LATEST NEWS
ప్రపంచంలో అతి పిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలిగా గుర్తింపు పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము  అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం. అది ఆగస్టు 13, 2013... తెలుగు నేల ను పులకింపజేస్తూ ఈ లోకంలో అడుగు పెట్టింది ఆ బంగారు తల్లి. పేరు కలశ... కలశ నాయుడు.. పసితనము నుండే పరుల కష్టాలకు స్పందించడం మొదలుపెట్టింది తనలాంటి పసిపిల్లలు, పనివాళ్ళుగా ఉండడం చూసి తట్టుకోలేకపోయింది ఆ చిన్నారి గుండె. తన వంతుగా, తన వయసుకు తెలిసినంతగా సాయం ప్రారంభించింది. పలకలు, బలపాలు, చాక్లెట్లు, ఆట బొమ్మలు... ఒకటేమిటి ఎవరికి ఏ అవసరం ఉన్నా అన్నీ ఇచ్చేస్తూ ఉండేది. ఆ చిన్నారి దాన గుణానికి, సేవా తత్వానికి మురిసిపోయిన ఆమె తల్లిదండ్రులు ఆమెకు కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు. చేయూతను అందించారు. దాని ఫలితమే కలశ  ఫౌండేషన్ సాధించిన ఘనవిజయాలు. వాటిలో మచ్చుకు కొన్ని తెలుసుకుందాం.   ‘అక్షర కలశం’ అనే జ్ఞాన జ్యోతిని వెలిగించి ఎందరో చిన్నారుల జీవితాల్లో వెలుగులు పంచుతుంది. విభిన్న రంగాలలోని విశిష్ట సేవలు అందించిన మహిళా మూర్తులను గుర్తిస్తూ, వారిని గౌరవిస్తూ ‘మార్వలెస్ ఉమెన్’ పురస్కారాలతో సత్కరిస్తుంది. ‘గ్రీన్ రన్’ పేరిట పర్యావరణ పరిరక్షణకై ప్రజల్లో లోతైన అవగాహన కోసం పాటుపడుతుంది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగిస్తుంది. చిన్నారి కలశ తన సేవలను దేశ సరిహద్దులు దాటి విస్తరించింది. ఎన్నో దేశాల అవార్డులు, రివార్డులు తనను వరించాయి. అవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ అందించిన గౌరవ డాక్టరేట్ మరో ఎత్తు. సామాజిక సేవా రంగంలో ఆ చిన్నారి చేసిన సేవను గుర్తించి లండన్ పార్లమెంటు భవనంలో.. చిన్నారి కలశ నాయుడు ‘ప్రపంచవ్యాప్తంగా అతిచిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలు’గా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. పలు దేశాలలో చిన్నారి కలశ అందించిన సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ ఈ పురస్కారం మరియు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది.  బ్రిటిష్ పార్లమెంట్, గౌరవ పార్లమెంటు సభ్యులు, గ్రేట్ బ్రిటన్ లోని ఇండియన్ హైకమీషనర్ మరియు అనేకమంది ప్రముఖులను ఉద్దేశించి చిన్నారి కలశ రెండు నిమిషాల పాటు అద్భుతంగా ప్రసంగించడం జరిగింది. అంతేకాదు కలశ నాయుడు గురించి లండన్ పార్లమెంట్లో రెండు నిమిషాల నిడివి గలిగిన ఆడియో విజువల్ ప్లే చేయడం జరిగింది. అతి ముఖ్యమైన పార్లమెంటు క్వశ్చన్ అవర్ లో భాగం కావలసి వచ్చినందున గ్రేట్ బ్రిటన్ ప్రధాని శ్రీ రిషి సునక్, ఈ కార్యక్రమంలో భాగం కాలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. అంతేకాక చిన్నారి కలశ నాయుడు కఠోర శ్రమ మరియు నిబద్ధతను గుర్తించి, గౌరవించుకోవడం ఒక సదవకాశం అని, ఇంత చిన్న వయసులో తను అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అని, ఈ పురస్కారం తనకు మేము అందించే గౌరవం, విశ్వ మానవ సేవలో ఈ చిన్నారి అత్యుత్తమ శిఖరాలు అందుకోవాలని ఆశిస్తున్నాను అని అన్నారు. చిన్నారి కలశ నాయుడిని తనతో కలిసి ఒక ప్రత్యేక హై-టీ పంచుకోవలసిందిగా ఆహ్వానం పలుకుతూ, తన అత్యద్భుత సేవలు మరియు ఈ వ్యక్తిగత విజయానికి ప్రతిగా ప్రతిష్టాత్మకమైన లండన్ పార్లమెంట్ సందర్శించవలసిందిగా వ్యక్తిగత ఆహ్వానం అందించడం జరిగింది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించిన తర్వాత మరో డిమాండ్ బలంగా వినిపిస్తోంది.  అదే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్‌ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు.  మాజీ ప్రదాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం రావడంపై సినీ, రాజకీయ సహా అన్ని రంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు. తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తికి కారణమైన పీవీ లాంటి వాళ్లకు నిజంగా దక్కాల్సిన గౌరవంగా అభివర్ణిస్తున్నారు. అదే టైంలో తెలుగు జాతీ ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్‌కి కూడా భారత రత్న ఇచ్చి ఉంటే తెలుగు నేల పులకించిపోయేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్య మంత్రి సీనియర్ ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాల్సిందే అని తెలంగాణ   మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డి తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రత్న ఇవ్వాలని చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమానికి పొంగులేటి మద్దతు తెలిపారు.  రఘు రాం రెడ్డి, పొంగులేటి   కలిసి కార్డులపై సంతకాలు చేసి..పోస్టు చేశారు. అనంతరం పార్టీ నేతలు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, కేత్తినేని హరీష్ లతో కలిసి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లో అనేక సంస్కరణలు తెచ్చారని అన్నారు.ఆ ఫలితంగానే.. కొత్త వారు రాజకీయాల్లో రాణించగలుగుతున్నారు అని ప్రశంసించారు. ఎమ్మెల్యే, ఎంపీలు,  మంత్రులు గా అనేకమందికి ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, విద్యా, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణ కుమారి, నాయకులు ఎండీ.ముస్తఫా, కొప్పుల చంద్రశేఖర్ రావు, బాణోతు ఉత్తేజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
జగన్ హయాంలో  ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు. ఫిట్ మెంట్, డిఏ బకాయిల విషయంలో అడిగినందుకు జగన్ సర్కార్ వారిని నానా ఇబ్బందులూ పెట్టింది. అంతెందుకు ఫిట్ మెంట్ పేరుతో జీతాలు తగ్గించేసి ఉద్యోగ సంఘాల నేతలతో చప్పట్లు కొట్టించుకుంది. ఔను 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఉద్యోగులు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా పీఆర్సీ విషయంలో  చేయగలిగినంత జాప్యం చేసి చివరకు ఇక తప్పదన్నట్లుగా 2022 జనవరిలో వారికి పీఆర్సీ  ఇచ్చింది. ఎక్కడైనా పీఆర్సీ ఇస్తే జీతాలు పెరుగుతాయి. కానీ జగన్ సర్కార్ మాత్రం రివర్స్ లో ఆలోచించింది.  జగన్ సర్కార్  పీఆర్సీ ప్రకటించిన తరువాత ఉద్యోగుల జీతాలు తగ్గాయి. నిజం వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా జరిగింది మాత్రం అదే.  ఉద్యోగులకు అప్పటికే మధ్యంతర భృతి (ఐఆర్) 27 శాతం ఉండగా, జగన్ సర్కార్  ఫిట్‌మెంట్‌ 23 శాతం ఇచ్చింది. దీంతో ఉద్యోగుల వేతనాలు 4 శాతం తగ్గాయి. దాంతో  తగ్గిన ఫిట్‌మెంట్‌ ప్రభావంతో డీఏలు.. హెచ్‌ఆర్‌ఏల్లో కూడా కోత పడింది.  దాంతో అప్పట్లో ఉద్యోగులు తమకు ఇచ్చింది పే రివిజన్ కాదు  పే రివర్స్‌  అని ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చే శారు.  అసలు జగన్ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ ఉద్యోగులకు కష్టాలూ వేధింపులు ఆరంభమయ్యాయనే చెప్పాలి. సమయానికి వేతనాలు ఇచ్చింది లేదు. వేతనాల కోసం రోడ్డెక్కితే ఉపాధ్యాయులు, ఉద్యోగులపై జగన్ సర్కార్ కక్ష సాధింపులకు పాల్పడింది. కారాలూ మిరియాలూ నూరింది. వారి పొడే గిట్టదన్నట్లుగా వ్యవహరించింది. రారయతీలు, అలవెన్సుల మాట దేవుడెరుగు అసలు జీతాలకే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. వేతనాల కోసం నిలదీసినందుకు అసలు వారు పని చేయడం లేదంటూ ప్రచారం చేసింది.  సమయపాలన లేదని నిలదీసింది. ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్ అంది. పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారంటూ ప్రజలలో వారిని పలుచన చేయడానికి ప్రయత్నించింది.  విధులకు పది నిముషాలు ఆలస్యమైనా గైర్హాజరుగా పరిగణించి వేతనాలు కట్ చేస్తామని బెదరించింది. దీంతో జగన్ సర్కార్ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు జగన్ పవన్ కట్ చేయడమొక్కటే తమ సమస్యలకు పరిష్కారం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆ విషయం అర్ధమైన తరువాత జగన్ సర్కార్ వారిని ఎన్నికల విధులకు దూరం చేయాలని ఎత్తుగడ వేసింది. వాలంటీర్లతో  పబ్బం గడిపేసుకోవచ్చని భావించింది. అయితే వాలంటీర్లను ఎన్నికల విధులకు ఎన్నికల సంఘం దూరం చేయడంతో ఇప్పుడు మళ్లీ ఉద్యోగులను మంచి చేసుకోవడానికి తహతహలాడుతోంది. అందులో భాగమే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నడూ లేని విధంగా మే నెల 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందించడం అని పరిశీలకులు అంటున్నారు. అయితే ఉద్యోగుల సహనం పూర్తిగా నశించాక ఇప్పుడు వారిని మంచి చేసుకోవడానికి జగన్ ఏ ప్రయత్నం చేసినా వృధాయే అని పరిశీలకలు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులు  జగన్  సర్కార్ విషయంలో ఒక నిర్ణయం తీసేసుకున్నారనీ ఇప్పుడిక జగన్మాయలో పడే అవకాశమే లేదనీ అంటున్నారు. మొత్తం అనూహ్యంగా 1నే వేతనాలు పడటం ఉద్యోగులనే విస్మయానికి గురి చేసింది. తామంటే జగన్ భయపడ్డాడనడానికి ఇదే నిదర్శనమని వారంటున్నారు. ఈ ఒక్క నెల సమయానికి వేతనాలిచ్చేసినంత మాత్రాన తమ నిర్ణయం మార్చుకునే ప్రశక్తే లేదని తెగేసి చెబుతున్నారు. 
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది. ప్రపంచానికి ఓటు హక్కు విలువను తెలియజెప్పిన మన దేశం ఇప్పుడు ఏదో ఒక ఆశ చూపితే తప్ప ఓటు వేయని ఓటర్లతో నిండిపోయి సర్వనాశనమయ్యే దిశగా వెళ్తోంది. రాజకీయ నాయకులు ఓటర్లకి తాయిలాల ఎరచూపి ఓట్లు వేయించుకోవడంతో ప్రారంభమైన ఈ జాడ్యం, ఇప్పుడు తాయిలాలు ఇస్తే తప్ప ఓటు వేయం అని ఓటర్లు చెప్పే పరిస్థితి వరకు పరిస్థితి దిగజారింది. ఎవరో ఒక రాజకీయ నాయకుడు డబ్బు ఇస్తే, విశ్వాసంతో అతనికే ఓటు వేసే పరిస్థితి నుంచి, అందరి దగ్గర డబ్బు తీసుకుని వేస్తే ఏ ఒక్కరికో.. లేక ఎవరికీ ఓటు వేయకుండా ఊరుకునే పరిస్థితికి ఓటర్లు చేరుకున్నారు. ఓటు వేయడం అనేది హక్కు, బాధ్యత అనే విషయం మరచిపోయి పథకాలు ఇస్తేనే, తాయిలాలు ప్రకటిస్తేనే ఓటు వేస్తామని చెప్పే దౌర్భాగ్య స్థితికి ఎన్నికల వ్యవస్థ చేరుకుంది. ఇప్పుడు చాలామంది ఓటర్లు ఎలా తయారయ్యారంటే, పథకాల ద్వారా డబ్బు ఇవ్వాలి, ఎలక్షన్లు వచ్చినప్పుడు  ఓటు వేయడానికి డబ్బు ఇవ్వాలి. ఇందులో ఓటర్లకు డబ్బు ఎరచూపే రాజకీయ నాయకులది తప్పా.. ఓటుకోసం డబ్బు ఆశించే ఓటర్లది తప్పా అంటే, అది ‘విత్తుముందా.. చెట్టుముందా’ అనే ప్రశ్నకంటే సంక్లిష్టమైన ప్రశ్న అవుతుంది. ఎలక్షన్ల వ్యవస్థలో రాజకీయ నాయకులు, ఓటర్ల మధ్య ఇలాంటి కానుకల బంధం కొనసాగుతూ, ప్రజాస్వామ్య విలువలను ఒకవైపు ప్రశ్నార్థకంలో పడేస్తుంటే, మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా ఓటర్లకు తాయిలాలు ఇచ్చే కార్యక్రమానికి తెరతీసింది. ఓటు వేసేలా ఓటర్లలో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహిస్తే ఓకేగానీ, ఓటు వేయండి, కానుకలు ఇస్తాం అని సాక్షాత్తూ ఎన్నికల కమిషనే అంటూ వుండటం ఘోరం.. దారుణం.. అన్యాయం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లను ఓటు వేసేలా చేయడానికి ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ‘ఓటు వేయండి.. బహుమతులు పొందండి’ అటూ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రకారం, ఓటు వేసిన ఓటర్లకు లక్కీ డ్రా ద్వారా డైమండ్ రింగ్‌లు గెలుచుకునే సదవకాశాన్ని ఇస్తోంది. ఓటర్లు ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రం బయటకి వచ్చి, తమ చేతికి వున్న ఇంకు గుర్తును చూపించి, లాటరీలో తమ పేరు నమోదు చేసుకోవాలి. ఇలా రెండు గంటలకోసారి లాటరీ తీసి, ఈ రెండు గంటల్లో ఓటు వేసిన వారికి ఒక డైమండ్ రింగ్ ఇస్తారు. భోపాల్ నియోజకవర్గంలో ఈనెల 7వ తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది. రెండు విడతల్లో తక్కువ పోలింగ్ నమోదైన నేపథ్యంలో మూడో విడత పోలింగ్‌ శాతాన్ని పెంచడానికి అక్కడి ఎన్నికల కమిషన్ ఈ డైమండ్ రింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన ఎన్నికల కమిషన్‌ని ఏమనాలో అర్థంకావడం లేదని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ చెంగ్ సైఫాన్. లావోస్ దేశానికి చెందిన చెంగ్ సైఫాన్ నలభై ఆరేళ్ళ క్రిందట అమెరికా దేశానికి వలస వెళ్ళాడు. చిన్నా చితకా ఉద్యోగాలేవో చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సైఫాన్‌కి ఎనిమిదేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధితో బాధపడుతూనే, చాలీ చాలని సంపాదనతో కీమో థెరఫీ చేయించుకుంటూనే బతుకుమీద ఆశతో ముందుకు వెళ్తున్నాడు చెంగ్ సైఫాన్. జీవితం ఎంత దురదృష్టభరితంగా వున్నప్పటికీ, తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు సైఫాన్. పవర్‌బాల్ లాటరీ అనే ప్రఖ్యాత సంస్థకు చెందిన లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేశాడు. ఇటీవల డ్రా నిర్వహించగా, చెంగ్ సైఫాన్ కొన్న మొత్తం ఐదు టిక్కెట్ల నంబర్లు సరిపోలి జాక్‌పాట్ తగిలింది. ఈ లాటరీ ద్వారా చెంగ్‌కి మొత్తం 1.3 బిలియన్ డాలర్లు... అంటే, మన కెరెన్నీలో అక్షరాలా పదివేల కోట్లు. పన్నులలో భాగంగా 422 మిలియన్ డాలర్లను తగ్గించి త్వరలో చెంగ్‌కి మిగతా డబ్బును అందించనున్నారు. ఈ లాటరీ టిక్కెట్లు కొనడానికి తనకు సాయం చేసిన తన భార్య, మిత్రుడితో ఈ డబ్బును పంచుకుంటానని, తనను వేధిస్తున్న క్యాన్సర్‌కి చికిత్స చేయించుకుంటానని చెంగ్ సైఫాన్ చెబుతున్నాడు.
ALSO ON TELUGUONE N E W S
దర్శకుడు సుకుమార్(Sukumar) ఎంతటి ప్రతిభావంతుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కుటుంబం నుంచి మరో ప్రతిభ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. సుకుమార్ కుమార్తె సుకృతి వేణి.. దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో సత్తా చాటింది. తాజాగా జరిగిన దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో 'గాంధీ తాత చెట్టు' చిత్రానికి గాను ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి అవార్డు అందుకుంది. సుకుమార్ సతీమణి  త‌బితా సుకుమార్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పద్మావతి దర్శకత్వం వహించారు. ఇప్పటికే పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సత్తా చాటి, ప్రశంసలు అందుకున్న 'గాంధీ తాత చెట్టు' చిత్రం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మమ్ముట్టి..మలయాళ సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే మాలీవుడ్  బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల వర్షంలో తడిసి ముద్దవ్వాల్సిందే. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. ఫస్ట్ మూవీ అనుభవంగల్ పాలిచకల్  1971 లో విడుదల అయ్యింది. అప్పుడు ఆయన వయస్సు  20  సంవత్సరాలు. దాన్ని  బట్టి ఆయన సినీ జర్నీ ని  అర్ధం చేసుకోవచ్చు. సామ్రాజ్యం, దళపతి, స్వాతి కిరణం లాంటి విభిన్న సినిమాలతో తెలుగు వారికి కూడా  అభిమాన కధానాయకుడు గా కూడా మారాడు . రీసెంట్ గా ఆయన ఒక రికార్డు సృష్టించాడు.అంతే కాకుండా  ఎంతో మంది అగ్ర హీరోలకి ఆదర్శంగా నిలిచాడు. . ప్రస్తుతం  స్టార్  హీరో  సినిమా  రెండేళ్లకో,మూడేళ్లకో  ప్రేక్షకులని పలకరిస్తుంది. ఎనీ  లాంగ్వేజ్ తీసుకున్నా ఇదే పరిస్థితి  కానీ మమ్ముట్టి ఈ పద్ధతిని మారుస్తు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు. కేవలం తొమ్మిదంటే  తొమ్మిది నెలల్లో ఐదు సినిమాలు రిలీజ్ చేసి సరికొత్త  ప్రభంజనాన్నే సృష్టించాడు.  డిఫరెంట్ కంటెంట్ తో కూడిన  ఆ చిత్రాలన్నీ సక్సెస్ ని కూడా  సాధించాయి. కన్నూర్ స్క్వాడ్  సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యింది,  కాదల్ ది కోర్ నవంబర్ 23న , అబ్రహం ఓజ్లర్ ఈ ఏడాది జనవరి న  రిలీజ్ అయ్యింది. భ్రమ యుగం ఫిబ్రవరి లో రిలీజ్ అయ్యింది.  ఇప్పుడు టర్బో గా రాబోతున్నాడు. వాస్తవానికి ఈ మూవీ  జూన్ 13న రిలీజ్ అవ్వాలి. కానీ మే 23నే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బజూక అనే ఇంకో చిత్రం కూడా ఈ సంవత్సరమే విడుదల కానుంది.  సోషల్ మీడియాలో మమ్ముట్టి ఐదు సినిమాల న్యూస్  బాగానే వైరల్ అవుతుంది. దీంతో  అన్ని బాషల కి చెందిన హీరోలు మమ్ముట్టి ని ఆదర్శంగా తీసుకోవాలని అభిమానులు, సినీ ప్రేమికులు  కోరుతున్నారు.  అన్ని లాంగ్వేజ్ లని కలుపుకొని   సుమారు 400  చిత్రాలకి పైనే మమ్ముట్టి  నటించాడు  
ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన దీపక్ సరోజ్ హీరోగా పరిచయమైన చిత్రం 'సిద్ధార్థ్ రాయ్'(Siddharth Roy). ఈ రొమాంటిక్ డ్రామాని యశస్వి దర్శకత్వంలో జయ అడపాక నిర్మించారు. 'అర్జున్ రెడ్డి' సినిమా ఛాయలతో ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన ఈ మూవీ.. రెండు నెలల తర్వాత ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.   ‘సిద్ధార్థ్ రాయ్’ మూవీ రివ్యూ   'సిద్ధార్థ్ రాయ్' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా దక్కించుకుంది. ఈ సినిమాని మే 3 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇటీవల థియేటర్లలో అంతగా ఆదరణ పొందని కొన్ని సినిమాలు.. ఓటీటీలో మ్యాజిక్ చేస్తున్నాయి. మరి యూత్ ఫుల్ మూవీ 'సిద్ధార్థ్ రాయ్' కూడా అలాంటి మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.
Rising star Naveen Chandra has clinched the highly coveted Best Actor award at the prestigious Dada Saheb Phalke Film Festival. The accolade recognizes his outstanding performance in the film 'Month of Madhu'.  The Dada Saheb Phalke Film Festival, named after the father of the Indian film industry, celebrates excellence in cinema across various categories each year. Artists from all corners of the country vie for these esteemed awards, making it a true testament to talent and dedication. Naveen Chandra's win for the year 2024 is a testament to his versatility and impact on the Indian film scene. Having showcased his acting prowess in a myriad of Telugu, Tamil, and Hindi films, he first made waves with his debut in the 2011 hit 'Andala Rakshasi'. Since then, he has continued to captivate audiences with his performances, including his role in the acclaimed film 'Game Changer'. Notably, Naveen Chandra's portrayal in the web series 'Inspector Rushi', available on Amazon Prime, has been garnering widespread acclaim and creating a sensation among viewers.
Prabhas' Salaar movie was released in theatres on December 22, 2023, and since then the movie has been performing well at the box office. Salaar has shattered several box office records and has been created new records every day. It was a solid comeback for Prabhas with total 700 crores gross worldwide. This is unprecedented and Prabhas is breaking his own records and creating new benchmarks. The film created sensation after the OTT release too. Now, the film's second part is in the works. Everyone is eagerly waiting to start the 2nd part shoot. Prasanth Neel is currently busy in pre-production while Prabhas and Prithviraj Sukumaran are so excited to back on grandeur sets. According to sources, the film's shoot begins in May end at Ramoji Film City, Hyderabad. The sets work is going on. Prabhas and Prithviraj Sukumaran will be part of this 10 days schedule. Salaar: Part 1 – Ceasefire is directed by KGF director Prashanth Neel and it is produced by Vijay Kiragandur under the banner of Hombale Films. The movie stars Prabhas, Shruti Haasan, Bobby Simha, Jagapathi Babu Tinnu Anand, Easwari Rao, Sriya Reddy and Ramachandra Raju in pivotal roles.
ఇళయరాజా అంటే తెలియని దక్షిణ భారతీయ సినీ ప్రేమికుడు లేడు. సంగీత ప్రపంచంలో ఎన్ని రాగాలు ఉంటాయో వాటన్నింటిలోను అవలీలగా స్వరాలు సమకూర్చగల సంగీత మేధావి. ఆయన స్వరపరచిన  పాటని  పామరులు సైతం నోటితో  హమ్ చెయ్యవచ్చు.అంతటి  సంగీత  జ్ఞానీ  గత కొంత కాలంగా సంచలనాల  జ్ఞానీ గా మారాడు. తాజాగా ఇంకో సంచలనాన్ని తన ఖాతాలో భద్రపర్చుకున్నాడు  రజనీకాంత్ తో కూలీ చిత్రాన్ని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ కి ఇళయరాజా  కోర్ట్  నోటీసులు పంపాడు. ఇటీవల కూలీ టీజర్ రిలీజ్ అయ్యింది.బంగారం స్మగ్లింగ్ చేసే డెన్ లోకి రజనీ అడుగుపెట్టి అందర్నీ తుక్కు తుక్కుగా కొడతాడు.ఇక  గతంలో ఇళయరాజా స్వరపరిచిన  తంగ మగన్ లోని  వా వా పక్కం వా పాటను టీజర్ లో  ఉపయోగించారు. దీంతో   తన అనుమతి లేకుండా తన పాటని  ఉపయోగించారంటు  సన్ పిక్చర్స్‌కు ఇళయరాజా నోటీసులు పంపించాడు. మ్యూజిక్ కి కాపీ రైట్ ని చెల్లించాలి.లేదా టీజర్ నుంచి తన పాటని  తొలగించాలని కూడా నోటీసులో పేర్కొన్నాడు.చివరిగా ఇందులో కొసమెరుపు ఏంటంటే  తంగ మగన్ లో  రజనీ నే హీరో. సిల్క్ స్మిత, రజనీ మీద ఆ పాట తెరకెక్కింది ఇళయ రాజా గతంలో అమర గాయకుడు దివంగత బాలసుబ్రమణ్యం గారు తన అనుమతి లేకుండా పాటలు పాడాడని  కూడా కేసు వేసాడు. పాటలు కేవలం స్వర కర్త సొంతం అనేది ఇళయరాజా అభిప్రాయం.  మరి ఇప్పుడు కూలీ విషయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రజనీ కాంత్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.  కూలీ కి లోకేష్ కనగరాజ్ దర్శకుడు కాగా అనిరుద్ మ్యూజిక్ ని అందించాడు. రజనీ కెరీర్ లో 171 వ సినిమా  
పాన్ ఇండియా హీరోలు ప్రభాస్(Prabhas), జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) సినిమాల విషయంలో గందరగోళం నెలకొంది. ఇద్దరి సినిమాల్లో ముందుగా ఏది మొదలవుతుందో తెలియక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఈ గందరగోళానికి కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్ అని చెప్పవచ్చు. గతేడాది డిసెంబర్ లో ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన 'సలార్' సినిమా విడుదలైంది. అలాగే వీరి కాంబోలో 'సలార్-2'(Salaar 2) రావాల్సి ఉంది. మరోవైపు ఎన్టీఆర్ తోనూ ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా మొదలవుతుంది అనేది పెద్ద సస్పెన్స్ లా మారింది. కొందరు 'సలార్-2' ఈ నెలలోనే ప్రారంభం కానుందని, ఇది పూర్తయ్యాక వచ్చే ఏడాది ఎన్టీఆర్-నీల్ (NTR Neel) ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. మరికొందరు మాత్రం అసలు ఇప్పట్లో 'సలార్-2' ఉండదని చెబుతున్నారు. 'కల్కి 2898 AD' విడుదల తర్వాత ప్రభాస్, హను రాఘవపూడి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తాడని, అనంతరం 'స్పిరిట్', 'కల్కి 2', 'రాజాసాబ్' పూర్తి చేసి.. అప్పుడు 'సలార్ 2'పై దృష్టి పెడతాడని అంటున్నారు. అంతేకాదు, ఎన్టీఆర్-నీల్ మూవీ అక్టోబర్ లేదా నవంబర్ నుంచి స్టార్ట్ కానుందని చెబుతున్నారు.  దీంతో 'సలార్-2', ఎన్టీఆర్ ప్రాజెక్ట్ లలో ఏది ముందు మొదలవుతుంది అనేది పెద్ద సస్పెన్స్ లా మారిపోయింది. ఈ సస్పెన్స్ కి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.
ఒకప్పుడు దర్శకుడు శ్రీను వైట్ల(Srinu Vaitla) సినిమాలకు ఎంతో క్రేజ్ ఉండేది. కామెడీ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా ఆయన పేరు చెప్పుకునేవారు. 'సొంతం', 'వెంకీ', 'ఢీ', 'రెడీ', 'దూకుడు', 'బాద్‍షా' ఇలా ఎన్నో ఆల్ టైం ఎంటర్టైనర్స్ ని శ్రీను వైట్ల అందించారు. సోషల్ మీడియాలో కనిపించే తెలుగు మీమ్స్ లో 80 శాతం ఆయన సినిమాల్లోని టెంప్లేట్స్ కనిపిస్తాయి. అలాంటి వైట్ల.. 'ఆగడు' తర్వాత వరుస పరాజయాలతో వెనకబడిపోయారు. 2018 లో వచ్చిన 'అమర్ అక్బర్ ఆంటోని' తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. ఆరేళ్ళ గ్యాప్ తర్వాత ఇప్పుడు శ్రీను వైట్ల మళ్ళీ తన మార్క్ చూపించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ తో 'విశ్వం' సినిమా చేస్తున్న ఆయన.. ఇప్పుడు మరో సినిమాని కూడా లైన్ లో పెట్టినట్లు సమాచారం. హీరో రామ్ పోతినేని(Ram Pothineni), శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన 'రెడీ'(2008) మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. థియేటర్లలో నవ్వులు పూయించి, కాసులు వర్షం కురిపించింది. పలు భాషల్లో రీమేక్ కూడా అయింది. ఇప్పటికీ ఈ సినిమాని రిపీటెడ్ గా చూసేవారు ఎందరో ఉన్నారు. అలా 'రెడీ'తో నవ్వుల సునామీ సృష్టించిన రామ్-వైట్ల కాంబో మరోసారి చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీను వైట్ల స్టోరీ లైన్ చెప్పడం, దానికి రామ్ ఇంప్రెస్ అవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. 'విశ్వం' సినిమా పూర్తయ్యాక.. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని వైట్ల మొదలుపెడతారట. 'రెడీ' కాంబోలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందనుందని తెలుస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'డబుల్ ఇస్మార్ట్'(Double iSmart) చేస్తున్నాడు రామ్. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దీని తర్వాత వైట్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
కల్ట్  ఫ్యాన్స్ కి పెట్టింది పేరు తమిళ సూపర్ స్టార్ అజిత్. తమ అభిమాన హీరోని ఎవరేమైనా అంటే వాళ్ళ అంతు తేల్చే వాళ్లే కల్ట్ ఫ్యాన్స్.రెండున్నర  దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ అంతటి అభిమానాన్ని  పొందాడు.    1996 లో తెలుగులో  వచ్చిన  ప్రేమలేఖ  ద్వారా కూడా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. తాజాగా అజిత్ కి ఒక గిఫ్ట్ వచ్చింది.   ఈ రోజు అజిత్  53వ పుట్టినరోజు. ఈ  సందర్భంగా ఆయన భార్య షాలిని ఒక  అద్భుతమైన బహుమతిని ఇచ్చింది. స్పోర్ట్స్ బైక్ లో నెంబర్ వన్ బైక్ గా గుర్తింపు పొందిన  డుకాటీ ని గిఫ్ట్ గా ఇచ్చింది. రెడ్ కలర్ కోటింగ్ తో ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఆ బైక్ ధర సుమారు 20 లక్షలు దాకా ఉంటుంది. ప్రస్తుతం ఆ బైక్ కి  సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు వాటిని చూసి  తమ  సంతోషం వ్యక్తం చేస్తు అజిత్ కి  బర్త్ డే విషెస్ చెప్తున్నారు. ఇక  స్వతహాగా  అజిత్ మంచి రేసర్. ఎన్నోపోటీల్లో పాల్గొని పలు  ప్రైజ్ లని  కూడా గెలుచుకున్నాడు. ప్రస్తుతం  విడా ముయార్చి అనే కొత్త మూవీ  షూటింగ్ లో  బిజీగా ఉన్నాడు.  మగిజ్ తిరుమేని దానికి దర్శకుడు. అలాగే   మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రానికి కూడా ఓకే చెప్పాడు.అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా  మొదటి సారి త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అజిత్ వైఫ్  షాలిని కూడా బాలనటిగా,  హీరోయిన్ గా  చాలా సినిమాల్లో చేసింది.చిరంజీవి హీరోగా వచ్చిన  జగదేక వీరుడు అతిలోక సుందరి లో  కళ్ళజోడు పెట్టుకొని కనపడే   అమ్మాయి తనే. అలాగే మాధవన్ హీరోగా వచ్చిన మణిరత్నం సఖి లో సోలో హీరోయిన్ గా తమిళ, తెలుగు ప్రేక్షకులని ఒక ఊపు ఊపింది.       
Mega Producer K. T. Kunjumon As the producer and directed by sensational director S. Shankar, Music by Oscar winner A. R. Rahman and starring by Indian Michael Jackson Prabhu Deva and beautiful actress Nagma movie Premikudu is going to be re-released. Ramana and Muralidhar are acting as the re release producers of this movie. SP Balasubramaniam, Vadivelu, Raghuvaran and Girish Karnad acted in lead roles. The movie Premikudu, which released 30 years ago, was planned for re-release in more than 300+ theaters on May 1st. Even, bookings opened and but the poor response and bookings made makers to postpone. Premikudu is Directed by S. Shankar, starring Indian Michael Jackson Prabhu Deva and Nagma’s movie released 30 years ago and impressed the youth. Even now, the songs of that movie continue to impress everyone, not just the youth. Prabhu Deva’s father S. P. Balasubramaniam’s acting is a big plus for the movie. S. P. Balu’s dancing is equal to Prabhudeva in the song andamaina premarani cheyyi tagilithe is special. Takeit Easy Policy, O Chelia Na Priya Sakhia songs are still evergreen songs. The movie which came out as a good youth full love story was the biggest blockbuster in those days.
ప్రేమ అనేది  ఇప్పట్లో చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ప్రేమ అంటే అబ్బాయిలు మాత్రమే ధైర్యం చేసి చెప్పేది.. అమ్మాయిలకు అంగీకారం ఉంటే తదుపరి వారి బంధం మరో మలుపు తిరిగేది.. కానీ ఇప్పుడు అట్లా కాదు.. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ ప్రేమ విషయంలో బాగా అడ్వాంటేజ్ గా ఉంటున్నారు. అయితే చిక్కల్లా ఒకమ్మాయి తమకు బాగా తెలిసి, తమతో సన్నిహితంగా ఉంటూ తమను లవ్ చేస్తుందా లేదా  అనే విషయం అర్థం కాక జట్టు  పీక్కునే అబ్బాయిల గురించే..   అయితే దీనికి ఈజీగానే చెక్ పెట్టవచ్చు అమ్మాయిలు తమను ప్రేమిస్తున్నారా లేదా అనే విషయాన్ని అబ్బాయిలు ఈ 7 విషయాల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటంటే.. అమ్మాయిలు తమకు ఎంత పని ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా వారి మనసులో ఒక అబ్బాయి పట్ల ప్రేమ ఉంటే వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఫోన్ లో అయినా, మెసేజ్ లో అయినా, వ్యక్తిగతంగా కలవడంలో అయినా తను ప్రేమించిన అబ్బాయిని ఎప్పుడూ లైట్ తీసుకోదు. తను ఇష్టపడుతున్న అబ్బాయితో సన్నిహితంగా ఉండటానికి అమ్మాయిలు అబద్దాలు చెప్తారు. మాట్లాడటానికో, కలసి నడుస్తున్నప్పుడో, పక్కపక్కన కూర్చున్నప్పుడో తాకడం, చెయ్యి పట్టుకోవడం, నవ్వడం, నవ్వించడం వంటివి చేస్తారు. ప్రతి అమ్మాయికి తను ఇష్టపడే అబ్బాయి మరొకరితో సన్నిహితంగా మాట్లాడితే కోపం వస్తుంది. అలాగే అసూయ పడుతుంది. ఒకమ్మాయి తను ఇష్టపడుతున్న అబ్బాయి ఇతర అమ్మాయిలతో మాట్లాడుతుంటే అలాగే ఫీలవుతుంది. కొన్నిసార్లు తను ప్రేమించిన అబ్బాయి  ముందు కోపాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. అమ్మాయి తను ప్రేమిస్తున్న అబ్బాయి కళ్లలోకి చూసి మాట్లాడాలంటే చాలా ఇష్టపడుతుంది. అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్లలోకి చూస్తూ మాట్లాడుతుంటే ఆమెకు ప్రేమ ఉన్నట్టే. అమ్మాయిలు తాము ప్రేమిస్తున్న అబ్బాయిలు అందుబాటులో కాస్త దూరంగా ఉంటే ఇక చూపులన్నీ తను ప్రేమిస్తున్న అబ్బాయి వైపే ఉంచుతుంది. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే.. అమ్మాయి తను ఇష్టపడే అబ్బాయి కదలికలను గమనించడానికి, అతన్ని చూడటానికి ఇష్టపడుతుంది. అబ్బాయికి నచ్చిన పని చేయడానికి, నచ్చిన వస్తువులు, నచ్చిన ఆహారం తీసుకొచ్చి ఇవ్వడానికి అమ్మాయి శ్రద్ద చూపిస్తున్నట్టైతే అది సాధారణ పరిచయం లేదా స్నేహం అనుకోవడానికి వీల్లేదు. ఏ మూలో అమ్మాయికి తప్పకుండా అబ్బాయి మీద ఇష్టముందని అర్థం. అమ్మాయిలు తమకు ఏ చిన్న బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా అబ్బాయితో చెబుతుంటే ఆమెకు అతను చాలా స్పెషలని అర్థం. అంతేకాదు తను ఇష్టపడుతున్న అబ్బాయి పక్కన ఉంటే ఆమె తన బాధలన్నీ మర్చిపోతుంది. అమ్మాయి ఇలా చేస్తుంటే ఆమె ప్రేమిస్తోందనే అర్థం.                                                         *నిశ్శబ్ద.  
  మనసులో ఏదీ దాచుకోలేకపోవడం చాలా మంది బలహీనత. బాధ అయినా, సంతోషం అయినా, దుఃఖం అయినా తనకు తెలిసిన వారికో లేక స్నేహితులు, ఆత్మీయులకో ఏదో ఒక  సందర్భంలో చెప్పుకుని తీరతారు. అయితే ఇలా చెప్పడం తప్పని కాదు కానీ.. కొన్ని విషయాలు మాత్రం ఇతరులతో అస్సలు చెప్పడం మంచిది కాదని అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేష నిపుణులు. ఏ వ్యక్తి అయినా ఇతరులతో అస్సలు చెప్పకూడని 5 విషయాలేంటో తెలుసుకుని వాటిని పాటిస్తే  వారి జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది. ఆ అయిదు విషయాలేంటో తెలుసుకుంటే.. ఆర్థిక స్థితి.. ఉద్యోగం చేసేవారు అయినా వ్యాపారం చేసేవారు అయినా పొదుపు చేసేవారు అయినా తమ ఆర్థిక స్థితి గురించి మరో వ్యక్తికి చెప్పడం మంచిది కాదు. ప్రతి వ్యక్తి ఆర్థిక స్థితి సామాజిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. డబ్బును చూసి మనుషులు మసలుకునే కాలమిది. ఎవరిదగ్గరైనా డబ్బు ఎక్కువ ఉందని తెలిసినా, ఎక్కువ సంపాదిస్తున్నారని తెలిసినా అప్పు కోసం, సహాయాల కోసం సులువుగా చుట్టూ చేరతారు. పక్క మనిషి గురించి పట్టించుకోని ఈ కాలంలో ఆర్థిక సహాయాలు చెయ్యడం అంత మంచిది కాదు. అందుకే ఆర్థిక స్థితి గురించి ఎవరికీ చెప్పకూడదు. ఇంటి సమస్యలు.. ప్రతి ఇంట్లోనూ సమస్యలుంటాయి. ఇంటి సమస్యలను ఇంటి వారితో చర్చించి వాటిని చక్కబెట్టుకోవడం శ్రేయస్కరం. అలా కాకుండా సలహాలు, సూచనలు ఇస్తారనో లేదా మనసులో భారం దించుకోవాలనే ఆలోచనతోనో ఇంటి సమస్యలు బయటి వారికి, తెలిసిన వారికి చెప్పడం మంచిది కాదు. రిలేషన్ గొడవలు..  నిజానికి తోబుట్టువులు, చుట్టాలు, బాగా దగ్గరి వారైనా సరే.. భార్యాభర్తల సమస్యలలో జోక్యం చేసుకోవడం, తీర్పులు ఇవ్వడం మంచిది కాదు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవలు, సమస్యలు వారే పరిష్కరించుకుంటే వారిద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం పెరుగుతుంది. ఏ సమస్యకైనా ప్రతి వ్యక్తి స్పందన వేరుగా ఉంటుంది. అనుభవాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి సమస్యలను బయటకు, లేదా ఇతరుల దగ్గరకు తీసుకెళ్లడం, చెప్పడం మంచిది కాదు. మూడవ వ్యక్తికి భార్యాభర్తల సమస్యలు చెబితే వారు దాన్ని ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు. బలహీనతలు.. ప్రతి వ్యక్తిలోనూ బలాలతో పాటూ బలహీనతలు ఉంటాయి. చాలామంది వ్యక్తులలో లోపాలు, బలహీనతలను వెతుకుతారు. వాటిని వేలెత్తి చూపిస్తారు. విమర్శిస్తారు. అందుకే వ్యక్తులలో బలాలు బయటపెట్టినా సమస్య లేదు కానీ బలహీనతల గురించి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరికీ చెప్పకూడదు. ప్రణాళికలు.. పెద్ద పెద్ద విషయాల గురించి నిర్ణయాలు తీసుకునే ముందు, పెద్ద ప్రణాళికలు వేసుకునేటప్పుడు వాటిని మరొక వ్యక్తితో చెప్పకూడదు. జీవితంలో ఇంకా ఎదిగే దశలో వేసుకునే ప్రణాళికలు ఇతరులతో చెప్పకూడదు.                                                      *రూపశ్రీ.  
మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అయ్యాయని ఒకప్పుడు చెప్పుకునేవాళ్లం. అది ఇప్పటికీ ఉంది కానీ.. మానవ సంబంధాలు మరికొన్ని కొత్త రూపాలకు దారి మళ్లాయి. ఒకప్పుడు వైవాహిక జీవితంలో ఏ సమస్య వచ్చినా  దాన్ని పరిష్కరించుకోవడం, సర్థుకోవడం చేసేవారు. కానీ ఇప్పుడలా కాదు.. ఏ సమస్య వచ్చినా దాన్ని తెగెవరకు లాగి అదే సమస్యకు పరిష్కారం అని అనుకుంటున్నారు. ప్రస్తుతం చాలా వైరల్ అవుతున్న విషయం స్లీపింగ్ డైవొర్స్.. అసలు స్లీపింగ్ డైవొర్స్ అంటే ఏంటి? దీనివల్ల భార్యాభర్తలకు జరిగే నష్టం ఏంటి తెలుసుకుంటే.. పెళ్లైన భార్యాభర్తలు  ఒకే గదిలో ఉన్నప్పుడు వారు కలిసి నిద్రపోతారు.  ఇద్దరూ విడివిడిగా పడుకోవడం ప్రారంభిస్తే వారి మధ్య ఏదో సరిగ్గా జరగడం లేదనే అనుమానం వస్తుంది.  సాధారణంగా భార్యాభర్తలు ఇక ఇద్దరూ కలిసి జీవించలేమని నిర్ణయించుకున్న తరువాత విడాకులు తీసుకుంటారు. కానీ ఈ స్లీపింగ్ డైవొర్స్ అనేవి బంధాన్ని తెంచుకునే విడాకులు కాదు.. నాణ్యమైన నిద్ర పొందడానికి భాగస్వాములు విడివిడిగా నిద్రపోవడానికి తీసుకునే విడాకులు. సాధారణంగా భాగస్వాములు నిద్రలో చేతులు,  కాళ్లను కదిలించడం వల్ల, గురకకు అలవాటు పడడం వల్ల లేదా ఏదైనా నిద్ర రుగ్మత కారణంగా పక్కవారి నిద్రకు డిస్టర్బ్ కలిగిస్తూ ఉంటారు. కానీ ఈ స్లీపింగ్ డైవొర్స్ కారణంగా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ఇద్దరు హాయిగా నిద్రపోతారని  అనుకుంటున్నారు. కానీ  ఇది సమస్యను పరిష్కరించడానికి బదులుగా వారి మధ్య బంధాన్నిబలహీనపరుస్తుంది. నిద్ర కోసం ఈ స్లీపింగ్ డైవొర్స్ తీసుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. అయినా సరే ఈ డైవొర్స్ స్లీపింగ్ వల్ల జంట మధ్య బంధం బలహీనపడుతుందని రిలేషన్షిప్ నిపుణులు నొక్కి వక్కాణిస్తున్నారు. ఇద్దరూ విడివిడిగా పడుకోవడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా వారిని ఎప్పటికీ కలిపి ఉంచేది వారిద్దరి మధ్య శారీరక స్పర్శే.. అది కూడా వారిమధ్య లేనప్పుడు  ఇక ఇద్దరినీ కలిపి ఉంచే మార్గమేదీ ఉండదు. ఒకే ఇంట్లో ఇద్దరూ అపరిచితుల్లా చాలా  కొద్ది కాలంలోనే మారిపోతారు. మరొక విషయం ఏమిటంటే ఇలా ఇద్దరూ విడివిడిగా పడుకోవడం అనేది దీర్ఘకాలం జరిగితే వైవాహిక బంధాలు విచ్చిన్నమై వాటి విలువ కూడా తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన నిద్రకోసం భార్యాభర్తలు ఇద్దరూ ఆరోగ్యకరమైన పద్దతులు ఎంచుకోవాలి. వైద్యుల సలహా తీసుకుని నిద్రకు బంగం కలిగించే సమస్యలను పరిష్కించుకోవాలి.                                              *రూపశ్రీ.  
మనిషి శరీరానికి ఆహారమే గొప్ప ఔషదం. సరైన ఆహారం తిన్నా, సరైన వేళకు తిన్నా అది శరీరానికి చాలా బాగా పనిచేస్తుంది. గ్రామాల లైఫ్ స్టైల్ గమనిస్తే సాయంత్రం దీపాలు పెట్టే వేళకు వంట పూర్తీ చేయడం,  ఆ తరువాత రాత్రి 7 గంటల లోపే భోజనం చేయడం జరుగుతుంది. ఆ తరువాత ఇరుగు పొరుగు వారు, కుటుంబ సభ్యులు కాసేపు కబుర్లు చెప్పుకుని 8 నుండి 9 గంటల్లోపు నిద్రపోయేవారు. తర్వాత ఉదయం నాలుగు గంటలకే లేచి పనులు చక్కబెట్టుకునేవారు. గ్రామాలలో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఇది బలమైన కారణం. కానీ ఈ అలవాటు ఇప్పుడెక్కడా కనిపించట్లేదు..  గ్రామాలలో కూడా కాంక్రీటు సొగసులు అద్దుకుని తమ అలవాట్లను కూడా కోల్పోయాయి. అయితే  రాత్రి 7 గంటలలోపే భోజనం చెయ్యడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఒక్కసారి తెలుసుకుంటే... ఆహారం తినడానికి, నిద్రపోవడానికి మధ్య తగినంత సమయం ఉండాలని వైద్యులు చెబుతారు.   ఎందుకంటే తినడానికి నిద్రించడానికి మధ్య  సమయం ఉండచం వల్ల  ఆహారం జీర్ణం కావడానికి అనువుగా ఉంటుంది.  ఆహారం సరిగా జీర్ణమైతే జీర్ణాశయ సమస్యలు ఏమీ ఉండవు. జీర్ణాశయ సమస్యలు  లేకపోతే ఉదర ఆరోగ్యం బాగుంటుంది.  దీంతో నిద్ర కూడా బాగా పడుతుంది. రోజూ రాత్రి 7 గంటలలోపు తినడం అలవాటు చేసుకునే వారికి తరువాత రోజు ఉదయం 8 గంటలలోపు బాగా ఆకలి అవుతుంది. ఉదయం 8 గంటలలోపు అల్పాహారం కానీ లేదా ఇతర ఆహారాలు కానీ ఉదయాన్నే తింటారు. దీని వల్ల ఉదయం ఆహారం ఎగ్గొట్టే అలవాటు తప్పుతుంది. ఆకళి కూడా వేళకు ఠంచనుగా అవుతుంది.   రాత్రి నిద్రపోయే ముందు ఆహారం తినేటప్పుడు అదొక హడావిడి ఉంటుంది. సమయం అయిపోతోందని, తొందరగా నిద్రపోవాలని కంగారు పడేవారు కొందరు ఉంటారు. దీని వల్ల ఆహారాన్ని ఆస్వాదించలేరు. అదే 7 గంటలప్పుడు వాతావరణం బాగుంటుంది. ఆహ్లదకరమైన వాతావరణంలో తినడం వల్ల ఆహారం కూడా శరీరానికి ఒంటబడుతుంది. ఆహారం బాగా జీర్ణం కావాలంటే తిన్న వెంటనే పడుకోకూడదు. 7గంటలలోపు భోజనం చేస్తే పడుకునే లోపు ఏదో ఒక పని చేస్తూ సమయం గడుస్తుంది. దీనివల్ల తిన్న ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది.  కడుపులో గ్యాస్, ఉబ్బరం, జీర్ణసమస్యలు వంటివి ఎదురుకావు. చాలామంది బరువు పెరగడానికి కారణం రాత్రి భోజన వేళలు సరిగా లేకపోవడమే. తిన్న వెంటనే కాసేపు నడక, ఇతర పనులు చేయడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కావడానికి సమయం దొరకడమే కాకుండా  కేలరీలు కూడా బర్న్ అవుతాయి. జీవక్రియ బాగుండటం వల్ల బరువు పెరగే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. ప్రతి వ్యక్తిలో సిర్కాడియన్ రిథమ్ అనే చక్రం ఉంటుంది. ఇది నిద్రా చక్రం నుండి జీవక్రియ వరకు చాలా విధులు సక్రమంగా ఉండేలా చూస్తుంది. రాత్రి 7గంటల లోపు తింటే సిర్కాడియన్ రిథమ్  ఆరోగ్యకరంగా ఉంటుంది.                                                           *నిశ్శబ్ద.
  జీర్ణ ఆరోగ్యం బాగుంటే మొత్తం ఆరోగ్యం అంతా బావుంటుంది. వేసవిలో  వేడి,  తేమతో కూడిన వాతావరణంలో శరీరాలు సులభంగా డీహైడ్రేషన్ కు గురవుతాయి.  ఇది మలబద్ధకం, అతిసారం,  ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి  ఆయుర్వేద చెప్పిన  చిట్కాలను అనుసరించడం అన్ని విధాలా మంచిది. జీర్ణ సమస్యల పరిష్కారానికి ఆయుర్వేదం చెప్పిన చిట్కాలివీ.. ఆహారం మన శరీరానికి ఇంధనం. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది, ఔషదంగా పనిచేస్తుంది. శరీరం  సమతుల్యంగా ఉండటంలో సహాయపడుతుంది.  మంచి ఆహారం తీసుకోవడం సరైన ఫిట్నెస్ మెంటైన్ చేయడానికి మూలం.   వెచ్చని, తాజాగా వండిన,  సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు ఆయుర్వేదంచే ఎక్కువగా సిఫార్సు చేయబడ్డాయి. డైటరీ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలు,  విత్తనాలు అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి మూలికలు,  సుగంధ ద్రవ్యాలు తీసుకోవడం చాలా మంచిది.  ఆయుర్వేదంలో ఉపయోగించే త్రిఫల వంటి మూలికలు జీర్ణక్రియకు,  జీర్ణశయాంతర వ్యవస్థను క్లియర్ చేయడానికి  బాగా ఉపయోగపడతాయి.  మసాలా దినుసులను పోలి ఉండే అల్లం జీర్ణ ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అల్లంను ఆహారంలో చేర్చవచ్చు లేదా తాజా అల్లం టీ వంటివి త్రాగవచ్చు. జీలకర్ర, కొత్తిమీర,  ఫెన్నెల్ టీ, లేదా CCF టీ, జీర్ణక్రియకు,  గ్యాస్,  ఉబ్బరం నుండి ఉపశమనానికి ఉపయోగిస్తారు. పులియబెట్టిన ఆహారాలైన పెరుగు, ఇంట్లో తయారుచేసిన ఊరగాయలు, మజ్జిగ, అన్నం గంజి,  ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు. సరైన జీర్ణక్రియ గట్ బ్యాక్టీరియా  సమతుల్యంగా ఉండటంపై  ఆధారపడి ఉంటుంది. ఇది ప్రోబయోటిక్స్ మద్దతు ఇస్తుంది.  కెఫిన్, స్పైసీ ఫుడ్,  కొన్ని పాల ఉత్పత్తులు కడుపు నొప్పికి కారణం అవుతాయి.  కొన్ని వస్తువులు తీసుకోవడం పరిమితం చేయడం ఉత్తమం. భారీ ఆహారాలు,  వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక కొవ్వు, ప్రాసెస్ చేయబడిన, ప్యాక్ చేయబడిన, నిల్వ చేసిన,  సీసాలలో ఉంచిన ఆహారాలను తగ్గించాలి.  ఎందుకంటే అవి జీర్ణం కావడం కష్టం.  జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. ఒకేసారి ఎక్కువ తినకుండా  రోజంతా చిన్న మొత్తాలలో తినాలి.  ఇది  జీర్ణవ్యవస్థపై  అధిక భారం పడకుండా చేస్తుంది. భోజనం చేస్తున్న సమయంలో  స్పృహతో తినాలి. తినేటప్పుడు గాలి పీల్చుకోకూడదు. ప్రశాంతమైన, రిలాక్స్డ్ వాతావరణంలో తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఆహారాన్ని నెమ్మదిగా,  పూర్తిగా నమలాలి. ఇది ఆహార కణాల విచ్ఛిన్నానికి సహాయపడుతుంది.   రోజంతా తగినంత నీరు త్రాగాలి. నీరు జీర్ణక్రియ,  పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.  అలాగే జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం కదలికలో సహాయపడుతుంది. జీర్ణాశయాన్ని శుభ్రపరచడంలో  గోరువెచ్చని నీరు తాగాలని ఆయుర్వేదం సూచిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి రెగ్యులర్ శారీరక శ్రమ కూడా అవసరం. ఆప్టిమల్ మూవ్మెంట్ థెరపీ ప్రేగు కదలికలను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.  మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొన్ని యోగా భంగిమలు,  శ్వాస వ్యాయామాలు ఉదర అవయవాలను ప్రేరేపిస్తాయి, ఇవి విశ్రాంతిని,  మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. పవనముక్తాసనం (గాలి-ఉపశమన భంగిమ),  భుజంగాసనం (కోబ్రా భంగిమ) వంటి ఆసనాలు సహాయపడతాయి. నాడి శోధన (ప్రత్యామ్నాయ నాసికా శ్వాస) వంటి ప్రాణాయామం కూడా జీర్ణవ్యవస్థను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.  గోరువెచ్చని నువ్వుల నూనెతో సవ్యదిశలో పొత్తికడుపును మసాజ్ చేయడం జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ప్రసరణను మెరుగుపరుస్తుంది.  నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది.  తద్వారా జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. విరేచన (చికిత్సా ప్రక్షాళన),  బస్తీ (ఔషధ ఎనిమా) వంటి పంచకర్మ చికిత్సలు శరీరాన్ని శుభ్రపరచడానికి,  జీర్ణ ఆరోగ్యానికి పరోక్షంగా తోడ్పడే దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు. క్రమం తప్పకుండా తినడం,  నిద్రపోవడం ద్వారా సిర్కాడియన్ చక్రాన్ని నియంత్రణలో ఉంచవచ్చు. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు కీలకం.                                                            *రూపశ్రీ.
మామిడి పండ్ల సీజన్ మొదలైంది. మార్కెట్‌లో వివిధ రకాల మామిడి పండ్లను విక్రయిస్తుంటారు. మామిడి  పండు తినడమంటే అందరికీ ఇష్టమే.. అయితే కొందరు మాత్రం దీన్ని మినహాయించాలని చెబుతారు. వారే మధుమేహం ఉన్నవారు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం మధుమేహం ఉన్నవారు కూడా మామిడి పండ్లను తప్పకుండా తినచ్చని, కానీ అది తగినంత మోతాదులో చాలా కొద్దిగా మాత్రమే తినాలని చెబుతారు. అంతేనా మరికొందరు బాగా పండిన మామిడి పండ్లను మధుమేహం ఉన్నవారు అస్సలు తినకూడదని కూడా అంటున్నారు. అసలు మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లు తినడంలో తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? తెలియకుండానే మామిడిపండ్లు తినడంలో వారు చేస్తున్న తప్పులేంటి? తెలుసుకుంటే.. మామిడి పండ్లను తింటే డయాబెటిక్ పేషెంట్ల పరిస్థితి మరింత దిగజారుతుందనేది పెద్ద అపోహ అని డాక్టర్లు చెబుతున్నారు. మామిడి పండ్లు ఆరోగ్యానికి మంచివి, కానీ తీపి కారణంగా మధుమేహ రోగులు తరచుగా వాటిని తినకుండా ఉంటారు.లేదా వాటిని తప్పుడు పరిమాణంలో లేదా తప్పుడు పద్ధతిలో తినడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనం ఏది తిన్నా అది షుగర్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.  ఇది ఏ ఆహారం తినడం ద్వారా చక్కెర స్థాయి ఎంత పెరుగుతుందో చెప్పడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులందరూ క్రమం తప్పకుండా పండ్లు తినాలి. అయితే మామిడి గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ ఎక్కువగా ఉంది (51-56). అందుకే తినే పరిమాణం,  విధానంపై మధుమేహ రోగులు శ్రద్ధ వహించాలి. డయాబెటిక్ పేషెంట్లు మామిడిపండ్లు తినడం మానేయాల్సిన అవసరం లేదు.  ప్రతిరోజూ 100 గ్రాముల చిన్న మామిడిపండును సమతుల్య పరిమాణంలో తీసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లను తినే విధానంపై శ్రద్ధ వహించాలి.  వాటిని తీసుకునేటప్పుడు జాగ్రత్త పడాలి. ఒకేసారి 100 గ్రాముల కంటే ఎక్కువ మామిడి తినకూడదు. మామిడికాయ గుజ్జును మాత్రమే తినాలి.  మామిడి రసం లేదా షేక్ రూపంలో తీసుకోకూడదు. పండ్లు తిన్న రెండు గంటల తర్వాత చక్కెర స్థాయిని చెక్ చేసుకోవాలి. పండ్లు తిన్న తర్వాత చక్కెర స్థాయి పెరిగితే పరిమాణాన్ని తగ్గించాలి.  వైద్యుడిని సంప్రదించాలి. భోజనం తర్వాత లేదా రాత్రి మామిడి తినకూడదు. ఎల్లప్పుడూ మామిడికాయను మధ్యాహ్నం సలాడ్‌గా లేదా ఉదయం అల్పాహారంగా తినాలి.                                          *రూపశ్రీ.