LATEST NEWS
రాష్ట్రం ఏదైనా కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలూ, అసమ్మతి, అసంతృప్తి రాగాలూ సహజమే. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అయితే కాంగ్రెస్ సీఎంలు అసమ్మతి, అసంతృప్తి నేతలను నియంత్రించడంలో ఇబ్బందులు పడటం రివాజే అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ తీరు ఇదే.  కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్యమంత్రులు పార్టీ అంతర్గత వర్గపోరును అదుపు చేయడానికి నానా తంటాలు పడ్డారు. కొండొకచో  సీఎం పీఠం నుంచి తప్పుకోవలసిన పరిస్థితులూ ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ విభజించు పాలించు విధానాన్ని అనుసరించడమే ఇందుకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తుండటం కూడా కద్దు. అంటే పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.  దీనివల్ల ముఖ్యమంత్రి పరిధికి మించి కూడా చాలా మంది సీనియర్ నాయకులకు పార్టీ వ్యవహారాల్లో సమానమైన పట్టు లభిస్తుంది. అయితే.. దీనికి  తెలంగాణ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకింత మినహాయింపుగా కనిపిస్తున్నారు. ఆయన అసమ్మతీయులను, తన వ్యతిరేకులను సమర్ధంగా అదుపు చేయగలుగుతున్నారు.  గత కొన్ని నెలలుగా.. కొండా సురేఖ,  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి   సవాళ్లను ఎదుర్కొన్నారు. చిన్నారెడ్డి వంటి మరికొందరు నాయకులు కూడా అసమ్మతి గళం వినిపించారు. ఈ ముగ్గురి విషయంలో రేవంత్ వ్యూహాత్యకంగా వ్యవహరించారు.   ఢిల్లీలో పార్టీ పెద్దలను ఒప్పించి.. కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారు. ఇది అసమ్మతిని గళం ఎత్తుతున్న ఇతర నేతలు వెనక్కుతగ్గడానికి దోహదం చేసింది. అంతే కాకుండా ఒక్క కొండా సురేఖ బర్త్ రఫ్ తో హైకమాండ్ వద్ద తన మాటకే చెల్లుబాటు ఉందని పార్టీ నేతలకు, శ్రేణులకు రేవంత్ చాటారు.  దీంతో ఇప్పటి వరకూ సమయం, సందర్భంతో సంబంధం లేకుండా విమర్శల గళమెత్తి సీఎంను లక్ష్యం చేసుకుంటూ వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెనక్కు తగ్గారు. సీఎంతో విభేదాలు లేవని చాటుకోవడానికి శతధా ప్రయత్నించడం ఆరంభించారు. ఇందుకు తార్కానంగా తాజాగా ఒక బహిరంగ వేదికపై ఆయన రేవంత్ పక్కన కూర్చుని ఆయనతో ముచ్చటించి.. తాను రేవంత్ కు వ్యతిరేకంగా కాదని చాటుకున్నారు. కొండా సురేఖ ఎపిసోడ్ వరకూ రేవంత్ కు తాను బద్ధ వ్యతిరేకినన్నట్లుగా బిల్డప్ ఇచ్చిన కోమటి రెడ్డి ఇప్పుడు రేవంత్ తో సఖ్యత పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.  ఇదొక్కటే కాదు..కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన చెప్పిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ లో వాతావరణం రేవంత్ కు అనుకూలంగా మారిందన్న విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.   దీంతో ఇక అసమ్మతి రాగాల బెడద ఇప్పటిలో రేవంత్ కు ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక్క కొండా సురేఖ బర్త్ రఫ్ తో అటు పార్టీ, ఇటు ప్రభుత్వంపై రేవంత్ తన పట్టు చాటుకున్నారని అంటున్నారు.  [Revanth reddy Upper Hand In Congress Internal Rift, konda surekha, komatireddy rajagopal reddy, telangana congress, revanth effect, congress politics, Telugu One]
ఆంధ్రప్రదేశ్‌లో అధికారిక కూటమి రాజకీయాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రణాళికలపై బీజేపీ  సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి పలు  అంశాలపై స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు, పార్టీ విధానాలు, అలాగే ఇతర పార్టీలతో ఉన్న సంబంధాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు  రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.  రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ  కూటమి   సమష్టి కృషితో ముందుకు సాగుతోందని చెబుతూనే.. క్షేత్రస్థాయిలో విభేదాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టారు.  వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు.  త్వరలో జరగనున్న  స్థానిక ఎన్నికల నేపథ్యంలో సీట్ల కేటాయింపు, సర్దుబాటు అంశాలపై  మూడు పార్టీల అగ్రనేతల మధ్య చర్చలు జరుగుతున్నాయన్న విష్ణు వర్ధన్ రెడ్డి..   భాగస్వామ్య పార్టీలన్నీ సమన్వయ కమిటీల ద్వారా సమష్టి నిర్ణయాలు తీసుకుంటాయని వెల్లడించారు.   కూటమి ధర్మం ముందు వ్యక్తిగత అభిప్రాయాలకు అవకాశమే లేదన్న ఆయన మిత్రధర్మాన్ని కూటమి పార్టీలన్నీ పాటిస్తాయన్నారు.   ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.  గతంలో పార్లమెంటరీ వేదికలపై అంశాలవారీగా కొన్ని సందర్భాల్లో వైసీపీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపితే తెలిపి ఉండొచ్చు కానీ అంత మాత్రానికే ఆ పార్టీని బీజేపీ బీటీమ్ అనడం సరికాదని చెప్పారు.   త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు సమన్వయంతో పోటీ చేసి   విజయం సాధించాలని మూడు పార్టీల శ్రేణులు పట్టుదలతో ఉన్నాయన్న విష్ణువర్ధన్ రెడ్డి.. క్షేత్రస్థాయిలో ఉన్న స్వల్ప విభేదాలను పరిష్కరించుకుని ముందుకు సాగుతామని పునరుద్ఘాటించారు.   [Differences in Allience Dact, Vishnuvardhan Reddy, BJP AP Alliance, TDP Janasena BJP, AP Local Body Elections, Andhra Pradesh Politics]
ఆంధ్రప్రదేశ్‌లో  సాగునీటి రంగం చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల,  ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి రాష్ట్ర రాజకీయాల్లో  చర్చనీయాంశంగా మారింది. వైసీపీ  అధినేత జగన్ పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ ప్రాజెక్టులపై ఇటీవల చేసిన ట్వీట్లు, విమర్శలపై తెలుగుదేశం ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై  తెలుగుదేశం అధికార ప్రతినిథి, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.  గత వైసీపీ  ప్రభుత్వ హయాంలో పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని అప్పసాని రాజేష్ వివరించారు. కాలువ నిర్మాణంలో అత్యంత కీలకమైన సివిల్ వర్క్స్, అక్విడెక్ట్‌లు, కల్వర్టులు పూర్తి చేయడంలో గత పాలకులు విఫలమయ్యాయన్నారు. ఒకవేళ గత ఐదేళ్లలో లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి ఉంటే, నేడు పురుషోత్తపట్నం నుంచి నీటిని లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదని అయన చెప్పారు. ప్రస్తుతం ఎల్లినో పరిస్థితులు, వర్షాభావ వాతావరణం నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం వరద జలాలను సమర్థవంతంగా ఒడిసిపట్టి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల మెట్ట ప్రాంతాలకు నీరు అందిస్తోందన్నారు. దీనివల్ల లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి సమస్యలు కూడా తీరుతాయని పేర్కొన్నారు. గతంలో పట్టిసీమ ప్రాజెక్టును కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారని, కానీ ఆనాటి ఆ నిర్ణయమే నేడు కృష్ణా డెల్టాను కాపాడిందని గుర్తుచేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.  ఇక వైఎస్ హయాంలో జలయజ్ణం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా అప్పసారి రాజేష్ ఖండించారు. వైఎస్ హయాంలో కేవలం మట్టిపనులు పూర్తి చేసి డబ్బులు దండుకుని చేసింది జలయజ్ణం కాదు, ధనయజ్ణమని విమర్శించారు.  [Polavaram Left Canal, Veligonda, Polavaram Left Canal, Chandrababu Naidu Irrigation,  Jagan Credit Chori, Purushothapatnam lift irrigation, AP Politics News, Telugu One]
తెలుగువన్ ప్రత్యేకం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వరుసగా ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, నీటి విడుదల జరుగుతోంది. అంటే ఏ ప్రాంతానికి నీరు అందని పరిస్థితి ఉందో ఆ ప్రాంతానికి నీటిని అందించే కార్యక్రమం ఏపీలో మొదలవ్వడమే కాదు అది సాకారమయ్యే పరిస్థితి కూడా వచ్చేసింది. ఈ సందర్భంగా వైసీపీ ఆ క్రెడిట్ అంతా తమదేనని బాకాలూదుతోంది. క్రెడిట్ చోరీ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నా వైసీపీ వెనక్కు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రముఖ విశ్లేషకుడు విక్రమ్ పూల వాస్తవాలను కళ్లకు కట్టారు.  రాష్ట్రంలో ఇరిగేషన్ పురోగతి వైఎస్ జలయజ్ణంతో మొదలైందనీ, ఆయన తరువాత చేసింది తామేనని చెప్పుకుంటూ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్న విక్రమ్ పోలా అసలు జలయజ్ణం కథ ఇదీ అంటూ ఆయన..  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో  జలయజ్ఞం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి దశలో భారీ మరియు మధ్యతరహా ప్రాజెక్టులతో కూడిన సుమారు 26 ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. అయితే, ఆ సమయంలో రాష్ట్ర బడ్జెట్ పరిమితులకు మించి ప్రాజెక్టులు చేపట్టడం, భారీగా రుణాలు సేకరించడం జరిగిందని చెప్పారు.  ఈ ప్రాజెక్టుల అమలులో భాగంగా కాంట్రాక్టర్ల ఎంపికలో ఈపీఎస్  విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, పెద్దఎత్తున ప్రాజెక్టులు చేపట్టడం, అనుమతులు రాకముందే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడం వంటి పరిణామాలు వివాదాస్పదమన్నారు. జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.  ఇక రాష్ట్ర విభజన తర్వాత  నవ్యాంధ్రప్రదేశ్ తొలి సీఎంగా చంద్రబాబు పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత..  సాగునీటి రంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపట్టారు. ఆయన  హయాంలో నిధుల కేటాయింపు,  పట్టిసీమ వంటి అనుసంధాన ప్రాజెక్టుల పూర్తి ద్వారా  సాగు, తాగునీరు అందించడంలో పురోగతి సాధించింది.  ఏది ఏమైనా రాజకీయ శంకుస్థాపనలు కాదు.. వాటి ఫలితాలను ప్రజలకు ఎవరైతే అందించారో వారికే క్రెడిట్ దక్కుతుందని విక్రమ్ పూల అన్నారు. జగన్ చేస్తున్నది క్రెడిట్ చోరీ ప్రయత్నమే తప్ప చేసిందేమీ లేదని కుండబద్దలు కొట్టారు.   [What Happened Actually In Jalayagnam, YSR Irrigation Projects, AP Politics, Telugu One, Polavaram Project, Jagan Credit Chori]
తెలంగాణ కాంగ్రెస్ లో వరుసగా అనూమ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ కేబినెట్ నుంచి కొండా సురేఖకు ఉద్వాసన తరువాత పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు, నేతల మధ్య విభేదాలను పరిగణనలోనికి తీసుకుని పార్టీ హైకమాండ్ కీలక మార్పులకు తెరలేపింది.   తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించిన హైకమాండ్  తెలంగాణ పీసీసీ,  జిల్లా కేడర్ మధ్య మరింత బలమైన సమన్వయాన్ని తీసుకొచ్చేందుకు  చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రవ్యవహారాల ఇన్ చార్జిగా మీనాక్షి నటరాజన్ కు ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. ఆమె స్థానంలో  ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం, సీనియర్ నాయకుడు అయిన  భూపేష్ బగెల్‌ను నియమించనుందని తెలుస్తోంది.  ఇటీవలి కాలంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న  రాజకీయ పరిణామాలు  ప్రభుత్వానికీ పార్టీకి మధ్య సమన్వయం లోపం ఉందన్న విషయాన్ని తేటతెల్లం చేసిన నేపథ్యంలో  కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.   పార్టీలో ఎలాంటి అసంతృప్తి, అసమ్మతికి తావు లేకుండా  కఠినమైన, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనీ, అందుకు భూపేష్ బగెల్‌ సరైన వ్యక్తి అని అధిష్ఠానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.  ఇప్పటివరకు తెలంగాణ బాధ్యతలు నిర్వర్తించిన మీనాక్షీ నటరాజన్ ను తెలంగాణ రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించాలన్న నిర్ణయానికి పార్టీ హైకమాండ్ వచ్చిందని అంటున్నారు.  సంస్థాగతంగా పార్టీ  పటిష్ఠతకు ఢోకా లేకుండా  ఉండాలంటే  భూపేష్ బగెల్ వంటి  అగ్రనేత అవసరమని హైకమాండ్ భావిస్తోంది.   [Telangana Congress, Bhupesh Baghel, Meenakshi Natarajan, AICC In Charge, Rahul Gandhi, Congress Party, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టీజర్, ట్రైలర్  పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 10 ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు మాస్ మహారాజా రవితేజ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. అందరికీ గుడ్ ఈవెనింగ్. ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. రియల్ ఇన్సిడెంట్స్‌పై తీశారు. చాలా రూటెడ్‌గా ఉంది. తెలంగాణ మైసాపురం బ్యాక్‌గ్రౌండ్ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. డెఫినెట్‌గా జనాలకి బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను. ప్రశాంత్ విహారి పాటలు చాలా బాగున్నాయి. తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే డీఓపీ ప్రశాంత్ వర్క్ చాలా బాగుంది. ఈ సినిమా నిర్మాతలు మయూర్  కుశాల్‌కి మంచి సక్సెస్, మంచి పేరు, డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్లు మరిన్ని మంచి సినిమాలు తీయాలి. దీపా తెలుగు నేర్చుకుని చక్కగా మాట్లాడారు. వికాస్ అందులో చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. తనకి ఆల్ ది వెరీ బెస్ట్. నాగరాజుకి  ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ చాలా అద్భుతంగా డైరెక్షన్ చేశారు. ఇలాంటి సబ్జెక్టు ఎంచుకోవడం, అది మాధవ్‌తో చేయడం చాలా బాగుంది. తమ్ముడు మాధవ్ బాగున్నాడు.(నవ్వుతూ) తన ట్రాన్స్‌ఫర్మేషన్ అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. తనకి ఆల్ ది వెరీ బెస్ట్. సెప్టెంబర్ 10న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ ఈ సినిమా చూస్తారని, యంగ్ టాలెంట్‌ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. జై సినిమా.  హీరో మాధవ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. రవితేజ గారి అభిమానులందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి రవితేజ గారిని చూసే పెరిగాను. ఆయన నా ఫస్ట్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాకు పెదనాన్న కాదు, ఆయన నాకు ఒక అన్నయ్య. మీ అందరికీ ట్రైలర్, టీజర్ ఎంత బాగా నచ్చిందో సినిమా కూడా అంతే బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో మీ అందరికీ పరిచయం అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఇందులో ఒక మనిషికి దున్నపోతు ఉన్నా హ్యూమన్ ఎమోషన్ చూస్తారు. డైరెక్టర్ గారు అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు. అలాగే మా నిర్మాతలు మయూర్, కుశాల్ గారికి థాంక్యూ. ఈ సినిమాలో క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. దీప అద్భుతంగా నటించింది. వికాస్ విలన్ క్యారెక్టర్‌లో ఇరగదీశాడు. అలాగే ప్రశాంత్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సెప్టెంబర్ 10న థియేటర్స్‌లో కలుద్దాం. జై మారెమ్మ.  డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మాధవ్ రవితేజ గారిని అనుసరిస్తూ సినిమా ప్రయాణం మొదలుపెట్టారు. తొలి సినిమాతోనే చాలా రూటెడ్ కంటెంట్ తీసుకున్నారు. ఈ కంటెంట్ చూస్తుంటే నాకు ‘జల్లికట్టు’ సినిమా గుర్తొచ్చింది. చాలా నేచురల్‌గా ఈ కంటెంట్ ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.  హీరోయిన్ దీప బాలు మాట్లాడుతూ.. “మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన రవితేజ గారికి చాలా థాంక్యూ.ఈ అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మాధవ్ ఎంతో క్రమశిక్షణతో అద్భుతంగా ట్రాన్స్‌ఫర్మ్ అయ్యారు. తనకు చాలా పెద్ద విజయం రావాలని కోరుకుంటున్నాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది . యాక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. రవితేజ గారి సినిమాలో నేనింతే నాకు చాలా పర్సనల్‌గా కరెక్టే సినిమా. ఎందుకంటే నాకు కూడా సినిమా తప్పితే ఇంకేమీ తెలియదు. మాకు స్ఫూర్తినిచ్చిన రవితేజ గారికి థాంక్యూ. మాధవ్  అద్భుతంగా నటించాడు. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ సినిమా మనసుల్ని తాకుతుంది.  డైరెక్టర్ మంచాల నాగరాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 10న ‘మారెమ్మ’ జాతర మొదలు కాబోతుంది. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా గ్రామాల్లో ఉండే ప్రజలు చాలా బాగా కనెక్ట్ అవుతారు. 2006 టైమ్‌లైన్‌లో జరిగే స్టోరీ ఇది. అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ వేడుకకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన రవితేజ గారికి థాంక్యూ. ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సెప్టెంబర్ 10న థియేటర్స్‌లో కలుద్దాం.  నిర్మాత మయూర్ రెడ్డి మాట్లాడుతూ.. “రవితేజ గారికి వెల్‌కమ్. ‘ఇరుముడి’తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న రవితేజ గారికి కంగ్రాజులేషన్స్. దర్శకుడు ‘మారెమ్మ’ కథ చెప్పినప్పుడు మా ఊరి కథ అనిపించింది. మా ప్రొడక్షన్ టీమ్‌కి థాంక్యూ. అందరూ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ‘మారి’ పాత్రలో మాధవ్ గారు చాలా అద్భుతంగా నటించారు. సెప్టెంబర్ 10న రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్‌కి వచ్చి చూసి సినిమాని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నాకు చాలా నమ్మకం ఉంది”    మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో మంచి పాటలు రాసే అవకాశం కల్పించిన దర్శకుడికి, అలాగే మా నిర్మాతలకు ధన్యవాదాలు. మాధవ్ గారు ఈ సినిమాలో ‘మారి’ పాత్రలో అద్భుతంగా నటించారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది”  మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి మాట్లాడుతూ.. “ఈ సినిమాకి కావాల్సిన ఎనర్జీ మొత్తం అమ్మవారే ఇచ్చారు. మాధవ్ గారు తన తొలి చిత్రానికే ఎంతో అద్భుతమైన సినిమాతో రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల వద్దకు వెళుతుంది. అంత మంచి కంటెంట్. తప్పకుండా ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తారని నమ్ముతున్నాను”  డీవోపీ ప్రశాంత్ అంకిరెడ్డి మాట్లాడుతూ.. మా నిర్మాతలకు, దర్శకుడికి ధన్యవాదాలు. చాలా అద్భుతమైన ప్రాజెక్టులో ఎంచుకున్నారు. మాధవ్ గారి కటౌట్ స్క్రీన్ మీద అదిరిపోతుంది. మా కెమెరా డిపార్ట్‌మెంట్‌కి, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా చాలా ఆర్గానిక్‌గా ఉంటుంది. తప్పకుండా అందరూ థియేటర్‌లో చూడాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.
తమిళ్ హీరో సూరి, టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆసక్తికరమైన చిత్రం ‘ మండాడి ’. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. బోట్ రేసింగ్, యాక్షన్, ఎమోషన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ‘మండాడి’ ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందనే అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 10 న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా శివ నిర్వాణ స్పెషల్ గెస్ట్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా *హీరో సుహాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇక్కడి దాకా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు టీచర్స్ డే, నా టీచర్స్ అంతా నా ముందే ఉన్నారు. మీ అందరి సపోర్ట్ తో ఎన్నో ఫేజెస్ దాటుకుంటూ మందాడి వరకు వచ్చా. చిత్రయూనిట్ అందరి సపోర్ట్ వల్లనే సినిమా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాము. హీరోయిన్ మహిమ, రవీంద్ర విజయ్, సూరి నటన ఈ సినిమాకు మెయిన్ అసెట్స్. సెప్టెంబర్ 10 న ఓ వినూత్న కంటెంట్ థియేటర్స్ లో చూడటానికి సిద్ధంగా ఉండండి అన్నారు. యాక్టర్ సూరి మాట్లాడుతూ.. లవ్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ఈ సారికి వదిలేయండి, వచ్చే సారి ఖచ్చితంగా తెలుగులో మాట్లాడుతా. మండాడి సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. సుహాస్ తో కాళీ పని చేయడం చాలా సంతోషంగా అంది అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు. భాస్కర్ భట్ల మాట్లాడుతూ ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని కోరుకున్నారు. కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ ఈ సినిమాలో పాటలు రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాలో నాకు పాటలు రాసే ఛాన్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ గారికి స్పెషల్ థాంక్స్. ఏష నాగుల గట్ట మీద సాంగ్ బిగ్గెస్ట్ హిట్ చేసిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.   యాక్టర్ రవీంద్ర విజయ్ మాట్లాడుతూ.. ఇలాంటి ఒక సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరం చాలా కష్ట పడ్డాము. ఇలాంటి ఒక కథ ఆడియన్స్ కి ఒక కొత్త అనుభవం. ఇప్పటివరకు చూడని ఎన్నో సీన్స్ ఈ ఇంటెన్స్ స్పోర్ట్ యాక్షన్ డ్రామా చూసి ఉండరు. సముద్రంలో ఎంతో చాలెంజింగ్ గా ఈ సినిమా షూట్ చేశారు. ఈ సినిమా కోసం సూరి, సుహాస్ ఎంతో నిబద్దతతో పని చేశారు. ఇది ఎమోషనల్ ప్యాక్ యాక్షన్ డ్రామా. ఫ్యామిలీతో పాటు చూడాల్సిన సినిమా ఇది అన్నారు.  హీరోయిన్ మహిమా నంబియార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మందాడి నాకు చాలా స్పెషల్ సినిమా. ఈ సినిమా యూనిట్ మొత్తానికి స్పెషల్ థాంక్స్. హీరో సుహాస్ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. రవీంద్ర విజయ్ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. సూరి సార్ మీరు నాకు ఇన్స్పిరేషన్. ఈ సినిమా చూసి అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా అన్నారు.   డైరెక్టర్ మతిమారన్ పుగళేంది మాట్లాడుతూ.. ఈ సినిమా నిర్మాతలకు, నటీనటులకు అందరికీ థాంక్స్. సూరి, సుహాస్ లేకుండా అస్సలు ఈ సినిమానే లేదు. ఈ బోట్ రేస్ అనేది తమిళనాడు లో ట్రెండ్. ఈ సినిమా కోసం ఎంతో కంమిట్మెంట్ తో పని చేసి అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా రూపొందించాం. ఇది ప్రతి ఒక్క ప్రేక్షకుడికి గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని పంచుతుందని నమ్ముతున్నా అన్నారు.  ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్రొడ్యూసర్ ఎల్రెడ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. మైత్రి నిర్మాతలకు స్పెషల్ థాంక్స్. ఒకరోజు నవీన్ సార్ స్వయంగా కాల్ చేసి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్న చేస్తా అన్నారు. ఈ సినిమా కోసం చాలా డబ్బు వెచ్చించాము. మా సినిమా ఓటీటీ డీల్ లో నవీన్ గారి సహకారం గొప్పది అన్నారు. హీరో హీరోయిన్లతో పాటు నటీనటులు అంతా బాగా కష్టపడి ఈ సినిమాకు మంచి అవుట్ పుట్ తీసుకొచ్చారు అని తెలిపారు.   మైత్రి మూవీ మేకర్స్ నవీన్ మాట్లాడుతూ.. ఈ సినిమా భారీ హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నా. ఈ సినిమా కోసం అందరూ బాగా కష్టపడ్డారు.      హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. ఒక మూవీ పేరు వినగానే సినిమాకు వెళ్ళాలి అనిపించే సినిమా ఇది. సూరి, సుహాస్ నడుమ ఓ బ్యూటిఫుల్ వరల్డ్ క్రియేట్ చేశారు. సముద్రంలో సినిమా తీయడం అనేది పెద్ద ఛాలెంజ్. పడవ షాట్ తీయడంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. అలాంటిది సినిమా మొత్తం సముద్రంలో తీశారంటే రియల్లీ హ్యాట్సాఫ్ అన్నారు. మరో అతిధి,   డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి రావడం చాలా గర్వంగా ఉంది. సూరి గారు మీరు డౌన్ టు ఎర్త్. ఈ సినిమా తరిలేరు చూసి ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుండనై ఫిక్స్ అయ్యా. ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడి పనిచేశారు. థియేటర్స్ లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మందాడి సినిమాకు ఎన్నో అవార్డ్స్ వస్తాయని నమ్మనుతున్నా అన్నారు.
మలయాళ చిత్రసీమలో తనకంటూ సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో వెండితెరకు పరిచయమైన నటి విస్మయ మోహన్‌లాల్. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, తన తొలి చిత్రం 'తుడక్కం'లో డిఫరెంట్ యాక్షన్ అండ్ సర్వైవల్ రోల్‌తో అలరించారు. ఆగస్టులో థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ జుడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'తుడక్కం' మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేట్రికల్ రన్ విజయవంతంగా ముగించుకున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్ (JioHotstar) సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 18 నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాలో విస్మయ మోహన్‌లాల్ 'మీను' అనే ఒక మార్షల్ ఆర్ట్స్ శిక్షకురాలి పాత్రలో కనిపించారు. ఒక సైకో క్రిమినల్ వేధింపులకు గురైన తర్వాత ఒక సాధారణ యువతి తనలోని మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలతో ఎలా పోరాడింది అనే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. విస్మయ నటన, ప్రత్యేకించి రియలిస్టిక్ స్టంట్ సీన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. విస్మయకి జోడీగా విలన్ పాత్రలో నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ కుమారుడు ఆశిష్ జో ఆంటోనీ కూడా నటుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించడం విశేషం. కథలో అత్యంత కీలకమైన సమయంలో తన కుమార్తె పాత్రకు స్పూర్తినిచ్చే మార్షల్ ఆర్ట్స్ గురువుగా ఆయన కనిపించి అభిమానులను అలరించారు. సాయికుమార్, మనోజ్ కే జయన్, బాబీ కురియన్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. థియేటర్లలో గ్రాండ్ రన్ సాధించిన 'తుడక్కం' మూవీని మిస్ అయిన మూవీ లవర్స్, విస్మయ మోహన్‌లాల్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ చూడాలనుకునే వారు సెప్టెంబర్ 18 నుండి జియోహాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. మలయాళంతో పాటు మిగిలిన ప్రాంతీయ భాషల ఆడియెన్స్ నుండి కూడా ఈ ఓటీటీ రిలీజ్ పై మంచి స్పందన వస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు.     [Thudakkam OTT Release Date, Vismaya Mohanlal, Mohanlal Daughter Movie, JioHotstar OTT Release, Malayalam OTT Movies]
గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ల పాత్రల చిత్రీకరణపై మళ్లీ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సినిమాల్లో కథా అవసరం లేకుండా కేవలం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే మహిళా నటులను ప్రదర్శించడంపై యంగ్ అండ్ హాట్ బ్యూటీ కాయదు లోహర్ తాజాగా స్పందించారు. సినిమాల్లో ఉద్దేశపూర్వకంగా నటీమణులను గ్లామరస్ వస్తువులుగా చూపించడాన్ని తాను అస్సలు సమర్థించనని ఆమె ఖరాఖండిగా తెగేసి చెప్పారు. ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినిమాల్లోని కొన్ని దృశ్యాలపై ఎదురైన ప్రశ్నలకు కాయదు లోహర్ అత్యంత నిజాయితీగా సమాధానమిచ్చారు. “సినిమా కథకు, ఆ పాత్ర ప్రయాణానికి గ్లామర్ లేదా బోల్డ్ సీన్స్ అవసరమైతే నా పరిధి మేర ఓకే చెప్తాను. కానీ, కేవలం పబ్లిసిటీ కోసం, ఇన్స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ అవ్వడం కోసం మాత్రమే ఒక నటిని అభ్యంతరకర కోణంలో చూపించాలనుకుంటే అలాంటి ప్రాజెక్ట్‌లకు నేను ఎప్పటికీ 'యస్' చెప్పను” అని ఆమె స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమలో భావప్రకటనా స్వేచ్ఛ, పాత్రల రూపకల్పనపై నిర్మాతలు, దర్శకులతో మాట్లాడటం చాలా కష్టమైన విషయమని కాయదు అభిప్రాయపడ్డారు. సెట్స్‌పై ఇటువంటి అంశాల గురించి ప్రస్తావిస్తే 'ఇక్కడ అందరూ ఇలాగే చేస్తారు' అనే సమాధానం ఎదురవుతుంటుందని, అయితే ఒక నటిగా తన గళాన్ని వినిపించడం ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రేక్షకుల ఆలోచనా సరళి కూడా మారుతోందని, అనవసర గ్లామర్ సీన్లపై నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారని గుర్తుచేశారు. అస్సాంకు చెందిన ఈ భామ శ్రీవిష్ణు హీరోగా వచ్చిన 'అల్లూరి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ, ప్రదీప్ రంగనాథన్ సరసన చేసిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ ఘనవిజయంతో ఈ బ్యూటీకి ఊహించని పాపులారిటీ లభించింది. దాంతో దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ కథానాయికలలో ఒకరిగా మారిపోయారు. ప్రస్తుతం కాయదు లోహర్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్‌లు వరుసకట్టాయి. టాలీవుడ్‌లో నాని సరసన 'ది ప్యారడైజ్'తో పాటు తమిళ్, మలయాళ భాషల్లో 'తారం', 'మంజనాత్తి' వంటి భారీ చిత్రాల్లో ఈ భామ నటిస్తున్నారు. ఎల్లప్పుడూ కేవలం లుక్స్ కంటే కంటెంట్‌కే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేసిన కాయదు కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.     [Kayadu Lohar, Kayadu Lohar Interview, Objectification of Women in Cinema, Kayadu Lohar Movies, Telugu Cinema News]
తెలుగు సినీ వర్గాల్లో భావప్రకటనా స్వేచ్ఛ మరియు సెన్సార్ బోర్డు ఆంక్షల చుట్టూ మళ్లీ తీవ్రమైన చర్చ మొదలైంది. తాజాగా సీబీఎఫ్‌సీ (CBFC) అధికారుల తీరును తప్పుబడుతూ 'పీపుల్స్ స్టార్' ఆర్. నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. చలనచిత్ర పరిశ్రమను, దర్శకనిర్మాతలను అనవసరపు నిబంధనల పేరుతో వేధించడం సరికాదని ఆయన ఘాటుగా హెచ్చరించారు. యువ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న కొత్త చిత్రం 'కామ్రేడ్ కళ్యాణ్' టీజర్ లాంచ్ కార్యక్రమానికి ఆర్. నారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టైటిల్‌లో 'కామ్రేడ్' అనే పదాన్ని వాడటంపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందనే వార్తలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోట్ల రూపాయిల బడ్జెట్‌తో, వందలాది మంది కష్టంతో రూపుదిద్దుకునే కళారూపాన్ని ఇలా చిన్న విషయాలకే అడ్డుకోవడం శోచనీయమని అన్నారు. సామాజిక స్పృహతో ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులను 'కామ్రేడ్' అని పిలుస్తారని, అలాంటి పవిత్రమైన మాటపై సెన్సార్ సభ్యులు అభ్యంతరం చెప్పడం ఏమాత్రం సమంజసం కాదని నారాయణమూర్తి స్పష్టం చేశారు. ఒకవైపు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, ఓటీటీలలో ఎటువంటి నియంత్రణ లేకుండా అభ్యంతరకరమైన కంటెంట్ వస్తుంటే, కేవలం థియేటర్ సినిమాలపైనే కఠిన ఆంక్షలు విధించడం ఏ రకమైన న్యాయమని ఆయన ప్రశ్నించారు. సమాజానికి అద్దం పట్టే సినీ మాధ్యమానికి రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కళను, సినీ పరిశ్రమను బతకనివ్వాలని, అనవసరపు విధివిధానాలతో నిర్మాతల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయవద్దని వేడుకున్నారు. గతంలో కూడా అనేక విప్లవాత్మక, సామాజిక సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నారాయణమూర్తి, పరిశ్రమ తరఫున ఎల్లప్పుడూ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే 'పీపుల్స్ స్టార్' చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ విశ్లేషకులు, నెటిజన్లు కూడా ఆయన వ్యాఖ్యలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వివాదాల నడుమ రూపుదిద్దుకుంటున్న శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్' ప్రాజెక్ట్‌పై ఈ కామెంట్స్‌తో మరింత హైప్ నెలకొంది.       [R Narayana Murthy, Comrade Kalyan, Sree Vishnu, Censor Board Issue, Telugu Cinema New]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెగసీ’ విడుదల తేదీ ఖరారైంది. ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.  డిసెంబర్ 3న ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'ఫౌజీ' విడుదల కానుంది. ఆ భారీ సినిమా విడుదలవుతున్న మరుసటి రోజే 'లెగసీ' వస్తుందంటే రిస్క్ అనే చెప్పొచ్చు. కంటెంట్ మీద నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది ఆసక్తికరంగ్ మారింది.  సాయికిరణ్ రెడ్డి దైదా రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెగసీ’ చిత్రాన్ని కలాహి మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మాతలు. చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఓ స్ట్రైకింగ్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. విశ్వక్ సేన్, ఏక్తా రాథోడ్ కనిపిస్తున్న ఈ కొత్త పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో డిసెంబర్ 4న ‘లెగసీ’తో విశ్వక్ సేన్ ఎలాంటి పవర్‌ఫుల్ అనుభూతిని అందించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ‘పిండం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాయికిరణ్ రెడ్డి దైదా, ‘లెగసీ’తో తన రెండో ఫీచర్ ఫిల్మ్‌ను తెరకెక్కిస్తున్నారు. అలాగే ‘పిండం’ తర్వాత కలాహి మీడియా నిర్మిస్తున్న రెండో చిత్రం కూడా ఇదే కావడం విశేషం. పవర్‌ఫుల్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘లెగసీ’లో అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం వంటి అంశాల మధ్య జరిగే ఆసక్తికర సంఘర్షణను ఆవిష్కరించనున్నారు. తన తండ్రి వదిలిన వారసత్వం కారణంగా ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడి ప్రయాణంలో విశ్వక్ సేన్ పాత్ర సాగుతుంది.        [Vishwak Sen, Legacy Movie, Release Date, Prabhas, Fauzi Movie, Telugu Film News, Telugu News]  
Mass Ka Das Vishwak Sen’s upcoming intense political action drama ‘LEGACY’ has locked its worldwide theatrical release date. The film, directed by Saikiran Reddy Daida and produced under the Kalaahi Media banner, will release worldwide on December 4, 2026. The intense political action drama is being produced by Yeshwanth Daggumati and Saikiran Reddy Daida, with Sanjay Sambrani and V.V.N. Prasad as co-producers. The makers unveiled a striking new release-date poster featuring Vishwak Sen and Ekta Rathod, officially announcing December 4th as the date audiences can mark on their calendars. Written and directed by Saikiran Reddy Daida, LEGACY marks his second feature film after his directorial debut Pindam. The film also marks the second production venture from Kalaahi Media, following Pindam.  Set against a powerful political backdrop, LEGACY explores the collision of power, family, love and betrayal. Vishwak Sen plays a character who is drawn into a dangerous world shaped by his father’s legacy, while acclaimed Hindi actor Kay Kay Menon takes on a powerful antagonist role.  The film features a strong ensemble cast including Rao Ramesh, Sachin Khedekar, Murali Mohan, Ekta Rathod, Raja Ravindra, Rajeev Kanakala, Aneesh Kuruvilla, Khushee Ravi, Kalyani Natarajan, Ravi Kaale, Amit Tiwari and others.  The technical team includes Jiju Sunny as cinematographer, Govind Vasantha as music composer, Sirish Prasad as editor, Rajeev Nair as production designer and Jashuva as action choreographer. The final leg of shooting is currently underway   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
    కొంత కాలంగా హిట్ నే కేర్ ఆఫ్ అడ్రస్స్ గా మార్చుకున్న  శ్రీ విష్ణు ఇప్పుడు 'కామ్రేడ్ కళ్యాణ్' తో రాబోతున్నాడు.  జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కగా కొంత సేపటి టీజర్ విడుదలైంది. అలా రిలీజ్ అయ్యిందో లేదో టీజర్ ని చూస్తూ ఉండటం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల ఫ్యాషన్ అయిపోయింది. దీంతో ఆటో మాటిక్ గా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. టీజర్ చూస్తుంటే ఈ సారి కూడా ఎప్పటిలాగానే  వినూత్నమైన కథలతో ప్రేక్షకులను అలరించే శ్రీ విష్ణు,వస్తున్నట్లు అర్ధం అవుతుంది. 1992వ సంవత్సరం నాటి కాలఘట్టంలో, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా మాడుగుల అనే గ్రామం నేపథ్యంలో ఈ కథ రూపుదిద్దుకుంది. సరిగ్గా రేడియోలో నక్సలైట్‌ ముప్పు పెరుగుతోందని, ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని ఒక అనౌన్స్‌మెంట్ రావడంతో టీజర్ ఎంతో ఉత్కంఠభరితంగా ప్రారంభమవుతుంది. అత్యంత ప్రమాదకరమైన నక్సలైట్ లీడర్ 'కామ్రేడ్ కళ్యాణ్'ను ఎలాగైనా వేటాడి పట్టుకోవాలని గ్రేహౌండ్స్ బలగాలు మరియు ప్రత్యేక పోలీస్ బృందాలు ఆ గ్రామాన్ని చుట్టుముడతాయి. అక్కడ మొదలైన తీవ్రమైన వేట, ఊహించని మలుపులు, రోమాంచితమైన సీన్లు ప్రేక్షకులను క్షణం కూడా పక్కకు తప్పుకోకుండా టీజర్‌కు కట్టిపడేస్తాయి. అయితే, ఈ  క్రైమ్ అండ్ మ్యాన్‌హంట్ నేపథ్యానికి దర్శకుడు ఎంతో తెలివిగా కామెడీని జతచేశాడు. సీరియస్ పోరాటాలు, రాజకీయ ఉద్రిక్తతల నడుమ శ్రీ విష్ణు మార్క్ వినోదం, ఆయన టైమింగ్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇందులో శ్రీ విష్ణు ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) చేస్తున్నట్లు అందుతున్న సంకేతాలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయి.  తెలంగాణ మరియు ఆంధ్ర యాసలతో పలికించిన సంభాషణలు, డిఫరెంట్ లుక్స్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ప్రతి సన్నివేశంలోనూ హైలైట్‌గా నిలిచాయి. శ్రీ విష్ణు కామెడీ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయడం ఖాయమనిపిస్తోంది.   Also read: హనుమాన్ అంశ చిత్రానికి పన్ను మినహాయింపు: మన ముఖ్యమంత్రిపై ప్రశంసలు  సాంకేతిక పరంగా కూడా ఈ టీజర్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. 1990ల కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సాయి శ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా సహజంగా, రిచ్‌గా కనిపిస్తోంది. ఇక విజయ్ బుల్గానిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లోని యాక్షన్, వినోదాన్ని పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ టీజర్‌కు మంచి రేసింగ్ పేస్‌ను తెచ్చిపెట్టింది. అలాగే సినిమాలో రాధికా శరత్ కుమార్, అపేంద్ర లిమాయే, షైన్ టామ్ చాకో వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. మొత్తంగా చూస్తే, 'కామ్రేడ్ కళ్యాణ్' టీజర్ వింటేజ్ కలర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పక్కా యాక్షన్-కామెడీ రైడ్‌ను ప్రామిస్ చేస్తోంది. స్టార్ రైటర్ కోన వెంకట్ నిర్మాత.అక్టోబర్ 9 వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ . [Comrade Kalyan Teaser, Sree Vishnu, Kona venkat, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]
కంటెంట్ ని నమ్ముకొని మూవీ తెరకెక్కిస్తే 'కరోడ్ పతి' అవ్వడంతో పాటు కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోతారని నిరూపించిన మూవీ "హనుమాన్ అంశ'. ఎటువంటి భారీ అంచనాలు లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్, సెల్యులాయిడ్ వద్ద  సంచలనాలు సృష్టిస్తుంది. ఆధ్యాత్మిక సత్యంతో కూడిన పకడ్బందీ స్క్రిప్ట్   నిష్కల్మషమైన భక్తి ముందర కోట్లాది రూపాయల బడ్జెట్లు కూడా చిన్నబోతాయనే సత్యాన్ని కూడా బలంగా చాటి చెప్పిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ మూవీకి అనూహ్య గౌరవం దక్కింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ అద్భుత ఆధ్యాత్మిక కావ్యానికి రాష్ట్రవ్యాప్తంగా పన్ను మినహాయింపు (ట్యాక్స్ ఫ్రీ) ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.  డెహ్రాడూన్‌లోని ఒక ప్రముఖ సినిమా హాళ్లలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తన ధర్మపత్ని గీతా ధామీతో పాటు రాష్ట్ర మంత్రివర్గ సహచరులు గణేష్ జోషి, ప్రదీప్ బాత్రా మరియు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తిలకించారు. సినిమా చూసిన అనంతరం పరవశించిపోయిన ముఖ్యమంత్రి, బాబా నీమ్ కరోలీ మహారాజ్ జీ త్యాగం, సేవా నిరతి, హనుమంతుడిపై ఆయనకున్న అచంచలమైన భక్తి విశ్వాసాలని కళ్లకు కట్టినట్లు చూపించింది. భక్తి అంటే కేవలం ఆరాధన మాత్రమే కాదు, అదొక సేవ మరియు మానవాళి సంక్షేమానికి ఆత్మసమర్పణ అనే గొప్ప సందేశాన్ని ఈ సినిమా అందిస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దేవభూమి ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక వైభవాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని దేశ విదేశాలకు చాటిచెప్పడంలో 'హనుమాన్ అంశ' వంటి సినిమాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ధామీ ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులకు కైంచి ధామ్ ఒక పవిత్రమైన శ్రద్ధా కేంద్రంగా మారిన వేళ, ఈ నిర్ణయం భక్తులకు ఎంతో ప్రాధాన్యమైనదిగా నిలిచింది.     Also Read: వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలి: పూనమ్ పాండే సంచలన కామెంట్స్ విశాల్ చతుర్వేది దర్శకత్వంలో కేవలం 1.75 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయల అత్యంత స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కగా, ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైనప్పుడు ఎటువంటి ఆర్బాటాలు లేవు. తొలి రెండు వారాల్లో బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా సాగి  మౌత్ టాక్ ముందు ఎన్ని పబ్లిసిటీ జిమ్మికులైనా జూజిబీ అని నిరూపించింది. ఈ విషయం భారతీయ సినిమా పుట్టుక నుంచి నిరూపితమవుతూ వస్తుంది. అందుకే  100 కోట్లకి  చేరువలో ఉంది.     [Hanuman Ansh, Tax Free, Neem Karoli Baba Biopic, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]  
A Naxal story is usually expected to come with violence, ideology and political intensity. Comrade Kalyan appears to have other plans. The teaser takes a backdrop associated with serious conflict and gives it an unexpectedly irreverent spin, with Sree Vishnu playing a man who seems far more interested in his own agenda than revolutionary ideology. Set against a Naxal-dominated village on the Andhra-Odisha border, the teaser hints at a story involving an old theatre, a Naxal group and the kidnapping of one of its leaders. The reasons behind his actions are deliberately kept unclear, giving the film a mystery beyond its comedy. The biggest takeaway, however, is Sree Vishnu’s performance. He approaches the character with a straight face even when the situations around him become increasingly absurd. That deadpan delivery, combined with his one-liners, gives the teaser its distinctive flavour. Shine Tom Chacko appears to be on the opposite side of the conflict, with their cat-and-mouse dynamic providing several comic moments. Radhikaa Sarathkumar, Satya and Sudharshan also contribute to the humour, while Mahima Nambiar appears as the female lead. The teaser also benefits from Vijai Bulganin’s background score, which matches the film’s quirky tone. Directed by Janikram Marella, Comrade Kalyan is scheduled to release on October 9. https://www.youtube.com/embed/Tr-4d0FYNB8?si=UFeFpVSpwNCGHAw8   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.     
సమాజంలో అత్యంత పవిత్రమైన, బాధ్యతాయుతమైన పాత్ర గురువుది. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి, జ్ఞానమనే వెలుగును నింపే మహోన్నత మూర్తి ఉపాధ్యాయుడు. తల్లిదండ్రులు జన్మనిస్తే, ఆ జన్మకు ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ప్రసాదించే శక్తి గురువుకు మాత్రమే ఉంది. కేవలం పుస్తకాల్లోని పాఠాలను మాత్రమే కాకుండా, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొవాలో నేర్పించే మార్గదర్శి ఉపాధ్యాయుడు. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ, మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ వేసుకోవాల్సిన ఆత్మపరిశీలన ప్రశ్న..  జ్ఞానం నేర్పే గురువుకు మనం నిజంగా ఏమిస్తున్నాం? అని. టీచర్స్ డే అంటే కేవలం గురువుకు శుభాక్షంకలు చెప్పడం, చిన్న బహుమతులు ఇవ్వడం కాదు.. టీచర్స్ డే రోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన విషయాలు ఉన్నాయి. గురువుల నుండి జ్ఞానం పొందిన ప్రతి విద్యార్థి.. ఎంత వయసు అయిన  వారైనా సరే.. కొన్ని విషయాలు తెలుసుకోవాలి..   మనోభావాల రూపంలో ప్రతిఫలం.. ఒకప్పుడు గురుకులాశ్రమాల్లో విద్య పూర్తయిన తర్వాత శిష్యులు తమ శక్తిమేరకు గురుదక్షిణ సమర్పించుకునేవారు. గురువులు కూడా ఏనాడూ ధనాన్ని ఆశించకుండా సన్మార్గంలో నడిచే ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడమే ధ్యేయంగా జీవించారు. మరి నేటి ఆధునిక కాలంలో మనం గురువులకు ఇస్తున్న ప్రతిఫలం ఏమిటి? కాలం మారే కొద్ది  విద్య వ్యాపారంగా మారిపోయిన నేటి సమాజంలో ఉపాధ్యాయుడి స్థానం, వారికి లభిస్తున్న గౌరవం ఎటువైపు పయనిస్తున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎదిగినా ఒదిగి ఉండటం లేదు.. చాలామంది విద్యాభ్యాసం పూర్తయి, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత తాము చదువుకున్న పాఠశాలలను, మార్గదర్శకత్వం వహించిన గురువులను మరిచిపోతున్నారు. కార్పొరేట్ విద్యావ్యవస్థలో ఉపాధ్యాయులను కేవలం జీతం తీసుకునే ఉద్యోగులుగా మాత్రమే చూసే ధోరణి పెరుగుతోంది. తల్లిదండ్రులు కూడా ఫీజులు చెల్లిస్తున్నాం కదా అనే భావనతో ఉపాధ్యాయుల శ్రమను, వారి ఆవేదనను గుర్తించలేకపోతున్నారు. తరగతి గదిలో విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం తపించే ఉపాధ్యాయుడికి మనం తిరిగి ఇస్తున్నది కేవలం కొన్ని పూలమాలలు, షాళ్ళు లేదా ఒక రోజు ఇచ్చే తాత్కాలిక గౌరవం మాత్రమేనా? గురువు ఆశించే అసలైన గురుదక్షి.. ఒక గురువు తన శిష్యుడి నుంచి గిఫ్ట్ లు , ధనాన్ని ఏనాడూ ఆశించడు. ఒక ఉపాధ్యాయుడికి లభించే అతిపెద్ద బహుమతి తన విద్యార్థి ఉన్నత స్థానంలో నిలబడటమే. మనం గురువుకు ఇవ్వాల్సిన మొదటిది గౌరవం. ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా, ఎంతటి సంపదను ఆర్జించినా, తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయుడిని చూసినప్పుడు వినయంతో నమస్కరించడం, వారి సేవలను గుర్తుంచుకోవడం నిజమైన గౌరవం. గుర్తింపు... తరగతి గదిలో విద్యార్థి క్రమశిక్షణతో ఉంటూ, గురువు నేర్పిన విలువలను జీవితంలో పాటించినప్పుడు ఆ ఉపాధ్యాయుడి శ్రమకు సార్థకత లభిస్తుంది. సమాజంలో మంచి పౌరుడిగా ఎదిగి, పదిమందికి ఉపయోగపడే పనులు చేసినప్పుడు ఫలానా ఉపాధ్యాయుడి శిష్యుడు..  అని సమాజం మెచ్చుకుంటే, ఆ మాట గురువుకు ఇచ్చే అతిపెద్ద ఆనందం. కృతజ్ఞతా భావం.. కాలం మారినా, ఏళ్లు గడిచినా తమ జీవితాన్ని తీర్చిదిద్దిన గురువులను తరచూ గుర్తుచేసుకోవడం, వీలైతే వారిని కలసి పలకరించడం ఉపాధ్యాయులకు ఎంతో మానసిక తృప్తినిస్తుంది. మార్పు అవసరం.. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనం కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, గురువుల పట్ల మనకున్న దృక్పథాన్ని మార్చుకోవాలి. ఉపాధ్యాయులను కేవలం సమాచారం అందించే యంత్రాలుగా చూడకుండా, ఒక తరాన్ని నిర్మించే శిల్పులుగా గుర్తించాలి. పాఠశాలల్లో , సమాజంలో వారికి తగిన గౌరవాన్ని, భద్రతను, అనుకూల వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత. గురువు ఇచ్చిన జ్ఞానం అమూల్యమైనది. దానికి ఏ భౌతిక వస్తువూ సాటి రాదు. మనం గురువుకు తిరిగి ఇవ్వగలిగింది కేవలం హృదయపూర్వక గౌరవం, కృతజ్ఞత, వారు చూపిన సన్మార్గంలో నడవడం మాత్రమే. ఉపాధ్యాయులు నేర్పిన సద్గుణాలను, విలువలను మన జీవితంలో ఆచరిస్తూ, సమాజ శ్రేయస్సుకు తోడ్పడటమే మనం గురువులకు సమర్పించగల నిజమైన గురుదక్షిణ.                         *రూపశ్రీ.
మనలో చాలామంది నిద్ర తక్కువైతే ఆరోగ్యానికి హానికరం అని భావిస్తుంటారు. రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రపోకపోతే మరుసటి రోజు అలసటగా అనిపించడం, పనిపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయని మనందరికీ తెలిసిందే. కానీ, ప్రతిరోజూ 8 నుంచి 10 గంటలకు మించి ఎక్కువసేపు నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి మేలు చేయకపోగా, అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సూచికగా మారుతుందని మీకు తెలుసా? ఇటీవల దాదాపు 5 లక్షల మంది వ్యక్తుల సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన ఒక కీలక పరిశోధనలో నిద్ర వ్యవధికి, మానవ ఆరోగ్యానికి ఉన్న అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధన అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ రాత్రి సమయంలో సుమారు 6.4 గంటల నుండి 7.8 గంటల మధ్య సరైన రీతిలో నిద్రపోయే వారిలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి సంబంధించిన సంకేతాలు, లక్షణాలు ఎక్కువగా కనిపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, దీని అర్థం ప్రతి ఒక్కరూ కచ్చితంగా 7 గంటలే నిద్రపోవాలని కాదు. ఒక వ్యక్తికి అవసరమయ్యే నిద్ర సమయం అనేది వారి వయసు, జన్యుపరమైన అంశాలు, అనుసరించే జీవనశైలి, చేసే శారీరక శ్రమ మరియు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కేవలం నిద్రపోయే గంటల సంఖ్యను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని నిద్ర సరిపోతుందో లేదో నిర్ణయించలేము. అయితే రోజువారీగా అతిగా నిద్రపోవడం అనేది మీ శరీరంలో లేదా మానసిక స్థితిలో ఏవైనా అంతర్గత సమస్యలు ఉన్నాయనడానికి ఒక స్పష్టమైన హెచ్చరిక కావచ్చు. డిప్రెషన్, స్లీప్ అప్నియా, శరీరంలో దీర్ఘకాలికంగా ఉండే వాపులు వంటి ప్రమాదకర పరిస్థితులతో అతి నిద్రకు ప్రత్యక్ష సంబంధం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా, అల్జీమర్స్ లేదా పార్కిన్సన్స్ వంటి న్యూరోడిజెనరేటివ్ వ్యాధులు, ఇతర తీవ్రమైన అనారోగ్యాలు కూడా ఒక వ్యక్తిలో నిద్రపోవాల్సిన వ్యవధిని అసాధారణంగా పెంచుతాయి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎక్కువసేపు నిద్రపోవడం వల్లనే ఈ వ్యాధులు వస్తున్నాయని పరిశోధన చెప్పడం లేదు; ఇప్పటికే శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యల కారణంగానే వ్యక్తి ఎక్కువగా నిద్రపోయే అవకాశం ఉంటుంది.       oversleeping health risks telugu guide,healthy sleep duration research details.
చిన్న పిల్లలు ఏది తింటే ఆరోగ్యంగా ఉంటారు, ఏది తింటే అనారోగ్యం పాలవుతారు అనే విషయంలో ప్రతి తల్లిదండ్రులూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా బిడ్డ పుట్టిన తర్వాత వారికి ఇచ్చే ఆహారంలో చక్కెర, తీపి పదార్థాలు, ప్రాసెస్ చేసిన స్వీట్లు ఎంతవరకు సురక్షితం అనే చర్చ చాలాకాలంగా నడుస్తోంది. చిన్నతనంలోనే పిల్లలకు విపరీతంగా తీపి అలవాటు చేయడం వల్ల వారి భవిష్యత్తు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల వెలువడిన ఒక సంచలనాత్మక పరిశోధన ఈ అంశంపై మరింత స్పష్టతనిచ్చింది. జీవిత ప్రారంభ దశలో, ముఖ్యంగా రెండేళ్ల వయసు లోపు పిల్లలకు చక్కెర వినియోగాన్ని తగ్గించడం వల్ల వారు పెద్దయిన తర్వాత తీవ్రమైన క్యాన్సర్ వ్యాధుల బారిన పడే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ ఆసక్తికరమైన అంశాన్ని పరిశోధించడానికి శాస్త్రవేత్తలు బ్రిటన్‌లో 1953 నాటి చారిత్రక పరిణామాలను నిశితంగా పరిశీలించారు. ఆ కాలంలో రేషనింగ్ వ్యవస్థ కారణంగా బ్రిటన్‌లో చక్కెర అందుబాటుపై కఠినమైన నియంత్రణలు ఉండేవి. దీనివల్ల ఆ సమయంలో పుట్టిన పిల్లలకు చిన్నతనంలో చాలా తక్కువ మొత్తంలో చక్కెర లభించింది. ఈ పరిస్థితులను ప్రామాణికంగా తీసుకుని, పరిశోధకులు ఏకంగా 64,000 మందికి పైగా వ్యక్తుల దశాబ్దాల కాలపు ఆరోగ్య సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించారు. చిన్నతనంలో తక్కువ చక్కెర తిని పెరిగిన వారి ఆరోగ్య ఫలితాలను, సాధారణంగా చక్కెర తిన్నవారితో పోల్చి చూసినప్పుడు దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నతనంలో పంచదార వినియోగాన్ని పరిమితంగా ఉంచిన వారిలో, దశాబ్దాల తర్వాత కొన్ని రకాల ప్రాణాంతక క్యాన్సర్లు వచ్చే ప్రమాదం సుమారు 36 శాతం నుండి 69 శాతం వరకు తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా కాలేయ క్యాన్సర్ విషయంలో ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా మరియు ఎక్కువగా కనిపించింది. దీనితో పాటు రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు కూడా వారిలో గణనీయంగా తగ్గినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చిన్న వయసులో చక్కెర పరిమితి వల్ల శరీరంలో కలిగే మార్పులు దీర్ఘకాలికంగా రక్షణ కవచంలా పనిచేస్తాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.         kids sugar restriction health benefits,childhood sugar intake cancer study.
50 తర్వాత వృద్ధాప్యం ఎందుకు వేగంగా కనిపిస్తుంది? 30 నుంచి 50 ఏళ్ల మధ్య శరీరంలో, చర్మంలో జరిగే మార్పులకు అసలు కారణాలు ఏమిటి? కొల్లాజెన్, Vitamin D లోపం వృద్ధాప్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇవి ఆహారం ద్వారా మాత్రమే అందుకోవచ్చా? లేక supplements అవసరమా? ప్రముఖ బ్యూటీ ఎక్స్‌పర్ట్, Celebrity Medical Aesthetic Specialist డాక్టర్ శ్రీ సత్య జగదీష్ ఈ వీడియోలో వయసు పెరిగే కొద్దీ శరీరంలో వచ్చే ముఖ్యమైన మార్పుల గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా Hormonal Imbalance, Collagen తగ్గడం, Vitamin D, Zinc, Omega nutrients వంటి అంశాలు ఆరోగ్యం, చర్మం మరియు వృద్ధాప్య ప్రక్రియపై ఎలా ప్రభావం చూపుతాయో సులభంగా తెలియజేస్తున్నారు. 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఆరోగ్యం, చర్మ సౌందర్యం, పోషకాహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొల్లాజెన్, Vitamin D వంటి పోషకాలు ఆహారం నుంచే సరిపోతాయా? Supplements ఎప్పుడు అవసరం కావచ్చు? ఈ ప్రశ్నలకు డాక్టర్ చెప్పిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి. వయసు పెరగడం సహజమే అయినా, సరైన ఆహారం, పోషకాలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితో శరీరంలో వచ్చే మార్పులను సమర్థంగా నిర్వహించుకోవచ్చు. పూర్తి వివరాల కోసం వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
వెన్నునొప్పి తర్వాత మానవులలో అత్యంత సాధారణంగా కనిపించే సమస్య మోకాళ్ల నొప్పులు. వయస్సు పైబడటం వల్ల లేదా మోకాలిలోని కార్టిలేజ్ , సాఫ్ట్ టిష్యూలకు గాయాలవడం వల్ల ఈ నొప్పి ఏ వయస్సు వారికైనా రావచ్చు. దీర్ఘకాలం పాటు వేధించే ఈ మోకాళ్ల నొప్పి మనుషులను శారీరకంగా, ఆర్థికంగా , మానసికంగా ఎంతో కుంగదీస్తుంది. అయితే ఈ నొప్పి రాగానే నేరుగా సర్జరీ అవసరం పడుతుందని భయపడాల్సిన పనిలేదు. శస్త్రచికిత్స కంటే ముందే అసలు ఈ మోకాళ్ల నొప్పి ఏ కారణం వల్ల వస్తుందో మరియు దానిని ఎలా అధిగమించవచ్చో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వీటి గురించి వివరంగా తెలుసుకుంటే.. మోకాళ్ల నొప్పికి ప్రధాన కారణాలు, వాటి లక్షణాలు.. సాధారణంగా 55 నుండి 60 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో మోకాళ్ల నొప్పి రావడానికి ఆస్టియోఆర్థరైటిస్ ప్రధాన కారణం. ఇందులో మోకాలి జోళ్లలోని కార్టిలేజ్ అరిగిపోయి, బరువును మోసే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల మోకాళ్లలో వాపు, తీవ్రమైన నొప్పి ఏర్పడి రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఈ రకమైన నొప్పి మోకాలి కింద లేదా ఇరువైపులా రావచ్చు. ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నవారికి ఉదయం పూట మోకాళ్లు బిగుసుకుపోయినట్లు అనిపిస్తాయి. మరొకవైపు, శారీరక శ్రమ మరియు వ్యాయామం ఎక్కువగా చేసే యువత లేదా క్రీడాకారులలో మోకాళ్ల నొప్పి గాయాల వల్ల వస్తుంది. ఎక్కువగా రన్నింగ్ లేదా వర్కౌట్లు చేయడం వల్ల ఐటీ బ్యాండ్ సిండ్రోమ్ రావచ్చు.  తొడ కండరాలు బలహీనంగా ఉండటం, మోకాలి నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్ల పాటెల్లోఫెమోరల్ పెయిన్ సిండ్రోమ్ లేదా రన్నర్స్ నీ అనే సమస్య వస్తుంది. దీనివల్ల మోకాలిచిప్ప కింద నొప్పి అనిపిస్తుంది. మోకాళ్ల నొప్పులు హఠాత్తుగా ఎందుకు వస్తాయి? కొన్నిసార్లు మోకాళ్ల నొప్పి కింద పడటం, ప్రమాదాలు జరగడం, ఆటలు ఆడేటప్పుడు లేదా వంగి పనులు చేసేటప్పుడు అకస్మాత్తుగా రావచ్చు.  మోకాలికి అయ్యే గాయాల్లో మెనిస్కస్ చిరగడం చాలా సాధారణం. ఇది మోకాలిని స్థిరంగా ఉంచే ఒక అర్ధచంద్రాకార కార్టిలేజ్. కాళ్లు అనుకోకుండా మెలిక తిరిగినప్పుడు ఇది చిరిగిపోయి తీవ్రమైన నొప్పి, వాపుకు కారణమవుతుంది. మోకాలిని అనుసంధానించే లిగమెంట్లు అతిగా సాగడం లేదా చిరగడం వల్ల కూడా నొప్పి వస్తుంది. ప్రత్యేకించి ఎమ్‌సిఎల్ , ఏసిఎల్ అనే లిగమెంట్లు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థరైటిస్ నొప్పి నివారణ , సంరక్షణ మార్గాలు.. నొప్పి నెమ్మదిగా ప్రారంభమై పెరుగుతున్నట్లయితే ఫిజియోథెరపిస్ట్ లేదా వైద్యుడిని సంప్రదించాలి. నడక తీరులో లోపాలు, నడుము భాగం బలహీనంగా ఉండటం వల్ల కూడా మోకాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది. ఇది నొప్పి నివారణ మందుల కంటే బాగా పనిచేస్తుంది. నొప్పి ఎక్కువగా ఉన్నవారు సైక్లింగ్, ఈత కొట్టడం లేదా ఎలిప్టికల్ మెషిన్ వాడటం వంటి తక్కువ ఒత్తిడి ఇచ్చే వ్యాయామాలు చేయాలి. మంచి సపోర్ట్ ఇచ్చే బూట్లు ధరించడం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది. వైద్య చికిత్సలు , జాగ్రత్తలు.. జీవనశైలి మార్పులు , సాధారణ మందులతో ఉపశమనం లభించనప్పుడు వైద్యులు స్టెరాయిడ్ ఇంజెక్షన్లను సూచిస్తారు. అయితే వీటిని పదే పదే వాడకూడదు. ప్రారంభ దశలోని ఆస్టియోఆర్థరైటిస్ రోగులకు హైలురోనిక్ యాసిడ్ లేదా ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్లు కొంతవరకు సహాయపడవచ్చు. ఏ చికిత్స పనిచేయనప్పుడు చివరి ఛాయిస్ గా మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు ఎంచుకుంటారు. మోకాళ్ల గాయాల నివారణకు ప్రథమ చికిత్స .. వ్యాయామం లేదా పనులు చేసేటప్పుడు గాయం వల్ల నొప్పి వస్తే ఆ పనిని వెంటనే ఆపేయాలి. మోకాలి చుట్టూ మంచు గడ్డలతో ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల వాపు, నొప్పి తగ్గుతాయి. మెనిస్కస్ లేదా ఏసిఎల్ చిరిగిన సందర్భాలలో వైద్యుడి సలహా మేరకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. మోకాలు పట్టు కోల్పోయినట్లు అనిపించినా, నిలబడటం లేదా మెట్లు ఎక్కడం కష్టంగా మారినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచుకునే మార్గాలు.. వయస్సు లేదా జన్యుపరమైన అంశాలను మార్చలేము కానీ శరీర బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా మోకాళ్లపై పడే భార తీవ్రతను తగ్గించవచ్చు. వ్యాయామం చేయడం వల్ల మోకాళ్లు పాడవుతాయనేది అపోహ మాత్రమే. శారీరక శ్రమ లేకపోతే కండరాలు బలహీనపడి ఆస్టియోఆర్థరైటిస్ ప్రమాదం మరింత పెరుగుతుంది. సరైన పౌష్టికాహారం తీసుకోవడం, కండరాలను బలంగా ఉంచుకోవడం , తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మోకాళ్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవడం  సాధ్యమవుతుంది.                *రూపశ్రీ.
బరువు తగ్గాలని అన్నం మానేశారు… అయినా బరువు తగ్గడం లేదా? రోజూ డైట్ చేసినా వెయిట్ పెరుగుతుందా? అయితే మీ బరువు పెరగడానికి కేవలం ఎక్కువగా తినడమే కారణమా? లేక థైరాయిడ్, PCOS, హార్మోన్ల మార్పులు, ఇన్ఫ్లమేషన్ వంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయా? 100 కిలోల బరువు ఉన్నవారు ఒక్క నెలలోనే మొత్తం బరువు తగ్గడం సాధ్యమేనా? కొబ్బరి నూనె తాగడం, ఫ్యాట్ బర్నర్ ట్యాబ్లెట్లు వాడటం నిజంగా ఉపయోగపడతాయా? Mounjaro, Ozempic వంటి బరువు తగ్గించే ఇంజెక్షన్లు ఎంతవరకు సురక్షితం? Bariatric Surgery చేయించుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రవి కుమార్ చింత ఊబకాయం (Obesity) గురించి ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. బరువు పెరగడానికి అసలు కారణాలు ఏమిటి? ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే ఏం చేయాలి? డైట్ విషయంలో ఎలాంటి అపోహలకు దూరంగా ఉండాలి? వంటి విషయాలను తెలుసుకోవచ్చు. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? థైరాయిడ్ లేదా PCOS వల్ల బరువు పెరుగుతోందని అనుమానం ఉందా? అయితే ఈ వీడియో మీకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తుంది. గమనిక: ఈ వీడియోలోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా చికిత్స లేదా బరువు తగ్గించే విధానాన్ని ఎంచుకునే ముందు వైద్యులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)