LATEST NEWS
ఎన్నికల ప్రచారం పూర్తయిన వెంటనే తిరుమల వేంకటేశ్వరుడిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయనకు ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాశీకి వెళ్ళే అవకాశం లభించింది. ఇప్పుడు  ఆయన సతీ సమేతంగా షిర్డీ సాయిబాబాను సందర్శించుకున్నారు. ఆయన ఏ దేవాలయానికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించే ప్రార్థిస్తారు. ఆయన ప్రార్థనలు ఫలించి దుర్మార్గపు ప్రభుత్వం అంతరిస్తే అంతకంటే కావల్సింది ఏముంటుంది?
ఎన్నికల ముందు జగన్ అండ్ దండుపాళెం బ్యాచ్ ‘సిద్ధం’, ‘సిద్ధం’ అని అరిచారు. ఎన్నికలు ముగిశాయి. వైసీపీ ఖేల్ ఖతం అయిపోయినట్టేనని అర్థమైపోతున్న నేపథ్యంలో జగన్ యూరప్ వెళ్ళడానికో, వెళ్ళిపోవడానికో ‘సిద్ధం’ అవుతున్నారు. జగన్ యూరప్ వెళ్ళకుండా ఆపాలని సీబీఐ కోర్టు ముందు సీబీఐ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్‌ని దేశం విడిచి వెళ్ళనివ్వకూడదని విజ్ఞప్తి కూడా చేసింది. అయినప్పటికీ, జగన్ జూన్ 1 వరకు యూరప్‌లో వుండటానికి సీబీఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇక చేసేదేమీ లేక సీబీఐ, ఈడీ చాలా పవిత్రమైన, అమోఘమైన తేదీ అయిన జూన్ 4వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ, జగన్‌కి తమ సత్తా చూపించడానికి అవసరమనవన్నీ ‘సిద్ధం’ చేసుకుంటున్నాయి. జగన్ మీద పదికి పైగా ఆర్థిక నేరాల కేసులు వున్నాయి. ముఖ్యమంత్రి హోదాని అడ్డు పెట్టుకుని ఆ కేసుల నుంచి జగన్ తప్పించుకుని తిరుగుతున్నారు. జూన్ 4 తర్వాత ఆ హోదా ఎలాగూ వుండదు కాబట్టి అప్పుడు తమ డ్యూటీని స్వేచ్చగా చేయడానికి సీబీఐ, ఈడీ సమాయత్తం అవుతున్నాయి. అలాగే బాబాయ్ మర్డర్ కేసు విషయంలో కూడా సీబీఐకి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి వెళ్ళి మరీ, ఖాళీ చేతులతో తిరిగి రావలసి వచ్చింది. జూన్ నాలుగు తర్వాత జగన్‌కి ముఖ్యమంత్రి హోదా వుండదు, అవినాష్ రెడ్డికి ఎంపీ హోదా వుండదు. అప్పుడు ప్రభుత్వ వ్యవస్థల శక్తిని చూడటానికి జగన్‌ అండ్ బ్యాచ్‌కి  అవకాశం దొరుకుతుంది.
ఆమధ్య తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన రోజున, ఆ ప్రభుత్వం చేయించిన ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన హార్డ్ డిస్క్లులు, ఆధారాలు ధ్వంసం చేయడం జరిగింది కదా.. అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ‘ధ్వంసం’ కార్యక్రమం ‘ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్’ రూపంలో జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ‘ఈ-ఆఫీస్’ని మూసేశారు. మే 17 నుంచి 25 వరకు  ‘అప్‌గ్రేడ్’ చేసే నెపంతో ఈ-ఆఫీస్‌ని మూశారు. ఈ వ్యవహారంపై తెలుగుదేశం అధినేత  చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కి చంద్రబాబు లేఖ రాశారు. త్వరలో కొత్త ప్రభుత్వం వస్తున్నందున, ఆ అప్ గ్రేడ్ వ్యవహారాన్ని కొత్త ప్రభుత్వం చూసుకుంటుందని, ఈ ప్రభుత్వమే అప్‌గ్రేడ్ చేయడం వల్ల అక్రమాలు జరిగే అవకాశం వుందని చంద్రబాబు ఆ లేఖలో రాశారు. ఇలా ఈ-ఆఫీస్‌ని అప్‌గ్రేడ్ చేయడం వల్ల జగన్ ప్రభుత్వం చేసిన అక్రమాలు సమాధి అయ్యే ప్రమాదం వుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ జగన్ తనకు సహకారం అందిస్తున్న ఐప్యాక్ సంస్థ కార్యాలయానికి వెళ్ళే ఛాన్సే లేదు. ఓటమి కన్ఫమ్ అయిన బాధ ఒక వైపు, యూరప్ వెళ్ళడానికి తట్టాబుట్టా సర్దుకునే బిజీ మరో వైపు. అయినప్పటికీ, జగన్ తీరిక చేసుకుని మరీ ఐప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) కార్యాలయానికి ఎందుకు వెళ్ళారా అనే సందేహాలు కలగటం సహజం. విజయవాడలో వున్న ఐప్యాక్ కార్యాలయానికి జగన్ వెళ్ళడం అనేది హండ్రెడ్ పర్సెంట్ అనధికార పర్యటన అయినప్పటికీ, అన్ని రకాల అధికారిక ఖర్చులతో ఆయన అక్కడకి వెళ్ళారు. ఐప్యాక్ కార్యాలయంలో జగన్ రాకకోసం ఎదురుచూస్తున్న వందలాది మంది ఐప్యాక్ ఉద్యోగులు జగన్‌ని చూసి ఉత్సాహంతో ఉరకలు వేశారు. షేక్ హ్యాండ్స్ ఇచ్చారు. సెల్ఫీలు దిగారు. అన్నికంటే వింత ఏమిటంలే, జగనే స్వయంగా ఒక సెల్ఫీ క్లిక్ చేశారు. తర్వాత ఐ ప్యాక్ సభ్యులు మీరు మళ్ళీ ఘన విజయం సాధిస్తారు అని ముక్తకంఠంతో అరిచారు. జగన్ కూడా, అంతకు ముందుకంటే భారీ విజయం సాధిస్తాను అని చెప్పారు. అది విని అందరూ ఆనందంగా చప్పట్లు చరిచారు... సీఎం.. సీఎం అని అరిచారు.. ఈ ప్రహసనం అయిపోగానే జగన్ తిరిగి తాడేపల్లి ప్యాలెస్‌కి చేరుకున్నారు. అసలింతకీ జగన్ ఐ ప్యాక్ కార్యాలయానికి ఎందుకు వెళ్ళినట్టు? ఎందుకంటే, గత ఎన్నికల తర్వాత జగన్ ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్ళారు. వాళ్ళకి థాంక్స్ చెప్పారు. ఇప్పుడు వెళ్ళాలన్న ఉద్దేశం లేకపోయినా, వెళ్ళక తప్పని పరిస్థితి.. ఎందుకంటే, ఇప్పటికే జగన్ ప్రభుత్వం చాపచుట్టేసినట్టే అనే పాయింట్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు కనుక జగన్ గత ఎన్నికల తరహాలో కాకుండా, ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్ళకుండా ఊరుకుంటే, జగన్ కూడా చేతులు ఎత్తేశాడనే మెసేజ్ వెళ్ళే అవకాశం వుంది కాబట్టి ఆయనకి వెళ్ళక తప్పలేదు. ఐపాక్‌తో గత ఎన్నికల వరకు అనుబంధం వున్న ప్రశాంత్ కిషోర్ దానిని కొంతకాలం క్రితం తెంచుకున్నారు. ఈమధ్య జర్నలిస్టు రవిప్రకాష్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్‌ని ప్రశాంత్ కిషోర్ భారీగా విమర్శించారు. చేసిన మేలును మరచిపోవడం కంటే పెద్ద పాపం మరొకటి వుండదని భగవద్గీతలో చెప్పారని, జగన్ తాను చేసిన మేలును మరచిపోయారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ నేపథ్యంలో, ఐప్యాక్ సంస్థకి వెళ్లి మరీ థాంక్స్ చెప్పాల్సిన పరిస్థితి జగన్‌ది. ఒకవేళ జగన్ వెళ్ళకపోతే, చూశారా.. జగన్ ఈసారి ఐప్యాక్ ఆఫీసుకు వెళ్ళలేదు. జగన్‌కి కృతజ్ఞత లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాట నిజమే అనే లోకనింద వస్తుందని భయపడి జగన్ ఆ సంస్థ కార్యాలయానికి వెళ్ళారు. ఓ పనైపోయింది బాబూ అనిపించుకున్నారు.
తెలంగాణలో చాలావరకు వేడి తగ్గింది. వాతావరణం చల్లబడింది. ఈనెల మొదటి వారంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని చోట్ల 47 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి. వాతావరణం చల్లబడటంతో 40 డిగ్రీలకు పడిపోయింది. ఉపరితల ఆవర్తనమే కారణమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అవర్తనం ఏర్పడమే దీనికి కారణం. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మూడురోజులు వర్షాలు కురవనున్నాయి.పిడుగులు పడే అవకాశం రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మే 17 వరకు తేలిక నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవనున్నాయి. జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణ పేట జిల్లాల్లో బుధవారం రోజు వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో వర్షం పడే అవకాశం ఉంది.ఉదయం ఎండ ఉన్నప్పటికీ సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుందని అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతల విషయానికి వస్తే 38 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్యలో నమోదవుతుందని, ఉరుములు, మెరుపులతో పాటు పిడిగులు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ మరికొన్ని జిల్లాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. ఇలా రాష్ట్రమంతా భిన్నమైన వాతావరణం నెలకొనడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. వేడి ఉన్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎండవేడిమికి ముఖ్యమైన పనులుంటే ఉదయం సమయంలోనే పూర్తిచేసుకోవాలని, ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటలకు బయటకు వెళ్లొద్దని, ఒకవేళ వెళ్లినా గొడుగు తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు.
ALSO ON TELUGUONE N E W S
ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు, చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) విషయంలో అలాంటిదే జరగబోతుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐకాన్ స్టార్ గా తనకంటూ ఓన్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్.. తనపై మెగా హీరో అనే ముద్ర లేకుండా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అందుకే బన్నీ.. మెగా బ్రాండ్ కి, మెగా కుటుంబానికి దూరంగా జరుగుతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కొందరు మెగా అభిమానులు ఎప్పటినుంచో బన్నీపై గుర్రుగా ఉన్నారు. ఇక ఇటీవల బన్నీ చేసిన ఓ పని.. మెగా అభిమానులందరి ఆగ్రహానికి కారణమైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 'మెగా వర్సెస్ అల్లు' వార్ కి దారితీశాయి. మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురం బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి అండగా నిలబడితే.. అల్లు అర్జున్ మాత్రం నంద్యాల వెళ్లి తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపాడు. అసలే జనసేన, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. దానికితోడు బన్నీ తీరుతో ఇప్పటికే కొందరు మెగా అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం మెగా ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఎప్పుడూ లేని విధంగా బన్నీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక నుంచి బన్నీతో తమకు సంబంధం లేదని, అతని సినిమాలు చూసేది లేదని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. అంతేకాదు, 'పుష్ప-2'ని బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కెరీర్ పీక్స్ లో ఉంది. 'పుష్ప'తో పాన్ ఇండియా హీరోగా అవతరించిన బన్నీ.. త్వరలో 'పుష్ప-2'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలున్నాయి. 'పుష్ప-2' ఆశించిన విజయాన్ని అందుకుంటే.. అల్లు అర్జున్ స్టార్డం ఎన్నో రెట్లు పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. అయితే ఇలాంటి తరుణంలో మెగా ఫ్యాన్స్ 'పుష్ప-2'ని బాయ్ కాట్ చేస్తే మాత్రం.. కలెక్షన్ల పరంగా తెలుగునాట తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. మెగా హీరోలు చిరంజీవి(Chiranjeevi), పవన్ కళ్యాణ్ ల అభిమానగణం భారీగా ఉంటుంది. వారిలో మెజారిటీ అభిమానులు అల్లు అర్జున్ సినిమాలను కూడా చూస్తుంటారు. అయితే ఇప్పుడు వారు 'పుష్ప-2'ని బాయ్ కాట్ చేస్తే.. ఖచ్చితంగా వసూళ్లపై ఎంతోకొంత ప్రభావం ఉంటుంది. పైగా 'పుష్ప పార్ట్-1'.. ఓవరాల్ గా హిట్ అయినప్పటికీ, భారీ బిజినెస్ కారణంగా తెలుగునాట మాత్రం నష్టాలనే చూసింది. ఇప్పుడు 'పుష్ప-2'కి ఓ రేంజ్ లో బిసినెస్ జరిగే అవకాశముంది. ఆ స్థాయి బిజినెస్ కి లాభాలు రావాలంటే అల్లు, మెగా అభిమానులు మాత్రమే కాకుండా.. అందరు హీరోల అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులు కూడా ఆదరించాల్సి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మెగా అభిమానుల సపోర్ట్ లేకుండా.. తెలుగునాట 'పుష్ప-2' లాభాలను చూస్తుందో లేదో చూడాలి.
Prepare for a spine-tingling experience on May 25th as Ashish gears up to captivate audiences with the intriguing romantic horror, "Love Me - If you Dare." Confident in delivering a blockbuster this summer, the team promises a spine-chilling ghost love story that will keep viewers on the edge of their seats. The film stars Ashish and Vaishnavi Chaitanya played the lead roles. Today makers launched the trailer. The trailer commences by introducing Ashish, portraying the daredevil Arjun, known for his adrenaline-pumping stunts. Arjun's insatiable quest for thrills is evident as he ventures into an abandoned house with the daring intention of romancing the ghost, Divyavathi. The electrifying encounters between Arjun and Divyavathi only serve to heighten anticipation among viewers. In addition to Ashish, the trailer features Virupaksha fame Ravikrishna and Simran Choudhary in pivotal roles, adding depth to the storyline. With its rapid-fire editing and spine-chilling sequences, the trailer ignites curiosity about the film's premise, hinting at a one-of-a-kind romantic horror experience. This sneak peek offers a glimpse into the captivating world of "Love Me," promising thrills, romance, and supernatural encounters. Oscar winning Musician MM Keeravaani scored the tunes. Blockbuster "Balagam" makers Harshith Reddy and Hanshitha Reddy are producing the film under "Dil Raju Productions" in association with Naga Mallidi. This romantic horror film is helmed by newcomer Arun Bhimavarapu. Shirish is presenting the film.
Global Star Ram Charan will next be joining forces with young and talented director Buchi Babu Sana of Uppena fame for a Pan India film #RC16. The film pre production is almost finished and will hit the floors very soon. Proudly presented by the leading production house Mythri Movie Makers, Venkata Satish Kilaru is venturing into film production grandly with the movie to be mounted on a huge scale with a high budget under the banner of Vriddhi Cinemas. Ram Charan is currently busy with Game Changer and will finish hi portion by May end. He will join RC 16 sets in June. Buchi Babu Sana wishes to film the songs during the initial shooting schedules, as AR Rahman already composed 3 songs for the film. For the first time in his career, AR Rahman recorded three songs before the regular shoot began. This untitled sports drama is planned on a massive budget and it is aimed for 2025 summer release. Rathnavelu will handle the cinematography work. Buchi Babu prepared a powerful script that will have a universal appeal. The film's shoot will commence very soon. The makers will announce the details of the other cast and crew of the movie soon
Supremely talented Satyadev latest movie, 'Krishnamma', is crafted as a raw and rustic backdrop action released in theatres on May 10. The famous distribution companies, Mythri Movie Makers and Prime Show Entertainments, known for distributing many successful films handled the release. 'Krishnamma' showcases Satyadev in a new dimension. Satyadev's rustic action sequences and rugged persona will leave viewers spellbound. The film created a sensation on day one itself with a gross of 1 crore. It achieved breakeven within the first week. Satyadev created a new sensation by collecting 5.4 crores gross, marking the best collection of his career. The film has been met with enthusiastic acclaim, bolstered by excellent reviews and strong word-of-mouth, positioning it for continued success at the box office. Krishnamma is the leading choice for audiences seeking engaging cinema and actioner, promising an extended successful run in theaters. Produced by Krishna Kommalapati under the Arunachala Creations banner and presented by acclaimed director Koratala Siva. Laxman Meesala, Raghu Kunche, Athira Raj, and others are introduced in pivotal roles. VV Gopalakrishna directed the movie, which is produced by Krishna Kommalapati under the banner of Arunachala Creations and backed by the renowned director Koratala Siva. Athira Raj stars opposite Satyadev in 'Krishnamma'. The film features music by Kaala Bhairava and cinematography by Sunny Kurapati.
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్  ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా లెవల్లో బిజీ ఆర్టిస్ట్ గా మారుతుంది. దీంతో శ్రీదేవి అభిమానుల ఆనందం మాములుగా లేదు. తన తల్లి లాగా ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో జాన్వీ  ఒక మూవీ  నుంచి తప్పుకోవాలని అనుకుందనే వార్త చూసి  అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. అసలు విషయం ఏంటో చూద్దాం  జాన్వీ అప్ కమింగ్ మూవీ మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి. ప్రముఖ హీరో  రాజ్ కుమార్ రావు తో  కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. మే 31 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ మూవీలో  జాన్వీ ప్రొఫిషనల్  క్రికెటర్ గా   మెరవబోతుంది. క్యారక్టర్ పర్ఫెక్షన్ కోసం రెండు  సంవత్సరాల నుంచి క్రికెట్ లో  శిక్షణ తీసుకుంటుంది. పైగా తనని  పూర్తి స్థాయి  క్రికెటర్‌గా మార్చడానికి కోచ్ లు కూడా చాలా కష్టపడ్డారు. ఇక షూటింగ్  టైం లో అయితే చెప్పక్కర్లేదు. జాన్వీ కి ఎన్నో సార్లు  గాయాలయ్యాయి. ఒక దశలో తన  రెండు భుజాలు  పని చెయ్యలేదు. ఆ సమయంలో  ఎన్నోసార్లు  సినిమా నుంచి వైదొలగాలని అనుకుంది. కానీ  చిత్ర యూనిట్ ఆమెకి  ధైర్యం చెప్పి ముందుకు నడిపించారు. ఈ విషయాలన్నీ  జాన్వీ కపూర్ నే  చెప్పింది. ప్రస్తుతం ఆ  మాటలు వైరల్ గా మారాయి  చాలా మంది  జాన్వికి సినిమా పట్ల ఉన్న కమిట్మెంట్ ని పొగుడుతున్నారు. ప్రస్తుతం  తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర లో చేస్తుంది.అక్టోబర్ లో ఆ మూవీ విడుదల కానుంది. అలాగే రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు మూవీ లోను హీరోయిన్ గా చేస్తుంది. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. రాబోయే రోజులన్నీ జాన్వీ వే   
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం 'పురుషోత్తముడు'. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. ఆకతాయి, హమ్ తుమ్ చిత్రాలతో ఆకట్టుకున్న రామ్ భీమన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు.  ఈ కార్యక్రమంలో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. "మా మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చిన మీడియా, గెస్టులకు థ్యాంక్స్. పురుషోత్తముడు మూవీ గురించి మాట్లాడాలంటే ముందు మా ప్రొడ్యూసర్ రమేష్ గారి గురించి చెప్పాలి. ఆయన సినిమాకు కావాల్సినంత ఖర్చు పెట్టి మూవీ బాగా వచ్చేలా చూసుకున్నారు. మా డైరెక్టర్ రామ్ భీమనతో నాకు మంచి అండర్ స్టాండింగ్ ఉంది. మేమిద్దరు ఒక్క చూపుతో సీన్ ఎలా ఉండాలో కన్వే చేసుకునేవాళ్లం. మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు. ఆయన రేపు పెద్ద డైరెక్టర్ అయ్యాక కూడా నాతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అందరూ బాగా వర్క్ చేశారు. జూన్ 6న పురుషోత్తముడు రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక డేట్ అనౌన్స్ చేస్తాం. మా మూవీని థియేటర్స్ లో చూసి ఎంకరేజ్ చేయండి." అన్నారు. దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ.. "ఒక సినిమా అనేక ఇబ్బందులు దాటుకుని రిలీజ్ వరకు రావడం సంతోషకరమైన విషయం. మా మూవీ టీజర్ లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. కరోనా లాంటి పాండమిక్ మాలాంటి అప్ కమింగ్ రైటర్స్, డైరెక్టర్స్ ను చాలా ఇబ్బందిపెట్టింది. రెండు సినిమాలు చేసి మూడో సినిమా పెద్ద కాన్వాస్ లో డిజైన్ చేసుకున్నప్పుడు పాండమిక్ వచ్చి మొత్తం మార్చేసింది. అలాంటి టైమ్ లో కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు..ఇద్దరు గంధర్వుల్లాంటి ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, ప్రకాష్ గారు వచ్చారు. నాకు వాళ్లు ఇంద్రుడు, చంద్రుడు. నిర్మాతలకు నాలుగు కథలు చెబితే మంచి టేస్ట్ తో ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్లు సినిమాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. బడ్జెట్ గురించి ఆలోచించలేదు. అడిగిన పెద్ద ఆర్టిస్టులను ఇచ్చారు. గోపీసుందర్, పీజీ విందా, మార్తాండ్ కె వెంకటేష్ ఇలా..ఒక్కొక్కరు మా టీమ్ కు యాడ్ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. రాజ్ తరుణ్ తో పనిచేసి ఆయనకు ఫ్యాన్ అయ్యా. మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు గానీ హీరోయిన్ తో రాజ్ తరుణ్ కెమిస్ట్రీ కంటే సెట్ లో రాజ్ తరణ్ తో నా కెమిస్ట్రీ ఎక్కువగా ఉండేది. రాజ్ తరుణ్ గారిని కొత్తగా తెరపై ప్రెజెంట్ చేసే చిత్రమిది. మీకు ప్రామిస్ చేస్తున్నా పురుషోత్తముడుతో ఒక ఐ ఫీస్ట్ లాంటి సినిమాను చూడబోతున్నారు." అన్నారు. నిర్మాత డా.రమేష్ తేజావత్ మాట్లాడుతూ.. "సినిమా నిర్మించాలని 30 ఏళ్ల కిందట అనుకున్నాను. పురుషోత్తముడు సినిమా కథను దర్శకుడు రామ్ భీమన గారు చెప్పగానే వెంటనే నచ్చి ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. తెరపై నా పేరు ఉంది గానీ నా సోదరుడు ప్రకాష్, నా సతీమణి, పిల్లలు అంతా ప్రొడక్షన్ చూసుకున్నారు. పెద్ద ఆర్టిస్టులను మాట్లాడటం దగ్గర నుంచి అన్నీ పనులు వాళ్లే చేశారు. మా సినిమా వరకు పురుషోత్తముడు అంటే మా డైరెక్టర్ రామ్ భీమన. ఆయన ఈ సినిమానే జీవితంగా గడిపారు. యాక్సిడెంట్ జరిగినా షూటింగ్ కు వచ్చి అంతా చూసుకున్నారు. మా హీరోయిన్ ఫస్ట్ సినిమాకే ఇంత  డెడికేషన్ చూపించడం ఆశ్చర్యం వేసింది. ఆమెకు 102 డిగ్రీస్ జ్వరం ఉన్నా షూటింగ్ చేసింది. రాజ్ తరుణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. ఒక మంచి మూవీ చేశామని బిలీవ్ చేస్తున్నాం. థియేటర్స్ లో మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం." అన్నారు. నిర్మాత ప్రకాష్ తేజావత్ మాట్లాడుతూ.. "పురుషోత్తముడు సినిమా టీజర్ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. త్వరలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నాం.  మీ అందరి సపోర్ట్ మా చిత్రానికి ఉంటుందని కోరుకుంటున్నా. థియేటర్స్ లో కలుద్దాం." అన్నారు. హీరోయిన్ హాసినీ సుధీర్ మాట్లాడుతూ.. "ఈ మూవీలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రామ్ భీమన గారికి థ్యాంక్స్. రాజ్ తరుణ్ షూటింగ్ టైమ్ లో బాగా సపోర్ట్ చేశారు. తెలుగు డైలాగ్స్ చెప్పడంలో హెల్ప్ చేశారు. మంచి ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి." అన్నారు. యాక్టర్ రచ్చ రవి మాట్లాడుతూ.. "మంచి కథా కథనాలతో, ప్యాడింగ్ ఆర్టిస్టులతో పురుషోత్తముడు సినిమా మీ ముందుకు రాబోతోంది. మా ప్రొడ్యూసర్స్ చాలా మంచి వాళ్లు. వాళ్లకు సంచుల నిండా డబ్బులు ఈ సినిమాతో మిగలాలని కోరుకుంటున్నా. రాముడు, భీముడు కలిస్తే ఎలా ఉంటాడో అలాగే మా డైరెక్టర్ రామ్ భీమన ఉంటారు. సెట్ లో ఎవరినీ కష్టపెట్టకుండా వర్క్ చేయించుకున్నారు. చాక్లెట్ బాయ్ రాజ్ తరుణ్ కు పురుషోత్తముడు మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా." అన్నారు. నటుడు ఆకెళ్ల గోపాలకృష్ణ మాట్లాడుతూ.. "పురుషోత్తముడు మంచి విందు భోజనం లాంటి సినిమా. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, బ్రహ్మానందం లాంటి పెద్ద నటీనటులతో మాలాంటి వాళ్లు కలిసి నటించే అవకాశం ఈ సినిమా కల్పించింది. మనసున్న నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. వారికి, హీరో రాజ్ తరుణ్ కు పురుషోత్తముడు బిగ్ సక్సెస్ ఇవ్వాలి." అన్నారు. లిరిసిస్ట్ బాలాజీ మాట్లాడుతూ.. "ఈ సినిమాలో పాటలు రాసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రామ్ భీమన గారికి థ్యాంక్స్. సినిమా షూటింగ్ టైమ్ లో ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. అయినా పట్టుదలతో ఈ సినిమాను పూర్తి చేశారు. అందరికీ నచ్చేలా సినిమాను రూపొందించారు. రాజ్ తరుణ్ గారు ఈ కథలోని ఎమోషన్స్ ను వెయ్యింతలు తీసుకెళ్లారని రామ్ భీమన గారు చెబుతుండేవారు. టీమ్ అందరికీ ఈ మూవీ పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా." అన్నారు. డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ.. "రామ్ భీమనతో మాట్లాడితే పెద్ద విద్యావేత్తలా అనిపిస్తాడు. పురుషోత్తముడు టీజర్ చూస్తే రామ్ భీమన బీ, సీ సెంటర్స్ ఆడియెన్స్ కు కూడా రీచ్ అయ్యేలా ఈ సినిమాను రూపొందించాడని తెలుస్తోంది. రాజ్ తరుణ్, రామ్ భీమన ఇద్దరి కెరీర్ లకు ఈ సినిమా నెక్ట్ స్టెప్ లాంటి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా." అన్నారు. యాక్టర్ రాజా రవీంద్ర మాట్లాడుతూ.. "డైరెక్టర్ రామ్ భీమన గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఇంప్రెస్ అయ్యాను. షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా డైరెక్టర్ చాలా కూల్ గా ఉండేవారు. మార్నింగ్ ఎలా ఉండేవారో సాయంత్రం వరకు అదే ఎనర్జీతో వర్క్ చేశారు. చాలా పెద్ద ప్యాడింగ్ ఈ మూవీలో ఉంది. సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది." అన్నారు. రాజ్ తరుణ్, హాసినీ సుధీర్, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, విరాన్ ముత్తంశెట్టి, ముకేష్ ఖన్నా, ప్రవీణ్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా పీజీ విందా, ఎడిటర్ గా మార్తాండ్ కె వెంకటేష్ వ్యవహరిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణు దేశాయ్ కి అర్జెంటుగా మూడువేల ఐదు వందల రూపాయిలు కావాలి. ఆ పేరుతో ఎవరైనా అడుగుతున్నారేమో అని అనుకోవద్దు. నిజంగానే తనకే  ఆ డబ్బులు కావాలి. పైగా అడిగింది  నేనే అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అసలు ఆ మ్యాటర్  ఏంటో పూర్తిగా చూద్దాం  కొన్ని రోజుల క్రితం మూడు వేల ఐదు వందలు రూపాయిలు కావాలని  కోరుతూ రేణు దేశాయ్ ఇన్‌స్టా ఖాతాలో ఓ మెసేజ్ పోస్టు అయ్యింది. క్యూఆర్ కోడ్ కూడా షేర్ అయ్యింది.దీంతో ఆమె అభిమానులు అయితే ఏమి పవన్ అభిమానులు అయితే ఏమి   అమౌంట్ ని  ట్రాన్స్‌ఫర్ చేశారు. కొంత మంది అభిమానులు మాత్రం రేణు దేశాయ్ అకౌంట్ హ్యాక్ అయ్యి ఉండచ్చనే   అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ అనుమానాలన్నింటిని పటా పంచలు చేస్తు రేణూ దేశాయ్ ఒక వీడియో  చేసింది. అమౌంట్ అడిగిన మాట నిజం. పిల్లలు,పెంపుడు జంతువులు, గోవుల కి సంబంధిచిన  దాతృత్వ కార్యక్రమాల గురించి డబ్బు అడిగినట్టు చెప్పింది. పైగా వాటి గురించి పూర్తి వివరణ కూడా ఇచ్చింది. నేను రెగ్యులర్‌గా కొంత మొత్తాన్ని డొనేట్ చేస్తుంటాను.  నా సంపాదనలో కొంత భాగాన్ని అందుకు  కేటాయించాను. అయితే, అప్పుడప్పుడూ కాస్త ఎక్కువ మనీ  అవసరం ఏర్పడుతుంది. కాకపోతే నాకున్న  లిమిట్స్ వలన మనీ ఎగ్జస్మెంట్  అవ్వడం లేదు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా. అందువల్ల నా వరకు సాయం చేశాక ఇంకా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్‌ను అడుగుతున్నానని చెప్పకొచ్చింది. నిజానికి  ఇన్ స్టాలో  పోస్టు పెట్టిన రోజునే వీడియో సందేశం ఇద్దామని అనుకున్నాను. కానీ ఫుడ్ పాయిజన్ కారణంగా  ఆరోగ్యం బాగోలేకపోవటంతో  చెయ్యలేకపోయాను. గోవుల షెడ్ నిర్మిస్తున్నానని  ఏడాదిన్నర లోగా  నిర్మాణం పూర్తవుతుందని తెలిపింది. అలాగే తనకి అమౌంట్  పంపించిన వాళ్లందరికీ  ధన్యవాదాలు కూడా తెలిపింది  
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు సందర్భంగా మే 20న 'దేవర' (Devara) మొదటి సాంగ్ విడుదల కానుందని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఒకరోజు ముందుగానే అంటే మే 19నే ఫస్ట్ సాంగ్ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించి సర్ ప్రైజ్ చేసింది దేవర టీం. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇస్తున్నాయి. ఎన్టీఆర్ కి, నాగవంశీకి మధ్య మంచి అనుబంధముంది. 'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్ కి ఇన్వైట్ చేయడం కోసం.. సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ తో కలిసి ఎన్టీఆర్ నివాసానికి వంశీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎన్టీఆర్ 'దేవర' సాంగ్స్ వినిపించినట్లు చెప్పి.. ఆ ముగ్గురూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయితే ఇప్పుడు దేవర ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్ వచ్చిన సందర్భంగా.. నాగవంశీ మరోసారి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే కామెంట్స్ చేశాడు. "దేవర నుంచి విడుదలవుతున్న ఫియర్ సాంగ్.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ యాంతం" అని నాగవంశీ అన్నాడు. "మీ అందరి కంటే ముందు నేను పాట విన్నాను.. ట్రస్ట్ మీ.. హుకుం(జైలర్ సాంగ్) మర్చిపోతారు.. ఇది అనిరుధ్ నెక్స్ట్ లెవెల్ మాస్ సాంగ్." అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు "దేవర ముంగిట నువ్వెంత" అనే లైన్ ని కూడా జోడించాడు.  అసలే ఎన్టీఆర్-అనిరుధ్ కాంబినేషన్ అంటేనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇప్పుడు నాగవంశీ చేసిన కామెంట్స్ తో అంచనాలు మరోస్థాయికి వెళ్లాయి.  మే 19న 'దేవర' నుంచి ఫియర్ సాంగ్ విడుదల కానుంది. మే 18న ప్రోమో విడుదలయ్యే అవకాశముంది.  
Talented hero Varun Sandesh is coming up with a unique thriller ‘Nindha’ which had its first look unveiled a few days ago to a good response. The movie directed and produced by Rajesh Jagannadham under the banner of The Fervent Indie Productions, unfolds Kandrakota Mystery. Today, the makers of the movie unveiled its teaser. Dada Saheb Phalke Award Winner Naveen Chandra did the honours of launching the teaser. After launching the teaser, he wished the team all the luck. https://youtu.be/rkWBtUwmxjs?si=E5vD-6M6b8QVTw_x The teaser opens with Thanikella Bharani uttering a thought-provoking dialogue: “Jeevithamlo Konni Sarlu Thappani Thelisinaa Cheyyaka Thappadu… (Sometimes in life you have to do something even if you know it's wrong…)” The clip then introduces Varun Sandesh in a gloomy avatar. He is undergoing a traumatic situation due to some happenings in life. The video also introduces other characters. The narrative becomes much more interesting and we get to witness a thrilling ride through twists of truth and deceit. The teaser doesn’t disclose the storyline, yet it makes a great impression. Rajesh Jagannadham cut the teaser fascinatingly, whereas Varun Sandesh came up with a brilliant performance. Ramiz Naveeth’s camera work is notable, while Santhu Omkar’s re-recording complements the visuals. Anil Kumar is the editor. The teaser has created inquisitiveness for the movie which is gearing up for its theatrical release.
  సిల్వర్ స్క్రీన్ మీద హీరో విలన్ కి షాక్ ఇవ్వాల్సిందే. ఇది రూల్. దీన్ని ఎవరు మార్చలేరు. హీరో చేత అదంతా చేయించేది    దర్శకుడు.కానీ ఒక  దర్శకుడు నిజ జీవితంలోనే   హీరోకి షాక్ ఇచ్చాడు. అది అలాంటి ఇలాంటి షాక్ కాదు. హీరో జీవితం మొత్తాన్ని తీసుకెళ్లి ఫేస్ బుక్ లో పెట్టాడు   పాన్ ఇండియా సినీ యుగంలో పర భాషా నటులు సైతం  సొంత భాషా నటులుగా మారారు.  అలా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయిన  మలయాళ నటుడు  టోవినో థామస్(tovino thomas) రెండు వేళ పద్దెనిమిది మూవీతో పాటు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన   మిన్నల్ మురళితో మంచి పేరుతో పాటు గుర్తింపుని పొందాడు. రెండు వేల  ఇరవై ఒకటవ సంవత్సరంలో మలయాళంలో  వజక్కు అనే మూవీలో హీరోగా చేసాడు. సనల్ కుమార్ శశిధరన్  దర్శకుడు. మూవీ  కంప్లీట్ కూడా అయ్యింది.  ఫస్ట్ కాపీ సిద్ధమై సెన్సార్ కు వెళ్లాల్సిన టైంలో  థామస్, శశిధరన్ (Sasidharan)మధ్య గొడవలు వచ్చాయి. ఆ గొడవలే సినిమాని ఫేస్ బుక్ పాలు చేసింది. థామస్ మీద కోపంతో  శశిధరన్ నే  ఫేస్ బుక్ లో షేర్ చేసాడు. విమియో అనే వీడియో అప్లోడింగ్ లో యూజర్లు ఉచితంగా చూసేలా అప్ లోడ్ చేసాడు.విషయం తెలిసి థామస్  ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. పైగా నిర్మాత కూడా  తనే ఈ విషయం పైన థామస్ ని సంప్రదించగా  వజిక్కు  కోసం  ఇరవై ఏడు లక్షలు దాకా ఖర్చుపెట్టానని సినిమా విడుదల కాకపోవడానికి దర్శకుడే కారణమని చెప్పుకొచ్చాడు. మరో వైపు సినిమా బాగా రాలేదనే కారణంతోనే  థామస్ నే విడుదల కాకుండా  అడ్డుకున్నాడని సనల్ కుమార్ శశిధరన్ ఆరోపిస్తున్నాడు. కుని కుశృతి హీరోయిన్ గా  చేసిన ఈ చిత్రంలో సుదేవ్ నాయర్ , అజిస్ నేడుమంగడ్, బైజు నోటో, కీలక పాత్రలు పోషించారు. భార్య నుంచి విడాకులు తీసుకున్న వ్యక్తికి, భర్త నుంచి విడాకులు తీసుకున్న  మధ్య ఏర్పడిన అనుబంధం ఎటు వైపు దారి తీసిందనే పాయింట్ తో  వజక్కు  తెరకెక్కింది. వజిక్కు అంటే గొడవ  
నిస్సహాయత ఏమీ చేయలేని, చేయాలనే ఆరాటం ఉన్నా చేయడానికి అవకాశం లేని ఒకానొక ఒంటరి స్థితి. మనిషిని నిలువునా ఒత్తిడిలోకి తోసి, ఆత్మన్యూనతా భావాన్ని పెంచే పరిస్థితి. ప్రపంచంలో ఇలాంటి నిస్సహాయులు ఎందరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ తిండి కోసం, ఉండటానికి నీడ కోసం ఎవరిని అడగాలో తెలియక, తమకు ఏమీ చేసే అవకాశాలు లేక అలా శూన్యం నిండిపోయినట్టు ఉండే స్థితి నిస్సహాయత. ఎందుకీ నిస్సహాయత?? ప్రపంచంలో మనిషి చేసుకుంటే ఎన్ని పనులు ఉండవు అని అనుకుంటారంతా. కానీ కొన్ని సార్లు అన్ని వైపుల నుండి తలుపులు మూసుకుపోయి చీకటిలో పడిపోయినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏదో ఒక చెయ్యి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ తలుపులు ఎక్కడున్నాయో కనబడక, ఎవరైనా ఆ తలుపులు తీస్తారేమో అనే ఆశతో ఉంటారు. అందుకే ఏమీ చేతకానితనంతో అట్లా ఉండిపోతారు.  ఎక్కడెక్కడ?? నిస్సహాయతకు చోటు లేని ప్రదేశమంటూ లేదు. చోటివ్వని మనిషంటూ లేడు. చిన్న పిల్లాడి నుండి పెద్దవాళ్ళ దాకా ఎంతోమంది ఉంటారు. అయితే చాలా వరకు యూత్ లోనూ, మహిళల్లోనూ ఈ నిస్సహాయత బాధితులు ఎక్కువగా ఉంటున్నారు అనేది నమ్మితీరాల్సిన నిజం. మరీ ముఖ్యంగా కట్టుబాట్ల కంచెల మధ్య నలిగిపోతున్న ఎంతో మంది మహిళలు ఏదో చెయ్యాలని, తమ జీవితాలను మార్చుకోవాలని ఉన్నా అందరికీ పైపైన కనబడే విషయాలు వీళ్ళకేం బాగున్నారులే అనిపించేలా చేస్తున్నాయి. కానీ పైకి కనిపించేది వేరు, లోపల వాళ్ళ సంఘర్షణ వేరు. చేయూత!! నిస్సహాయంగా ఉన్న ఇలాంటి వాళ్ళ సంఘర్షణను గుర్తించే కొన్ని మహిళా స్వచ్చంధ చేయూత సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. అయితే ఇలాంటివి అందరికీ అందుబాటులో ఉండటం లేదు. కొన్ని మహానగరాలకు పరిమితమైతే మరికొన్ని దూరప్రాంతాలలో ఉండటం వల్ల ఎంతోమంది ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే దిగువ తరగతి  కులాల మహిళల కంటే, ఉన్నత కులాల మహిళలలో ఇలాంటి నిస్సహాయులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పరువు, సమాజం, గౌరవం అనే గీతల వెనుక నిస్సహాయంగా నిలబడుకుని శూన్యపు చూపులు చూస్తుంటారు. మధ్యలోనే చదువు ఆగిపోయి, సంప్రదాయాలలో చిక్కుకుపోయి, గడప దాటి బయటకు వెళ్లే స్వేచ్ఛ లేని స్త్రీ సమాజం ఎంతో ఉంది. ఒక్క తలుపు తెరవండి!! ఇలాంటి సమస్యలో చిక్కుకుని మానసికంగా నలిగిపోయేవాళ్లకు సొంత ఆలోచన క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఏమి చేయలేకపోతున్నామనే చేతగాని తనమే అలాంటి అజ్ఞానపు వృత్తంలో పడిపోవడానికి కారణం అవుతుంది. అయితే నీ చుట్టూ బోలెడు ప్రపంచం ఉందని, అవకాశాలు ఉన్నాయని, దారి కూడా ఉందని చెబుతూ నువ్వున్నది ఓ చిన్న గది  మాత్రమే ఒక్కసారి మొత్తం తరచిచూస్తే ఎక్కడో ఒకచోట తలుపులు చేతికి దొరుకుతాయి అని మాటలతో భరోసా నింపితే ఆంజనేయుడికి  గుర్తుచేయగానే శరీరం పెరిగినట్టు వీళ్లకు కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలా మెల్లిగా మీ మాటలతోనే ఒక తలుపు తెరిచి వాళ్లకు చూపించినట్టవుతుంది కూడా.  ప్రపంచం పెద్దది!! మనుషులే చిన్నతనంతో ఉన్నారు!! ఆలోచిస్తే ఇదే నిజమని అనిపిస్తుంది. నిజానికి ఒకమనిషి బాగుపడితే చూసి సంతోషించేవాళ్ళు ఎక్కువ లేరు ఈ ప్రపంచంలో. ఎప్పుడూ అవతలి వాడిని ఎలా ముంచుదామా, వాడిది ఎలా లాక్కుందామా అనే ఆలోచనే తప్ప  అయ్యో ఇలా చేస్తే దారి కనబడుతుంది కదా వెళ్లి చెబుదాం అనుకునేవాళ్ళు ఎవరూ ఉండటం లేదు. ఎక్కడో, ఎవరో నూటికి ఒక్కరు ఉన్నా వాళ్ళ సాయం అందుకునే వాళ్ళు ఏ కొద్దీ మందో అంతే. మిగిలినవాళ్లకు పైన చెప్పుకున్నట్టు సంఘర్షణే మిగుల్తోంది. అందుకే మనుషులు తమ మనసును కాసింత పెద్దగా చేసుకోవాలి. అందులో ఎన్నో హృదయాలకు ప్రేమను పంచాలి. ఆ ప్రేమను అందుకున్న వాళ్ళు నిస్సహాయత నుండి బయటకొస్తారు నేస్తాల్లారా!! ◆వెంకటేష్ పువ్వాడ.
ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే అంటారు. అందుకే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అంటూ పాటను రాశారు రచయితలు. బ్రహ్మకు మారు పేరు అమ్మ. మనకు దెబ్బ తగిలినా వెంటనే అమ్మా అని అంటాము. అంటే మనకు ఆనందం కలిగినా..బాధ కలిగినా వెంటనే అమ్మ గుర్తొస్తుంది. రెండు గంటల పాలు మనల్ని వినోదంలో ముంచెత్తే మన తారలైనా అమ్మకు ముద్దుల బిడ్డలే. మన తెరవేల్పుల్లో చాలా మంది అమ్మతో అనుబంధం గురించి వేదికలపైనో ప్రెస్ మీట్‌లలోనో చెబుతూ ఉంటారు. మన హీరోలు వాళ్ల అమ్మతో దిగిన చిత్రమాలిక మీ కోసం..   అమ్మ రమాబాయితో  రజనీకాంత్ అమ్మ అంజనాదేవితో  చిరంజీవి, నాగబాబు    అమ్మ అంజనాదేవితో  పవన్ కళ్యాణ్  అమ్మ ఇందిరాదేవితో  మహేశ్  అమ్మ షాలినితో ఎన్టీఆర్ అమ్మ రాజ్యలక్ష్మీతో  రవితేజ అమ్మ శివకుమారితో  ప్రభాస్  అమ్మ సురేఖతో రామ్‌చరణ్ అమ్మ నిర్మలతో అల్లు అర్జున్, అల్లు శిరీష్ అమ్మ విజయలక్ష్మీతో నాని
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం కాస్త కష్టమైన పనే. చదివిన చదువుకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షించేవారు ప్రస్తుతం తక్కువే. పట్టణాలలో మంచి మంచి కంపెనీలలో గౌరవప్రదమైన వేతనంతో, హుందాగా ఉండే ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. చాలామంది ఆ ఉద్యోగాల విషయంలో కూడా గందరగోళానికి గురవుతూ ఉంటారు. కారణం ఇంటర్వ్యూ లో సక్సెస్ కాకపోవడం. ఎంతో బాగా చదివి, మంచి ర్యాంక్ లు సాధించిన వారు కూడా ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికి ఫెయిల్ అవుతూ ఉంటారు. మరి ఇంటర్వ్యూ లో సక్సెస్ కావాలంటే ఏమి చేయాలి??  ఎంపిక: కొంతమంది ఖాళీగా ఉన్నాం ఏదో ఒక జాబ్ తొందరగా చూసుకోవాలి, ఏదో ఒకటి క్లిక్ అవ్వకపోతుందా అనే ఆలోచనతో వరుసపెట్టి అన్నిటికి అప్లై చేసేస్తూ ఉంటారు. దీనివల్ల నెలకొనేదే పెద్ద గందరగోళం. కాన్ఫిడెంట్ లేకుండా పది కంపెనీలలో ఇంటర్వ్యూ కు వెళ్లడం కంటే కాన్ఫిడెంట్ తో ఒక్కదానికి అటెండ్ అవ్వడం మంచిదనే విషయం మర్చిపోకండి.  నాట్ ఓన్లీ దట్: ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పటి నుండి అందరూ చేసే పని, తాము అప్లై చేసిన జాబ్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మననం చేసుకుంటూ వాటిని బట్టి పట్టడం. దీనివల్ల ఒనగూరేది ఏమి ఉండదు. ఎందుకంటే వాటిని మననం చేసుకుంటూ మిగిలిన వాటిని ఎంతో సులువుగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. పైపెచ్చు ఇంటర్వ్యూ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది సంస్థకు సంబంధించిన వారి ఇష్టం. వారు పూర్తి జాబ్ కు సంబంధం లేని విషయం అయినా అడగవచ్చు. ఎందుకంటే వాళ్లకు కావలసింది పని చేయడం మాత్రమే కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి వర్క్ కు సంబంధించిన విషయాలు ఒక అంశం మాత్రమే. మరింకేం కావాలి?? నమ్మకం ఇవ్వగలగాలి. బాధ్యతాయుతంగా ఉండగలరు అనే నమ్మకాన్ని ఇవ్వగలగాలి. చాలా సంస్థల్లో మొదట ప్రాధాన్యత ఇచ్చే విషయం కూడా ఇదే.  పని చేయబోయే సంస్థ  విషయంలో, చేయబోయే వృత్తి విషయంలో ఎంత బాధ్యతాయుతంగా ఉండగలరు అనే విషయం మీదనే ఎంపిక ఎక్కువగా జరుగుతుంది. అలాగే పని పట్ల నిబద్ధత ఎంతో అవసరం. పనికి ప్రాధాన్యత ఇచ్చేవారి వైపు కంపెనీ మొగ్గు చూపుతుంది. కాబట్టి పని విషయంలో భరోసా ఇవ్వగలగాలి. స్పృహ కలిగి ఉండాలి: ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు కంపెనీ భవంతిలో అడుగుపెట్టినప్పటి నుండి చుట్టుపక్కల వాతావరణం ను గమనించుకుంటూ వెళ్ళాలి. కంపెనీలలో ప్రతిచోటా సీసీ కెమెరాల నిఘా ఉంటుందనే విషయం మరువకూడదు. మనిషి కదలిక నుండి ఆహార్యం వరకు ప్రతి విషయంలో ఒక నిజాయితీ కనిపించాలి. నటించాలని చూస్తే ఖాళీ చేతులతో బయటకు రావడం ఖాయం. తన పని మాత్రమే చూసుకుని పోయే వాళ్లకు ప్రాధాన్యత తక్కువగానే ఉంటుంది. ఇంటర్వ్యూ రూమ్ దగ్గరకు వెళ్లే మార్గంలో ఉన్న క్యాబిన్ లలో ఎవరు లేకుండా ఉండి, ఫ్యాన్ లు, లైట్ లు వంటివి ఆన్ లో ఉంటే వాటిని ఆఫ్ చేయడం. నీటిని వృథా చేయకపోవడం, లిఫ్ట్ సౌకర్యం ఉన్నా మెట్లెక్కి వెళ్లడం. మంచినీళ్లు వంటివి ఇచ్చే బాయ్ ని నవ్వుతూ పలకరించడం, థాంక్స్ చెప్పడం. ముఖ్యంగా సంస్థ గూర్చి ఇంటర్వ్యూ కు వచ్చిన తోటి వ్యక్తులతో ఎలాంటి చర్చా చేయకుండా ఉండటం. సంస్థ గురించి ముందుగానే వివరంగా తెలుసుకోవడం. అంటే సంస్థ స్థాపన నుండి ప్రస్తుతం అధికారుల వరకు అన్నిటి గూర్చి వారి కృషి గురించి కూడా అధ్యయనం చేసి తెలుసుకోవడం. స్కిల్స్ ఎప్పుడు కిల్ చేయకూడదు: కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంటర్వ్యూ లో అధికారులతో మాట్లాడేటపుడు కావాలని వారిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించకూడదు. లేకపోతే మీ స్కిల్స్ ను మీరే కిల్ చేసుకున్నట్టు అవుతుంది.  ముందుగా మరింత ఉత్సాహంగా: ఇక చివరగా చెప్పుకున్నా అన్నిటికంటే ముందు చేయవలసిన పని. ఇంటర్వ్యూ కు హడావిడిగా చివరి నిమిషంలో వెళ్లకుండా, వీలైనంత ముందుగా వెళ్లడం. దీనివల్ల కంపెనీని అక్కడి వాతావరణాన్ని, పని విధానాన్ని అంతో ఇంతో గమనించే వెసులుబాటు ఉంటుంది. తద్వారా సహజంగానే గందరగోళం తగ్గిపోతుంది.  ట్రస్ట్ యువర్ కాన్ఫిడెన్స్: మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు నమ్మండి. ఎవరో ఏదో భయపెట్టేలా చెప్పే మాటలు, విషయాలు ఏవి పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఉన్నట్లయితే, మీ వ్యక్తిత్వం నుండి, పని విషయం వరకు మీ అభిప్రాయాలు నచ్చాయంటే ఏ కంపెనీ ఎం.డి కూడా మిమ్మల్ని వదులుకోడు.  సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది సుమా!! ◆ వెంకటేష్ పువ్వాడ
భోజన ప్రియులకి నెయ్యి లేదా అంటూ ఉంటారు. నెయ్యి లేనిదే ముద్ద దిగదు.నెయ్యి తో పోపు పెట్టిన ఆహారం,నెయ్యితో కాల్చిన చపాతి నెయ్యితో కాల్చిన పెసరట్టు తప్ప మరేది వద్దు అంటూ ఉంటారు.ఇక కొంతమంది అయితే ముఖ్యంగా స్వీట్స్ లో నెయ్యి కారుతూ ఉండాలి. ముఖ్యంగా బొబ్బట్లు, బూరెలు  కూడా నెయ్యి తో చేసినవే బాగుంటాయి అంటారు భోజన ప్రియులు నెయ్యితో చేసిన పదార్ధాలు ఆస్వాదిస్తూ తిన్నప్పుడే వాటి మజా ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా దక్షణాది రాష్ట్రాలలో కుటుంబంలో పెళ్ళి ళ్ళు శుభకార్యాలలో సంబంధాలు కోసం వెళ్ళినప్పుడు మా నానమ్మ నెయ్యి వెన్నతో పెట్టింది.మీరేం పెడతారు చెప్పండి అంటు అడగడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే మీరు ఇలాగే గనక నెయ్యి తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే ఇకమీరు నెయ్యి జోలికే వెళ్ళరు. నెయ్యి ఆరోగ్యానికి ఎలా దోహదం చేస్తుందో మీకు బాగా తెలుసు.వినిఉండచ్చు. ఇది కేవలం యాంటి ఏజింగ్ మాత్రమే కాదు మనసు మెదడు ఆరోగ్యంగా ఉండడానికి లాభం కలిగించే అంశం అయితే నెయ్యి ప్రతి ఒక్కరికి సరిపడదు. అని అంటున్నారు నిపుణులు. భారత దేశం లో నెయ్యి చాలా ప్రాచుర్యం లో ఉంది.నెయ్యి కొంతమంది ప్రతిరోజూ తమ భోజనం లో చేరుస్తారు. నెయ్యి వాడడం కూడా చాలా కష్టం నేతిని బ్రెడ్ లో లేదా చపాతీలో పప్పు కూరలో నెయ్యిని ఎక్కువగా వినియోగిస్తారు. నెయ్యిని ఆయుర్వేదం లో ఎక్కువగా వాడడం గమనించవచ్చు.నెయ్యి ఆరోగ్య పరంగా మంచి ఉపయోగాలు ఉన్నాయి. గుండె సంబందిత ఆరోగ్యానికి లాభదాయకంగా ఉంటుంది.ఖాళీ పొట్టతో నెయ్యి తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. శరీరంలో ఉన్న పంచెంద్రియాలలో శుభ్ర పరిచి ఉపసమనం ఇస్తుంది. నెయ్యిలో యాంటి ఏజింగ్ మరియు గుండె ను ఆరోగ్యంగా ఉంచే గుణాలు ఉంటాయి. కంటి ఆరోగ్యానికి నెయ్యి చాలా మంచిది దీనితో పాటు నెయ్యి మెదడు,జ్ఞాపక శక్తిని పెంచి పంచేంద్రియాలు చురుకుగా పని చేసేందుకు దోహదం చేస్తుంది.
  శరీరంలో ప్యూరిన్ పెరుగుదల కారణంగా యూరిక్ యాసిడ్ పెరగడం ప్రారంభమవుతుంది. అధిక యూరిక్ యాసిడ్‌తో బాధపడేవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తినడం,  త్రాగడంలో ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కీళ్ళు,  ఎముకలలో నొప్పి, వాపు, పెరుగుతుంది. ప్యూరిన్ అనే రసాయనం శరీరంలో విచ్ఛిన్నమైతే, యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అతిగా తాగడం, తక్కువ శారీరక శ్రమ, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం, ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త కారణంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. వేసవిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న రోగులు ఏ పండ్లు తినాలో తెలుసుకుంటే.. బ్లాక్బెర్రీస్.. బ్లాక్బెర్రీస్  వేసవిలో సీజన్లో అందుబాటులో ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ లు అధికంహా ఉన్న బెర్రీ పండ్లు  అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారికి  ప్రయోజనకరంగా ఉంటాయి.  బెర్రీలు జీవక్రియను పెంచడంలో,  శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో వాపును తగ్గిస్తుంది.  యాసిడ్ స్థాయి కూడా సమతుల్యంగా ఉంటుంది. అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారు  బ్లాక్బెర్రీస్ తినవచ్చు. చెర్రీలు.. యూరిక్ యాసిడ్ రోగికి చెర్రీలు కూడా  చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆమ్లాన్ని నియంత్రించే మూలకాలు చెర్రీస్‌లో ఉంటాయి. విటమిన్ బి-6, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఎ,  విటమిన్ బి రెడ్  చెర్రీస్‌లో ఉంటాయి. చెర్రీస్ అధిక యూరిక్ యాసిడ్‌ను తగ్గించే అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది. అరటిపండు.. యూరిక్ యాసిడ్ ప్రమాదాన్ని నివారించాలనుకుంటే రోజూ అరటిపండ్లను తినడం మంచిది. అరటిపండ్లలో ప్యూరిన్ తక్కువగా ఉంటుంది. అరటిపండ్లు తినడం ద్వారా అధిక యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. గౌట్ సమస్యలో అరటిపండ్లు కూడా మేలు చేస్తాయి. అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి కూడా అందుతుంది. కివీ.. పుల్లటి,  జ్యుసి పండ్లను తినడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంటే వాటి స్థానంలో  కివీని తినవచ్చు. కివి వినియోగం యూరిక్ యాసిడ్‌ను నియంత్రిస్తుంది. కివి తినడం వల్ల విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం,  ఫోలేట్ లభిస్తాయి. దీని వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి. కివిని రోజూ తినడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. యాపిల్.. ఎండాకాలం అయినా, చలికాలం అయినా పండ్ల దుకాణంలో యాపిల్స్ ఎప్పుడూ దొరుకుతాయి. యాపిల్ ఫైబర్ అధికంగా ఉండే  పండు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాపిల్ రక్తంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. యాపిల్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ ప్రభావం తగ్గుతుంది.  రోజువారీ పనులు చేయడానికి తగినంత  శక్తి అందిస్తుంది. ప్రతిరోజూ ఒక యాపిల్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు.                                                *రూపశ్రీ.  
అరటి చాలా  శక్తివంతమైన పండు. దీన్ని తినడం వల్ల శరీరానికి ప్రాణశక్తి లభిస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు ఓ అరటిపండు తింటే చాలాసేపటి వరకు ఆకలి బాధ దూరంగా ఉంటుంది. ఇది మెత్తగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ తినదగిన పండు. జీర్ణం కావడానికి సులువుగానే ఉంటుంది. ఎక్కువసేపు ఆకలిని అదుపులో ఉంచుతుంది. కండరబలాన్ని, పోషకాలను ఇస్తుంది. వర్కౌట్ తర్వాత అరటిపండు తినడం ఫిట్నెస్ ఫాలో అయ్యేవారికి తప్పనిసరి. పైపెచ్చు అరటిపండు మిగిలిన పండ్లతో పోలిస్తే ధర తక్కువే. కాబట్టి అందరూ కొనుక్కుని తినగలుగుతారు. కానీ  అరటిపండు అందరికీ మంచిది కాదు. ఆయుర్వేదంలో అరటిపండు కొంతమందికి ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. అరటిపండు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో? దీన్ని ఎవరు తినకూడదో  తెలుసుకుంటే.. పోషకాలు.. అరటిపండు తినడం వల్ల  విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ బి6తో పాటు గ్లూటాతియోన్, ఫినాలిక్స్, డెల్ఫిడినిన్, రుటిన్, నారింగిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. 80వ్యాధులకు చికిత్స చేయగలదు.. పోషకాహార నిపుణులు అరటిపండులో ఉన్న గొప్పదానాన్ని చెబుతూ ఇది 80రకాల వ్యాధులకు చికిత్స చేయగలదని పేర్కొన్నారు. అరటి పండు వాత పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుంది. వాతం క్షీణించడం వల్ల దాదాపు 80 రకాల వ్యాధులు వస్తాయని ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇది పొడిబారడం, ముడతలు పడటం, ఎముకలలో అంతరం, మలబద్ధకం, చేదు రుచి మొదలైన అనేక సమస్యలు ఇందులో ఉన్నాయి. వీటన్నింటికి అరటిపండు చికిత్స చేయగలుగుతుంది. అరటిపండు ఎవరు తినాలంటే.. ఆయుర్వేదం ప్రకారం అరటిపండు  చల్లని గుణం కలిగి ఉంటుంది. ఇది  జీర్ణం కావడానికి బరువుగా ఉంటుంది.   ఇది లూబ్రికేషన్‌గా పనిచేస్తుంది. శరీరం ఎండిపోయి, ఎప్పుడూ అలసిపోయినట్టు, బాగా నిద్రపోనట్టు, శరీరంలో ఎప్పుడూ మంటగా ఉన్నట్టు అనిపించేవారు, చాలా దాహంతో ఉన్నవారు,  ఎక్కువ  కోపంగా ఉన్నవారు అరటిపండును తినాలి. దీనివల్ల ఆ కోపస్వభావం, అతిదాహం వంటి సమస్యలు అణిచివేయబడతాయి. ఎవరు తినకూడదంటే.. అరటిపండు కఫ దోషాన్ని పెంచుతుంది. కాబట్టి అధిక కఫ శరీర తత్వం గలవారు దీనిని తినకూడదు. పెరిగిన కఫం కారణంగా జీర్ణాశయంలో  అగ్నితత్వం  బలహీనంగా ఉంటే అరటి పండు దానిని మరింత నెమ్మదిస్తుంది. అధిక కొవ్వు, దగ్గు,  జలుబు ఉన్నవారు, ఆస్తమా రోగులు దీనిని తినకూడదు. ఒకవేళ తినాలని అనిపిస్తే  చాలా ఆలోచించి దీని పర్యావసానాలు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంటేనే తినాలి.                                              *నిశ్శబ్ద