LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నేడు ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని సుస్థిరం చేస్తూ, దానికి తిరుగులేని చట్టబద్ధత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.    శనివారం (మార్చి 28) ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ, దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.  గత కొన్నేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళానికి శాశ్వతంగా స్వస్తి పలకడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.   ఆంధ్రప్రదేశ్ ఏకైక,  శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ, భవిష్యత్తులో ఏ శక్తులు కూడా దీనిని మార్చలేని విధంగా రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా సభ్యులను కోరారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఒకే రాజధాని విధానం అత్యంత అవసరమన్నారు.   ఈ తీర్మానం  ప్రధాన ఉద్దేశ్యం కేవలం ఒక నగరాన్ని నిర్మించడం మాత్రమే కాదు, దానికి చట్టపరమైన భరోసా కల్పించడమని చెప్పారు.  గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వాలు మారినా,  రాజధాని మార్పు వంటి అంశాలు పునరావృతం కాకూడదనీ అందుకే ఈ తీర్మానాన్ని ఆమోదించాలనీ కోరారు. అసెంబ్లీలో ఈ తీర్మానం ఆమోందం పొందిన తరువాత  దీనిని తదుపరి చర్యల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా  స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రసంగిస్తూ.. రాజధాని అనేది ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న అంశమన్నారు.  రాజధాని నిర్మాణం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, రాజకీయ ప్రయోజనాల కోసం దానిని అడ్డుకోవడం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని ఆయన ప్రస్తుతించారు. గత ఐదేళ్లలో అమరావతి ఎదుర్కొన్న ఆటంకాలు, న్యాయపరమైన చిక్కులు,  రైతుల పోరాటాలను దృష్టిలో ఉంచుకుని  ఈ కొత్త తీర్మానం ద్వారా అందరిలోనూ భరోసా నింపడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  కాగా రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వల్ల  ఈ ప్రాంతంలో భూముల విలువ పెరగడంతో పాటు  పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.    
లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ఈ యాప్ ల వలలో పడి ఎందరో నిండు ప్రాణాలను బలవంతంగా తీసేసుకుంటున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటిని నియంత్రించడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు అంతగా సత్ఫలితాలను ఇస్తున్నట్లు కనిపించదు. తాజాగా కాకినాడ జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.  వివకాలిలా ఉన్నాయి.  అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహమ్మద్ బషీర్   కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఒక  ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మెరుగైన భవిష్యత్తు కోసం పట్టణానికి వచ్చిన బషీర్, కొంతకాలం క్రితం అవసరాల నిమిత్తం ఒక ఆన్‌లైన్ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవడంతో, లోన్ యాప్ నిర్వాహకులు బషీర్‌పై ఒత్తిడి పెంచారు. ఫోన్ కాల్స్ ద్వారా వేధించడమే కాకుండా, అసభ్యకరంగా మాట్లాడుతూ మానసిక క్షోభకు గురిచేశారు. ఈ క్రమంలోనే యాప్ నిర్వాహకుల వేధింపులు మితిమీరిపోవడంతో..  తీవ్ర మనస్తాపానికి గురైన బషీర్ తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  తమ కుమారుడి మృతికి కారణమైన లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆన్‌లైన్ రుణాల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి అక్రమ లోన్ యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.
  క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి  సెంటిమెంట్లు బాగా  ఎక్కువ‌. ఎందుకంటే  ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి  సెంటిమెంట్ల  ద్వారా. అలా త‌న తండ్రి  తెలంగాణ  రాష్ట్ర స‌మితి అనే పార్టీని ఏప్రిల్ 27, 2001లో స్థాపించ‌గా.. కూతురు క‌విత, పాతికేళ్ల త‌ర్వాత‌.. అంటే 2026, ఏప్రిల్ 25న పార్టీ ప్ర‌క‌ట‌న‌కు సుముహుర్తం ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు.ఇంత‌కీ ఈ పార్టీ పేరు ఏమై ఉంటుంది? అంటే, తెలంగాణ ప్రజా జాగృతి అని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆమె తెలంగాణ  జాగృతి అనే సామాజిక సంస్థ‌ను న‌డుపుతున్నారు. దీనికే ప్ర‌జా అనే ప‌దం  చేర్చుతూ దాన్ని రాజ‌కీయ పార్టీగా మార్చుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.   ఇక పార్టీ గుర్తులు ఏవి ఉంటాయో ప‌రిశీలిస్తే.. ధ‌ర్మ గంటను ఖ‌రారు చేసే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. జెండా, అజెండా  ఎలాంటివో గ‌మ‌నిస్తే ఇప్ప‌టికే జాగ్ర‌త్తికంటూ తెలుపు, లేత ప‌చ్చతో కూడిన జెండా రంగులున్నాయి. వీటికి అజెండాను జోడిస్తే.. సామాజిక తెలంగాణ లేదా తెలంగాణ  ఫ‌స్ట్.. ఆమె తీసుకున్న రాజ‌కీయ విధానంగా స‌మాచారం.  ఇక యువ‌త‌, మ‌హిళ‌లు, అణ‌గారిన వ‌ర్గాల హ‌క్కులు, మ‌రీ ముఖ్యంగా అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు అండ‌గా నిల‌బ‌డ్డం వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇక బీసీ  సంగ‌తి స‌రే స‌రి. మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ల‌పై పోరాటం కూడా ఆమె తీసుకుంటున్న పొలిటిక‌ల్ లైన్ల‌లో భాగ‌మే.  వ‌చ్చే ఎన్నిక‌ల  నాటికి డీలిమిటేష‌న్లో భాగంగా తెలంగాణ నియోజ‌క‌వ‌ర్గాలు సైతం పెర‌గ‌నుండ‌టంతో ఆమె పార్టీ నుంచి కూడా ఎంద‌రో కొత్త రాజ‌కీయ నాయ‌కులు పుట్టుకొచ్చేలా  తెలుస్తోంది.ఇక ఏప్రిల్ 25న ఎందుకు? ఈ ముహుర్తం  ఖ‌రారు చేయ‌డం వెనక ఉన్న ఉద్దేశ‌మేంటో ప‌రిశీలిస్తే.. కొన్ని జ్యోతిష శాస్త్ర ప‌ర‌మైన అంశాలు ఇందులో దాగి  ఉన్నట్టు స‌మాచారం. ఏప్రిల్ ఇర‌వై ఐదున రాజ‌యోగాన్నిచ్చే గ్ర‌హ‌గ‌తుల సంచారం  క‌నిపిస్తోందని అంటారు పండితులు. కొత్త  ప‌నులు ప్రారంభించ‌డానికి  ఇది సుదినంగా  చెబుతున్నారు.  దానికి తోడు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్స‌వానికి కూడా ఈ తేదీతో కొంత సంబంధ‌ముంది. పాతికేళ్ల క్రితం కేసీఆర్ 2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్రారంభించారు క‌విత తండ్రి కేసీఆర్. అదే తేదీకి అటు ఇటుగా తెలంగాణ ప్ర‌జా జాగృతి ప్రారంభిస్తున్నారు కేసీఆర్ త‌న‌య‌ క‌విత‌. ఆ పార్టీ  ఆనాడు ఎంతగా ఎదిగిందో, త‌న పార్టీ  కూడా అంతేలా  ఎదుగుతుంద‌ని బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు క‌విత‌. ఉగాది త‌ర్వాత వ‌చ్చే శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల అనంత‌రం త‌న పార్టీ  జెండా ఎగుర‌వేయ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్ల‌వ‌చ్చ‌న్న  న‌మ్మ‌కాలు కూడా క‌విత‌కు ఉన్న‌ట్టు స‌మాచారం.  బీఆర్ఎస్ లో తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు అన్యాయం జ‌రిగింది. అలాంటి వారికి త‌మ పార్టీలో స‌ముచిత స్థానం క‌ల్పిస్తాన‌ని అంటున్నారు క‌విత‌. ఇక చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళా సాధికార‌త‌ను తీసుకొచ్చేలా 33 శాతం రిజ‌ర్వేష‌న్ల‌కు కూడా ప్ర‌యారిటీ ఇస్తున్నారు. ప్ర‌త్యేకించీ యువ‌త కోసం ఉద్యోగ నోటిఫికేష‌న్లు.. నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌పై రాజీలేని పోరాటం కూడా క‌విత త‌న విధానంగా  చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌విత  పార్టీ ఎఫెక్ట్ ఎంత‌?  కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కి దీటుగా ఆమె పార్టీ టీపీజే  ఎదిగే అవ‌కాశం ఎంత‌? ద‌క్షిణాది నుంచి జ‌య త‌ర్వాత ఆ స్థాయిలో ఒక మ‌హిళ‌గా ఆమె రాజ‌కీయంగా ఎదిగి సీఎం కాగ‌ల‌రా?  తేలాల్సి ఉంది.
  తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు. తెలంగాణ ప్రజా పార్టీగా నామకరణం చేసిన నూతన పార్టీని ఏప్రిల్ 25 తేదీన ఉదయం 10గం.లకు అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. మేడ్చల్‌లోని మునిరాబాద్‌లో పార్టీ ప్రకటిస్తానని, అదే రోజు పార్టీ జెండా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు మంచి ముహూర్తం ఉందన్నారు.  రాముని ఆశీర్వాదంతో పార్టీ ప్రకటన తేదీని నిర్ణయించామని ముహుర్తాలపై తనకున్న నమ్మకాన్ని చాటుకున్నారు. వారణాసి వెళ్లి గంగా స్నానం చేసి పార్టీ నీ లంచ్ చేస్తామని జాగృతి అధ్యక్షురాలు స్పష్టం చేశారు.  వాస్తవానికి ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి రెండు రోజుల ముందు పార్టీని, జెండాను ఆవిష్కరించనున్నట్లు కవిత ప్రకటించడం విశేషం. ఏఏ అంశాలపై కొత్త పార్టీ పోరాటం చేయాలో తమ దృష్టికి తీసుకురావాలని కవిత శ్రీరామ నవమి సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందంటున్న కవిత, తెలంగాణ వచ్చినప్పటి నుంచి యువత  ఉద్యోగాల కోసం వేచి చూడాల్సి వస్తోందని పరోక్షంగా బీఆర్ఎస్‌పై మండిపడ్డారు.  తమ కొత్తపార్టీ ద్వారా యువత కోసం ఏం చేయబోతున్నామో చెబుతామని. యువత, మహిళలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని కవిత వెల్లడించారు.  జాగృతి సంస్థ ద్వారా బీసీలు, దళితుల హక్కుల కోసం పోరాటం చేశామని,  పార్టీ ఆవిర్భావం నాడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు,యువత పెద్ద ఎత్తున తరలిరావాలని కవిత కోరారు.  మొత్తానికి తెలంగాణ జాగృతి సంస్ధ...రాజకీయ పార్టీగా మారబోతుందిప్పుడు. తమ పార్టీ ఎవరికీ బీ పార్టీ కాదని ....తమది నెంబర్ వన్ పార్టీగా ఉండబోతుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. కొత్త పార్గీ నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో సలహాలు ఇవ్వాలని ,   అందుకోసం ఒక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేస్తామని, అలాగే మెయిల్‌కి మేసేజ్ చేయవచ్చన్నారు. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తామన్న కవిత,  అప్పటిలోగా.. అంటే రానున్న 28 రోజుల్లో ప్రతి ఒక్కరినీ కలుస్తానని ప్రకటించారు.. తెలంగాణ ఉద్యమకారులు, యువత, మహిళలు, మెథావులు, కవులు, పాత్రికేయులు అందరితో చర్చిస్తామన్నారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మద్రగడ పద్మనాభరెడ్డితో భేటీ అయ్యారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో జరిగిన ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం కిర్లంపూడి చేరుకున్న అంబటి నేరుగా ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో  రాజకీయ పరిస్థితులపై వారిరువురూ చర్చించారని తెలుస్తోంది. భేటీ అనంతరం అంబటి రాంబాబు ముద్రగడపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన పట్టుదల, రాజకీయాలలో నిజాయితీ, విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తుతించారు. తమ మధ్య జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.   అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఈ సందర్భంగా అంబటి విమర్శలు గుప్పించారు.   గతంలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని పోలీసులు ఏ విధంగా ఇబ్బందులకు గురిచేశారో అలాగే ఇప్పుడు వైసీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తీరును  తప్పుపట్టిన అంబటి రాంబాబు.. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు తగ్గేదేలే అంటూ పుష్పసినిమా స్టైల్ లో చెప్పారు.   వైఎస్సార్సీపీ తరపున, తన సామాజికవర్గం తరపున పోరాడుతూనే ఉంటానన్నారు. ప్రభుత్వ అణిచివేత ధోరణిని ప్రజలంతా గమనిస్తున్నారని అంబటి రాంబాబు చెప్పారు.   
ALSO ON TELUGUONE N E W S
- ప‌వ‌ర్‌స్టార్‌ రూట్ మార్చాల్సిందేనా?  - పవన్‌కు కలిసొచ్చే ప్రాజెక్టులివే..  - ఫ్యాన్స్ కోరుకుంటున్న క్రేజీ అప్‌డేట్! టాలీవుడ్ ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పాలనా వ్యవహారాల్లో తీరిక లేకుండా గడుపుతుండగా, మరోవైపు తన కోసం ఎదురుచూస్తున్న నిర్మాతలను, అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలు చేయాలి? ఆయనకు ఏ తరహా కథలు సెట్ అవుతాయి? అనే అంశంపై ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా దర్శకుడు సముద్రఖని రీసెంట్‌గా చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆస‌క్తిని పెంచాయి. గతంలో ప‌వ‌న్‌కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'బ్రో' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించడమే కాకుండా, పవన్‌కు ఒక డిఫరెంట్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచనలో సముద్రఖని ఉన్నట్లు తెలుస్తోంది. ప‌వ‌న్‌కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే 'బ్రో 2' పట్టాలెక్కించడం పెద్ద కష్టమేమీ కాదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసే అవకాశం ఉండటమే ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రధాన బలం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అత్యంత బిజీ షెడ్యూల్‌ను పాటిస్తున్నారు. రాష్ట్ర పర్యటనలు, అధికారిక సమీక్షలతో ఆయన డైరీ నిండిపోయింది. ఇలాంటి తరుణంలో భారీ బడ్జెట్ సినిమాలు, నెలల తరబడి షూటింగ్ అవసరమయ్యే ప్రాజెక్టులు చేయడం పవన్‌కు కాస్త భారమైన విషయమే. అందుకే, 'బ్రో' వంటి సినిమాలైతే తక్కువ కాల్షీట్లతోనే పూర్తి చేయవచ్చు. గతంలో 'బ్రో' షూటింగ్‌ను కూడా పవన్ రికార్డు సమయంలో పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు కూడా ఆయనకు ఇలాంటి ప్రాజెక్టులే కరెక్ట్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌కు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక సినిమా కమిట్ అయ్యారు. గతంలో ఇదే బ్యాన‌ర్‌పై 'బ్రో' నిర్మించినందున, సీక్వెల్ ప్లాన్ చేస్తే నిర్మాతలకు కూడా కలిసొచ్చే అంశం. దీనికి తోడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, సలహాలు తోడైతే షూటింగ్ శరవేగంగా సాగిపోతుంది. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే, ఏడాదికి ఒకట్రెండు సినిమాలు విడుదల చేయాలంటే ఇలాంటి 'షార్ట్ అండ్ స్వీట్' ప్రాజెక్టులే ఉత్తమమని ఫ్యాన్స్ కూడా అభిప్రాయ పడుతున్నారు. ఇక పవన్ రాబోయే చిత్రాల విషయానికొస్తే, 'ఓజీ' (OG)పై భారీ అంచనాలు ఉన్నాయి. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే 'ఓజీ' వంటి భారీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి సమయం పడుతుంది కాబట్టి, గ్యాప్‌లో 'బ్రో 2' వంటి సినిమాలు వస్తే బాగుంటుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ సీక్వెల్ వార్తలపై మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది 'ఓజీ' ఎప్పుడు వస్తుందా అని అడుగుతుంటే, మరికొందరు పవన్ కళ్యాణ్‌ను స్క్రీన్ మీద చూస్తే చాలు, అది ఎలాంటి సినిమా అయినా పర్లేదని కామెంట్స్ చేస్తున్నారు. మరి సముద్రఖని ప్రతిపాదనకు పవర్ స్టార్ ఓకే చెబుతారో లేదో చూడాలి. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం త్వరలోనే 'బ్రో 2' అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం తెలుగు సంవత్సరాది సందర్భంగా జర్నలిస్టుల కోసం డైరీ విడుదల చేయడం, ఇన్సూరెన్స్ ప్లాన్‌ను రెన్యువల్ చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. 2026–2027 సంవత్సరానికి సంబంధించిన డైరీ మరియు ఇన్సూరెన్స్ రెన్యువల్‌ను మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ ఏడాది ప్రత్యేకంగా, ప్రతి ఫిల్మ్ జర్నలిస్ట్ కుటుంబానికి (2+2) అందించే ఇన్సూరెన్స్ కవరేజీని ₹5 లక్షల నుంచి ₹10 లక్షలకు పెంచడం జరిగింది. అదేవిధంగా, ప్రమాదాల సమయంలో జర్నలిస్టులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేక యాక్సిడెంట్ పాలసీ ప్రవేశపెట్టారు. ఏదైనా ప్రమాదం కారణంగా 2 నుంచి 12 నెలలు బెడ్ రెస్ట్ అవసరమైన పరిస్థితుల్లో, ప్రతి వారం ₹10,000 చొప్పున సహాయం అందేలా ఈ పాలసీ రూపొందించబడింది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులకు గుర్తింపు కల్పించే విధంగా అసోసియేషన్ తరఫున ఐడి కార్డులు జారీ చేయగా, వాటిని కూడా చిరంజీవి గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు TFJA చేపడుతున్న కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందిస్తూ ₹5 లక్షల చెక్కును అందించి, సభ్యుల సంక్షేమానికి వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో TFJA ప్రెసిడెంట్ వై.జె.రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, ట్రెజరర్ నాయుడు సురేంద్ర, పోలిట్ బ్యూరో కన్వీనర్ వారణాసి లక్ష్మీనారాయణతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.
 -హృతిక్ రోషన్ మాజీ ప్రియురాలు ఎవరు -హాస్పిటల్ లో ఉండటానికి కారణం ఏంటి! -అసలు ఆమెకొచ్చిన వ్యాధి తీవ్రత ఎంత  స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan)ఒకప్పటి ప్రియురాలుగా ప్రముఖ నటి సబా ఆజాద్(Saba Azad)కి గుర్తింపు ఉంది. ఆ తర్వాతి కాలంలో మంచి స్నేహితులుగా మిగిలిపోయారు. రీసెంట్ గా సబా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్ చూసిన వాళ్లంతా  సబా ఆరోగ్య విషయంపై బాధపడుతున్నారు. ఆ న్యూస్ ఏంటో చూద్దాం. ఇనిస్టా వేదికగా బెడ్ పై పడుకొని ఉన్న తన పిక్ ని షేర్ చేస్తు నేను ‘సైక్లోస్పోరా కయెటానెన్సిస్’అనే ప్రమాదకర పరాన్నజీవి వల్ల వచ్చిన 'సైక్లోస్పోరియాసిస్ అనే వ్యాధి  బారిన పడ్డాను. గడిచిన 14 రోజులు నా లైఫ్ లోనే అత్యంత దారుణమైనవి. రోజుకి రెండు సార్లు జిమ్‌లో కఠినమైన వర్కౌట్లు చేసే నేను, ఇప్పుడు కనీసం ఒక టూత్‌పిక్ ఎత్తేంత బలం కూడా లేని స్థితికి చేరుకున్నాను. కేవలం రెండు వారాల వ్యవధిలోనే నాలుగు కిలోల బరువు తగ్గిపోయాను. కనీసం నడవడానికి కూడా ఓపిక లేని స్థితిలో ఉన్నాను. అలాంటి ఈ కష్ట సమయంలో హృతిక్ రోషన్ తన పక్కనే ఉండి ధైర్యం చెబుతున్నాడు. Also read: Rishab Shetty: స్టార్ హీరోయిన్ ని అన్ ఫాలో చేసిన రిషబ్ శెట్టి.. అందులో ఆమె హ్యాండ్ కూడా ఉంది ఈ ఇన్ఫెక్షన్ సోకడం వెనుక ఉన్న కారణం నన్ను షాక్ కి గురిచేసింది. ఎప్పుడూ ఇంటి భోజనమే తింటాను. బయటకు వెళ్లినా సొంత వాటర్ బాటిల్‌నే వెంట తీసుకెళ్తాను. ఇంతలా వ్యక్తిగత పరిశుభ్రత పాటించినా సదరు పరాన్నజీవి శరీరంలోకి ఎలా చేరిందో అర్థం కావడం లేదని చెప్పింది. అంతే కాకుండా నెటిజన్లని హెచ్చరిస్తూ మనం తినే ఆకుకూరలు, సలాడ్స్,కూరగాయల  విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.  కూరగాయలని కేవలం నీటితో కడిగితే సరిపోదు. బేకింగ్ సోడా లేదా వెజీ వాష్ ఉపయోగించి శుభ్రం చేయాలి. పచ్చిగా తినే ఆహార పదార్థాల ద్వారానే ఇలాంటి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఢిల్లీకి చెందిన సబా పూర్తి పేరు సబా సింగ్ గ్రేవాల్. ఇప్పటకి వరకు సుమారు పది చిత్రాల వరకు చేసింది. గత ఏడాది బాబీ డియోల్ హీరోగా వచ్చిన బందర్ అనే మూవీలో ఖుషి గా బాబీ డియోల్ ప్రేమికురాలిగా కనిపించింది. సింగర్ గాను తన సత్తా చాటింది.    
సినిమా ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. కొంతమంది హీరోయిన్లు వరుస హిట్లు అందుకుని స్టార్ హోదా పొందితే, మరికొంతమంది ఒకటి రెండు సినిమాలతోనే కనుమరుగవుతుంటారు. కానీ, వెండితెరపై ఆశించిన స్థాయిలో మెరవకపోయినా, నిజ జీవితంలో మాత్రం మహారాణిలా సెటిల్ అయిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అచ్చం అలాంటి అదృష్టమే వరించింది టాలీవుడ్ హీరోయిన్ అదితి ఆర్యను. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇజం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ, ప్రస్తుతం దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ వారసుడిని వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. అదితి ఆర్య గురించి చెప్పాలంటే.. ఆమె కేవలం ఒక నటి మాత్రమే కాదు, మేధావి కూడా. 2015లో 'ఫెమినా మిస్ ఇండియా వరల్డ్' కిరీటాన్ని గెలుచుకున్న ఈ సుందరి, ఆ తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరీ జగన్నాధ్ రూపొందించిన ‘ఇజం’ మూవీలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమాలో తన గ్లామర్, నటనతో పర్వాలేదనిపించినా, దురదృష్టవశాత్తూ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో ‘సెవెన్’, ‘నిన్ను వదిలి నేను పోలేనులే’ వంటి సినిమాల్లో నటించినా అవేవీ ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. తెలుగులో అవకాశాలు తగ్గడంతో అదితి ఆర్య తన ఫోకస్‌ను బాలీవుడ్ వైపు మళ్ళించింది. అక్కడ రణవీర్ సింగ్ నటించిన ‘83’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో మెరిసింది. అయితే సినిమాల్లో తన కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతున్న క్రమంలో, అదితి తన చదువుపై దృష్టి పెట్టింది. ప్రపంచ ప్రఖ్యాత ‘యేల్ యూనివర్సిటీ’ (Yale University) నుంచి ఎంబీఏ పూర్తి చేసి తన ప్రతిభను చాటుకుంది. కేవలం గ్లామర్ ప్రపంచానికే పరిమితం కాకుండా, విద్యా రంగంలోనూ ఆమె సాధించిన ఈ విజయం అందరినీ ఆశ్చర్యపరిచింది.అయితే అదితి ఆర్య జీవితంలో అతిపెద్ద మలుపు ఆమె వివాహం. ప్రముఖ వ్యాపారవేత్త, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ కుమారుడు జై కోటక్‌తో ఆమె కొన్నాళ్ల పాటు ప్రేమాయణం సాగించింది. వీరిద్దరూ ఉదయ్‌పూర్‌ వేదికగా అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నారు. అంబానీ కుటుంబంతో సహా దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. జై కోటక్ ప్రస్తుతం కోటక్ 811 విభాగానికి కో-హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఉదయ్ కోటక్ నికర ఆస్తి విలువ సుమారు 1.2 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. అటు అదితి సొంత సంపాదన, ఇటు కోటక్ కుటుంబ కోడలిగా ఆమె హోదాను బట్టి చూస్తే, సుమారు 12,000 కోట్ల రూపాయల ఆస్తికి ఆమె యజమానిగా మారిందని టాక్ వినిపిస్తోంది. సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయినా, వ్యక్తిగత జీవితంలో మాత్రం అదితి ఆర్య ఒక బిలియనీర్ కోడలిగా రాజభోగాలను అనుభవిస్తోంది. ప్రస్తుతం అదితి ఆర్య సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ, తన కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఆమె సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే, గ్లామర్ ప్రపంచాన్ని వదిలేసి బిజినెస్ మరియు ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు వెండితెరపై చూసిన ఈ హీరోయిన్ రేంజ్ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోవడంతో నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
  -కాంతార, కాంతార చాప్టర్ 1 తో క్రేజీ హీరోగా రిషబ్ శెట్టి  -సోషల్ మీడియాలోను ఫుల్ యాక్టీవ్  -కానీ ఆ హీరోయిన్ ని ఎందుకు అన్ ఫాలో చేసాడు రిషబ్ శెట్టి(Rishab Shetty)..స్తబ్దుగా ఉన్న సౌత్ చిత్ర పరిశ్రమకి కాంతార, కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1)తో సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చాడు. ఎంతలా అంటే ఎంటైర్ ఇండియన్ సినీ పరిశ్రమకి చెందిన మేకర్స్ మొత్తం కాంతార టైప్ లో మూవీ తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యేంతలా. దీంతో రిషబ్ శెట్టి గురించిన నిత్య తాజా అప్డేట్ గురించి తెలుసుకొనే అభిమానుల నెంబర్ ఏ రోజుకా రోజు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఒక న్యూస్ వాళ్ళందరిని  షాక్ కి గురవ్వలా! ఆలోచనలలో పడాలా! అనే అయోమయంలో పడేలా చేసింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం. రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటాడు. రీసెంట్ గా తన ఇనిస్టాగ్రామ్ అకౌంట్ నుంచి ప్రముఖ హీరోయిన్ రుక్మిణి వసంత్(Rukmini vasanth)ని అన్ ఫాలో చేసాడు.కాంతార చాప్టర్ 1 లో ప్రిన్సెస్ కనకవతి గా రుక్మిణి వసంత్ అత్యద్భుతమైన పెర్ఫార్మ్ తో మెస్మరైజ్ చేసింది. చిత్ర విజయంలో కూడా ఆమె భాగముందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.  అలాంటిది రిషబ్ శెట్టి అన్ ఫాలో చేసిన న్యూస్ ఇప్పుడు అభిమానుల్లో వైరల్ గా మారింది. ప్రముఖ నిర్మాత, నటుడు రాజ్ బి శెట్టి ని కూడా రిషబ్ అన్ ఫాలో చేసాడు. పైగా రిషబ్, రాజ్ సుదీర్ఘ కాలం నుచి మంచి మిత్రులు. రెండు రోజుల క్రితం కాంతార ని నిర్మించిన హోంబులే ఫిలిమ్స్ ని కూడా రిషబ్  అన్ ఫాలో చెయ్యడం గమనార్హం. also read: Varun Tej: అన్నయ్యకే ఎదురొస్తున్న తమ్ముడు.. 2027 సంక్రాంతి ఎవరిది  రిషబ్ అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే జై హనుమాన్ తో పాటు ది ప్రైడ్ ఆఫ్ భారత్  ఛత్రపతి శివాజీ మహారాజ్" అనే చిత్రాల్లో చేస్తున్నాడు. మరి ఈ రెండు చిత్రాలపై అంచనాలు ఏ విధంగా ఉంటాయో చెప్పక్కర్లేదు. రుక్మిణి వసంత్ అప్ కమింగ్ సినీ జర్నీని చూసుకుంటే ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ ల డ్రాగన్ లో చేస్తుంది.            
తెలుగు సాహిత్యంలో కొన్ని పుస్తకాలు కాలాతీతమైనవి. దశాబ్దాలు గడిచినా ఆ కథల్లోని సజీవత్వం ఏమాత్రం తగ్గదు. అటువంటి అరుదైన అద్భుతాల్లో డాక్టర్ దాశరథి రంగాచార్య రాసిన 'చిల్లర దేవుళ్లు' నవల ఒకటి. ఇప్పుడు ఈ అపురూప సాహితీ సంపదను వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో ఇదే నవలను ఆధారంగా చేసుకుని సినిమా వచ్చినప్పటికీ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో ఈ పీరియడ్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నిజాం కాలం నాటి తెలంగాణ సామాజిక పరిస్థితులు, దొరల గడీల్లో నలిగిపోయిన సామాన్యుల జీవితాలు, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం సాగిన పోరాటాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ముఖ్యంగా 1930ల నాటి తెలంగాణ పల్లెటూరి వాతావరణాన్ని, అప్పటి మనుషుల ప్రవృత్తులను రంగాచార్య గారు ఈ నవలలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇప్పుడు అటువంటి బలమైన కంటెంట్‌తో నేటి తరం ప్రేక్షకులను మెప్పించేలా ఒక భారీ ప్రాజెక్ట్‌ను రూపొందించే పనిలో టాలీవుడ్‌కు చెందిన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఉన్నట్లు సమాచారం. నిజానికి 1977లోనే 'చిల్లర దేవుళ్లు' సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. టి. మాధవరావు దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రానికి దాశరథి రంగాచార్య స్వయంగా సంభాషణలు సమకూర్చడం విశేషం. అప్పట్లో కె.వి. మహదేవన్ సంగీతంలో వచ్చిన 'కలువకు చంద్రుడు ఎంతో దూరం' వంటి పాటలు ఇప్పటికీ శ్రోతల మనసుల్లో నిలిచే ఉన్నాయి. తాజాగా ఈ కథను మళ్ళీ సినిమాగా తీయాలనే ఆలోచన రావడం వెనుక ప్రస్తుతం టాలీవుడ్‌లో నడుస్తున్న 'నేటివిటీ' ట్రెండ్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో 'బలగం' వంటి చిత్రాలు తెలంగాణ సంస్కృతిని, నేటివిటీని ప్రతిబింబిస్తూ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. దీంతో పాత తరం నాటి క్లాసిక్ కథలపై సినీ మేకర్స్ దృష్టి పడింది. ముఖ్యంగా పీరియడ్ చిత్రాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, చిల్లర దేవుళ్లు లాంటి కథను సరికొత్తగా ప్రెజెంట్ చేస్తే అది మరో లెవల్‌లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును హ్యాండిల్ చేయబోయే దర్శకుడు ఎవరు? నటీనటులు ఎవరనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచే సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సాహితీ ప్రియులు అయితే ఈ అద్భుత కావ్యానికి సరైన న్యాయం జరిగితే మరో 'రంగస్థలం' లేదా 'పుష్ప' రేంజ్ ఇంపాక్ట్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ మాండలికం, ఆనాటి గడీల వాతావరణం పర్ఫెక్ట్‌గా సెట్ అయితే ఈ సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా గుర్తింపు పొందే అవకాశం ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లు తెలుస్తోంది. నవలను వెండితెరపైకి అనువదించే క్రమంలో కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలా లేక ఒరిజినల్ ఆత్మ దెబ్బతినకుండా తెరకెక్కించాలా అనే కోణంలో స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టాలీవుడ్ అగ్ర నటుల్లో ఎవరో ఒకరు ఈ చారిత్రాత్మక పాత్రను పోషించే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్.  ఇదిలా ఉంటే.. క‌న్యాశుల్కం న‌వ‌ల ఇప్పుడు వెబ్ సిరీస్‌గా రాబోతోంది. ఇందులో ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. గ‌తంలో ఎన్టీఆర్ న‌టించిన క‌న్యాశుల్కం సినిమా వ‌చ్చింది. అలాగే చ‌లం మైదానం వంటి న‌వ‌ల‌లు కూడా సినిమాలుగా రాబోతున్నాయి. ఇలాంటి కంటెంట్‌ను ఓటీటీలు ఎక్కువ‌గా ప్రోత్స‌హిస్తున్నాయి. దీన్నిబ‌ట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో క్లాసిక్ న‌వ‌ల‌ల‌కు పూర్వ వైభ‌వం రావ‌డం ఖాయ‌మ‌ని అర్థ‌మ‌వుతోంది. 
  -పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభమైన వరుణ్ తేజ్ న్యూ మూవీ  -నీహారిక కొణిదెల నిర్మాత  -2027 సంక్రాంతికి రిలీజ్  -మరి వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడితో పోటీ తప్పదా! కొంత కాలంగా కట్ అవుట్ కి తగ్గ హిట్ ని అందుకోవడానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)అష్టకష్టాలు పడుతున్నాడు. తన క్యారక్టర్ పరిధి మేరకు బాగానే చేస్తున్నా కథ, కథనంలోని లోపాల వల్ల డిజాస్టర్స్ అనేవి చుట్టపు చూపుగా రావాల్సింది పోయి పర్మినెంట్ గా తిష్ట వేస్తున్నాయి. సోలో హీరోగా 2019 లో వచ్చిన 'గద్దలకొండ గణేష్' తప్ప మరో సినిమా హిట్ లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడితో చేసిన F3 హిట్ నే తన ఖాతాలో ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరికే వరుణ్ పోటీ రాబోతున్నాడు. డిటైల్స్ ఏంటో చూద్దాం. వరుణ్ తేజ్ ప్రెజంట్ మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi)దర్శకత్వంలో కొరియన్ కనకరాజు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే మరో మూవీ స్టార్ట్ చేసాడు. టైటిల్ 'బరి'(Bari). వాలీబాల్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కనుంది. నిర్మాత ఎవరో కాదు వరుణ్ సోదరి నిహారిక కొణిదెల(Niharika Konidela). ఈ రోజు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చేతుల మీదుగా పూజా కార్యక్రమాలతో సదరు మూవీ స్టార్ట్ అయ్యింది. నీహారిక నిర్మాణంలో  గతంలోనే వచ్చిన కమిటీ కుర్రాళ్లు దర్శకుడు యదువంశీ(Yadhu vamsi)దర్శకుడు. ఇప్పుడు ఈ మూవీ 2027 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ విషయాన్నీ నీహారిక అధికారకంగా ప్రకటించడం రసవత్తరంగా మారింది. Also read: Sridevi: శ్రీదేవి తర్వాత అందమైన హీరోయిన్ ఈమెనే.  కానీ తన అమ్మ వల్ల ఆమె జీవితం అందుకు కారణం లేకపోలేదు. వెంకటేష్(venkatesh),అనిల్ రావిపూడి(Anilravipudi)మూవీ త్వరలోనే స్టార్ట్ కానుంది. కళ్యాణ్ రామ్ కూడా ఒక హీరో. ఈ మూవీ కూడా సంక్రాంతి బరిలో నిలబడటం తధ్యం. అనిల్ రావిపూడితో పాటు ప్రేక్షకుల డ్రీం కూడా. మరి సెల్యులాయిడ్ పై తన F3  టీంతో వరుణ్ తేజ్ పోటీపడటం అంటే అన్నయ్య వెంకీ కే వరుణ్ యాదవ్ ఎదురొస్తున్నట్టుగానే ప్రేక్షకులు ఫీలవుతారు. అంతలా F 2 , F 3 తో వెంకీ, వరుణ్ మెస్మరైజ్ చేసారు.     
  - బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్  - 'పెద్ది'లో రామ్ చరణ్ కుస్తీ పోరాటం..  - మెగా ప‌వ‌ర్‌స్టార్ న‌ట‌ విశ్వరూపం  - స్పోర్ట్స్ డ్రామాలో కొత్త ట్రెండ్  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు ఈ సినిమా కేవలం క్రికెట్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా అని అందరూ భావించారు. కానీ, మేకర్స్ తాజాగా వదిలిన అప్‌డేట్ చూస్తుంటే దర్శకుడు బుచ్చిబాబు ఒక రేంజ్ లో ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో క్రికెట్‌తో పాటు ‘కుస్తీ’ (Wrestling) ఎలిమెంట్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. కేవలం ఆట మాత్రమే కాదు, ఆ ఆట వెనుక ఉన్న భావోద్వేగాలను కూడా అద్భుతంగా ఆవిష్కరించ బోతున్నారు. తాజాగా విడుదలైన ‘పెద్ది పహిల్వాన్’ అనే చిన్న వీడియో గ్లింప్స్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. "కుస్తీ అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా.. ప్రాణంతో చావుకు ఎదురెళ్లే ఆట" అంటూ వినిపిస్తున్న డైలాగ్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. అంటే, కథానాయకుడు క్రికెట్‌లో సత్తా చాటినప్పటికీ, పరిస్థితుల దృష్ట్యా కుస్తీ బరిలోకి దిగాల్సి వస్తుందనే పాయింట్‌ను ఈ వీడియో హింట్ చేస్తోంది. ఒకే సినిమాలో రెండు విభిన్నమైన క్రీడలను జోడించి, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో బుచ్చిబాబు ఒక వండర్ క్రియేట్ చేయబోతున్నాడని స్పష్టమవుతోంది. గతంలో క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ‘లగాన్’, కుస్తీ నేపథ్యంలో వచ్చిన ‘దంగల్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ రెండింటి కలయికతో ‘పెద్ది’ రాబోతుండటంతో, ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రామ్ చరణ్ తన కెరీర్‌లో ఇంతవరకు ఇలాంటి రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాలో నటించలేదు. అందుకే చరణ్ మేకోవర్, ఫిజిక్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండటం మరో విశేషం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ మరియు పాటలు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ బ్యాటింగ్ స్టైల్ చూసి మురిసిపోయిన అభిమానులు, ఇప్పుడు ‘పహిల్వాన్’ గెటప్‌లో ఆయన్ని చూడటానికి మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతున్న ఈ మూవీ రామ్ చరణ్ ఇమేజ్‌ను మరో మెట్టు ఎక్కిస్తుందనడంలో సందేహం లేదు. టెక్నికల్ పరంగా కూడా టాప్ క్లాస్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. ముఖ్యంగా ఏ.ఆర్. రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది. మరికొద్ది రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ రాబోతున్నాయనే వార్త మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది.
- 'ధురంధర్ 2'పై ఎంపీ ఘాటు విమర్శలు. - 1100 కోట్లు కొల్లగొట్టిన రణవీర్ సినిమా..  - రణవీర్ సింగ్ వర్సెస్ ఓవైసీ  - ముస్లింల చిత్రీకరణపై తీవ్ర అభ్యంతరం ముక్కుసూటిగా మాట్లాడే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన రాజకీయ అంశాలపై కాకుండా, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్న బాలీవుడ్ చిత్రం 'ధురంధర్ 2'పై విరుచుకుపడ్డారు. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పై థ్రిల్లర్‌ను ఆయన ఘాటు పదజాలంతో విమర్శించడం ఇప్పుడు సినిమా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన ఒక సదస్సులో పాల్గొన్న ఓవైసీకి 'ధురంధర్ 2' సినిమా గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ.. "అసలు అది ఒక సినిమానా? మూడు గంటల పాటు సాగే అదొక బక్వాస్ (చెత్త)" అంటూ కొట్టిపారేశారు. సినిమాలో కేవలం బూతులు, హింసను ప్రోత్సహించే సన్నివేశాలు తప్ప మరేమీ లేవని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు గంటల పాటు సమయం వృధా చేసుకుని ఇటువంటి సినిమాలు చూసే తీరిక తనకు లేదని, ప్రజలు తన ప్రసంగాలను ఒక గంట విన్నా ఎంతో కొంత జ్ఞానం లభిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ముస్లింలను చూపించిన తీరుపై ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా చూశాక ముస్లింలను దూషించాలనే భావన కలిగేలా సన్నివేశాలు ఉన్నాయని, సమాజంలో విద్వేషాన్ని పెంచేలా సినిమాను మలిచారని ఆయన ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వస్తున్న ఆదరణ గురించి ప్రస్తావించగా, తనదైన హైదరాబాదీ శైలిలో స్పందిస్తూ అటువంటి విషయాలను తాను పట్టించుకోనని తేల్చి చెప్పారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురంధర్ 2' చిత్రం గతేడాది వచ్చిన 'ధురంధర్'కు సీక్వెల్. ఇందులో రణవీర్ సింగ్ 'జస్కిరత్ సింగ్ రంగీ' అలియాస్ 'హమ్జా అలీ మజారీ' అనే భారతీయ గూఢచారి పాత్రలో నటించారు. పాకిస్థాన్‌లోని కరాచీ అండర్ వరల్డ్‌లోకి చొరబడి ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసే మిషన్‌లో భాగంగా సాగే ఈ కథలో సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించారు. గూఢచారిగా రణవీర్ నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. ఒకవైపు విమర్శలు వస్తున్నా, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా అన్-స్టాపబుల్‌గా దూసుకుపోతోంది. విడుదలైన కేవలం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 1140 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. గతంలో భారీ విజయం సాధించిన 'పుష్ప' వంటి సినిమాల రికార్డులను సైతం ఈ చిత్రం అధిగమించడం విశేషం. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం వంటి దక్షిణాది భాషల్లో కూడా ఈ స్పై థ్రిల్లర్‌కు మంచి వసూళ్లు వస్తున్నాయి. రాజమౌళి, అల్లు అర్జున్ వంటి దిగ్గజాలు ఇప్పటికే ఈ సినిమా సాంకేతిక విలువలను, రణవీర్ నటనను ప్రశంసించారు. అయితే రాజకీయ నాయకుల నుండి వస్తున్న ఇటువంటి విమర్శలు సినిమా వసూళ్లపై ఏమైనా ప్రభావం చూపుతాయా లేదా అన్నది వేచి చూడాలి. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ చిత్రం, లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్లకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంటుంది. 'డీజే టిల్లు' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు విమల్ కృష్ణ, ఇప్పుడు మరో ఆసక్తికరమైన టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాగ్ మయూర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి 'అనుమాన పక్షి' అనే వెరైటీ పేరును ఫిక్స్ చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలోని "గులాబ్ జామ్" అనే సాంగ్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తాజాగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. డీజే టిల్లు తర్వాత విమల్ కృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీలో దీనిపై మంచి బజ్ ఉంది. ఈ పాటలో ఉన్న ఎనర్జీ, బీట్ వింటుంటే మరో మ్యూజికల్ హిట్ ఖాయమనిపిస్తోంది. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన ఈ గీతానికి కిట్టు విస్సాప్రగడ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. మరీ ముఖ్యంగా, సీనియర్ సింగర్ రమణ గోగుల తనదైన శైలిలో ఈ పాటను ఆలపించడం విశేషం. చాలా కాలం తర్వాత రమణ గోగుల వాయిస్‌లో వస్తున్న ఈ సాంగ్ వినడానికి చాలా హుషారుగా ఉందనే టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ పాట త్వరగానే వైరల్ అవుతోంది. సినిమా కాన్సెప్ట్ గురించి దర్శకుడు విమల్ కృష్ణ స్పందిస్తూ.. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక విషయంలో అనుమానం కలుగుతుంటుందని, ఆ పాయింట్‌ను బేస్ చేసుకునే ఈ కథను రాసుకున్నట్లు తెలిపారు. ఇది కేవలం కామెడీ మాత్రమే కాదు, ఇందులో ఒక చిన్న సైకలాజికల్ సస్పెన్స్ ఎలిమెంట్ కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 'డీజే టిల్లు'లో హీరో క్యారెక్టరైజేషన్ ఎంతలా క్లిక్ అయిందో, ఈ సినిమాలో రాగ్ మయూర్ పాత్ర కూడా అదే స్థాయిలో మెప్పిస్తుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది. ఈ చిత్రంలో రాగ్ మయూర్ సరసన మెరిన్ ఫిలిప్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ప్రిన్స్, రాశి, బ్రహ్మాజీ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ప్రమోషన్ల జోరు పెంచిన 'అనుమాన పక్షి' టీమ్, సినిమాను మే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ వేసవిలో ప్రేక్షకులకు కావాల్సిన ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమా ద్వారా లభిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రాగ్ మయూర్ కెరీర్‌లో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని, అలాగే విమల్ కృష్ణ తన సక్సెస్ ట్రాక్‌ను కొనసాగిస్తారని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ మరియు ట్రైలర్ గురించి మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి.
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత నెల ఆఖరున వచ్చే విద్యుత్ బిల్లు ఒక ఎత్తు.  చాలా మంది విత్యుద్ బిల్లుకు భయపడి ఏసీ వినియోగించే విషయంలో వెనకడుగు వేస్తారు.  అయితే ఇలాంటి వాటికి సోలార్ ఏసీ ఒక పర్మినెంట్ సొల్యూషన్ ఇస్తుంది. ఇవి హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించి పనిచేస్తాయి. పగటిపూట సూర్యరశ్మితో, రాత్రిపూట గ్రిడ్ లేదా బ్యాటరీ బ్యాకప్‌తో నడుస్తాయి. ఇవి ఆర్థికంగా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి మాత్రమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడటం ద్వారా పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఎంత ఏసీకి ఎంత సోలార్ సెటప్ ఉండాలి? 1 టన్ను సోలార్ ఏసీని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే, అది సరిగ్గా పనిచేయడానికి కనీసం 1.5KW (1500 వాట్స్) సామర్థ్యం గల సోలార్ ప్యానెల్ అవసరం అవుతుంది. పగటిపూట సూర్యరశ్మి  తీవ్రంగా ఉన్నప్పుడు, ఏసీ పూర్తిగా సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో పనిచేస్తుంది.  ఇది నేరుగా DC పవర్‌పై పనిచేసే మోడళ్లలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇది పవర్ నష్టాన్ని తగ్గించి, మెరుగైన కూలింగ్  పనితీరును అందిస్తుంది. నైట్ బ్యాకప్ సెలక్షన్.. సోలార్ ఏసీ  అతిపెద్ద ప్రయోజనం దాని సౌలభ్యం. అంటే, ఒకవేళ రాత్రిపూట  బ్యాటరీ బ్యాకప్ అయిపోతే,  దానిని విద్యుత్‌తో నడపవచ్చు. ఈ సాంకేతికత రాత్రిపూట కూడా  ఏసీ పనితీరుకు ఎలాంటి సమస్య ఉండదని హామీ ఇస్తుంది.  సులభంగా చెప్పాలంటే,  సౌరశక్తితో పాటు విద్యుత్తుతో కూడా ఏసీని నడపవచ్చు. పైన పేర్కొన్న సోలార్ ఏసీ ని ఆన్లైన్ మార్కెట్లో అయినా, ఆఫ్ లైన్ మార్కెట్ లో అయినా కొనుగోలు చేయవచ్చు. ఇంటి పైకప్పు మీద తగినంత స్థలం ఉంటే.. సోలార్ ఏసీ ఎంపిక చాలా మంచిది.                                         *రూపశ్రీ.
రాముడు రాఘవుడు రవికులుడితడు అనే పాటను వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో శ్రీరాముడు పితృవాఖ్య పరిపాలకుడు అనే మాటను విని ఉంటాము. ఇంకా చక్కని నడవడిక కలిగిన అబ్బాయిలను చూస్తే రాముడు అనే టాగ్ వేస్తాము. ఇలా మన జీవితాలలో రాముడు ఒక భాగం. అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరామచంద్రుడు యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం అంటారు. కొన్ని విమర్శలు ఉన్నా వాటి వెనుక కూడా సరైన హేతువులతో ఆలోచిస్తే దశావతారాలలో రాముడి అవతారం ప్రజలకు ఏదో చెప్పడానికే ఈ భూమి మీదకు వచ్చిందని ఖచ్చితంగా నమ్ముతారు. నవమి వైభవం!! నవమి రోజు రాముడు పుట్టాడు. అయితే అన్నిచోట్లా శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణం జరుపుతారు. భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రసిద్ధ గుడులలో ఇంకా చిన్న చిన్న రాముడి కోవెలలో కూడా సీతారాముల కల్యాణం ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. తెలంగాణలో భద్రాచలంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట లోనూ రాముడి కల్యాణం, శ్రీరాముడి పట్టాభిషేకం ఎంతో బాగా చేస్తారు.  ఏకపత్నీ వ్రతుడు!! ఒకటే మాట, ఒకటే బాణం అనే క్రమంలో సాగే రాముడు జీవితంలో కూడా ఒక భార్యను మాత్రమే కలిగి ఉండటం చక్కని సందేశం. ఆ కాలానికి ఒకటికి పదిమందిని పెళ్లిళ్లు చేసుకుని వందలకొద్ది పిల్లల్ని కలిగిన రాజుల కాలంలో రాముడు సీతకు మాత్రమే జీవితంలో చోటిచ్చాడు. శివదనస్సును విరిచి మరీ సీతను సొంతం చేసుకున్న ఈ కౌసల్యా కుమారుడు తన జీవితంలో ఏ ఇతర ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదంటే ఆశ్చర్యమేస్తుంది.  రామాయణం!! భారతీయ సాహిత్య చరిత్రలో ఇదొక అద్భుత గ్రంధం. ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన ఈ రామాయణం ఏడు కాండలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నతనం నుండి పిల్లలకు రామాయణాన్ని చెబుతూ ఉండటం వల్ల పిల్లల్లో గొప్ప వ్యక్తిత్వం అలవడుతుందని అంటారు. ఇదే నిజం కూడా.  ఇంకా ఇందులో రాముడు మాత్రమే కాకుండా సీత, లక్ష్మణుడు, రాముడి ప్రయాణంలో ఎదురయ్యే ఎందరో గొప్ప వ్యక్తిత్వాలుగా మనకు కనబడతారు.  హనుమంతుడు, జటాయువు, విభీషణుడు, సుగ్రీవుడు, వానర సైన్యం. ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు రామాయణంలో ఉంటారు.  వీళ్ళు మాత్రమే కాకుండా గుహుడు, శబరి లాంటి గొప్ప రామభక్తులు కూడా కనిపిస్తారు. అందుకే రామాయణం అంత గోపోయా గ్రంథమయ్యింది. కాలంతో పాటు నిలిచే ఉంది. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే!! అవన్నీ పనిగట్టుకుని పుడుతున్నవి కాబట్టి ఈ రామాయణం ఆ రామ నామం ధర్మబద్ధమైన జీవితం మనిషి మనుగడ ఉన్నంతవరకు ఉంటాయి. రామనామం!! రాముడు గొప్పవాడా రామ నామం గొప్పదా అంటే రామ నామమే గొప్పది అంటారు. ఒక్కసారి రమానామాన్ని జపిస్తే వెయ్యిసార్లు ఇతర దేవుళ్లను జపించినట్టని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. వారధి కడుతున్న వానరసైన్యం ప్రతి రాయి మీద రామా అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతున్నాయి. కానీ స్వయంగా రాముడే వాటిని సముద్రంలో వేస్తే అవి మునిగిపోయాయి. దీనిని బట్టి రాముడి కంటే రామ నామమే ఎంతో గొప్పది అని అర్థమవుతుంది. త్యాగరాజు అంటాడు  నిధి చాల సుఖమా రాముని స న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా అని రామదాసు అంటాడు ఓ రామ నీనామ శ్రీరామ నీనామ మేమి రుచిరా అని ఎన్ని రకాలుగా చూసినా రాముడి వంటి పురుషుడు, రామ నామమంత సులువైన శక్తివంతమైన అద్భుత మార్గం మరొకటి ఉండదు అని నిక్కచ్చిగా చెప్పచ్చు. ఈ శ్రీరామ నవమి నాడు ఆ రామచంద్రుడిని పలుకే బంగారయాయేనా కోదండపాణి అంటూ లాలనగా ప్రార్థిస్తూ పునీతులవుదాం. ఇంకా గుడిలో వడపప్పు, పానకం వేసవిలో కమ్మగా తినేసొద్దాం.  ◆వెంకటేష్ పువ్వాడ.                           
  మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం.  అయితే ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విషయాలను ఎవరికీ చెప్పకూడదు అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు.  మనిషి జీవితంలో ఏ విషయాలు ఇతరులకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? తెలుసుకుంటే.. ఆర్థిక పరిస్థితి గురించి  ఆదాయం, బ్యాంకు బ్యాలెన్స్, పెట్టుబడులు లేదా ఏ రకమైన లోన్ గురించైనా సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకోవడం ప్రమాదకరం కావచ్చు.  కొన్నిసార్లు ఇలాంటి  సమాచారాన్ని చాలా మంది పుకారు అని వ్యక్తిత్వాన్ని చిన్నతనం చేయడం, లేదా సమాచారాన్ని అనుసరించి తప్పుడు పనులకు పాల్పడటం జరిగే అవకాశం ఉంటుంది.  ఉదాహరణకు.. ఏదైనా పెద్ద ఆస్తిని కొనుగోలు చేశారని లేదా ఏదైనా పెద్ద వస్తువు లేదా బంగారం లాంటివి కొనుగోలు చేశారని  ఎవరికైనా చెబితే..అది కాస్తా అందరికీ తెలుస్తూ చివరికి  దొంగతనం లేదా మోసపోవడానికి  దారితీయవచ్చు. అందువల్ల, ఆర్థిక విషయాలలో గోప్యతను పాటించడం ఎల్లప్పుడూ సురక్షితం. ఆరోగ్యం, వైద్య సమాచారం.. ఆరోగ్యం,  మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం చాలా సున్నితమైనది.  తీవ్రమైన అనారోగ్యాలు, మందుల అవసరాలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలను నమ్మకమైన వ్యక్తికి లేదా వైద్యుడికి మాత్రమే చెప్పడం మంచిది.   ఉదాహరణకు..  దీర్ఘకాలిక అనారోగ్యం ఉందని ఎవరికైనా చెబితే.. ఆ విషయం తప్పుడు వ్యక్తుల చేతికి వెళితే సామాజికంగా లేదా వృత్తిపరంగా నష్టం చేకూరే స్థితికి దారితీయవచ్చు. ఇష్టమైన, ఇష్టం లేని విషయాలు.. మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కూడా కొన్నిసార్లు ఇతరుల నుండి వ్యంగ్యానికి లేదా విమర్శకు మూలంగా మారవచ్చు.  వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ఇతరులకు చెప్పినప్పుడు వాటిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటే  ఎగతాళి చేయవచ్చు. కాబట్టి,  ఇష్టాయిష్టాలను నమ్మకమైన స్నేహితులకు మాత్రమే తెలియజేయండి. రిలేషన్స్, పర్సనల్ లైఫ్.. రిలేషన్స్ గురించి,  వ్యక్తిగత విషయాల గురించి బహిరంగపరచడం  గోప్యతకు భంగం కలిగించవచ్చు.  ఉదాహరణకు.. ఒక వివాదాన్ని లేదా కుటుంబ సమస్యను సోషల్ మీడియాలో లేదా మూడవ వ్యక్తితో పంచుకోవడం  ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అలాగే  ఆత్మగౌరవానికి భంగం కలిగేలా చేస్తుంది.  అంతేకాదు..  బంధాల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది.                                 *రూపశ్రీ.
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది.  వెల్లుల్లి వాసన, ఘాటైన రుచితో ఆహారానికి రెట్టింపు రుచిని ఇస్తుంది.  అయితే  వెల్లుల్లి తినడం కంటే.. వెల్లుల్లి నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు.  ఇంతకీ వెల్లుల్లి నీరు ఆరోగ్యానికి  చేసే మలు ఏమిటి? వెల్లుల్లి నీటిని ఎలా తయారు చేసుకోవాలి?  పూర్తీగా తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి.. వెల్లుల్లి నీరు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే ఒక పానీయం. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వైరస్‌లు, బ్యాక్టీరియా మరియు ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి బలాన్ని ఇస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వెల్లుల్లి నీరు తాగడం గుండె ఆరోగ్యానికి మంచిది. వెల్లుల్లికి రక్తపోటును తగ్గించే సామర్థ్యం ఉంది. ఇది రక్తనాళాలను విస్తరింపజేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, వెల్లుల్లి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల గుండెపోటు మరియు పక్షవాతం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వెల్లుల్లి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగుల నుండి వ్యర్థాలను తొలగించి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అజీర్ణం, గ్యాస్,  మలబద్ధకం వంటి సమస్యలకు ఇది ఒక మంచి ఔషదంగా పనిచేస్తుంది.. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు తాగితే చాలా మంచిది. బరువు.. వెల్లుల్లి నీరు బరువు అదుపులో ఉంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇది శరీర జీవక్రియను పెంచి కొవ్వును కరిగిస్తుంది. ఆకలిని నియంత్రించడం ద్వారా   పదే పదే ఏదో ఒకటి తినాలని అనిపించే వారికి చాలా చక్కగా సహాయపడుతుంది. అందువల్ల, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి డ్రింక్. వ్యాధులు.. వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి నీరు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది,   చర్మం మీద ముడుతలు వంటివి పడకుండా చర్మం యవ్వనంగా ఉండటంలో సహాయపడుతుంది. వెల్లుల్లి నీరు ఎలా తయారు చేసుకోవాలంటే.. రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి పరగడుపున తాగాలి. కొన్ని రోజుల్లోనే చాలా మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.                                      *రూపశ్రీ.
  హైందవులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిస్తుంది. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమినాటి పానంకం కూడా అంతే! శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల... మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట! ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబలుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి... ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరో పక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లివారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు, ఈ సంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు.   బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడిదగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే! పెసరప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పడు చాలామంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని (సూప్‌) తాగడం మొదలుపెట్టారు. మనం ఆడుతూపాడుతూ తాగే వడపప్పు, పానకాల వెనుకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట!   ..నిర్జర.
మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది  కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు అంటున్నారు. మరీ ముఖ్యంగా అందరికీ కాకుండా కొందరికి మాత్రమే మూత్రపిండాల సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నేటికాలంలో చర్మ సంరక్షణలో భాగంగా చాలా రకాల క్రీములు వాడుతూ ఉంటారు.  ఇవి కూడా మూత్రపిండాల సమస్యకు కారణం అవుతాయి అనే మాట చాలా చర్చలకు దారి తీస్తోంది.   మూత్రపిండాల సమస్యకు అసలు కారణాలు ఏంటి? మూత్రపిండాల సమస్య ఎవరిలో ఎక్కువ వస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. రెండు రూపాలు.. మూత్రపిండాల వ్యాధులు రెండు రూపాలలో వస్తాయి.  మధుమేహం వల్ల వచ్చే మూత్రపిండాల వ్యాధి మొదటిది. 50 శాతం మందికి మధుమేహం కారణంగా మూత్రపిండాల వ్యాధి వస్తుంది. అధిక రక్తపోటు మరొక కారణం. మూత్రపిండాల్లో రాళ్లు,  ఇన్ఫెక్షన్లు కూడా ఈ వ్యాధికి ఇతర కారణాలు. జన్యుపరంగా,  ఇతర మందులు తీసుకోవడం వల్ల కూడా మూత్రపిండాల వ్యాధి రావచ్చు. తాత్కాలిక,  శాశ్వత మూత్రపిండాల వ్యాధులు కూడా ఉన్నాయి. తాత్కాలిక మూత్రపిండాల వ్యాధి.. మలేరియా, డెంగ్యూ జ్వరం లేదా లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధి వచ్చినప్పుడు,  మూత్రపిండాలు తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోతాయి. ఈ పరిస్థితిలో డయాలసిస్ అవసరం కావచ్చు. లేదా మందులతో దీనిని నయం చేయవచ్చు. ధీర్షకాల మూత్రపిండాల వ్యాధి.. కొంతమందికి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉండవచ్చు. ఇది మధుమేహం,  అధిక రక్తపోటు కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే, చివరికి  డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి అవసరం  ఏర్పడుతుంది. లక్షణాలు.. మూత్రపిండాల వ్యాధికి తరచుగా ఎలాంటి లక్షణాలు ఉండవు. అందుకే చాలామంది  దానిని పట్టించుకోరు. ఏదైనా అనుమానం వచ్చి పరీక్ష చేయించుకున్నప్పుడు మాత్రమే రక్తంలో క్రియాటినిన్ స్థాయి ఎక్కువగా ఉందని తెలుస్తుంది. మూత్రపిండాల వైఫల్యానికి అత్యంత సాధారణ లక్షణం కాళ్ళలో నీరు చేరడం. ఇతర లక్షణాలలో లైట్ గా చలి, నొప్పి, జ్వరం, లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే చలి,  వెన్నెముకకు ఇరువైపులా నొప్పి వంటివి  ఉంటాయి. పాదాల వాపు మూత్రపిండాల వ్యాధి లక్షణం అని ఖచ్చితంగా చెప్పలేము. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా పాదాల వాపు రావచ్చు. జీవనశైలిలో మార్పులు కూడా మూత్రపిండాల వ్యాధికి కారణం కావచ్చు. మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్ తినడం,  ఊబకాయం వంటివన్నీ మూత్రపిండాల వ్యాధికి దారితీసే పరిస్థితులు. మూత్రం రంగు మారడం, మూత్రంలో రక్తం కనిపించడం,  మూత్ర విసర్జనలో ఇబ్బంది కూడా మూత్రపిండాల వ్యాధి లక్షణాలే. చర్మాన్ని తెల్లబరిచే క్రీములతో మూత్రపిండ వ్యాధులు.. చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగించే క్రీములు మూత్రపిండాలకు హాని కలిగించవచ్చని వైద్యులు అంటున్నారు. వైద్యపరంగా ఉపయోగించే క్రీములు సాధారణంగా పెద్ద సమస్యలను కలిగించవు.  కానీ చాలామంది అందం మీద పిచ్చితో సోషల్ మీడియాలో కనిపించే ప్రమోషన్ యాడ్స్,  ఇంటర్నెట్ లో కనిపించే పేక్ రివ్యూస్ చూసి సొంతంగా క్రీములు ఎంచుకుని వాడుతుంటారు. అలాంటి క్రీములలో అధిక పరిమాణంలో పాదరసం ఉండవచ్చని అంటున్నారు. పాదరసానికి చర్మాన్ని తెల్లగా చేసే గుణం ఉంది. పాదరసం మూత్రపిండాలకు ప్రమాదకరమైన పదార్థం. మూత్రపిండాలకు హాని కలిగించే మరొక పదార్థం ఆర్సెనిక్. చాలా క్రీములలో వీటన్నింటి పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం పాటు  వాడటం వల్ల, ఇది చర్మం ద్వారా రక్తంలో కలిసి మూత్రపిండాలకు చేరి ప్రమాదం కలిగిస్తుందని పరిశీలనలలో తేలింది. వైద్య సలహా లేకుండా ఎలాంటి క్రీములు వాడకుండా ఉండటం చాలా ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు.                                  *రూపశ్రీ.