 3,నుంచి ఈ విధానం అమలు కానుంది. Also read: Niharika konidela: విశ్వక్ సేన్, నేను ఒక్క సాంగ్ తోనే ఆపేశాం.. వైరల్ అవుతున్న నీహారిక మాటలు  టాలీవుడ్‌లో గత కొంత కాలంగా ఓటీటీ ప్రభావం, భారీ బడ్జెట్ సినిమాల కొరత, మరియు పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు సింగిల్ స్క్రీన్స్‌ను కోలుకోలేని దెబ్బ తీశాయి. చాలా చోట్ల నిర్వహణ భారం కాక యజమానులు థియేటర్లని మూసివేసే ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాది సినిమా ఎగ్జిబిటర్లందరూ కలిసి ఒక ఉమ్మడి నిర్ణయానికి రావాలని భావించారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ఆ ఏకాభిప్రాయానికి ప్రతిరూపంగా నిలుస్తోంది.    
- వెయ్యి కోట్ల ‘వారణాసి’లో మహేష్ బాబు విశ్వరూపం..  - రణ్‌బీర్ రామాయణానికి గట్టి పోటీ! - రణ్‌బీర్ కపూర్ రాముడి లుక్ బాగున్నా.. మహేష్ బాబు రాక కోసం ఫ్యాన్స్ వెయిటింగ్! - బాక్సాఫీస్ వద్ద రామాయణ యుద్ధం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అది రామాయణ గాథ ఆధారంగా వస్తున్న భారీ చిత్రాలు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న ‘రామాయణ’ టీజర్ ఇటీవల విడుదల కావడంతో నెట్టింట పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే, ఈ టీజర్‌ను చూసిన నెటిజన్లు సహజంగానే ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ (SSMB29)తో పోల్చి చూస్తున్నారు. రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఈ సినిమా విజువల్ వండర్‌గా ఉండబోతుందని, రణ్‌బీర్ రాముడి కంటే మహేష్ రాముడే పవర్‌ఫుల్‌గా ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ చిత్రంలో శ్రీరాముడి లుక్ చాలా క్లాసీగా, ప్రశాంతంగా కనిపిస్తోంది. హిందీ ప్రేక్షకులు దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నప్పటికీ, రాజమౌళి అభిమానులు మాత్రం జక్కన్న రేంజ్ వేరే అని చెప్తున్నారు. ‘వారణాసి’ చిత్రానికి సంబంధించి గతంలో విడుదలైన గ్లింప్స్‌లో ఒక్క రామాయణ ఎపిసోడ్ షాట్ చూస్తేనే సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థమైపోయింది. వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ స్థాయిలో ఉండబోతోందని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ చిత్రం గురించి గతంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వారణాసి’లో శ్రీరాముడికి సంబంధించిన ఒక సీన్ షూట్ చేసిన తర్వాత, ఆ ఒక్క షాట్ కోసం ఎన్ని రోజులైనా వేచి ఉండొచ్చని, తన కష్టమంతా మర్చిపోయానని మహేష్ పేర్కొన్నారు. అంటే ఆ సన్నివేశం ఎంత ప్రభావవంతంగా వచ్చిందో మనం ఊహించుకోవచ్చు. రాజమౌళి సినిమాల్లో ఉండే ఆ భారీతనం, విజువల్ ఎఫెక్ట్స్ ముందు ఏ సినిమా అయినా దిగదుడుపేనని ట్రేడ్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఇక ఈ సినిమా నేపథ్యం విషయానికి వస్తే.. రాజమౌళి ఈ చిత్రాన్ని కేవలం రామాయణం మాత్రమే కాకుండా, ఒక గ్లోబల్ అడ్వెంచర్‌గా మలుస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఈ ప్రయాణంలో రామాయణానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలను జక్కన్న టచ్ చేయబోతున్నారు. ముఖ్యంగా మహేష్ బాబును గతంలో ఎన్నడూ చూడని సరికొత్త మేకోవర్‌లో చూపించేందుకు రాజమౌళి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో రణ్‌బీర్ వర్సెస్ మహేష్ అనే యుద్ధం అప్పుడే మొదలైపోయింది. రణ్‌బీర్ టీజర్ చూసి మురిసిపోతున్న బాలీవుడ్ ప్రేక్షకులకు, రాజమౌళి అసలు సిసలు విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని తెలుగు ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. మహేష్ బాబు రాముడి లుక్ కనుక అఫీషియల్‌గా బయటకు వస్తే సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ‘వారణాసి’ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉంది. రాజమౌళి తన సినిమాల్లో ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో జాగ్రత్తగా మలుస్తారనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. రాబోయే రోజుల్లో మహేష్ బాబు అఫీషియల్ లుక్ గురించి రాజమౌళి ఏదైనా హింట్ ఇస్తారేమో వేచి చూడాలి!
- విజయశాంతి మాస్ ట్రీట్ - రౌడీల గుండెల్లో వణుకు పుట్టించిన పవర్‌ఫుల్ ఫైట్! - శ్రీకాంత్ సాక్షిగా విజయశాంతి వీరవిహారం - పరీక్షా కేంద్రంలో అవినీతిపై పోరాటం! లేడీ సూప‌ర్‌స్టార్ విజయశాంతి, జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్ నటించిన ఆశ‌యం చిత్రంలోని ప‌వ‌ర్‌ఫుల్ స‌న్నివేశాల‌తో కూడిన వీడియో ఇది. ఎ.మోహ‌న‌గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ఎ.ఎం.ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. పరీక్షా కేంద్రంలో అవినీతికి పాల్పడుతున్న లెక్చరర్‌ను సరోజిని (విజయశాంతి) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం, ఆ తర్వాత రోడ్డుపై ఆమెపై దాడికి ప్రయత్నించిన రౌడీలకు బుద్ధి చెప్పే ఉత్కంఠభరితమైన ఫైట్ సీన్ ఇందులో ప్రధాన ఆకర్షణ. తెలుగు సినీ ప్రేక్షకులకు 'కర్తవ్యం' సినిమాతో లేడీ బాస్ అంటే ఎలా ఉంటుందో చూపించిన విజయశాంతి, మరోసారి తన మార్క్ యాక్షన్‌తో అదరగొట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా వీడియోలో విజయశాంతి నటించిన ఒక పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అన్యాయాన్ని ఎదిరించే ఒక ధైర్యవంతురాలైన విద్యార్థిని పాత్రలో ఆమె చూపిన తెగువ మెస్మరైజ్ చేస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఒక కాలేజీ నేపథ్యంలో మొదలవుతుంది. పరీక్షా హాల్లో లెక్చరర్ డబ్బు తీసుకుని ఒక స్టూడెంట్ బదులు తానే పేపర్ రాస్తుండగా, విజయశాంతి అడ్డుకుంటుంది. ఈ క్రమంలో జరిగే వాగ్వాదం చివరకు రోడ్డుపై పెద్ద ఫైట్‌కు దారితీస్తుంది. కాలేజీ నుంచి డిబార్ అయిన రౌడీ మూకలు విజయశాంతిపై దాడికి దిగగా, ఆమె తనదైన శైలిలో వారిని మట్టి కరిపించడం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ స్టంట్ లో విజయశాంతి బాడీ లాంగ్వేజ్ మరియు ఆమె కళ్లలో కనిపించే తీక్షణత అద్భుతం. ఎటువంటి డూప్ లేకుండా రిస్కీ షాట్స్‌ను కూడా ఎంతో నేచురల్‌గా చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా రౌడీలు చుట్టుముట్టినప్పుడు ఆమె ఇచ్చే కౌంటర్ ఎటాక్స్, ఫుట్ వర్క్ ఒక ప్రొఫెషనల్ ఫైటర్ తరహాలో ఉన్నాయి. స్టంట్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ ఫైట్ సీన్ చాలా రా అండ్ రస్టిక్‌గా ఉండి ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది. వీడియోలో హీరో జ‌గ‌ప‌తిబాబు కూడా కనిపిస్తారు. ఆయన పాత్ర ఇందులో విజయశాంతికి సపోర్టివ్‌గా ఉంటూనే, ఒక సామాన్య వ్యక్తిగా ఆమె ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయేలా డిజైన్ చేయబడింది. డైరెక్టర్ ఎమోషన్‌ను మరియు యాక్షన్‌ను బ్యాలెన్స్ చేస్తూ తీసిన విధానం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పాత క్లిప్పింగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుండగా, "విజయశాంతి గారు మళ్ళీ ఇలాంటి పవర్‌ఫుల్ రోల్స్ చేయాలి" అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి మ‌రిన్ని మంచి వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscibe చేసుకోండి.
    -రేపు రాకాసతో సందడి చేయనున్న నీహారిక  -ప్రమోషన్స్ లో బిజీ  -వైరల్ అవుతున్న విశ్వక్ సేన్ పై మాటలు  మెగా డాటర్ అనే టాగ్ లైన్ కి పర్ఫెక్ట్ గా న్యాయం చేస్తు తన సినీ డైరీని ఫుల్ బిజీ మోడ్ లో ఉంచుతుంది నీహారిక కొణిదెల(Niharika Konidela). ఈ క్రమంలోనే రేపు 'రాకాస' మూవీతో థియేటర్స్ లో ల్యాండ్ కానుంది. ప్రొడ్యూసర్ గా ఇప్పటికే కమిటీ కుర్రాళ్ళు తో హిట్ అందుకొని ఉండటంతో 'రాకాస'పై అంచనాలు పెరిగాయి.సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా చేస్తుండగా హర్రర్ కామెడీతో తెరకెక్కడం రాకాస స్పెషల్. రేపు ఏప్రిల్ 3 న రిలీజ్ కానున్న నేపథ్యంలో  ప్రమోషన్స్ ఫుల్ వేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ప్రముఖ హీరో విశ్వక్ సేన్ పై నీహారిక(Niharika)చేసిన వ్యాఖ్యలు సినీ సర్కిల్స్ లో టూ డే ఫ్రెష్ నెస్ హోదాలో తిరుగుతున్నాయి. మరి ఆ వ్యాఖ్యలేంటో చూద్దాం. కెరీర్ మొదట్లో నటిగా  'విశ్వక్ సేన్(Vishwak Sen)తో 'టర్మ్స్ అండ్ కండిషన్స్' అనే షార్ట్ ఫిలిం చేశాను. ఎంటర్ టైన్ మెంట్ కోణంలో చేయమంటే  అలానే చేస్తు నటిగా బాగానే ఎంజాయ్ చేశాను. ఆ ఏజ్ లో నాకు వచ్చిన యాక్టింగ్ అదే. కానీ దేవుడి దయవల్ల ఒక సాంగ్ తోనే షార్ట్ ఫిలిం ఆగిపోయింది. ఆ విధంగా ఆగిపోవడం విశ్వక్ కి నాకు మంచి జరిగినట్లయింది. అప్పట్లో మీడియా హడావిడి లేదు. ఏదైనా ఫ్రీగా చేసుకునేవాళ్లం. కానీ మీడియా ఉండుంటే నేను అలాంటి షార్ట్ ఫిలిమ్స్ చేసేదాన్ని కాదు కదా అని ఇప్పుడు అనిపిస్తుందని చెప్పింది. దీంతో  షార్ట్ ఫిలిం ఆగిపోతే ఎందుకు హ్యాపీగా ఫీలవుతున్నావో కూడా చెప్పచ్చు కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పనిలో పనిగా గతంలో అఖిల్ అక్కినేని గురించి నీహారికనే చెప్పిన కొన్ని మాటలని కూడా వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. మరి ఆ మాటలు కూడా చూద్దాం.   Also read: Ramayana: టార్గెట్ మొత్తం క్లియర్ గా అర్థమైంది.. ఒక రేంజ్ లో ఉన్న రామాయణ టీజర్ అఖిల్(Akhil Akkineni)అక్కినేని తో ఒక షార్ట్ ఫిలిం చేశాను. ఎస్.ఎస్ కార్తికేయ దర్శకత్వం వహించాడు. రాజమౌళి(SS Rajamouli)కి చూపిస్తే ఈ షార్ట్ ఫిలిం రిలీజ్ చేయకపోతే బెటర్ అన్నారని చెప్పుకొచ్చింది. రాజమౌళి కొడుకే కార్తికేయ అనే విషయం తెలిసిందే.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా  ఆటంకం కలిగిస్తాయి. అందువల్ల ఏ విధమైన ఆటంకం లేకుండా, శ్రద్దగా  చదువుకోవాలంటే వారికి జ్ఞాపకశక్తి కూడా మెరుగ్గా ఉండాలి. ముఖ్యంగా  స్టడీ టేబుల్‌పై వారి ఏకాగ్రతను దెబ్బతీసే వస్తువులు ఉంటే, వారు ఎంత కష్టపడి చదివినా  ఏకాగ్రత తక్కువగానే ఉంటుంది. ఎంత ప్రయత్నించినా చదువు మీద దృష్టి పెట్టలేరు. ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉంటే వారు చదువుకునే ప్రదేశంలో లేదా స్టడీ టేబుల్‌పై ఉంచకూడని ఐదు వస్తువులు ఉన్నాయి. అవేంటో.. వాటిని ఎందుకు చదువుకొనేటప్పుడు పిల్లలకు దగ్గరగా ఉంచకూడదో తెలుసుకుంటే.. మొబైల్ ఫోన్.. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు పిల్లల ఏకాగ్రతను బాగా దెబ్బతీస్తున్నాయి. సోషల్ మీడియా నోటిఫికేషన్లు, మెసేజ్‌లు, గేమ్స్, వీడియోలు పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయి. ఫోన్‌ను టేబుల్‌పై దూరంగా ఉంచినప్పటికీ, పిల్లల మనసు పదే పదే  నోటిఫికేషన్ల కోసం చూస్తూ ఉంటుంది. దీనివల్ల వారి చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. అందువల్ల, చదువుకునే సమయంలో మొబైల్ ఫోన్‌ను వేరే చోట ఉంచాలి.  మరీ ముఖ్యంగా నేటికాలంలో టీనేజ్ పిల్లలకు కూడా సపరేట్ గా ఫోన్ లు కొనివ్వడం పెద్దలు చేస్తున్న తప్పు.  చిన్నతనం నుండే పిల్లలకు ఫోన్ విషయంలో మంచి క్రమశిక్షణ పెట్టడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే పిల్లల మనసు చదువుపైన దృష్టి పెట్టేందుకు సహాయపడుతుంది. స్నాక్స్.. చదువుకునే బల్లపై లేదా చదువుకునే ప్రదేశంలో  చిప్స్, చాక్లెట్, శీతల పానీయాలు వంటివి ఉంచడం కూడా మంచిది కాదు. పిల్లలు చదువుకునేటప్పుడు తినేస్తుంటారు, దీనివల్ల వారి ఏకాగ్రతకు భంగం కలుగుుతంది. జంగ్  ఫుడ్ వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.  పిల్లల ఏకాగ్రత దెబ్బతింటుంది. దానికి బదులుగా, పిల్లలను చురుకుగా, ఏకాగ్రతతో ఉంచడానికి బల్ల దగ్గర పండ్లు, నీళ్లు వంటి ఆరోగ్యకరమైన పదార్థాలను ఉంచాలి. ఆరోగ్యకరమైన స్నాక్స్, ఒక గ్లాసు నీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోండి. స్టేషనరీ.. పిల్లలు తరచుగా పెన్నులు, పెన్సిళ్లు, మార్కర్లు , పోస్ట్-ఇట్ నోట్లను  బల్లలపై వదిలేస్తుంటారు. దీనివల్ల స్టడీ టేబుల్ చిందరవందరగా, అస్తవ్యస్తంగా తయారవుతుంది.  ఈ మానసిక గందరగోళం ఏకాగ్రతను కోల్పోయేలా చేస్తుంది. అందువల్ల, బల్లపై కేవలం అత్యవసరమైన పుస్తకాలు, పెన్నులు, నోట్‌బుక్‌లను మాత్రమే ఉంచాలి. ఇతర స్టేషనరీని అల్మరాలో లేదా డ్రాయర్‌లో భద్రపరచాలి. గేమింగ్ పరికరాలు.. టేబుల్‌పై గేమింగ్ కన్సోల్, హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ పరికరం లేదా కంట్రోలర్‌ను ఉంచడం వల్ల పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుంది. గేమింగ్ పరికరాన్ని చూడగానే పిల్లలకు ఆడాలనే కోరిక కలిగే అవకాశం ఎక్కువ.  దీనివల్ల చదువుకునే సమయం తగ్గి, వారి ఏకాగ్రతకు భంగం కలుగుతుంది. గేమింగ్ పరికరాలను వేరే గదిలో లేదా అల్మరాలో ఉంచాలి. కోట్స్.. గెలుపుకు బోలెడు మార్గాలు ఉంటాయి. కొందరు భయంతో గెలవాలని ప్రయత్నం చేస్తారు. చాలామంది పిల్లలకు బాగా చదువుకుని మార్కులు బాగ తెచ్చుకోవాలని ఉన్నా,  ఏదో బలహీనత వారిని వెనక్కు లాగుతూ ఉంటుంది.  ఈ కారణంగా భయంతో చదువు వైపు ఏకాగ్రత పెట్టడానికి కొన్ని కోట్స్ రాసిన స్టిక్కర్స్ పెట్టుకుంటారు.  కానీ భయంతో చదివే చదువుకంటే.. ఇష్టంతో చదివే చదువు చాలా బాగా గుర్తుంటుంది.  అందుకే చదువుకోవడాన్ని ప్రేరేపించే విదంగా ఉండే కోట్స్ ను స్టడీ టేబుల్ లేదా చదువుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి.  ఇది మరింత మెరుగ్గా చదవడానికి సహాయపడుతుంది. చదువుకునే పిల్లలు ఉన్నప్పుడు పైన చెప్పుకున్నవి పాటించడం వల్ల పిల్లలు చదువులో మరింత మెరుగ్గా ముందుకెళతారు.                                   *రూపశ్రీ.
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు. అయితే ఆరోగ్యంగా చల్లని నీరు తాగాలంటే.. మట్టి కుండలు మంచి ఆప్షన్..  ఇది చల్లదనాన్నే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మార్కెట్లో మట్టి కుండ కొనడం అంత సులభం కాదు. సరైన దానిని ఎంచుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే నీరు అస్సలు చల్లగా ఉండదు. మట్టికుండ కొనుగోలు చేసేటప్పుడు మంచిది  ఎన్నుకోవాలంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి.   మట్టికుండ కొనుగోలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవలసిన విషయాలు.. రంగు వేసిన కుండలు..  రంగులు వేసిన కుండను ఎప్పుడూ కొనకూడదు. వాటిలో రసాయన రంగులను ఉపయోగిస్తారు, అవి చూడటానికి అందంగా కనిపించినా ఆరోగ్యానికి హానికరం. కుండలో రంధ్రాలు.. కుండకు లీకులు లేదా రంధ్రాలు ఉన్నాయేమో తనిఖీ చేయాలి.  కుండ కొనేటప్పుడే కుండలో నీళ్లు నింపి వెంటనే తనిఖీ చేయండి. కుండ ఆకారం.. కుండ ఆకారాన్ని పరిగణనలోకి తీసుకోడం  చాలా ముఖ్యం. కుండ మరీ పలుచగా లేదా మరీ మందంగా ఉండకూడదు, లేకపోతే నీరు చల్లబడదు. సరైన మందం ఉన్న కుండను ఎంచుకోవాలి. వెడల్పాటి మూతి.. మార్కెట్లో కుండ కొనేటప్పుడు, వెడల్పాటి మూతి ఉన్నదాన్ని ఎంచుకోవాలి. దానివల్ల కుండను నింపడం, నీటిని తీసివేయడం, శుభ్రపరచడం చాలా సులభం అవుతుంది. దానిలోని నీరు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.                                *రూపశ్రీ.
  జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది,  ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్షం పదమూడవ రోజున మహావీర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు జైన మతానికి చెందిన 24వ తీర్థంకరుడైన  మహావీరుని జన్మదినోత్సవం. ఈ సంవత్సరం, మహావీర్ జయంతి 2026 మార్చి 31, మంగళవారం నాడు  వచ్చింది.  యువరాజు వర్థమానుడు.. మహావీరుడిగా ఎలా పరివర్తన చెందాడు? దీని వెనుక ఉన్న కథ ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. మహావీరుని పంచ వ్రతాలైన అహింస, సత్యం, అపవిత్రత, బ్రహ్మచర్యం, అపరిగ్రహం జైన మతానికి మూలస్తంభాలు.  మహావీరుని జన్మదినోత్సవం జైన సమాజానికి ఒక ప్రధాన పండుగ. ఈ పవిత్రమైన రోజున, జైన దేవాలయాలను అలంకరిస్తారు,  మహావీరుని విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తారు, భారీ రథయాత్రలను నిర్వహిస్తారు. ప్రజలు దానధర్మాలు చేస్తారు , మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. సాధారణ మానవుడిగా జన్మించిన వర్థమానుడు  తన జీవితాన్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించుకుని, జ్ఞానోదయం పొందిన ఆత్మగా, మహావీరడిగా మారి, అసాధారణమైన కార్యాలు సాధించారు. ఆయన ఒక రాజభవనంలో జన్మించి, పుట్టుకతోనే యువరాజు అయినప్పటికీ,  జ్ఞానాన్వేషణలో త్యాగాన్ని, అంకితభావాన్ని అనుసరిస్తూ మహావీరుడిగా మారారు. కానీ యువరాజు వర్ధమానుడి నుండి మహావీరుడిగా ఆయన ప్రయాణం మరింత అద్భుతమైనది. వర్థమానుడు మహావీరుడిగా మారిన ప్రయాణం..  మహావీరుడు సుమారు 2,500 సంవత్సరాల క్రితం క్రీ.పూ. 599లో  వైశాలిలోని క్షత్రియకుండ గ్రామంలో ఒక క్షత్రియ రాజ కుటుంబంలో జన్మించారు. పుట్టినప్పుడు, అతని తల్లిదండ్రులు అతని శ్రేయస్సు  బాగుండాలని  వర్ధమాన అని పేరు పెట్టారు. వర్ధమానుని తండ్రి సిద్ధార్థుడు ,అతని తల్లి త్రిశాల. శ్వేతాంబర సంప్రదాయం ప్రకారం వర్ధమానుడు యువరాణి యశోదను వివాహం చేసుకున్నాడు. అయితే దిగంబర సంప్రదాయం మహావీరుడిని జీవితాంతం బ్రహ్మచారిగా వర్ణిస్తుంది. 30 ఏళ్ల వయసులో వర్ధమాన యువరాజు లౌకిక జీవితాన్ని త్యజించాలని నిశ్చయించుకుని, సర్వస్వం త్యజించి సత్యం , జ్ఞానం కోసం అన్వేషిస్తూ  బయలుదేరాడు. దీక్ష స్వీకరించిన తరువాత, అతను ఒక సంవత్సరానికి పైగా దేవదూష్య వస్త్రాలు ధరించి, ఆపై వస్త్రాలు విడిచిపెట్టి, తపస్సు మార్గాన్ని అనుసరించి కఠోర తపస్సు చేశాడు. 12 సంవత్సరాల మౌనం, తపస్సు, ఉపవాసం , ఆత్మసంయమనం తరువాత చివరకు రిజుబాలిక నది ఒడ్డున ఉన్న ఒక సాల వృక్షం కింద కైవల్యాన్ని పొందాడు. 42 ఏళ్ల వయసులో దివ్య జ్ఞానోదయం పొందిన తర్వాత,  మహావీరుడు  తన జీవితంలోని తదుపరి 30 సంవత్సరాలు బీహార్, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ వంటి ప్రాంతాలలో పర్యటించారు. ఈ సమయంలో, ఆయన ధర్మ సందేశాన్ని కూడా వ్యాప్తి చేశారు. 72 ఏళ్ల వయసులో, దీపావళి కార్తీక అమావాస్య రోజున,  మహావీరుడు బీహార్‌లోని పావాపురిలో  నిర్వాణం పొందారు. ఇది మహావీరుడి కథ..!                                       *రూపశ్రీ.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో, క్యాలీ ఫ్లవర్ ను పోలిన బ్రోకలీ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా కొన్ని రకాల జబ్బులను ఆమడ దూరంలో ఉంచే శక్తి బ్రోకలీకి ఉంది. అసలు బ్రోకలీలో ఉండే పోషకాలు ఏంటి? బ్రోకలీ తింటే ఏ వ్యాధులు దూరంగా ఉంటాయి?  తెలుసుకుంటే.. బ్రోకలీలో ఉండే పోషకాలు.. బ్రోకలీలో ఫైబర్,  విటమిన్-సి, విటమిన్-కె, ఐరన్,  పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బ్రోకలీ తింటే ఏ జబ్బులు దూరంగా ఉంటాయంటే.. గుండె జబ్బులు.. బ్రోకలీని తింటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అయితే ఇందుకోసం బ్రోకలీని తీసుకునే విధానం కూడా చాలా ముఖ్యం.  ఆవిరి మీద ఉడికించిన బ్రోకలీని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. రక్తనాళాల ఆరోగ్యం.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా బ్రోకలీ గుండె మరియు రక్తనాళాల  వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు,  పరిశోధనా ఫలితాలు చెబుతున్నాయి. క్యాన్సర్.. బ్రోకలీకి క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంటే.. బ్రోకలీ యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ప్రోస్టెస్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కంటిచూపు.. కంటి చూపుకు పదును పెట్టడంలో,  దృష్టి లోపాన్ని నివారించడంలో,  రేచీకటి వంటి దృష్టి సమస్యలు నివారించడంలో బ్రోకలీ  కొంతవరకు సహాయపడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. పేగు ఆరోగ్యం.. బ్రోకలీలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది.  ఇది పేగు ఆరోగ్యానికి చక్కగా  సహాయపడుతుంది. బ్రోకలీని తీసుకుంటూ ఉంటే పేగు ఆరోగ్యం మెరుగవుతుంది. చక్కెర స్థాయిలు.. మధుమేహం ఉన్నవారు బ్రోకలీని తింటే చాలా ఉపయోగం.  బ్రోకలీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.                                  *రూపశ్రీ.
మండే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి గంటల తరబడి ఏసీ ముందు కూర్చోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు  శరీరంపై రహస్యంగా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా ఏసీలో ఎక్కువగా గడిపేవారిలో ఊబకాయం సమస్య చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి.  ఏసీ లో గడపడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ నిజాలు తెలుసుకోవాలి... ఊబకాయం ఎలా పెరుగుతుందంటే.. కార్యకలాపాలు లేకపోవడం.. శరీరం సౌకర్యవంతంగా చల్లగా ఉన్నప్పుడు, అది శక్తిని ఖర్చు చేయడానికి ప్రయత్నం చేయదు. రోజంతా కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల కేలరీల బర్నింగ్  గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా, కొవ్వు వేగంగా పేరుకుపోతుంది. ఉష్టోగ్రత.. వేడి వాతావరణంలో, శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి శరీరం ఎక్కువగా శ్రమిస్తుంది, దీనివల్ల జీవక్రియ చురుకుగా ఉంటుంది. ఏసీలో ఉండటం ఈ ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది, దీనివల్ల జీవక్రియ రేటు తగ్గి బరువు పెరుగుతుంది. ఆకలి.. చల్లని వాతావరణంలో శరీరానికి అదనపు శక్తి అవసరం ఏర్పడుతుంది. దీని ఫలితంగా తరచుగా ఆకలి వేయడం, విచక్షణారహితంగా జంక్ లేదా నూనె పదార్థాలను తినడం వంటివి ఊబకాయానికి దారితీస్తాయి. చెమట, డిటాక్స్.. చెమట పట్టడం అనేది శరీరం  సహజ డిటాక్స్ ప్రక్రియ. ఎయిర్ కండిషన్డ్ గదులలో ఉండటం వల్ల చెమట తక్కువగా పడుతుంది, దీనివల్ల శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి, బరువు పెరగడం,  ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. మనస్సు, శరీరం.. చల్లటి గాలి మనసును మొద్దుబార్చి, ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని తగ్గిస్తుంది. ఇది ప్రేరణపై కూడా ప్రభావం చూపి, వ్యాయామం పట్ల ఇంటరెస్ట్ లేకుండా చేస్తుంది.  సోమరితనం పెంచుతుంది. ఇలా జాగ్రత్త పడాలి.. ప్రతి 45 నిమిషాలకు 5 నిమిషాల పాటు నడవాలి,  లేదా తేలికపాటి స్ట్రెచింగ్ చేయాలి. ఏసీ ఉష్ణోగ్రతను మరీ తక్కువగా ఉంచకూడదు, దానిని 24–26 డిగ్రీలకు పరిమితం చేయాలి. ఇంటి పనులతో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. తాజా పండ్లు, సలాడ్లు,  నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం కోసం కనీసం 30 నిమిషాలు కేటాయించాలి. విశ్రాంతి ముఖ్యం, కానీ విశ్రాంతి అలవాటు వల్ల వచ్చే ఊబకాయం జీవితాంతం ఉండే ఒత్తిడిగా మారే అవకాశం ఉంటుంది.                                   *రూపశ్రీ.
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి.  పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. అంటే.. బంగారం అంత మన్నికైనవని అర్థం.  చాలామంది చలికాలంలో పసుపు పాలు తాగుతారు.  అనారోగ్యాల నివారణకు పసుపు పాలు ప్రసిద్ధి చెందాయి. పసుపు పాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి,  వాపును తగ్గిస్తాయి,  నిద్రను ప్రోత్సహిస్తుంది. అయితే పసుపు పాలు తాగడం  అందరికీ సురక్షితం కాదని అంటున్నారు.  కొంతమందికి పసుపు పాలు తాగడం వల్ల నష్టాలు కూడా ఎదురవుతాయి.  ఇంతకీ పసుపు పాలు తాగడం వల్ల కలిగే నష్టాలేంటి?  పసుపు పాలు ఎవరు తాగకూడదు? తెలుసుకుంటే.. పసుపు పాలు ప్రయోజనాలు.. రోగనిరోధకశక్తి.. పసుపులో లభించే కర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్,  యాంటీ బాక్టీరియల్ పదార్థం. ఇది శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.   వాతావరణం మారినప్పుడు జలుబు, దగ్గు రాకుండా నివారించడంలో ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా  ఉంటుంది. జలుబు, దగ్గు.. పసుపు పాలు గొంతు నొప్పి, దగ్గు,  జలుబు నుండి ఉపశమనం కలిగిస్తాయి.  దీని వేడి చేసే గుణం శ్లేష్మాన్ని వదులు చేసి, గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. వాపులు.. పసుపులో ఉండే శోథ నిరోధక గుణాలు శరీరంలో వాపు, కీళ్ల నొప్పులు,  కండరాల బిగువును తగ్గించడంలో సహాయపడతాయి. గాయం లేదా వ్యాయామం తర్వాత పసుపు పాలు తీసుకోవడం వల్ల వేగంగా కోలుకుంటారు. పసుపు పాలు ఎవరు తాగకూడదు? జీర్ణసమస్యలు ఉన్నవారు.. తరచుగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం లేదా విరేచనాలతో బాధపడుతుంటే, పసుపు పాలు  సమస్యను మరింత పెంచే అవకాశం ఉంటుంది. పసుపు యొక్క వేడి స్వభావం,  పాల యొక్క బరువైన స్వభావం జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. రక్త సంబంధ వ్యాధుల మందులు.. పసుపు రక్తాన్ని పలుచగా చేయడానికి పనిచేస్తుంది.  ఇప్పటికే రక్తాన్ని పలుచబరిచే మందులు వాడుతున్నట్లయితే, పసుపు పాలు తాగడం వల్ల రక్తస్రావ ప్రమాదం పెరగవచ్చు. మధుమేహ రోగులు.. పసుపు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించగలదు.  మధుమేహం రోగులు ఇప్పటికే మందులు తీసుకుంటున్నట్లయితే, వాటి ప్రభావం అధికంగా ఉండి, చక్కెర స్థాయి చాలా తక్కువగా పడిపోవచ్చు. మూత్రపిండాలలో రాళ్లు ఉన్న రోగులు.. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే దీనిలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. గర్భిణీ స్త్రీలు.. గర్భధారణ సమయంలో పసుపును అధిక మోతాదులో తీసుకోవడం సురక్షితం కాదు.  దీనివల్ల హార్మోన్ల మార్పులు కలగవచ్చు, కాబట్టి డాక్టర్ సలహా లేకుండా గర్భిణి స్త్రీలు పసుపు పాలు తీసుకోకూడదు.                              *రూపశ్రీ.