జగన్ రోజు రోజుకూ ఓ ట్రోల్ ఐటెమ్ గా మారిపోతున్నారా?

posted on: Jul 2, 2026 11:54AM

ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  జగన్.. రోజు రోజుకూ ఓ ట్రోల్ స్టఫ్ గా మారిపోతున్నారా? అంటే నెటిజనులు ఔననే అంటున్నారు. ఇటీవలి కాలంలో ఆయన   మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారని తెలియగానే.. ట్రోలింగ్ కు, మీమ్స్ కు కావలసినంత స్టఫ్ దొరుకుతుందని నెటిజనులు సంబరపడిపోతున్నారు. అందుకు తగ్గట్టుగానే జగన్ ప్రెస్ మీట్ లలో చేసే ప్రసంగాలు ఉంటున్నాయి.  జగన్ ప్రసంగాలు,  మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి.

 నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.  అందుకు తగ్గట్టుగానే జగన్   వివాదాస్పదమైన, వినూత్నమైన ప్రకటనలు ట్రోలర్లకు, నెటిజనులకు కావలసినంత స్టఫ్ అందిస్తున్నాయి.  తాజాగా బుధవారం (జూన్ 1) జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో  అమరావతి వర్సెస్ 'మావిగన్' అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇప్పటికే జగన్ మావిగన్ ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా అందరి హేళనలకూ గురై ఒక హాస్యాస్పద అంశంగా మారిపోయింది. అదలా ఉండగానే.. తన తాజా ప్రెస్ మీట్ లో జగన్  ఏకంగా మావిగన్ ను వచ్చే ఎన్నికల అజెండాగా ప్రకటించడం నెటిజనులకు పండుగలా మారింది. 

ఇక దీనిపై మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానం దాటవేసిన తీరు కూడా ఆయనపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ కు కారణమైంది. సాధారణంగా ప్రెస్ మీట్లలో ఎదురయ్యే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పే జగన్, ఈసారి మాత్రం ఎన్నికల అజెండాగా మావిగన్ అంటూ చేసిన ఆయన ప్రకటనపై విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోవడం కూడా జగన్ పారిపోయారు అంటూ నెటిజనులు ట్రోల్ చేయడానికి కారణమైంది.  మావిగన్ ఎన్నికల అజెండా అయితే విశాఖ పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు జగన్ నిరుత్తరుడై, కనీసం ఆ ప్రశ్న సంధించిన విలేకరి వైపైనా చూడకుండా.. హడావుడిగా ప్రెస్ మీట్ ను ముగించేయడం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. 

ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా జగన్ జారుకున్నారనీ, ప్రశ్నలు వినిపించలేదన్నట్లు యాక్ట్ చేయడంలో జగన్  కమల్ హసన్ ను మించిపోయారనీ నెటిజన్లు వీర లెవెల్లో ఎగతాళి చేస్తున్నారు.  2019 నుంచి 2024 వరకూ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్.. ఆ ఐదేళ్లూ  విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధాని అని, త్వరలోనే అక్కడి నుంచే పాలన సాగిస్తానని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి అత్యంత ఆదర్శవంతమైన ఫార్ములా మూడు రాజధానులేననీ, అదే తాను చేస్తున్నాననీ చెప్పుకున్నారు.

అయితే మూడు రాజధానులను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలూ  2024 ఎన్నికలలో మూకుమ్మడిగా తిరస్కరించి, వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తీర్పు ఇచ్చారు. ఇప్పుడు జగన్ తాజాగా విశాఖను, మూడు రాజధానులనూ వదిలేసి మావిగన్ అంటూ కొత్త రాగం అందుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  తన తాజా ప్రెస్ మీట్ లో వైజాగ్ రాజధాని గురించి అడిగిన ప్రశ్న వినగానే..  ఏం చేస్తున్నాడో తెలియనట్లు రెండు చేతులూ జేబులో పెట్టుకుని అలా నడిచి వెళ్లిపోయారంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...