ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ళుగా సాగిన దుర్మార్గపు పాలన మీద స్వాతిరెడ్డి అనే ప్రవాసాంధ్ర మహిళ ఎప్పటి నుంచో తన వీడియోల ద్వారా పోరాటం చేస్తున్నారు. ఆమె మీద వైసీపీ సోషల్ మీడియా పిశాచాలు ఎన్నోరకాలుగా వేధించాయి. కష్టకాలంలో కూడా ఆమె స్వరాష్ట్రానికి రాకుండా చేశాయి. ఈ ఎన్నికల వేళ ఆమె జగన్కి మరోసారి ఓటు వేస్తే రాష్ట్రం, పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆమె ఏమంటున్నారో ఆమె మాటల్లోనే...
‘‘రాష్ట్రంలోని మహిళలందరికీ, ముఖ్యంగా రాష్ట్రంలోని అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్రంలోని అమ్మలందర్నీ ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. అమ్మా, మీకు ఇద్దరు బిడ్డలు వుంటే, ఇద్దరు బిడ్డలూ మీకు చెరో ఒక కన్ను అని చెప్తారు కదా. మరి, విజయమ్మకి కూడా ఇద్దరు బిడ్డలుంటే, ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల గారికి సపోర్ట్ చేయమని మాత్రమే ఎందుకు మిమ్మల్నందర్నీ అభ్యర్థించారు? ఎందుకు సీఎం అభ్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయమని ఒక్కటంటే ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే, ఆ కన్నతల్లి విజయమ్మకి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు అని, అతడు చేస్తున్నవన్నీ తప్పుడు పనులని. అందుకే ఆ కన్నతల్లి బాధపడి, భయపడి ఫారిన్కి వెళ్ళిపోయి ఛీ కొట్టేసింది ఇతనిని. సో, రక్తం పంచుకుని పుట్టి, తనతోపాటు పుట్టిన చెల్లి మా అన్న దుర్మార్గుడు, మా అన్న చేసేవన్నీ తప్పుడు పనులు. మా అన్న హత్యలు చేసిన వారికి ఆశ్రయం ఇస్తున్నాడు. ఇతన్ని నమ్మకండి.. ఇతనికి ఓటు వేయకండి. ఇతని వల్ల నేనే చాలా హింస అనుభవిస్తున్నాను, చాలా మానసిక క్షోభకి గురయ్యాను అని ప్రెస్ ముందుకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి. మీరందరూ చూస్తూనే వున్నారు కదా. ఇంకోపక్కన నిన్న మొన్నటి దాకా సపోర్ట్ చేసిన ప్రశాంత్ కిషోర్, పోయిన ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన ప్రశాంత్ కిషోర్ కూడా జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపాన్ని తెలుసుకుని ఛీ కొట్టి పక్కకి వచ్చేశారు.
మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూనే వుంటాం కదా... మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని చాలా దుర్మార్గంగా హింసించారు. అన్యాయంగా చంపేశారు. ఒక ముస్లిం సోదరుడి కుటుంబం ఆత్మహత్యకు కారణమయ్యారు. ఒక తెలుగుదేశం కార్యకర్తని గొంతు నడిరోడ్డులో, పట్టపగలు కోశారు. మద్యం గురించి ప్రశ్నించినందుకు హత్యలు చేశారు.. ఇలా ఎన్నెన్నో దుర్మార్గాలు ఈ ఐదు సంవత్సరాలుగా మనం చూశాం.
ఈ స్వాతిరెడ్డి ఐదు సంవత్సరాలుగా వీడియోలు చేస్తూ వుంది. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ప్రశ్నిస్తోంది. పోస్టులు పెడుతోంది. ధైర్యంగా మాట్లాడుతోంది అని మాత్రమే మీరు చూశారు. కానీ, గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి పార్టీ, అతని కింద పనిచేస్తున్న కొంతమంది పోలీసులు నన్ను ఎంత హింసించారో అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పడానికి కూడా ఒక కారణం వుంది. డాక్టర్ సుధాకర్ గారిని చంపినట్టు, మరికొంతమందిని చంపినట్టు నన్ను కూడా చంపడానికి ఈ ఐదు సంవత్సరాలుగా ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. మానసికంగా నన్ను చంపేయడానికి, నా గొంతు నొక్కడానికి ఎంత హింసించారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో సందర్భాల్లో ట్రోల్స్ మీరే చూశారు. ఎంత జుగుప్సాకరంగా, ఎంత బాధపడే విధంగా, ఎంత అసహ్యంగా చేశారో మీరు చూశారు. నా మీద ఒక ఉద్యమమే చేశారు. సాక్షి ఛానల్లో గానీ, సోషల్ మీడియాలో గానీ, ఆఖరికి మహిళా కమిషన్ ప్రెస్ మీట్లు పెట్టి నా గురించి మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు. నా కుటుంబాన్ని, నా కన్న తండ్రిని, నా కన్నతల్లిని నడి రోడ్డులో పెట్టి ఎంత హింసించారో ఎవరికీ తెలియదు. నా కన్నతండ్రిని వారం రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు. నా పరిస్థితి ఎలా వుందంటే, నాకన్నతండ్రి చావుబతుకుల్లో వుంటే, కనీసం నా దేశానికి, నా రాష్ట్రానికి వచ్చి నా కన్నతండ్రి చివరి రోజుల్లో చూసుకోలేని పరిస్థితి. చివరి చూపులు అని చెప్పినా, వెంటిలేటర్ మీద వున్నా నేను వచ్చి కన్నతండ్రిని చూసుకోలేని పరిస్థితి. కొన్ని నెలలుగా మా నాన్నని చూసుకోలేక నరకం అనుభవిస్తున్నాను. దీనంతటికీ కారణం ఎవరు.. ఈ జగన్మోహన్ రెడ్డి, అతని కింద పనిచేస్తున్న కొంతమంది పోలీసువాళ్ళు. నేనేమీ నీరవ్ మోడీని కాదు డబ్బులు తినేసి ఫారిన్ కంట్రీకి వచ్చేయలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డినీ కాదు లక్ష కోట్లు మింగేసి పారిపోవడానికి. నాపైన రెడ్ కార్నర్ నోటీసులు పెట్టారు. ఇదీ నా పరిస్థితి.
ఇదంతా మీకు చెప్పడానికి కారణం ఏమిటంటే, దూరంగా వున్న నన్నే ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు పెడుతుంటే, ఇక మిమ్మల్ని ఎలా హింసిస్తాడో, మీ బిడ్డల్ని ఎలా టార్చర్ పెడతాడో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతమంది ఆడబిడ్డలు రేప్లకుగానీ, హత్యలకు గానీ గురైతే వాళ్ళకి ఏం న్యాయం చేశారు? మీకు గుర్తుండే వుంటుంది, ఆస్పత్రిలో ఒక మహిళ అత్యాచారానికి గురైతే ఆ మహిళకు ఇంతవరకు న్యాయం జరగలేదు. నా ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రతి ఒక్క కన్నతల్లి కూడా తన బిడ్డల బాగునే కోరుకుంటుంది. వారి బిడ్డలు సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా వుండాలని అనుకుంటుంది. అదే మీరు ఈ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే మాత్రం... అమ్మా, నిజం చెబుతున్నాను.. మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతులతో మీరే నాశనం చేసినట్టు అవుతుంది. నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి జగన్మోహన్ రెడ్డికి ఓటు అస్సలు వేయకండి. మీ బిడ్డలు బాగుండాలన్నా, మీరు బాగుండాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా దయచేసి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకండి. నాలాంటి పరిస్థితి మళ్ళీ ఏ ఆడపిల్లకి, మీ ఇంట్లో ఆడపిల్లకి రాకూడదనే నా కోరిక. మీరందరూ బాగుండాలి. అందరి పిల్లలు చక్కగా చదువుకోవాలి. మంచి ఉద్యోగాల్లో సెటిలవ్వాలి. మీ బిడ్డలు మీరు కని, పెంచి, పోషించినందుకు మిమ్మల్ని బాగా చూసుకోవాలి. మంచి సమాజం తయారవ్వాలి. మన రాష్ట్రం డెవలప్ అవ్వాలి. ఇదే నా కోరిక. దయచేసి మరొక్కసారి చెప్తున్నాను. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే వుంది. మీ డెసిషన్ చేతిలోనే వుంది. మీ ఓటు చేతిలోనే వుంది. మీ పిల్లలు బాగుపడాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓటు వేయకండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్.