LATEST NEWS
తెలంగాణ రాజయాలలో పెను సంచలనంగా మారిన కొండా సురేఖ ఎపిసోడ్ లో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంటోందా? కేబినెట్ నుంచి కొండా సురేఖకు ఉద్వాసన పలికిన తరువాత.. ఆమె పార్టీకి రాజీనామా చేయకపోవడానికి హస్తిన స్థాయిలో ఆమెకు దక్కిన హామీలే కారణమా? ఆమె విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సాఫ్ట్ కార్నర్ తో ఉందా? అంటే తాజాగా జరుగుతన్న ప్రచారాన్ని బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె హైకమాండ్ పిలుపు మేరకుఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.  గతంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అలాగే సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖకు ఏర్పడిన విభేదాల కారణంగా.. క్రమశిక్షణ చర్య అంటూ ఆమెకు రేవంత్ కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. సాధారణంగా కాంగ్రెస్ రాజకీయాలలో ఇటువంటి కఠిన చర్య చాలా అరుదు. దీంతో కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడం పార్టీ వర్గాలలో సంచలనంగా మారింది.   అయితే,   సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలిగా  కొండా సురేఖను పూర్తిగా దూరం పెట్టడం మంచిది కాదని భావించిన హైకమాండ్.. కేబినెట్ మంత్రిగా ఉద్వాసనకు గురైన ఆమెకు మరో కీలక పదవిని అప్పగించడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలగకుండా ఆమె సేవలను పార్టీకి అందేలా చేయాలని నిర్ణయించిందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొండా సురేఖకు ఆర్టీసీ చైర్మన్ పదవిని ఆఫర్ చేసే     అవకాశం ఉందని తెలుస్తోంది ఆర్టీసీ చైర్మన్ పదవికి   కేబినెట్ హోదా  ఉండటంతో ఆమె గౌరవానికి తగిన పదవి అవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.   కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైనప్పటికీ..  కొండా సురేఖ   పార్టీ నాయకత్వంపై  దుందుడుకుగా ఎటువంటి విమర్శలు, వ్యాఖ్యలూ చేయలేదు. ఆమె సహజ వైఖరికి ఇది పూర్తి విరుద్ధం.  రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తన అంతిమ లక్ష్యమని కస్పష్టం చేసిన సురేఖ.. తనకు అవమానం జరిగినా..  తాను కాంగ్రెస్ ను వీడే ప్రశక్తే లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.   కేవలం తన పదవి కోల్పోవడం పట్ల కాకుండా, సరైన కారణం లేకుండా తనను తప్పించారనే చిన్న అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్న కొండా సురేఖ.. ఆ అసంతృప్తి వినా.. పార్టీని వీడాలన్న యోచన తనలో ఇసుమంతైనా లేదని స్పష్టం చేశారు. ఆమెఅనుసరించిన ఈ వైఖరే కొండా పట్ల హైమాండ్ లో సాఫ్ట్ కార్నర్ ఏర్పడటానికి కరాణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    [Konda Surekha, Telangana Congress Politics, Cabinet Rank Post,  RTC Chairman, Revanth Reddy, Telugu One]
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..! తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త చర్చనీయాంశంగా మారిన పరిణామంలో, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సంచలన సవాల్ విసిరారు. మాక్ అసెంబ్లీలు పెట్టి బీసీ నేతకు ముఖ్యమంత్రి స్థానం కల్పించడం కేవలం డ్రామాలని, నిజంగా దమ్ముంటే బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.  ఎలాగో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభకు రారూ కదా, మరి బీసీలు  ఎస్సీలపై ఈ కపట ప్రేమ ఎందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్ తన స్థానంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రతిపక్ష నేత బాధ్యతలు అప్పగిస్తే, ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం మాయమాటలు చెబుతూ దళితులు, బీసీలను మోసం చేయడం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు ఏమాత్రం లేదని మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా ఆరోపించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పుగా మలిచారని, మూడెకరాల భూమి పంపిణీ గానీ, ప్రతిష్టాత్మకమైన దళిత బంధు పథకం అమలును గానీ పూర్తిగా విస్మరించారని గుర్తుచేశారు. కేవలం ఎన్నికల సమయంలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం సరికాదని, ఆయన ఆశయాలను, సూచనలను నిజ జీవితంలో పాటించాలని హితవు పలికారు.  నాటి TRS 2003 డాక్యుమెంట్‌ను కూడా సరిగా పట్టించుకోని చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని విమర్శించారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తామనడం సరికాదని, ముందుగా తమ బుర్రలోని పాత, కుహనా ఆలోచనలను శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చురకలంటించారు. కాలం మారిపోయిందని, నేడు దళితులు నగరాలకు వచ్చి ఉన్నత స్థాయికి చేరుకున్నారని, కాలం చెల్లిన దొరలను ప్రజలు ఫామ్ హౌస్‌లకు పరిమితం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి దళితులకు, వెనుకబడిన వర్గాలకు తీవ్రమైన అవమానాలు జరిగినా కేసీఆర్ నుంచి ఎన్నడూ సరైన స్పందన రాలేదని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను చూసి 'అధ్యక్షా' అనాల్సి వస్తుందనే భయంతోనే కేసీఆర్ సభకు రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎలాంటి స్పష్టమైన విజన్ లేకుండా రాష్ట్రాన్ని పాలించి, రాష్ట్రాన్ని తీవ్రమైన అప్పులపాలు చేశారని మండిపడ్డారు.  అయినప్పటికీ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే, మరోవైపు ప్రజా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మిగిలిన రెండున్నరేళ్ల పాలనా కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క ఎన్నికల హామీని కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ పీసీసీ చీఫ్ తన ప్రసంగాన్ని ముగించారు.       [ MLC Mahesh Kumar Goud, Talasani Srinivas Yadav, KCR, PCC Chief, BRS, Congress,  BRS, CM Revanth reddy, KCR, KTR, Telugu One, Telugu News ]
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు. కొండా కుటుంబానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు.“కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు” అని కొండా మురళి స్పష్టం చేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. కొండా సురేఖకు మద్దతుగా వచ్చిన కార్యకర్తలు ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  “కొండాను ఢీకొట్టడం ఈ గొర్రెల వల్ల కాదు” అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని గొర్రెలు, గుంటనక్కలు అన్నీ ఒక్కటై కొండాను ఢీకొట్టాలని చూస్తున్నాయని, అయితే అది సాధ్యం కాదని అన్నారు. ఈ సందర్భంగా కార్యక ర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. “పులి.. పులి.. పులి.. బెబ్బులి.. కొండా మురళి వేట పులి” అంటూ నినాదాలతో హోరెత్తించారు. కొండా కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కార్యకర్తలు తెలిపారు. “మీరు నక్సల్స్‌లోకి వెళ్తే.. మీతోనే నక్సల్స్‌లోకి వస్తాం” అంటూ కొండా మురళికి, కొండా సురేఖకు అభయం ఇచ్చారు. కొండా కుటుంబం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. తాజా పరిణా మాలతో స్థానికంగా కొండా వర్గం రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.       [ Konda Murali, Konda Surekha, Congress party, Warangal, CM Revanth reddy, Konda sushmitha, Telugu One, Telugu News]  
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏర్పడిన భేదాభిప్రాయాల కారణంగా ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్యే కొండా సురేఖను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. మంత్రి పదవిని కోల్పోయిన నాటి నుంచి అసెంబ్లీ జరుగుతున్న ప్రస్తుత వర్షాకాల సమావేశాలకు దూరంగా ఉంటున్న ఆమెతో, తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా ఫోన్లో మాట్లాడారు.  పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాలను పక్కనబెట్టి, వ్యక్తిగత సమస్యలను విడనాడి మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాల్సిన ఆవశ్యకతను ఆమెకు వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ఆమె హాజరుకాకపోవడం కాంగ్రెస్ పార్టీ సర్కిళ్లలో తీవ్ర దుమార రేపింది.  ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను మీనాక్షి నటరాజన్‌కు అప్పగించినట్లు సమాచారం. ఫోన్ సంభాషణ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఢిల్లీ నుంచి నేరుగా రావాల్సిందిగా కొండా సురేఖకు పార్టీ పెద్దల నుంచి పిలుపు అందడం ప్రాధాన్యత సంతరించుకుంది.  మంత్రి పదవిని కోల్పోయి తీవ్ర అసంతృప్తితో రగులుతున్న సురేఖను కూడగట్టే క్రమంలో భాగంగానే హైకమాండ్ ఈ చర్యలు చేపట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఆమెకు త్వరలోనే కేబినెట్ స్థాయి లేదా సముచితమైన మరో ఉన్నత పదవిని అప్పగించే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటం గమనార్హం. గతంలో వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఆమె కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, పరకాల అసెంబ్లీ స్థానంపై చెలరేగిన వివాదం తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి.   తన బిడ్డ చేసిన వ్యాఖ్యలకు తల్లిగా తనను బాధ్యురాల్ని చేసి బలిపశువును చేయడం ఎంతవరకు సమంజసమని సురేఖ గతంలో బహిరంగంగానే ప్రశ్నించిన సంగతి తెలిసిందే. బీసీ వర్గానికి చెందిన తనపైనే కఠిన చర్యలు తీసుకున్నారని, పార్టీలో కొందరికే ఒక రకమైన న్యాయం, తమలాంటి వారికి మరో న్యాయం జరుగుతోందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారకుండా చూసేందుకు హైకమాండ్ వేగంగా పావులు కదుపుతోంది. ఫోన్ కాల్ చర్చల తర్వాత, ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న కొండా సురేఖతో పార్టీ పెద్దలు జరిపే సమావేశం తర్వాత ఈ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందనే అంశంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.         [ Konda Surekha, Congress High Command, Meenakshi Natarajan, Telangana Politics, CM Revanth Reddy, Congress Cabinet, Congress party, Parakala assembly, Konda Sushmita Patel, Telugu One, Telugu News ]
  What Can Today’s Generations Learn From G.D. Naidu? Today, we have almost everything. We have smartphones. We have Google. We have YouTube. We have AI. We have online courses. We have access to knowledge from almost every corner of the world. But with all this access to technology and information… Are we creating enough? Recently, while watching the biopic GDN, I came across the life of G.D. Naidu—an inventor, industrialist and experimenter whose life was far ahead of the technology available during his time. The film itself presents his journey as that of an inventor overcoming enormous challenges during the colonial era. (Netflix) And one question kept coming back to me… How did a man who lived more than 100 years ago, with very limited formal education, develop such extraordinary curiosity about machines, technology and innovation? How did he look at a machine and think, “How does this work?” And then try to understand it? How did he look at a problem and think, “Can I build a better solution?” That was G.D. Naidu. And perhaps the biggest lesson today's generations can learn from his life is not simply how to become an inventor. It is… How to become curious again. Don't Just Use Technology. Understand It. Today, we use technology every minute. We use smartphones, but how many of us understand how they actually work? We use AI, but how many of us are curious about what is happening behind it? We use machines every day, but how many of us stop and ask: “Can this be made better?” G.D. Naidu had a different relationship with technology. He didn't just want to use machines. He wanted to understand them. His curiosity eventually extended into electrical, mechanical and automotive technology, among other areas. He experimented, manufactured and developed practical solutions rather than simply being a passive consumer of technology. Today, technology is everywhere. But perhaps what we need most is not more technology. We need more people who are curious enough to understand it. Your Degree Should Not Be the End of Your Education G.D. Naidu's formal education was limited. But he never allowed that to become the limit of his learning. He learned through observation. Through experimentation. Through machines. Through travel. Through experience. Through mistakes. Through doing. This doesn't mean formal education is unimportant. It means something else: A classroom should be the beginning of learning, not the boundary of learning. Today, a student can learn from the world's best universities without even leaving home. The knowledge is available. The technology is available. The opportunities are available. The question is: Are we using them? Learn by Doing Perhaps one of the most important ideas we can take from G.D. Naidu's approach to education is simple: Learn by doing. Not just reading about something. Not just watching someone else do it. Do it yourself. Build something. Break something. Experiment. Fail. Understand why it failed. Try again. This is where real learning begins. Imagine a child learning electricity only from a textbook. And imagine another child being allowed to build a simple electrical circuit with their own hands. Which child is more likely to remember the lesson? Today, we have simulations, laboratories, robotics kits, 3D printers, coding platforms and AI. We have more tools for hands-on learning than ever before. So the question is not whether resources exist. The question is whether we are using them to create, or simply using technology to consume. Don't Wait for Perfect Resources When we think about innovation today, we often imagine expensive laboratories, advanced equipment and large teams. But G.D. Naidu's journey tells us that innovation can begin much earlier than that. With a machine. With a problem. With a question. And with the determination to find an answer. His early journey itself was remarkable. He became involved in transport and engineering, and the United Motor Service eventually grew into a large bus operation. He also moved beyond transport into manufacturing and technology. That tells us something important. Sometimes we tell ourselves: “I don't have the right equipment.” “I don't have enough money.” “I don't have a laboratory.” “I don't have the right degree.” “I don't have the right opportunity.” But innovation doesn't always begin with resources. Sometimes it begins with a question. “Why?” “How?” “What if?” “Can I make this better?” That is where an inventor begins. Learn From the World. Build for India. G.D. Naidu understood the importance of learning from the world. He travelled abroad, observed technologies and brought back machines and technological knowledge. But the purpose wasn't simply to admire what other countries had built. He used what he learned as inspiration for experimentation, manufacturing and technological development in India. His museum in Coimbatore also became a way of exposing people to technology and the evolution of machines. The G.D. Naidu Industrial Museum today preserves many of these technological exhibits and inventions. (Tamil Nadu Tourism) That is an important lesson for today's generation. We don't have to reject what the world has created. We should learn from it. Understand it. Improve it. And ask: “How can we use this knowledge to solve India's problems?” Today, India has a huge opportunity. AI. Semiconductors. Electric vehicles. Space technology. Biotechnology. Robotics. Clean energy. The next generation shouldn't only ask, “What can I get from the world?” It should also ask, “What can I build for the world?” Innovation Should Solve Real Problems Innovation is not simply about creating something complicated. The real question is: Who does it help? A great invention solves a real problem. It makes something faster. Cheaper. Safer. Simpler. More accessible. More useful. That mindset is especially important for India. We have millions of real-world problems waiting for better solutions. From agriculture to transportation. From water management to waste management. From healthcare to education. From energy to rural technology. From manufacturing to public infrastructure. Imagine if today's young minds started looking at these problems not only as problems… but as opportunities to innovate. That could change India. What Can Millennials Learn? Millennials grew up during one of India's biggest technological transitions. We saw the world move from landlines to smartphones. From letters to instant messaging. From physical maps to Google Maps. From limited information to unlimited information. We have already experienced enormous technological change. But the lesson from G.D. Naidu is: Never let experience become resistance to learning. The technology we mastered yesterday may not be the technology that defines tomorrow. So keep learning. Keep adapting. Keep experimenting. What Can Gen Z Learn? Gen Z has grown up with extraordinary access to information. You can learn almost anything with a smartphone. But information alone doesn't create innovation. There is a difference between: knowing something, understanding something, and building something. The next step is to convert: Information → Knowledge → Skill → Idea → Product → Impact. Don't just become excellent consumers of content. Become creators of solutions. What Can Gen Alpha Learn? Gen Alpha is growing up in a completely different world. AI will be everywhere. Machines will become smarter. Learning will become more personalized. Technology will become increasingly powerful. But that creates an interesting challenge. If machines can answer more questions… will humans continue to ask better questions? That may become one of the most important skills of the future. Don't compete with machines at what machines do best. Use them. Question them. Work with them. And most importantly… imagine things that don't exist yet. And What Would G.D. Naidu Do With Today's Technology? This is the question that fascinates me the most. Imagine taking the young G.D. Naidu from his time… and bringing him into today's world. Give him a smartphone. Give him the internet. Give him AI. Give him a modern laboratory. Give him a 3D printer. Give him access to universities and research from around the world. Give him today's manufacturing technology. What would he build? What problem would he notice first? What machine would he take apart? What technology would he try to improve? What new invention would he imagine? We don't know. But perhaps that is exactly the point. Because the world he lived in had limited technology… but enormous curiosity. We live in a world where technology is abundant. So perhaps our biggest challenge is to make sure… our curiosity doesn't become scarce. The Biggest Lesson From G.D. Naidu When we talk about G.D. Naidu, we often talk about his inventions. But perhaps his greatest contribution was something bigger. He showed that learning doesn't have to stop with a textbook. That curiosity can become knowledge. Knowledge can become skill. Skill can become innovation. And innovation can create opportunities for an entire society. His legacy also reminds us that innovation is not only about inventing things. It is about creating a culture of learning, experimentation and problem-solving. That is why his story is still relevant. Not only for engineers. Not only for inventors. Not only for students. For every generation. Because every generation gets better technology than the previous one. But technology alone doesn't guarantee progress. People do. People who question. People who learn. People who experiment. People who build. People who solve problems. People who look at the world and say: “This can be better.” That is perhaps the real lesson G.D. Naidu leaves for Millennials, Gen Z and Gen Alpha. We don't need everyone to become an inventor. But we need every generation to develop the mindset of an inventor. To observe. To question. To learn. To experiment. To create. And finally… to leave the world a little better than we found it. G.D. Naidu lived in a time when technology was scarce, but curiosity was abundant. We live in a time when technology is abundant. So the real question is… Can we make sure our curiosity remains abundant too? Written by Sreekanth Damacharla Ideas for a Better India
ALSO ON TELUGUONE N E W S
  గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'దాదా' తర్వాత చేయబోయే మూవీ కొరటాల శివతో అని అనౌన్స్ మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. కమర్షియల్ టచ్ కి సోషల్ మెసేజ్ ని నింపడంలో కొరటాల సిద్ధహస్తుడు కావడంతో స్టోరీతో పాటు బాలకృష్ణ క్యారక్టర్ పై ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ పలురకాల కథల్ని ఊహించుకోవడం స్టార్ట్ చేసారు.    అంతేకాకుండా, ఈ చిత్రానికి సౌత్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నట్లు వార్తలు రావడంతో అంచనాలు స్థాయి కూడా పెరిగింది. అయితే, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ఆగిపోయిందంటూ అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేయగా, బాలకృష్ణ గారు ఇటీవల బడ్జెట్ మరియు కమర్షియల్ సేఫ్టీ విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం మొదలైంది. రూ. 100 కోట్ల పరిధిలోనే ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారని, అందుకే రూ. 150 కోట్ల బడ్జెట్ హర్డిల్ కారణంగా కొరటాల శివ సినిమాపై అనిశ్చితి ఏర్పడిందని వార్తలు వ్యాపించాయి. ఈ పుకార్లతో నందమూరి అభిమానులు తీవ్ర ఆందోళనకు గురై, సినిమా అప్‌డేట్ వెంటనే ఇవ్వాలని నెట్టింట డిమాండ్ చేయడం ప్రారంభించారు.         Also Read: జై జై రామ్ సాంగ్: ఎందుకిలా చేసారు? ఉన్న అర్హత ఏంటి! అయితే అదే సమయంలో బాలయ్య డై హార్డ్ ఫాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు' అనవసరమైన రూమర్లని  నమ్మవద్దని, త్వరలోనే అధికారిక ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్‌మెంట్ అప్‌డేట్ రాబోతోందని సమాచారం.ఏది ఏమైనా బాక్స్ ఆఫీస్ కూడా కొత్తగా బరిలోకి దిగబోతున్న ఒంగోలు గిత్తలా బాలయ్య, కొరటాల మూవీ కోసం కాసుకొని కూర్చుంటుందనేది పక్కా.         [Balakrishna, Koratala Siva, , NBK112 , Fans Demand, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood]  
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్‌లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇక ఆగస్ట్ నెలలోనే ఈ మూవీని అనకాపల్లి ప్రజలకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. ‘అనకాపల్లి’ సినిమాని అనకాపల్లి ప్రజలు వీక్షించి అద్భుతమైన రెస్సాన్స్‌ను అందించారు. ఈ మూవీని తెలుగులో పాటుగా తమిళంలోనూ భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రధాన పాత్రల్ని చూపిస్తూ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు అందరిలోనూ మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తోంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్, పూర్వి డిస్ట్రిబ్యూషన్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నాయి. ఈ చిత్రానికి మాయా.వి కెమెరామెన్‌గా, శ్రీకృష్ణ అత్తలూరి ఎడిటర్‌గా పని చేశారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి ఉదయ్ భాగవతులు డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు.        [Anakapalli Release Date, Anakapalli on October 2, Anakapalli Movie Telugu, Trinadha Rao Nakkina, Vikram Sahidev, Telugu Film News, Telugu News]  
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సై ఫై థ్రిల్లర్ మూవీ 'కిల్లర్'. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. 'కిల్లర్' సినిమా అక్టోబర్ 30న రిలీజ్ రాబోతోంది. ఈ రోజు మహిళల కోసం 'కిల్లర్' మేకర్స్ 'సూపర్ షీ ఛాలెంజ్'ను అనౌన్స్ చేశారు. రాత్రికి రాత్రే మీకు సూపర్ పవర్ వస్తే ఏం చేస్తారో చెబుతూ రీల్స్ చేసి పంపితే వారిలో బెస్ట్ రీల్స్ చేసిన పది మందికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున క్యాష్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అలాగే తమ ఆన్సర్స్ ను టెక్ట్స్ మెసేజ్ పంపిన వారిలో బెస్ట్ ఆన్సర్స్ పంపిన 20 మంది ఒక్కొక్కరు 2 వేల రూపాయల చొప్పున క్యాష్ ప్రైజ్  అందుకోవచ్చు. త్వరలో జరగనున్న కిల్లర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజేతలను వేదిక మీదకు పిలిచి ఈ క్యాష్ ప్రైజ్ అందిస్తారు. ఔత్సాహికులు తమ రీల్స్, టెక్ట్స్ మెసేజ్ లు హీరోయిన్ జ్యోతి పూర్వజ్ ఇన్ స్టాగ్రామ్ అక్కౌంట్ కు ట్యాగ్ చేసి, #SuperSHE #KilleR అనే హ్యాష్ ట్యాగ్స్ రాయాలి. ఈ వివరాలను వెల్లడిస్తూ హీరోయిన్ జ్యోతి పూర్వజ్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఓవర్సీస్ లో "కిల్లర్" మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఓఎంజి పిక్చర్స్ ఈ సినిమాను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సంస్థ "కిల్లర్" సినిమాను అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యా వంటి దేశాల్లో విడుదల చేయబోతోంది. https://www.instagram.com/reel/DdThJ8nzLPg/       [Killer Movie, Super She Challenge, Jyothi Poorvaj, Instagram, Sci Fi Thriller Telugu, KilleR, Telugu Film News, Telugu News]
      భారతీయ సినీ ప్రేమికులతో పాటు, రామభక్తులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రామాయణకి కౌంట్ డౌన్ కి స్టార్ట్ అయ్యింది. ఇంకెంత మహా అయితే నెలన్న రోజులు.  దీంతో రిలీజ్ డేట్ నవంబర్ 6 వడివడిగా వస్తుండటంతో మేకర్స్ కూడా ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఈ క్రమంలోనే నిన్న వినాయకుడికి చవితి శుభాకాంక్షలు చెప్తూ  'జై జై రామ్' సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. అయితే 'సియారామ్ సియారామ్' అనే హుక్ లైన్ వెంటనే క్యాచ్ అయ్యేలా ఉంది. దీంతో ఇంతటి ప్రెస్టేజియస్ట్ పాటలో ఇప్పటికే చాలా భక్తి పాటల్లో వినిపించిన  'సియారామ్' ఫీల్ ని ఎందుకు నమ్ముకున్నారని, పరిచయమైన భక్తి సాంగ్ లాగానే ఉందనే విమర్శలు వస్తున్నాయి. ప్రశ్న ని సోషల్ మీడియా వేదికగా కొంత మంది లేవనెత్తుతున్నారు. ఏది ఏమైనా అందరకీ నచ్చాల్సిన అవసరం లేదు. కానీ సాంగ్ రిలీజైన కొద్దీ సేపటి నుంచే రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.   రామాయణ నుంచి రిలీజైన తొలి సాంగ్ కూడా కావడంతో పండగ మూడ్ లో కూడా అభిమానులు,సంగీత ప్రియులు జై జై రామ్'  సాంగ్ మూడ్ లో ఉండిపోయారు. రామ భక్తులైతే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'ఆస్కార్ విజేతలు ఏ.ఆర్. రెహమాన్ హన్స్ జిమ్మర్ సంగీత సారథ్యంలో రూపొందిన జై జై రామ్ వింటుంటే ఒక రకమైన ఆధ్యాత్మిక ప్రశాంతతను, మైమరిపించే భక్తి భావాన్ని అందిస్తోంది. డాక్టర్ కుమార్ విశ్వాస్ అందించిన అత్యద్భుతమైన సాహిత్యం భక్తి రసాన్ని పండించగా, భారతీయ సంగీత దిగ్గజాలు అరిజిత్ సింగ్ మరియు శ్రేయా ఘోషాల్ తమ అమృతతుల్యమైన గాత్రంతో ఈ పాటకు మరింత జీవం పోశారు.ఈ పాట కేవలం ఒక కమర్షియల్ సినిమా గీతంలా కాకుండా ఒక పవిత్రమైన ప్రార్థనలా ప్రారంభమై, శ్రోతలను నేరుగా రామరాజ్యపు ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్తుందనే అభిప్రయాన్ని వ్యక్తం చేస్తున్నారు.       Also Read: ఒంటిపై బట్టలు లేకుండా ఈ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా!  సాంగ్ లో  విజువల్స్ పరంగా చూసుకుంటే  శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి తమ క్యారెక్టర్స్ లో ఒదిగిపోయిన తీరు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటోంది. రణబీర్ కపూర్ దైవికమైన కాంతి, తేజస్సుతో మెరిసిపోతుండగా, సాయి పల్లవి సీతమ్మవారి పాత్రలో చూపించిన పవిత్రత మరియు సాత్వికమైన వ్యక్తీకరణలు ఈ వీడియోకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విఎఫ్ఎక్స్ (VFX), సిజిఐ (CGI) హంగుల కంటే కూడా భావోద్వేగాలకే ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు నితిన్ తివారి ప్రతి ఫ్రేమ్‌ని  ఎంతో భక్తి  శ్రద్ధల తో రూపొందించినట్లు స్పష్టమవుతోంది.  ప్రపంచ సినీ ప్రేమికులని రామాయణ థియేటర్స్ కి తీసుకురావడమే లక్ష్యంగా రామాయణని నమిత్ మల్హోత్రా నిర్మించాడు.          [Ramayana,Jai Jai Ram Song Review, Ranbir Kapoor, Sai Pallavi, Namith Malhotra,Nitesh Tiwari, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood]  
'ఆ నలుగురు', 'మధుమాసం', 'అందరి బంధువయా', 'ఇదీ సంగతి', 'ఆటగదరా శివా' తదితర సినిమాలతో విలక్షణ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు చంద్ర సిద్ధార్థ్. ఆయన తెరకెక్కించిన తాజా సినిమా 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు'. ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా... అనేది ఉపశీర్షిక. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత పొడవైన టైటిల్‌తో వస్తున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. ప్రముఖ దర్శక రచయిత మదన్ అందించిన కథతో వై.వి.సత్యనారాయణ రాజు సమర్పణలో ఫిల్మోత్సవ్ పతాకంపై చంద్ర సిద్ధార్థ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదల కానుంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు.  'ఈ పాట కోరినవారు..' టీజర్ విడుదల చేసిన అనిల్ రావిపూడి, సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ''ఇంత పెద్ద టైటిల్‌తో సినిమా రావడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చంద్ర సిద్ధార్థ్ గారి దగ్గర 'మధుమాసం', 'హౌస్‌ఫుల్', 'అందరి బంధువయా' చిత్రాలకు నేను స్క్రిప్ట్ విభాగంలో పని చేశాను. ఆయన సెన్సిబుల్ సినిమాలు తీశారు. పొడవాటి టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు. దర్శక నిర్మాత చంద్ర సిద్దార్థ్ మాట్లాడుతూ... ''మా సినిమా టీజర్ విడుదల చేసిన అనిల్ రావిపూడి గారికి థాంక్స్. మేం అడిగిన వెంటనే ఓకే చెప్పారు. ఆయన బిజీ షెడ్యూల్‌లో మాకు కొంత టైమ్ ఇచ్చారు. ఆయనకు టైటిల్, టీజర్ నచ్చడం పాజిటివ్ సైన్. మాకు సంతోషంగా ఉంది. టైటిల్ రెస్పాన్స్ బావుంది. ఆడియన్స్ అందరిలో సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన థ్రిల్లర్ సినిమాల్లో ఇదొక డిఫరెంట్ సినిమా అవుతుంది. థియేటర్లలో మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం'' అని అన్నారు. హర్ష హీరోగా,  అమైరా గోస్వామి, సుజనా రెడ్డి హీరోయిన్లుగా పరిచయమవుతున్న 'ఈ పాట కోరినవారు...' సినిమాలో ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌ వర్ధన్, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. టీజర్ విషయానికి వస్తే... 'నీ రేడియో కావాలి' అంటూ హీరో హర్ష ఒకరి ఇంటికి వెళతాడు. అక్కడ రేఖా నిరోషా 'నేను వద్దా' అని అడుగుతారు. అది చూసి ఆమె భర్త ఓ లుక్ ఇస్తారు. తర్వాత 'ఇంత అందంగా ఉన్నారు. మిమ్మల్ని ఎలా వదులుకున్నారు' అని ఇనాయ సుల్తానాను అడిగితే... 'ఎప్పుడూ మీరే వదిలేయాలా? మేం వదలకూడదా' అని ఆమె సమాధానం ఇస్తారు. ప్రేయసిని షేర్ చేసుకోవాలనుకునే ప్రియుడు, పెళ్లి పీటల మీద భర్తతో పాటు మరొకరు కావాలని కోరిన భార్య వంటి సన్నివేశాలు సినిమాపై ఆసక్తి పెంచాయి. ఈ మిస్టికల్ మ్యూజికల్ థ్రిల్లర్ మీద అంచనాలు పెంచాయి.   'ఆ నలుగురు'తో మానవ సంబంధాలు, భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించిన చంద్ర సిద్ధార్థ్, ఈసారి ఆధునిక థ్రిల్లర్ నేపథ్యంతో మరో భిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా మలుస్తూ రూపొందిన చిత్రమిది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, మెమరీస్, గిల్ట్ వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించిన చిత్రమిది.        [Ee Paata Korinavaaru Movie, Ee Paata Korinavaaru Teaser, Anil Ravipudi, Chandra Siddhartha, Telugu Movies 2026, Telugu Film News, Telugu News]  
    ప్రపంచ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు 'సిడ్నీస్వీనీ.. 'యుఫోరియా' సిరీస్ తో అయితే తన కట్ అవుట్ కి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. వివాదాలని ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలిపించుకొనే ఆత్మీయ బంధువులా లూప్ లైన్ లో ఉంచుకునే   'సిడ్నీ స్వీనీ'  మరోసారి అంతర్జాతీయంగా తీవ్ర వివాదంలో చిక్కుకొని గ్లోబల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. స్పోర్ట్స్ ప్రిడిక్షన్,  ట్రేడింగ్ వేదిక'నోవిగ్' (Novig) అనే బ్రాండ్ ప్రచారం కోసం సిడ్నీ స్వీనీ చేసిన నూతన స్పోర్ట్స్  ప్రకటన సోషల్ మీడియా వేదికల్లో వైరల్ కావడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారుల నుంచి తీవ్ర విమర్శలని ఎదుర్కొంటోంది. యాడ్‌లో సిడ్నీ స్వీనీ ఒంటిపై దుస్తులు లేకుండా, కేవలం టెన్నిస్ రాకెట్లు, బాస్కెట్‌బాల్స్, ఫుట్‌బాల్స్, హాకీ స్టిక్స్ మరియు వివిధ క్రీడా పరికరాల సహాయంతో శరీరాన్ని కప్పుకుంటూ ఉంది. అయితే నోవిగ్ బ్రాండ్ కేవలం స్పోర్ట్స్ ప్రిడిక్షన్ మార్కెట్ అని చాటిచెప్పడమే దీని ప్రధాన ఉద్దేశమని సదరు కంపెనీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. అంతేకాకుండా, మొదటి నుంచి ఈ ప్రచారాన్ని ఎంతో క్రియేటివ్‌గా, హ్యూమర్ మరియు కాన్ఫిడెన్స్‌తో రూపొందించడంలో తాను స్వయంగా భాగస్వామ్యం వహించానని సిడ్నీ స్వీనీ గతంలో చెప్పుకొచ్చింది.  అయితే, యాడ్ విడుదలైన కొద్దిసేపటికే ప్రపంచం నలుమూలల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా క్రీడా ప్రపంచం నుండి ప్రతికూల స్పందనలు వెల్లువెత్తాయి. ఆస్ట్రేలియాకు చెందిన నాలుగు సార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, మాజీ స్విమ్మర్ అరియార్న్ టిట్మస్ ఈ ప్రచారంపై సోషల్ మీడియాలో  ఘాటుగా స్పందించింది. మహిళా అథ్లెట్లు క్రీడల్లో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి, గౌరవం సాధించడానికి కొన్ని దశాబ్దాలుగా ఎంతో కష్టపడుతుంటే, కేవలం బ్రాండ్ ప్రచారం కోసం మహిళల శరీరాలను ఇలా సరుకుగా మార్చడం దారుణమని మండిపడ్డారు. బ్రిటీష్ రన్నర్ ఏమీ హంట్, యుఎస్ జిమ్నాస్ట్ గ్రేసీ క్రామర్, రగ్బీ ప్లేయర్ సోఫీ ఫెల్లా వంటి పలువురు క్రీడాకారిణులు కూడా ఈ యాడ్‌ను తీవ్రంగా తప్పుపట్టారు.       Also Read: ఎపిక్ షాకింగ్ కలెక్షన్స్: డిజాస్టర్ అంటుంది ఎవరు! అయితే ఈ వ్యాఖ్యలపై సిడ్నీ స్వీనీ నేరుగా ఏ ప్రకటన చేయకుండా, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక ఆసక్తికరమైన సైలెంట్ కౌంటర్ ఇచ్చారు. గతంలో స్పోర్ట్స్ విభాగంలో ప్రముఖ మ్యాగజైన్లకు నగ్నంగా లేదా దాదాపు దుస్తులు లేకుండా ఫొటోషూట్లు చేసిన దిగ్గజ అథ్లెట్ల ఫొటోలను ఆమె వరసగా షేర్ చేశారు. అందులో టెన్నిస్ లెజెండ్ సెరెనా విలియమ్స్, బాస్కెట్‌బాల్ స్టార్ మేగన్ రాపినో, యూఎఫ్‌సీ ఫైటర్ రోండా రౌసీ, ఎన్‌ఎఫ్‌ఎల్ స్టార్స్ రాబ్ గ్రోంకోవ్స్కీ, జేసన్ కెల్స్ వంటి దిగ్గజాల ESPN 'బాడీ ఇష్యూ' ఫొటోషూట్స్ ఉన్నాయి. క్రీడా దిగ్గజాలు చేసినప్పుడు లేని అభ్యంతరం, తన వరకు వచ్చేసరికి ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారనే ప్రశ్నని  ఆమె పరోక్షంగా లేవనెత్తి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. గత ఏడాది అమెరికన్ ఈగిల్ డెనిమ్ బ్రాండ్ ప్రచారంతో చర్చనీయాంశమైన రెండు సార్లు ఎమ్మీ నామినీ పొందిన ఈ హాలీవుడ్ నటి, ఇప్పుడు ఈ కొత్త గ్లోబల్ స్పోర్ట్స్ యాడ్ వివాదంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచారు.     [Sydney Sweeney , Sports Ad Controversy, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood]    
Chandra Siddharth, the acclaimed filmmaker known for his distinctive and sensitive storytelling in films such as Aa Naluguru, Madhumasam, Andari Bandhuvaya, Idhi Sangathi and Aatagadara Siva, is now coming up with yet another unconventional film titled ‘Ee Paata Korinavaaru Nemalipalem Nundi Rama, Jyotsna, Nandu, Murali, Kabir, Dhol Ravi Modhalagunavaru’. The film carries the intriguing subtitle ‘A Forbidden Raag from a Forbidden Saga’ and has already entered the record books as the film with one of the longest titles in the history of Telugu cinema. Based on a story by noted filmmaker and writer Madan, the film is presented by Y.V. Satyanarayana Raju and produced by Chandra Siddharth under the banner of Filmotsav. The film is slated for a grand theatrical release on September 18. The teaser of ‘Ee Paata Korinavaaru…’ was unveiled by blockbuster director and ‘Hit Machine’ Anil Ravipudi, who wished the team great success. Speaking on the occasion, Anil Ravipudi said, “ It is interesting to see a film coming with such a long title. I worked in the script department with Chandra Siddharth garu on Madhumasam, Housefull and Andari Bandhuvaya. He has always made sensible and meaningful films. I hope this film, which comes with such an unusual title, will also receive a great response from audiences.” Director and producer Chandra Siddharth said, “ I sincerely thank Anil Ravipudi garu for launching our teaser. He immediately agreed when we approached him and graciously gave us some time despite his busy schedule. The fact that he liked both the title and the teaser is a very positive sign for us, and we are extremely happy. The response to the title has been very encouraging, and it has already created a great deal of curiosity among audiences. Among the thrillers made in Telugu so far, we believe this film will stand out as something truly different. We are confident that it will receive a good response in theatres.” Starring Harsha as the male lead, with Amaira Goswami and Sujana Reddy making their debuts as female leads, Ee Paata Korinavaaru… features Inaya Sultana, Ravi Varma, Ashok Vardhan and Rekha Nirosha in prominent roles.The teaser opens with Harsha visiting someone’s house saying, “I want your radio.” Rekha Nirosha then asks, “Don’t you want me?”, prompting a telling reaction from her husband. In another intriguing moment, when Inaya Sultana is asked, “You are so beautiful. How could he leave you?”, she responds, “Why should you always be the one to leave? Can’t we be the ones to leave too?” The teaser also features unusual and provocative situations—a lover who wants to share his girlfriend and a wife who wants someone else along with her husband at the wedding altar. These intriguing situations have heightened curiosity around the film and have raised expectations for this mystical musical thriller. Chandra Siddharth, who powerfully explored human relationships and emotions in Aa Naluguru, is now presenting audiences with a completely different cinematic experience set against the backdrop of a contemporary thriller. The film explores the fascinating relationship between music, sound and the human brain, weaving elements such as sound therapy, brain mapping, memories and guilt into an intriguing mystery narrative. With its unconventional title, mysterious premise and distinctive storytelling, Ee Paata Korinavaaru… promises to offer audiences a thriller unlike anything they have seen before. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
A land dispute involving Allu Arjun’s father-in-law Kancherla Chandrasekhar Reddy has now escalated into a criminal case, adding another twist to the long-running controversy surrounding a prime property in Nanakramguda. According to the complaint, the dispute revolves around land linked to the Mantri Cosmos premises. Representatives of the residents’ association have alleged that Chandrasekhar Reddy, along with two others, entered the property and attempted to assert control over the disputed portion. The situation reportedly turned tense when residents and security personnel objected to the move. The complaint also contains allegations of damage to property, confrontation with security staff and threats during the episode. Based on the complaint, Gachibowli police have registered a case and are looking into the allegations. CCTV footage from the premises is reportedly being examined as part of the investigation. The development has naturally attracted attention because of Chandrasekhar Reddy’s connection to the Allu family. He is the father of Sneha Reddy, Allu Arjun’s wife, making the otherwise local property dispute a matter of interest in film circles as well. For now, the case remains at the investigation stage, and the allegations made in the complaint are yet to be established. The immediate focus will be on the police probe and the competing claims over the disputed Nanakramguda property. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ, రాజకీయ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ భూవివాదంలో చంద్రశేఖర్ రెడ్డితో పాటు మురళీధర్ రెడ్డి, గడ్డం రవిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మంత్రి కాస్మోస్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన వివాదంపై.. స్థానిక ఓనర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఓనర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కొందరు వ్యక్తులు మంత్రి కాస్మోస్ ప్రాంగణంలోకి అక్రమంగా చొరబడి, గేటు తాళాలు పగులగొట్టి, అక్కడి నిర్మాణాలను ధ్వంసం చేశారు. సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించడంతో పాటు ప్రాంగణంలో టిన్‌షీట్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. మంత్రి కాస్మోస్ ప్రాంగణంలోకి చొరబడి బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓనర్స్ అసోసియేషన్ పోలీసులను కోరింది. అక్రమ ప్రవేశం, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.       [Icon Star Allu Arjun, Kancharla Chandrasekhar Reddy, Allu Arjun Father In Law, Mantri Cosmos Nanakramguda, Allu Arjun Latest, Telugu Film News, Telugu News, Hyderabad]  
    బేబీ ఫేమ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య  జంటగా ఈ నెల 11 న  వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లోకి వచ్చిన మూవీ  ‘ఎపిక్. ఫస్ట్ సెమిస్టర్ అనేది టాగ్ లైన్. సితార నాగవంశీ, 90 's దర్శకుడు ఆదిత్య హాసన్ ఎపిక్ కి మూల స్థంబాలు కావడం, ప్రీమియర్స్ కూడా ప్రదర్శించడంతో అభిమానులు, సినీ ప్రేమికులు మరో సారి మెస్మరైజ్ చేసే సినీ  ఆనందం తమ సొంతమవడం ఖాయమని భారీగానే పోటెత్తారు. పైగా అవసరం ఉన్నా లేకపోయినా తమ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఎపిక్ ప్రీమియర్ కి వచ్చానని గర్వంగా చెప్పుకున్నారు. తీరా సినిమా చూసాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకొనే పరిస్థితి .      దీంతో  ప్రిమియర్ షోల నుంచే నెగిటివ్ టాక్ రావడంతో, తొలి రోజు నుంచే కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది.  . ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కేవలం నామమాత్రపు వసూళ్లతో సరిపెట్టుకున్న ఈ చిత్రం, రెండవ రోజుకూ వచ్చేసరికి కలెక్షన్లలో మరింత క్షీణతను నమోదు చేసింది. మొదటి రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 6 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించగలిగింది. భారతదేశం అంతటా మొదటి రెండు రోజుల్లో 3.71 కోట్ల గ్రాస్ వసూలవ్వగా, విదేశీ మార్కెట్ల నుండి వచ్చిన కలెక్షన్లు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. శని, ఆదివారాల్లో కూడా థియేటర్ల వైపు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు.  ఇక మొదటి వీకెండ్ చివరినాటికి అంటే మూడవ రోజు పూర్తయ్యేసరికి, ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మొత్తం ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు 6.64 కోట్లకి  చేరుకున్నాయి. , ఇండియా గ్రాస్ కలెక్షన్లు 4.99 కోట్లు కాగా  ఓవర్సీస్ 1.65 కోట్ల గ్రాస్.     Also Read: పవన్‌ కళ్యాణ్‌ని ఓడించిన నాగ చైతన్య: ఇది మామూలు మాస్ కాదు! ఈ కలెక్షన్స్ పై ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రెజెంట్ బుక్ మై షో లాంటి యాప్స్ లో పచ్చ మార్కు తన జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. యూత్ లవ్ స్టోరీ అంటే శృంగారం తప్ప మరేమి ఉండదా అనే కోపంతో ప్రేక్షకులు డిజాస్టర్ అంటున్నారనే అభిప్రాయాన్ని సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అసలు  అలాంటి జోనర్స్ కి ఇక సెల్యులాయిడ్ పై చోటు ఉండకపోచ్చనే మాట కూడా వినపడుతుంది.         [Epic , Epic Collections, Anand Deverakonda, Vaishnavi Chaitanya, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood]
లైఫ్ లో సక్సెస్ కావాలంటే  మనిషి ఆలోచన ఎలా ఉండాలి.! జీవితంలో విజయం సాధించడం అనేది అనుకోకుండా జరిగే ఒక సంఘటన కాదు. అది ఒక నిరంతర ప్రయాణం. ఈ ప్రయాణంలో మన గమ్యాన్ని, మన స్థాయిని నిర్ణయించేది మన ఆలోచనా సరళి మాత్రమే. ఒక మనిషి ఎలా ఆలోచిస్తే అతని జీవితం అలానే తయారవుతుంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనం స్పందించే తీరు, మన మానసిక స్థితి , మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును రూపుదిద్దుతాయి. విజేతలకు, సాధారణ వ్యక్తులకు మధ్య ఉండే ప్రధాన తేడా వారి ప్రతిభ లేదా అదృష్టం మాత్రమే కాదు, వారి ఆలోచనా విధానం కూడా. విజయం సాధించడానికి  మనిషి ఆలోచనా సరళి ఎలా ఉండాలో వివరంగా తెలుసుకుంటే..  చాలామంది తమ సామర్థ్యాలకు ఒక హద్దును ఏర్పరచుకుంటారు. కానీ, సరైన శిక్షణ, శ్రమ , నిరంతరం  నేర్చుకుంటూ ఉండటం వంటి వాటి ద్వారా ఏ నైపుణ్యాన్నైనా పెంపొందించుకోవచ్చనే నమ్మకం ఉండాలి. ఓటమి అనేది ప్రయాణానికి ముగింపు కాదని, అది ఒక అనుభవమని గ్రహించాలి. ప్రతి వైఫల్యం ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగే ఆలోచన ఉన్నప్పుడే వ్యక్తిగత వికాసం సాధ్యమవుతుంది. స్పష్టమైన లక్ష్యాలు.. మనిషి ఆలోచన ఎప్పుడూ స్పష్టమైన లక్ష్యాల వైపు మొగ్గు చూపాలి. స్పష్టత లేని ఆలోచనలు గమ్యం లేని ప్రయాణం లాంటివి.  జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు, దాని కోసం ఏ రోజు ఏమి చేయాలి అనే విషయంలో స్పష్టత ఉండాలి. లక్ష్యాలను షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అని విభజించుకుని, వాటిని సాధించడానికి  ప్రణాళికలు రచించుకోవాలి. కేవలం ఆలోచించడమే కాకుండా, ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టే క్రమశిక్షణ ఉండాలి. పారిపోవడం కాదు పరిష్కారం వెతకాలి.. పరిస్థితులు ఎల్లప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు నిరాశపడకుండా ధైర్యంగా నిలబడే ఆలోచనా ధోరణి ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు "ఇది నాకే ఎందుకు జరిగింది" అని బాధపడటం కంటే, "ఈ సమస్యను నేను ఎలా పరిష్కరించగలను" అని ఆలోచించడం ముఖ్యం. సమస్యల వైపు కాకుండా పరిష్కారాల వైపు దృష్టి సారించే ఆలోచనా సరళి మనిషిని మానసికంగా బలంగా మారుస్తుంది. పరిస్థితుల సర్దుబాటు.. విజయం  సాధించాలంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మనిషి కూడా మారడం చాలా అవసరం. ప్రపంచం వేగంగా మారుతోంది. పాత ఆలోచనలకే పరిమితమైపోతే పురోగతి సాధ్యం కాదు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, కొత్త సాంకేతికతలను అవగాహన చేసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండటం  అనేది మనిషి ఆలోచనను పదునుపెడుతుంది. ఏ వయసులోనైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి వెనుకాడకూడదు. పాజిటివ్ ఆలోచన.. ఆలోచనల్లో పాజిటివ్నెస్ ఉండటం చాలా ముఖ్యం. మన ఆలోచనలే మన భావోద్వేగాలను, మన చర్యలను శాసిస్తాయి. ప్రతికూల ఆలోచనలు మన శక్తిని క్షీణింపజేస్తాయి , భయాన్ని పెంచుతాయి. పాజిటివ్ ఆలోచనలు మనలో నమ్మకాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయి. మీ చుట్టూ ఉన్న పరిసరాలు, మీరు సహవాసం చేసే వ్యక్తులు కూడా మీ ఆలోచనలపై ప్రభావం చూపుతారు. కాబట్టి సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులతో సమయం గడపడం, ప్రేరణనిచ్చే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. సమయం విలువ.. గొప్ప విజయాలు సాధించిన వారెవరూ సమయాన్ని వృథా చేయరు. కాలం అత్యంత విలువైనది. నేటి పనిని నేడే పూర్తి చేయాలనే ఆలోచన ఉండాలి. వాయిదా వేసే అలవాటు విజయానికి అతిపెద్ద శత్రువు. ప్రతి నిమిషాన్ని ఉపయోగకరంగా మార్చుకునే ఆలోచన ఉన్నప్పుడే అనుకున్న గమ్యాన్ని త్వరగా చేరుకోగలము. అవరోధాలు అధిగమించడం.. విజయం సాధించే క్రమంలో అనేక అడ్డంకులు వస్తాయి. మొదట్లోనే ఫలితాలు రాకపోవచ్చు. అంత మాత్రాన ప్రయత్నాన్ని ఆపకూడదు. పట్టుదల, సహనం అనేవి ఆలోచనా విధానంలో భాగం కావాలి. ఫలితం ఆలస్యమైనా, సరైన మార్గంలో పయనిస్తున్నామనే నమ్మకంతో నిలకడగా శ్రమించాలి. చివరగా.. విజయం అనేది కేవలం డబ్బు లేదా హోదాకు మాత్రమే పరిమితం కాదు. సమాజానికి ఉపయోగపడేలా, ఇతరులకు ప్రేరణగా నిలిచేలా ఆలోచించడం నిజమైన విజయం. మన ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటే, మన జీవితం కూడా అంత ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి మీ ఆలోచనలను సానుకూలంగా, స్పష్టంగా, , లక్ష్య సాధన వైపు నడిపించేలా మలుచుకోవాలి. అలా చేస్తే జీవితంలో విజయం తప్పక సొంతమవుతుంది.                       *రూపశ్రీ.  
మానవ శరీరానికి ఇంధనం అందించే పోషకాహారంలో కొవ్వులు (Fats) అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే, మనం రోజూ తీసుకునే ఆహారంలో ఉండే అన్ని రకాల కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేయవు. ముఖ్యంగా మన హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో  సంతృప్త కొవ్వులు (Saturated Fats) మరియు  అసంతృప్త కొవ్వులు  (Unsaturated Fats) మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడం ఎంతో అవసరం. వైద్య నిపుణులు మరియు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల ప్రకారం, అసంతృప్త కొవ్వులు గుండెకు రక్షణ కవచంలా పనిచేస్తే, పరిమితికి మించి తీసుకునే సంతృప్త కొవ్వులు ప్రాణాంతకమైన గుండె జబ్బులకు దారితీస్తాయి. ఈ రెండు రకాల కొవ్వుల వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు, అవి మన రక్తనాళాలపై చూపే ప్రభావం మరియు గుండెను సురక్షితంగా ఉంచుకునే మార్గాల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. మొదటగా  సంతృప్త కొవ్వులు  (Saturated Fats) గురించి పరిశీలిస్తే, ఇవి సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఘనరూపంలో ఉంటాయి. వెన్న, నెయ్యి, రెడ్ మీట్, చీజ్, పామాయిల్ మరియు కొబ్బరి నూనె వంటి ఆహార పదార్థాలలో ఇవి ఎక్కువగా లభిస్తాయి. ఆహారంలో సంతృప్త కొవ్వులు ఎక్కువైతే, అవి కాలేయంలో చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్‌డిఎల్ (LDL , Low Density Lipoprotein) ఉత్పత్తిని గణనీయంగా పెంచుతాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడలలో కొవ్వు పొరలుగా (Plaque) పేరుకుపోయి, ధమనులను మూసివేస్తుంది. దీనిని వైద్య పరిభాషలో  అథెరోస్క్లెరోసిస్  (Atherosclerosis) అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదికల ప్రకారం, మనం రోజూ తీసుకునే మొత్తం క్యాలరీలలో సంతృప్త కొవ్వుల వాటా 7 శాతం నుండి 10 శాతానికి మించకూడదు. ఈ పరిమితి దాటితే గుండెపోటు (Heart Attack) మరియు పక్షవాతం (Stroke) వచ్చే ప్రమాదం 30 శాతానికి పైగా పెరుగుతుంది.   దీనికి భిన్నంగా  అసంతృప్త కొవ్వులు  (Unsaturated Fats) గుండెకు అమృతం లాంటివి. ఇవి గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉంటూ, ఆలివ్ ఆయిల్, ఆవనూనె, పొద్దుతిరుగుడు నూనె, బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు (Flaxseeds) మరియు సాల్మన్ వంటి కొవ్వు చేపల్లో పుష్కలంగా లభిస్తాయి. అసంతృప్త కొవ్వులను ఏక అసంతృప్త (MUFA) మరియు బహుళ అసంతృప్త (PUFA) కొవ్వులుగా వర్గీకరిస్తారు. ఇవి రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తూ, మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డిఎల్ (HDL  , High,Density Lipoprotein) స్థాయిలను పెంచుతాయి. అంతేకాకుండా, ఇవి శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ (Triglycerides) స్థాయిలను తగ్గించి, రక్తనాళాల వాపును (Inflammation) నివారిస్తాయి. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం క్రమబద్ధంగా ఉండటమే కాకుండా, రక్తప్రసరణ ఎలాంటి అవరోధాలు లేకుండా సాగుతుంది. శాస్త్రీయ పరిశోధనలు మరియు అంతర్జాతీయ న్యూట్రిషన్ అధ్యయనాలు వెల్లడించిన గణాంకాల ప్రకారం, మన దైనందిన ఆహారంలో సంతృప్త కొవ్వుల నుండి వచ్చే 5 శాతం క్యాలరీలను అసంతృప్త కొవ్వులతో భర్తీ చేయడం వల్ల హృద్రోగాల ప్రమాదం ఏకంగా 13 శాతం నుండి 25 శాతం వరకు తగ్గుతుంది. అలాగే, ప్రాసెస్ చేసిన ఆహారాలు, బేకరీ తినుబండారాలలో ఉండే  ట్రాన్స్ ఫ్యాట్స్  (Trans Fats) నిత్య జీవితంలో 1 శాతం కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలని వైద్యులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మొత్తం రోజువారీ క్యాలరీలలో కొవ్వుల శాతం 20 నుండి 35 శాతం వరకు ఉండవచ్చని, కానీ అందులో అత్యధిక భాగం అసంతృప్త కొవ్వులే ఉండాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, ఆరోగ్యకరమైన గుండె కోసం మనం రోజూ వాడే వంట నూనెలు మరియు ఆహార పదార్థాల ఎంపికలో మార్పులు చేయడం అత్యంత ఆవశ్యకం. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, రెడ్ మీట్, అధికంగా వెన్న మరియు డాల్డా వాడకాన్ని తగ్గించి, వాటి స్థానంలో డ్రై ఫ్రూట్స్, సీడ్స్, ఆలివ్ ఆయిల్, నాణ్యమైన అసంతృప్త నూనెలను ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజువారీ ఆహారంలో సరైన కొవ్వుల సమతుల్యతను పాటించడంతో పాటు నిత్యం 30 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల గుండె సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది. సరైన ఆహార అవగాహనే శ్రేయోభరితమైన సుదీర్ఘ జీవితానికి పునాది.       [Saturated Fats, Unsaturated Fats, Heart Health, LDL Cholesterol, HDL Cholesterol, Atherosclerosis, Trans Fats, Healthy Fats, Cholesterol, Cardiovascular Health]
స్త్రీ సంతానోత్పత్తి వ్యవస్థ మరియు గర్భధారణ విషయంలో మహిళల్లో తరచుగా అనేక అపోహలు, సందేహాలు నెలకొంటాయి. ముఖ్యంగా తల్లికావాలని కోరుకునే మహిళలు ఎదుర్కొనే ప్రధానమైన చర్చ  అండాల సంఖ్య  (Egg Quantity) మరియు  అండాల నాణ్యత  (Egg Quality). చాలామంది మహిళలు అండాల సంఖ్య ఎక్కువగా ఉంటే చాలు, త్వరితగతిన గర్భం దాల్చవచ్చని భావిస్తుంటారు. కానీ, సంతానోత్పత్తి నిపుణులు (Fertility Experts) వెల్లడిస్తున్న నిజాల ప్రకారం అండాల సంఖ్య ఎంత ముఖ్యమో, అంతకంటే అండాల నాణ్యత అత్యంత ప్రాధాన్యమైనది. సంతానలేమి సమస్యలతో బాధపడేవారిలో ఈ రెండింటి మధ్య తేడాను సరిగ్గా అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. గర్భధారణ విజయవంతం కావడానికి ఈ రెండు అంశాలు ఏ విధంగా తోడ్పడతాయి, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలేంటో ఇప్పుడు సమగ్రంగా తెలుసుకుందాం. జన్యుపరంగా పరిశీలిస్తే, ప్రతి పెళ్లైన మహిళ లేదా అమ్మాయి తన పుట్టుకతోనే అండాల నిల్వలతో జన్మిస్తుంది. శారీరక నిర్మాణం ప్రకారం ఒక ఆడపిల్ల జన్మించినప్పుడు ఆమె అండాశయాలలో దాదాపు 10 లక్షల నుండి 20 లక్షల (1 to 2 million) అండాలు ఉంటాయి. అయితే, వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ నిల్వలు సహజంగానే క్షీణిస్తూ ఉంటాయి. యుక్తవయస్సుకు (Puberty) చేరుకునేసరికి ఈ అండాల సంఖ్య దాదాపు 3,00,000 నుండి 4,00,000 వరకు తగ్గిపోతుంది. ఒక మహిళ తన జీవితకాలంలో కేవలం 300 నుండి 400 అండాలను మాత్రమే అోవ్యులేషన్ (Ovulation) ద్వారా విడుదల చేస్తుంది. మిగిలిన అండాలన్నీ శరీరంలో కరిగిపోతాయి. ముఖ్యంగా 30 సంవత్సరాల వయసు నాటికి మహిళల్లో ప్రారంభ నిల్వలలో కేవలం 12 శాతం అండాలు మాత్రమే మిగులుతాయి. 40 ఏళ్లు దాటేసరికి ఈ నిల్వలు మరింత పడిపోయి కేవలం 3 శాతానికి చేరుకుంటాయి. వైద్య భాషలో అండాల సంఖ్యను  ఓవేరియన్ రిజర్వ్  (Ovarian Reserve) అని పిలుస్తారు. దీనిని అంచనా వేయడానికి బ్లడ్ టెస్ట్ ద్వారా AMH (Anti Müllerian Hormone) మరియు ఆంత్రల్ ఫోలికల్ కౌంట్ (AFC) స్కాన్ నిర్వహిస్తారు. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. AMH పరీక్ష అనేది కేవలం మీ అండాశయంలో ఎన్ని అండాలు అందుబాటులో ఉన్నాయో (Quantity) మాత్రమే చెబుతుంది తప్ప, ఆ అండాలు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాయో (Quality) చెప్పలేదు. ఉదాహరణకు, 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళకు మంచి AMH స్థాయిలు ఉన్నప్పటికీ, వయస్సు ప్రభావం వల్ల అండాల నాణ్యత తగ్గిపోవచ్చు. మరోవైపు, 25 సంవత్సరాల యువతికి తక్కువ AMH (ఉదాహరణకు 1.0 ng/mL కంటే తక్కువ) ఉన్నప్పటికీ, ఆమె అండాల నాణ్యత చాలా బాగుండటం వల్ల త్వరగా గర్భం దాల్చే అవకాశాలు 60 నుండి 70 శాతం వరకు ఉంటాయి.   అండాల నాణ్యత అంటే అండంలోని జన్యు పదార్థం (DNA/Chromosomes) ఎంత ఆరోగ్యకరంగా ఉందనేది సూచిస్తుంది. నాణ్యమైన అండం మాత్రమే శుక్రకణంతో విజయవంతంగా ఫలదీకరణ (Fertilization) చెంది, ఆరోగ్యకరమైన పిండంగా (Embryo) మారగలదు. నాణ్యత లోపిస్తే ఫలదీకరణ జరగకపోవడం, లేదా పిండం ఏర్పడినా గర్భస్రావం (Miscarriage) కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మహిళ వయస్సు 35 ఏళ్లు దాటిన తర్వాత అండాల్లో క్రోమోజోమ్ లోపాలు (Aneuploidy) పెరిగే అవకాశం దాదాపు 50 శాతానికి పైగా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల సంతానోత్పత్తి క్రమంగా తగ్గుతుంది. అయితే అండాల నాణ్యతను కేవలం వయస్సే కాకుండా మన రోజువారీ జీవనశైలి, ఆహార అలవాట్లు, శరీర బరువు (BMI), మానసిక ఒత్తిడి మరియు ధూమపానం వంటి దురలవాట్లు తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అండాల సంఖ్యను తిరిగి పెంచడం సాధ్యం కాకపోయినప్పటికీ, అందుబాటులో ఉన్న అండాల నాణ్యతను మెరుగుపరచడం లేదా కాపాడుకోవడం ఖచ్చితంగా సాధ్యమేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు, ఆకుకూరలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు నిపుణుల సలహాతో కోఎంజైమ్ Q10 (CoQ10), ఫోలిక్ యాసిడ్ వంటి సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల అండాల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాగే రోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, రసాయనాలు మరియు ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉండటం, తగినంత నిద్రపోవడం ద్వారా అండాశయ ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుంది. కాబట్టి గర్భధారణకు ప్రయత్నించే మహిళలు కేవలం AMH స్కోర్ చూసి కంగారు పడకుండా, అండాల నాణ్యతను పెంపొందించే ఆరోగ్యకరమైన మార్గాలను ఎంచుకోవడం ఎంతో శ్రేయస్కరం.     [Egg Quality, Egg Quantity, Ovarian Reserve, AMH Test, Fertility, Female Fertility, Ovulation, Pregnancy, Reproductive Health, Fertility Tips]
వయసు పెరగడం సహజం.. కానీ వయసుతో వచ్చే ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన తర్వాత మన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకలు వంటి ముఖ్యమైన అవయవాల పనితీరులో కూడా వయసుకు అనుగుణంగా మార్పులు వస్తాయి. 60+ వయసులో పడిపోవడం, నీరసం, వినికిడి తగ్గడం, చూపు సమస్యలు, నిద్రలో మార్పులు వంటి సమస్యలు సాధారణంగా కనిపించవచ్చు. అయితే వీటిని చిన్న సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో General Geriatrics & Lifestyle Specialist డాక్టర్ శ్రావణి కుమారి 60 ఏళ్లు దాటిన వారు తమ ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. వయసుకు తగ్గట్టుగా మందుల మోతాదు, పోషకాహారం, నిద్ర, శారీరక ఆరోగ్యం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ ఎందుకు అవసరమో తెలియజేస్తున్నారు. అంతేకాదు, నాగార్జున, చిరంజీవి వంటి ప్రముఖులు వయసు పెరిగినా ఫిట్‌గా, యాక్టివ్‌గా మరియు గ్రేస్‌ఫుల్‌గా కనిపించడానికి కారణం ఏమిటి? వయసును ఆరోగ్యంగా, అందంగా స్వీకరించేందుకు ఎలాంటి జీవనశైలి పాటించాలి? అనే అంశాలపై కూడా ఈ వీడియో ఆసక్తికరమైన అవగాహన కల్పిస్తుంది. మీ వయసు 60 దాటిందా? లేదా మీ కుటుంబంలో 60+ వయసున్న వారు ఉన్నారా? అయితే ఈ వీడియోను తప్పక చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మందులు, ఆహారం లేదా ఇతర చికిత్సలకు సంబంధించి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
కీళ్ల నొప్పులు, వాపు, ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ (Rheumatoid Arthritis)లో కనిపించవచ్చు. ఇది సాధారణ కీళ్ల నొప్పులతో పోలిస్తే భిన్నమైన ఆటో ఇమ్యూన్ సమస్య. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ఆయుర్వేదం పనిచేస్తుందా? ఇంగ్లీష్ మెడిసిన్ తప్పనిసరా? కొన్ని సందర్భాల్లో సంప్రదాయ వైద్య చికిత్స అవసరం లేదా? ఆటో ఇమ్యూన్ కీళ్ల సమస్యల్లో ఆయుర్వేదాన్ని ఎందుకు కొందరు నిపుణులు సిఫారసు చేయరు? ఫంక్షనల్ మెడిసిన్ విధానం ఎలా భిన్నంగా ఉంటుంది? ఈ వీడియోలో Acupuncture మరియు Functional Medicine నిపుణులు డా. పి.ఎస్. సాగర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు సంబంధించిన వివిధ చికిత్సా విధానాల గురించి వివరిస్తున్నారు. ఆయుర్వేదం, కన్వెన్షనల్ మెడిసిన్, ఫంక్షనల్ మెడిసిన్ మధ్య ఉన్న తేడాలు, వాటి విధానాలు, పరిమితులు మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో చికిత్సను ఎంచుకునేటప్పుడు పరిగణించాల్సిన అంశాల గురించి తెలుసుకోండి. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య పరిస్థితికి సరైన చికిత్సను నిర్ణయించుకునే ముందు అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది భక్తిశ్రద్ధలు, రంగురంగుల మండపాలు, అంతకుమించి స్వామివారికి నివేదించే రకరకాల నైవేద్యాలు. బొజ్జ గణపయ్యకు పెట్టే ప్రసాదాలు కేవలం సంప్రదాయంలో భాగం మాత్రమే కాదు, వాటి వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే ఈ పండుగ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాల వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంటుంది. మన పెద్దలు ఆ కాలానికి తగినట్లుగా, శరీరానికి మేలు చేసే పదార్థాలనే వినాయకుడి ప్రసాదాలుగా మార్చారు. ఆ ప్రసాదాలు ఏమిటి, వాటి వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే.. కుడుములు , ఉండ్రాళ్ళు.. వినాయక చవితి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి కుడుములు, ఉండ్రాళ్ళు. వీటిని నూనె లేకుండా కేవలం ఆవిరి మీద మాత్రమే ఉడికిస్తారు. ఆవిరి మీద ఉడికే ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి చాలా సులభంగా ఉంటాయి. బియ్యపు పిండి, పెసరపప్పు లేదా శనగపప్పు, బెల్లం, కొబ్బరి కలగలిపి వీటిని తయారుచేస్తారు. బియ్యపు పిండి కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఆవిరి వంటకం కావడం వల్ల జీర్ణక్రియకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా పొట్టలో మంట, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఇవి కాపాడతాయి. కొందరు కుడుములను మైదా పిండితో నూనెలో డీప్ ఫ్రై చేసి చేస్తారు. ఇది అంత ఆరోగ్యానికి మంచిది కాదు.   బెల్లం , పప్పుధాన్యాల కాంబినేషన్.. అన్ని రకాల ప్రసాదాలలో బెల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయాన్ని శుభ్రపరచడానికి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది. కుడుముల్లో వాడే శనగపప్పు, పెసరపప్పుల ద్వారా శరీరానికి కావలసిన ప్రోటీన్లు లభిస్తాయి. వర్షాకాలంలో పెరిగే బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి బెల్లం, పప్పుధాన్యాల కాంబినేషన్ శరీరానికి మంచి బలవర్ధకమైన ఆహారంగా పనిచేస్తుంది. జిల్లేడు కాయలు , మోదకాలు.. విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మోదకాలను బియ్యపు పిండిలో బెల్లం, కొబ్బరి పూరకంతో చేస్తారు. కొబ్బరిలో ఉండే మంచి కొవ్వులు చర్మానికి, జుట్టుకు చాలా మంచివి. అంతేకాకుండా కొబ్బరి శరీరానికి అవసరమైన శక్తిని త్వరగా అందిస్తుంది. కొబ్బరి , బెల్లం కలిపి తినడం వల్ల శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు, వాత రోగాల నివారణకు  ఈ కాంబినేషన్ చక్కగా తోడ్పడుతుంది. పాయసం , పరమాన్నం.. పాలు, బియ్యం, బెల్లం లేదా చక్కెరతో తయారుచేసే పాయసం నివేదనలో ముఖ్యమైనది. పాలల్లో లభించే కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది. ఇందులో వేసే యాలకులు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, కడుపులో ఉన్న ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. పాయసంలో వాడే నెయ్యి శరీరానికి కావలసిన విటమిన్లు ఎ, డి లభించేలా చేస్తుంది , కీళ్ళకు అవసరమైన నూనెను అందిస్తుంది. పులిహోర.. ఏ పండుగైనా పులిహోర లేకపోతే నివేదన పూర్తికాదు. వినాయక చవితి నాడు నిమ్మకాయ లేదా చింతపండు పులిహోరను ప్రసాదంగా పెడతారు. చింతపండు, నిమ్మకాయలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో విటమిన్ సి లభించడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పుల వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. పులిహోర తాళింపులో వాడే పసుపు సహజమైన యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. పసుపులోని కుర్కుమిన్ అనే అంశం శరీరంలో మంటను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే ఇందులో వేసే అల్లం, మిరియాలు జీర్ణరసాలను ఉత్పత్తి చేసి ఆకలిని పెంచుతాయి. చలిమిడి , వడపప్పు.. వినాయక చవితి పూజ ముగిసిన తర్వాత ఇచ్చే ముఖ్యమైన ప్రసాదం చలిమిడి ,   పచ్చి పెసరపప్పును నీటిలో నానబెట్టి వడపప్పుగా ఇస్తారు. నానబెట్టిన పెసరపప్పులో పీచు పదార్థం, ప్రోటీన్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. వేడి చేసిన బియ్యపు పిండి, బెల్లం కలిపి చేసే చలిమిడి శరీరానికి తక్షణ బలాన్ని ఇస్తుంది. వర్షాకాలంలో కలిగే అలసటను నివారించడంలో ఈ  కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. పండ్ల నివేదన , పత్రీ ప్రభావం.. స్వామివారికి ప్రసాదాలతో పాటు రకరకాల పండ్లను సమర్పిస్తారు. ముఖ్యంగా వెలగపండు, నేరేడు పళ్ళు, అరటిపళ్ళు నివేదిస్తారు. వెలగపండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, కడుపులోని క్రిములను సంహరిస్తుంది. నేరేడు పళ్ళు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. వీటితో పాటు పూజలో ఉపయోగించే ఏకవింశతి పత్రి కూడా ఒక రకమైన ఔషధ గని. పూజ చేసే సమయంలో ఆ పత్రి తాకిడి, వాటి సువాసనల వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ విధంగా వినాయక చవితి ప్రసాదాలు కేవలం నైవేద్యం మాత్రమే కాకుండా, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధాలుగా పనిచేస్తాయి. మన సంస్కృతిలో భాగమైన ఈ ప్రసాదాలను తిని, పండుగను భక్తితో పాటు ఆరోగ్యకరంగా జరుపుకోవడం ఆ వినాయకుడు ఇచ్చే అదృష్టం.. !                          *రూపశ్రీ.