LATEST NEWS
 పులివెందుల తీర్పు పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం కావడానికి ఇక కొన్ని గంటలే ఉంది. ఈ నేపథ్యంలో పులివెందులలో పోలింగ్ హీట్ పీక్స్ కు చేరింది. పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉప ఎన్నిక ఫలితంపై పులివెందుల, కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, ఆ మాటకొస్తే దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఏదో ఒక మండలానికి చెందిన ఎన్నికలా కాకుండా ఈ ఉప ఎన్నిక యుద్ధ వాతావరణాన్ని తలపించేంత ఉద్రిక్తత, ఉత్కంఠ రేపుతోంది. మంగళవారం (ఆగస్టు 12)   జరగనున్న ఈ ఉప పోరును తెలుగుదేశం కూటమి ,వైసీపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం వేడెక్కింది.  ఇప్పటికే ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా దాడులు, ప్రతిదాడులు జరగడంతో ఇక పోలింగ్ ఇప్పటికే ప్రచార సందర్భంగా పోలింగ్ దాడులు జరగడం తో పోలింగ్ రోజున పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయాందోళనలు  వ్యక్తమౌతున్నాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్ సైన్యం దిగితే... తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి పార్టీలు ప్రైవేటు సైన్యాన్ని  దించారన్న ప్రచారం   ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో పులివెందులలో దౌర్జన్యానికి పై చేయి అవుతుందా? ప్రజాస్వామ్యానిదా? అన్న పరిస్థితి కనిపిస్తోంది.   ఇప్పటికే తెలుగుదేశం కూటమి, వైసిపి నేతలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.  ప్రచార ఘట్టంలోనే హింసాత్మక ఘటనలు జరగడంతో  పోలింగ్ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇదిలా ఉంటే పోలింగ్ రోజు తమకు అనుకూలంగా ఓటింగ్  జరుపుకునేందుకు బయట వ్యక్తులు పులివెందులకు చేరుకున్నారన్న ప్రచారంతో స్థానికులలో ఆందోళన వ్యక్తం అవుతోంది. పోలీసులు పోలింగ్ ముందు రోజు నుంచే కొత్త వ్యక్తులు పోలింగ్ జరిగే పులివెందులలో కానీ ఒంటిమిట్టలో కానీ ఉండకూడదని   హెచ్చరించారు.  ఇక ప్రలోభాల పర్వం కూడా పెద్ద ఎత్తున  సాగుతోందంటున్నారు.  పోటాపోటీగా, ప్రతిష్టాత్మకంగా మారిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నకలో ఓటు చాలా కాస్టీగా మారిపోయిందని పరిశీలకులు చెబుతున్నారు.  ఓటుకు పది వేల చొప్పున ఇస్తున్నారంటూ తెలుగుదేశం కూటమి, వైసీపీలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఒంటిమిట్టలో కూడా జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా పులివెందుల స్థానం అంత కాకపోయినా.. ఓటుకు నోటు భారీగానే ఇస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం రెండు  జట్పీసీలకు కలిపి..దాదాపు పాతిక కోట్ల పంపిణీ జరుగుతోందని అంచనా వేస్తున్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఇంత కాస్టీగా మారడం ఇదే ప్రథమం అంటున్నారు.  ఇక పులివెందుల బరిలో స్థానానికి వై.ఎస్.ఆర్.సి.పి అభ్యర్థిగా తుమ్మల హేమంత్ రెడ్డి, తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా  బిటెక్ రవి సతీమణి  లతారెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున అభ్యర్ధి రంగంలో ఉన్నారు. మరి కొందరు స్వతంత్రులు కూడా రంగంలో ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థుల మధ్యే ఉంది.  ఇక   ఒంటిమిట్ట జడ్.పి.టి.సి అభ్యర్థిగా వైసీపీ తరఫున ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా ముద్దు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయభాస్కర్ తో పాటు మరో 8 మంది స్వంతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడా పోటీ ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీల మధ్యే ఉంది.  
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఓ  వృద్దురాలు తన వంతుగా విరాళం అందజేశారు. నరసరావుపేటకు చెందిన కాసా నాగేంద్రమ్మ అనే వృద్ధురాలు రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షిస్తూ రెండు లక్షల నూట పదహారు రాపాయల విరాళం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో సోమవారం (ఆగస్టు 11)న స్వయంగా కలిసి ఈ విరాళం చెక్కును అందించారు.  రాజధాని నిర్మాణానికి విరాళం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సచివాలయంలో కలిసి రూ.2,00,116 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాగేంద్రమ్మకు   కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు ఆమెను అభినందించారు. రాష్ట్ర రాజధాని అత్యంత గొప్పగా చరిత్రలో నిలిచిపోయేలా నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో ఆబాట గోపాలం రాజధాని నిర్మాణం పట్ల ఎంతో ఉత్సాహంతో ఉన్నారనడానికి కాసా నాగేంధ్రమ్మ తన వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా సచివాలయం వరకూ వచ్చి విరాళం అందించడమే నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తదితరులు పాల్గొన్నారు.  
గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్‌, ఫిలిం ఫెడరేషన్‌ మధ్య వేతనాల సమస్య రోజురోజుకీ జటిలం అవుతోంది. పీట ముడులు పడుతోంది. దీనికి పరిష్కారం కోసం పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. దీంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలను, రాజకీయనేతలను శరణుజొచ్చుతున్నారు నిర్మాతలు. ఉభయ తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫి మంత్రులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ సమస్యలు, కార్మిలకు డిమాండ్ లు, ఆందోళనకు సంబంధించి వినతి పత్రాలు అందజేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ను నిర్మాతలు కలిశారు.   కాగా నిర్మాతలతో భేటీపై ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్  సినీ పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితిని తెలియజేయడానికి కలుస్తామంటూ కొందరు నిర్మాతలు చెబితే రమ్మన్నాం.. అంతే తప్ప ఈ భేటీకి ప్రత్యేకమైన అజెండా ఏమీ లేదని తేల్చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సమస్యలకు సంబం ధించి నిర్మాతలు, కార్మికులు చెప్పే అంశాలను విని, వాటిని సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకు వెడతాం. వారి స్థాయిలోనే ఏం చేయాలన్న నిర్ణయం ఉంటుందని కందుల  చెప్పారు. అంతే కాకుండా   ఆంధ్రప్రదేశ్‌లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం. సినిమా నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పనకు  కృషి చేస్తాం, రాష్ట్రంలో స్టూడియోలు, రీరికార్డింగ్‌ థియేటర్లు, డబ్బింగ్‌ థియేటర్లు నిర్మించేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని చెప్పారు. కాగా కందుల దుర్గేష్‌ను నిర్మాతలు బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కె.ఎల్‌.నారాయణ, డి.వి.వి.దానయ్య, రవిశంకర్‌, నాగవంశీ, భరత్‌, విశ్వప్రసాద్‌, చెర్రీ, సాహు గారపాటి, యువి క్రియేషన్స్‌ వంశీ, బన్నీ వాసు, వివేక్‌ కూచిభొట్ల తదితరులు  కలిశారు. ఇక తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని  ఎఫ్‌డిసి ఛైర్మన్‌ దిల్‌ రాజు, బాపినీడు, ఫిలిం ఛాంబర్‌ కార్యదర్శి దామోదర ప్రసాద్‌, సుప్రియ, జెమినీ కిరణ్‌ తదితరులు కలిశారు. 
ఆలస్యం అమృతం విషం ఈ నానుడి అతికినట్లు సరిపోయే సందర్భం ఏదైనా ఉందంటే  అది ఇదే.  తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యం అయ్యే కొద్దీ..   కేంద్రం నుంచి పంచాయతీలకు రావసిన  కేంద్ర నిధులు  రాకుండా ఆగి పోతాయి. అంతే కాదు..  నిర్దిష్ట గడువు ముగిస్తే అవి మురిగి  పోతాయి కూడా.   అవును..  రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1992లో తెచ్చిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం.. ప్రజలచే ఎన్నుకోబడిన పంచాయతీలు కొలువు తీరి ఉన్నప్పడు మాత్రమే  పంచాయతీలకు  కేంద్ర నిధులు అందుతాయి. అయితే తెలంగాణలో గ్రామ పంచాయతీల గడువు 2024 జనవరిలోనే ముగిసింది. ఇక అక్కడి నుంచి  కారాణాలు ఏవైనా పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ముడి పడలేదు. ఈ కారణంగా ఇప్పటికే, కేంద్ర ప్రభుత్వం  2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రావలసిన రూ.1,550 కోట్లను రిలీజ్ చేయకుండా  విత్ హెల్డ్  లో పెట్టింది. అంటే..  నిధుల విడుదలను నిలుపుదల  చేసింది. అలాగే ప్రస్తుత   ఆర్థిక సంవత్సరానికి సంబందించి   రూ.1,450 కోట్లు కూడా విడుదల కాలేదు.  అంటే..  పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడం వలన రాష్ట్రంలోని గ్రామ  పంచాయతీలు ఇంచుమించుగా రూ.3000 కోట్లు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.  మరో వంక నిధుల కొరతతో అల్లాడుతున్న గ్రామ పంచాయతీలకు ప్రాణప్రదంగా భావించే  కేంద్ర నిధుల విడుదల కావాలంటే..   స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణం నిర్వహించడం మినహా మరో మార్గంలేదన్నది పంచాయతీరాజ్ శాఖ అధికారుల సమాచారం. మరోవంక..  స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని   హై కోర్టు గడువు విధించింది. ఈ అన్నిటినీ మించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్  కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని  బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే .. అంటూ రాజకీయ హెచ్చరికలు చేస్తున్నాయి. దీంతో  గండం నుంచి గట్టెక్కేదారి కనిపించక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తికమక పడుతోంది. ఇతర అంశాలు ఎలా ఉన్నా..  రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఫేస్  చేస్తున్న తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ముందు కేంద్ర గ్రాంట్స్ తెచ్చుకోవడం పై దృష్టి పెట్టాలి,  లేదంటే,  పంచాయతీల పరిస్థితి మరింత అధ్వాన స్థితికి దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా, గత ఆర్థిక సంవత్సరానికి సంబందించిన రూ.1,550 కోట్లు విడుదల అవుతాయనే నమ్మకం లేదనీ, గడువు ముగిసిన గత సంవత్సరం నిదుల విడుదల పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విచక్షణాదికార పరిధిలోకే వస్తుందనీ,  సో ..గత ఆర్థిక సంవత్సరానికి సంబందించిన రూ.1,550 కోట్లు విడుదల కేంద్రం దయ .. మన ప్రాప్తం అన్నట్లుగానే ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే..  గతంలో   ఎన్నికలు నిర్వహించిన వెంటనే విత్ హెల్డ్  లో పెట్టిన నిధులను విడుదల చేసిన అనుభవాల ఉన్నాయి కాబట్టి  ఎన్నికలు జరిగితే గత, ప్రస్తుత సంవత్సరాలకు సంబందించిన రూ. 3000 కోట్లు విడుదలవుతాయనే విశ్వాసాన్ని పంచాయతీ శాఖ అధికారాలు వ్యక్తం చేస్తున్నారు.   అలాగే.. ఈలోగా ఎన్నికలు జాప్యానికి కారణాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రనికి లేఖ రాస్తే, కేంద్ర నిధులు  విడుదల అవుతాయని  కొందరు అధికారులు అంటున్నారు  అయితే..  స్థానిక సంస్థల ఎన్నికల్లో  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం రోజురోజుకూ మరింత జటిలం అవుతున్న నేపధ్యంలో, ఈ చిక్కు ముళ్ళు వీడి, పంచాయతీ ఎన్నికల జరగడం  ప్రస్తుత పరిస్థితిలో సాధ్యమేనా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సింధూన‌ది పై ప్రాజెక్టు క‌డితే అణుబాంబులేస్తానంటోంది పాక్. మొన్న‌టికి మొన్న ఇదే అణు బాంబుల విష‌యంలో భారీ ఎత్తున భ‌య‌ప‌డ‌బ‌ట్టే క‌దా?  కాళ్లు పట్టుకుని మ‌రీ ఇండియాతో కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి వ‌చ్చింది? ఈ విష‌యం పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మ‌ర‌చిపోతే ఎలా? మొన్న‌టి యుద్ధంలో భార‌త్ పాక్ ని భ‌య‌పెట్ట‌కుండా ఏకంగా ఆ దేశ అణు నిల్వ‌లున్న ప్రాంతంలో బాంబులు జార విడిచి ఉండాల్సింది.  జ‌స్ట్ ఆ నూర్ ఖాన్ బేస్ పై బ్ర‌హ్మోస్ లు వ‌దిలినందుకే త‌ల్ల‌డిల్లిపోయింది పాక్.  ఈ ఎయిర్ బేస్ కి ద‌గ్గ‌ర్లో ఇటు ఆర్మీ చీఫ్ హెడ్ క్వార్ట‌ర్ తో పాటు అటు అణు నిర్వ‌హ‌ణ చేసే నేష‌న‌ల్ క‌మాండ్ ఆఫీసు కూడా ఉంటుంది. ఇక్క‌డ భార‌త్ బాంబులు ప‌డ్డంత‌నే.. ఇదే పాక్ ఆర్మీ చీఫ్‌.. జ‌డుసుకుని బంక‌ర్లో దాక్కున్నాడు. అలాంటి బీరువు ఇప్పుడు మ‌ళ్లీ బీరాలు ప‌లుకుతున్నాడు. సింధూన‌ది మీద ప్రాజెక్టు క‌డుతున్నందుకే ఇలా అంటుంటే మ‌రి బ్ర‌హ్మ‌పుత్రా న‌ది మీద చైనా క‌డుతున్న ప్రాజెక్టు ప‌రిస్థితి ఏంటి? సింధూన‌ది ఎలా కుటుంబ ఆస్తి కాదో అదీ అంతేగా? మ‌రి చైనాపై కూడా భార‌త్ అణు బాంబులు వేయాలా? మొన్న ప‌హెల్గాం దాడి త‌ర్వాత ఇదే సింధూజ‌లాల‌ విష‌యం వెలుగులోకి వ‌స్తే మేం అణుబాంబులు వేస్తామ‌ని అన్నారు పాక్ దేశ నాయ‌కులు. తీరా భార‌త్ యుద్ధానికి దిగితే వేయాల్సిన బాంబులు వేయ‌డం మానేసి.. బంక‌ర్ల‌లో దాక్కున్నారు. ఇరాన్ ద‌గ్గ‌ర అణుబాంబులు ఉంటే..  ప్ర‌పంచానికే అతి పెద్ద విప‌త్తుగా భావించిన అమెరికా.. పాక్ విష‌యంలో ఎందుకో వెన‌క‌డుగు వేస్తూనే ఉంటుంది. అంటే పాక్ ద్వారా భార‌త్ ని భ‌య‌పెట్టి ఆయుధాలు కొనిపించాల‌న్న యోచ‌న అమెరికాది. అందుకే ఆ దేశ గ‌డ్డ‌పై నుంచి ఇలాంటి బీరాలు ప‌లికిస్తోంద‌న్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెలువ‌డుతున్నాయ్.  మేం పోతే స‌గం ప్ర‌పంచాన్ని లాక్కెళ్లిపోతామ‌ని మీరు భ‌య‌పెడ‌తారేమో.. కానీ భార‌త్ మొన్న‌టిలా చేసి చూపిస్తుంది.  అయినా యుద్ధం జ‌రుగుతుంటే మ‌న ద‌గ్గ‌ర ప్లాన్స్ లేవు ప్రేయ‌ర్సే అన్న మునీర్ కూడా .. ఇలా భార‌త్ ను భ‌య‌పెట్టేందుకు ప్రయత్నించడం  ఆశ్చ‌ర్యంగా ఉంది. ట్రంప్ కుటుంబానికి అమ్ముడుపోయి పాకిస్థాన్ని తాక‌ట్టి పెట్టి బ‌తుకుతున్న మునీర్  సైన్యాధ్య‌క్షుడంటే ఆసియాకే అవ‌మాన క‌రంగా ఉందని అంటున్నారు దౌత్య నిపుణులు.
ALSO ON TELUGUONE N E W S
Superstar Mahesh Babu is working with SS Rajamouli and from past 15 years both of them have been waiting to collaborate. Now, the movie shoot has started but the update about story or the kind of project has not been announced. While makers state it as Globe Trottling adventure, they did not confirm the story.  Now, on Mahesh's birthday, a sample of his look has been released by the makers. Mahesh Babu made sure that his fans get at least a small update from the movie, as originally the makers have decided to only release any update in November, only.  For this small glimpse of his look, Mahesh fans have poured in their love on a special website. Mahesh looked at the wishes and felt very happy. SS Karthikeya, son of Rajamouli and executive producer, shared the photo of Mahesh enjoying the wishes.  He wrote on X, "Our #GlobeTrotter witnessed love pouring in from every corner of the globe… cheers to whoever came up with the cool idea of http://WishSSMB.com. Just felt like sharing this with you all…" Mahesh with curly hair looks very different from his other films. 
  జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'వార్-2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించడంతో 'వార్-2'పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయిన ఖర్చు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. (War 2)   'వార్-2' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 10న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చిన ఈ వేడుకలో ఎన్టీఆర్, హృతిక్ సందడి చేశారు. 'వార్-2' రిజల్ట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్న ఎన్టీఆర్.. కాలర్ ఎగరేసి మరీ ఫ్యాన్స్ కి భరోసా ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈ ఈవెంట్ కి అయిన ఖర్చు గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వేడుకకు ఏకంగా రూ.1.7 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఈ ఖర్చుతో ఓ చిన్న సినిమా తీయొచ్చు అని చర్చించుకుంటున్నారు.   భారీగా ఖర్చు అయినప్పటికీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల 'వార్-2'పై మరింత బజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. దాని వల్ల ఓపెనింగ్స్ పెరిగే అవకాశముంది. ఆ తర్వాత చూస్తే మాత్రం.. ఈవెంట్ కోసం రూ.1.7 కోట్లు ఖర్చు చేయడం వల్ల నష్టమేమీ లేదని చెప్పవచ్చు.  
Prabhas is one of the most eligible bachelors and is amongst the biggest stars of Indian Cinema. Post Baahubali, his craze have grown Pan-india and he delivered a big hits with Salaar and Kalki. He is shooting for The Raja Saab and Prabhas-Hanu project, currently.  While he is busy with his continuous film projects, reports about his romantic link-ups have been going around. But he did not react to any of them and many are waiting for his marriage. Prabhas has been silent about his possible matrimony and been showing reluctance to commit about it soon.  Shyamala Devi, wife of late Krishnam Raju, and his relative, talked to media briefly after her visit to Daksharamam Temple. She stated that she did special offerings and pooja to Lord Shiva and Goddess Parvati, for Prabhas well-being and marriage. She remarked that only God can give clear answer about Prabhas impending nuptials.  She candidly remarked that while she doesn't know about the possible bride but she hopes that he would get married soon. On the other hand, Prabhas is happy to be busy with his film commitments and he is locked till 2028 with projects like Spirit, Salaar Part 2, Kalki 2 and few others in the pipeline.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్ళి కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. నిజానికి 'బాహుబలి' తర్వాత ప్రభాస్ పెళ్ళి చేసుకుంటాడని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే, బాహుబలి వచ్చి పదేళ్లు అవుతుంది కానీ.. ఇంతవరకు ప్రభాస్ పెళ్ళి పీటలు ఎక్కలేదు. మధ్య మధ్యలో ప్రభాస్ పెళ్ళి అంటూ వార్తలొస్తున్నాయి కానీ.. అవేవీ నిజం అవ్వట్లేదు. ఈ క్రమంలో ప్రభాస్ పెళ్ళి గురించి తాజాగా ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (Prabhas)   అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని తాజాగా శ్యామలాదేవి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ పెళ్లి గురించి పార్వతీ పరమేశ్వరులకు పూజలు చేసినట్లు తెలిపారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు.. శివుడు అనుగ్రహిస్తే త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని అన్నారు. అమ్మాయి ఎవరు, పెళ్ళి ఎప్పుడు అనేవి తెలియవని.. కానీ, పెళ్ళి మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని శ్యామలాదేవి చెప్పారు.    శ్యామలాదేవి మాటలు విని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఆమె కోరుకున్నట్టుగా త్వరలోనే ప్రభాస్ పెళ్ళి పీటలు ఎక్కుతారేమో చూడాలి.  
విజయ్ దేవరకొండ(Vijay deverakonda),జర్సీ మూవీ ఫేమ్ 'గౌతమ్ తిన్ననూరి'(Gowtam tinnanuri)కాంబినేషన్ లో గత నెల 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'కింగ్డమ్'(Kingdom). యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ దేవరకొండ 'సూరి' గా రెండు పార్శ్యాలు నిండిన క్యారక్టర్ లో అత్యద్భుతంగా నటించాడని అభిమానులు ముక్త కంఠంతో చెప్తున్నారు. సాంకేతిక ప్రమాణాల పరంగా కూడా మూవీ ఉన్నత స్థాయిలో ఉందనే మాటలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి 'కింగ్డమ్' ఓటిటి హక్కులని ప్రముఖ నిర్మాణ సంస్థ 'నెట్ ఫ్లిక్స్'(Netflix)దక్కించుకున్న విషయం తెలిసిందే. ఓటిటి రిలీజ్ డేట్ ని సదరు సంస్థ ఇంకా అధికారంగా ప్రకటించలేదు. కానీ 'కింగ్ డమ్' ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతుందని, మేకర్స్ మరికొన్నిరోజుల్లో సదరు డేట్ పై అధికార ప్రకటన కూడా ఇవ్వనున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్థుతానికి అయితే      థియేటర్స్ లో కింగ్డమ్ రెండో వారంలో కొనసాగుతు ఉంది. ఈ సమయంలో ఓటిటి డేట్ వార్తలు సోషల్ మీడియాలో వస్తుండటం వైరల్ గా మారింది. సితార ఎంటర్ టైన్ మెంట్ పై సూర్యదేవర నాగవంశీ(Nagavamsi)నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ కి అన్నయ్యగా శివ అనే క్యారక్టర్ లో 'సత్యదేవ్' నటించాడు. సదరు క్యారక్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. విజయ్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే(Bhaghyashri Borse)చెయ్యగా, మనీష్ చౌదరి, అయ్యప్ప పి శర్మ, గోపరాజు రమణ,బాబురాజ్ తదితరులు మిగతా పాత్రల్లో కనిపించారు. అనిరుద్(Anirudh Ravichander)సంగీతాన్ని అందించాడు. కింగ్డమ్ ఇప్పటి వరకు 80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.       
బుల్లితెర మీద అమరదీప్, తేజు జోడి అందరికీ ఎంతో ఇష్టమైన జోడి. ఇక శ్రీముఖి, వర్ష, సుహాసిని వీళ్లంతా తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ ఉంటారు. ఇక అమరదీప్ కి ఇష్టమైన ఫ్రెండ్స్ ఆరియానా, మానస్, నిఖిల్ ఇలా ఉన్నారు. ఐతే అమరదీప్ ఇప్పుడు మూవీస్ లో బాగా ట్రై చేస్తూ ఉన్నాడు. అలాగే కొన్ని మూవీస్ లో నటిస్తున్నాడు. గతంలో తానూ నటించిన కొన్ని మూవీస్ లో రోల్స్ గురించి చెప్పుకొచ్చాడు. నాగచైతన్య హీరోగా నటించిన ‘శైలజ రెడ్డి అల్లుడు’ మూవీలో టైటిల్ రోల్ దగ్గర చూస్తే అమరదీప్ చౌదరి అని కనిపిస్తుంది. ఒక సీన్ లో నటించాను కానీ అది లేదు. నా సీన్ కి నేను డబ్బింగ్ కూడా చెప్పుకుని వచ్చా. ఎడిటింగ్ లో తీసేసారు. చాలా మూవీస్ లో చిన్న చిన్న పాత్రలే చేసాను ఎందులోనూ లేను నేను. జక్కన్న, ఉంగరాల రాంబాబు, భలే భలే మగాడివోయ్, కృష్ణార్జున యుద్ధం ఇలా మూవీస్ లో చిన్న చిన్న రోల్స్ చేసాను. కానీ ఎందులోనూ లేకపోయినా నేను వెనకడుగు వేయలేదు. ఇప్పుడు ఒక నాలుగు సినిమాల్లో చేస్తున్నా. సీరియల్స్ లో పేమెంట్స్ బాగానే వచ్చేవి. సినిమాలకు వచ్చాను ..దాంతో కొంచెం కష్టమే ఇంట్లో. " అని చెప్పుకొచ్చాడు. ఇక అమరదీప్ బిగ్ బాస్ సీజన్ 7 లో టాస్కులు ఆడి అందరి మనసులకు దోచుకున్నాడు. ఇక ఇప్పుడు "సుమతి శతకం" అనే మూవీతో హీరోగా రాబోతున్నాడు అమరదీప్. తనకు శివుడు అంటే ఇష్టం అని చెప్పుకొచ్చాడు.
  'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి సినిమాలతో కెరీర్ స్టార్టింగ్ లో సంచలనాలు సృష్టించిన విజయ్ దేవరకొండ.. కొన్నేళ్లుగా ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోతున్నాడు. ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన 'కింగ్ డమ్' కూడా విజయ్ కోరుకున్న సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వలేకపోయింది. దీంతో విజయ్ తదుపరి చిత్రాలపై అందరి దృష్టి పడింది.    ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒక దానికి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు కాగా, మరో చిత్రానికి రవికిరణ్ కోలా డైరెక్టర్. ఈ రెండు సినిమాల తర్వాత విజయ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ కి హరీష్ శంకర్ దర్శకుడని సమాచారం. విజయ్ గత చిత్రం 'కింగ్ డమ్' కూడా సితార బ్యానర్ లో రూపొందటం విశేషం.   గతేడాది 'మిస్టర్ బచ్చన్'తో నిరాశపరిచిన హరీష్ శంకర్.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా చేస్తున్నాడు. ఇది 2026 ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి హరీష్.. ఉస్తాద్ తర్వాత మరో సినిమా చేస్తాడో లేదా డైరెక్ట్ గా విజయ్ ప్రాజెక్ట్ పైకి వెళ్తాడో చూడాలి.  
ముప్పై శాతం వేతనం పెంచాలని 24 క్రాఫ్ట్స్ కి చెందిన  తెలుగు సినిమా ఫెడరేషన్ సభ్యులు, కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా షూటింగ్ లు కూడా ఆగిపోయాయి.    ఈ విషయంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందిస్తు 'నిర్మాతలు లేకుండా సినిమా పరిశ్రమ లేదు. మన పరిశ్రమ మనుగడకు నిర్మాతల శ్రేయస్సు చాలా ముఖ్యమైనదనే విషయాన్నీ ట్రేడ్ యూనియన్లు గుర్తించాలని పేర్కొంది. రీసెంట్ గా ప్రముఖ నిర్మాతలు ఎస్ కె ఎన్(Skn),మధుర శ్రీధర్(Madhura Sreedhar)తో పాటు మరికొంత మంది నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మధుర శ్రీధర్ మాట్లాడుతు సినిమా అనేది క్రియేటివ్ బిజినెస్. కానీ ప్రొడ్యూసర్స్ కి డెమోక్రసీ లేదని అనిపిస్తుంది. హీరో, హీరో ఫ్రెండ్ మధ్య  ఒక గదిలో చిన్న సీన్  షూట్ చెయ్యడానికి ఒక జనరేటర్ తో పాటు ఒక లైట్ మెన్, ఒక  ఎలక్ట్రీషియన్ సరిపోతారు. కానీ యూనియన్ రూల్స్ ఒప్పుకోవని ఏడుగురు లైట్ మెన్స్ వచ్చారు. మేకప్ డిపార్ట్మెంట్ నుంచి ముగ్గురు వచ్చారు. దీంతో అక్కడున్న పది,ఇరవై మందికి ఫుడ్ సర్వ్ చేయడానికి ఆరుగురు ప్రొడక్షన్స్ వాళ్ళు. కాస్ట్యూమ్స్ పరంగా హీరో హీరోయిన్ బట్టలని, నా అసిస్టెంట్ డైరెక్టర్ ఇస్త్రీ చేసి తీసుకు  రాగలడు. కానీ యూనియన్ రూల్స్ ప్రకారం ఒక కాస్ట్యూమర్ ని,బట్టలు ఉతకడానికి ఒకరు, ఇస్త్రీ చెయ్యడానికి ఒకర్ని పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక చిన్న సీన్ కి ఎనభై మంది పని చేస్తారు. నిజంగా పని చేసే వాళ్ళు నలుగురే ఉంటారు. డిఓపి ని రమ్మంటే నలుగురు అసిస్టెంట్ కావాలంటాడు. 30 % హైక్ గురించి మాట్లాడటం లేదు.  నేను ఒక చిన్న నిర్మాతని, మా మీద ఎందుకు యూనియన్ వాళ్ళందర్నీ రుద్దుతోంది. నేను  యూనియన్ వాళ్ళకి  ఎందుకు బైండ్ అవ్వాలి. నిర్మాతల  యూనియన్ ఏం చేస్తుందని మధుర శ్రీధర్ చెప్పుకొచ్చాడు. నిర్మాతగా మధుర శ్రీధర్  ప్రేమ, ఇష్క్, కాదల్, మాయ, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఒక మనసు, ఏబీసీడీ, దొరసాని వంటి పలు విభిన్న చిత్రాలు నిర్మించాడు. ఈ నెల 8 న 'మోతె వారి లవ్ స్టోరీ' అనే వెబ్ సిరీస్ ని నిర్మించాడు. 2010 లో సందీప్ కిషన్ హీరోగా లగడపాటి శ్రీధర్ నిర్మాణ సారధ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్నేహగీతం అనే చిత్రంతో  దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన మధుర శ్రీధర్  పలు చిత్రాలకి దర్శకత్వం వహించాడు.     
Superstar Rajinikanth speeches at his movie audio launch events in recent times have become highly popular and they have been increasing hype for his films, too. Now, the makers of Coolie, Sun Pictures, dropped audio launch event videos on OTT and YouTube. Once again, Rajini shared an emotional anecdote from his life.  Interestingly, he and Lokesh share similar emotional connection. Rajini shared that he worked as Coolie, even though, he passed out SSLC, as he ran away from his house to find some job in Film Industry. His father asked him to become a Coolie and he shared how he faced difficulties during those days to earn Ten rupees.  After long struggle, he got a chance to become bus conductor and later, life took a huge turn, like everyone know him, today. He shared that such tough times have made him stronger and he is always looking to deliver what people expect from him as their beloved actor.  While this brought huge motivation to his fans and people who take him as an inspiration to work and make big. But the surprise came from director Lokesh Kanagaraj, as he shared how the number he used on Coolie badge of Rajinikanth is his faher's badge number.  He also shared that his father worked as bus conductor and when Rajinikanth, asked him about his father, he shared this anecdote. Lokesh stated that Rajini asking him about his father has become a huge memory for him and it will same for his father, too.  King Nagarjuna, Aamir Khan, Upendra, Satyaraj, Shruthi Haasan, Soubin Shahir are playing other prominent leading roles in this movie. Coolie is releasing on 14th August and it has created huge box office euphoria in Southern States with pre-sales.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Hansika Motwani has been lately in the news due to her rumored separation from her husband, Sohael. Recently, she deleted her marriage video and photos she shared with Sohael on Instagram. The news reports have been speculating about her indirect clarification, ever since.  Now, on her birthday, she shared a cryptic message which seems to be another confirmation about her separation and divorce. She mentioned that her life taught many lessons this year, which she never asked for. Still, she stated that she found peace and attributed it to birthday magic.    She wrote, "Feeling humbled and full of gratitude. Wrapped in love, topped with cake, and thankful for every little moment. This year brought lessons I didn't ask for... and strength I didn't know I had. Heart's full. Phone's full. Soul's at peace. Thank you for the birthday magic." Well, at a time when the divorce and separation rumors are going around, such a cryptic post does feel like an unofficial confirmation about the impending. For now though, she has chosen to stay silent and she might open up sooner than later.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
చాణక్య నీతి శాస్త్రంలో జీవితంలోని ప్రతి అంశం చక్కగా వివరించబడింది. ఆచార్య చాణక్యుడు తన జీవిత అనుభవాల ద్వారా వృత్తి, స్నేహం, వైవాహిక జీవితం, సంపద, విద్య, వ్యాపారం మొదలైన అన్ని విషయాలపై నైతిక పాఠాలను అందించాడు. ఇదిలా ఉంటే పెళ్లి గురించి ప్రస్తావించాడు. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాల గురించి కూడా వివరించాడు. భార్యాభర్తల మధ్య అనుబంధం ప్రత్యేకమైనది. అది జీవితాంతం ఉండే అనుబంధం. వైవాహిక జీవితం సాదాసీదాగా, ప్రేమగా ఉండాలంటే ఇరువైపులా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పరస్పర సామరస్యం,  ప్రేమపై ఆధారపడిన సంబంధం మాత్రమే బలపడుతుంది. కాబట్టి చాణక్యుడి తత్వశాస్త్రం ప్రకారం సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఏ అంశాలు దారితీస్తాయో ఇక్కడ వివరాలు ఉన్నాయి. చాణక్యుడు ప్రకారం, భార్యాభర్తలు ఒకరికొకరు సహచరులు, పోటీదారులు కాదు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, భార్యాభర్తలిద్దరూ కలిసి ముందుకు సాగడం ముఖ్యం. జీవితంలో ఎదురయ్యే రెండు సమస్యలనూ ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా చేసి పరిష్కరించుకోవాలి. ఆచార్య చాణక్య ప్రకారం ప్రతి సంబంధానికి వారి వ్యక్తిగత పరిమితులు ఉంటాయి. అదేవిధంగా, భార్యాభర్తల మధ్య కొన్ని రహస్య విషయాలు ఉన్నాయి, అవి ఎప్పుడూ మూడవ వ్యక్తికి చెప్పకూడదు, లేకుంటే వారి పరస్పర సంబంధంలో చీలిక ఉండవచ్చు. ఆచార్య చాణక్యుడు ప్రకారం, భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి అవసరాలను ఒకరు చూసుకోవాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, మనం ఒకరి భావాలను గౌరవించుకోవాలి. మద్దతు ఇవ్వాలి.  మీ వైవాహిక జీవితం విజయవంతంగా ముందుకు సాగాలంటే , భార్యాభర్తలు ప్రతి విషయంలోనూ ఓపిగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు మీ సంబంధంలో చీలికలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. భార్యాభర్తల మధ్య స్నేహపూర్వక దృక్పథం ఉండాలి. సంబంధం ఒకరికొకరు మద్దతు ఇచ్చే స్నేహితులలా ఉండాలి. ఇద్దరి మధ్య సమానత్వ భావన ఉంటే ఎలాంటి సమస్యలనైనా సులభంగా పరిష్కరించుకోవచ్చు.
రక్షా బంధన్ ఆగస్టు 9వ తేదీన వచ్చింది. ఈ రోజు కోసం కొందరు  ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుంటారు. కొందరు అక్కాచెల్లెళ్ళు  ఇప్పటికే కొత్త ఆలోచనలతో రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి రెఢీ అవుతున్నారు. కొత్త బట్టలు, రాఖీ  సిద్ధం చేసుకోవడం పరిపాటి. ప్రతిసారీ  పండుగను ఇంకాస్త మెరుగ్గా చేసుకోవాలని అనుకుంటారు.  కానీ ఇంకా మెరుగ్గా అంటే ఏం చేయాలో చాలామందికి తెలియదు.  మెరుగ్గా చేసుకోవడం అంటే కాస్త ఖరీదైన రాఖీ కట్టడం,  ఖరీదైన స్వీట్లు తెచ్చి పంచుకుని తినడం అని అనుకుంటారు చాలా మంది. కానీ ఇది తప్పు.. చాలామంది చేసేది కూడా రాఖీ కట్టడం, స్వీట్లు తినడం.. దీంతో రాఖీ సెలబ్రేషన్ అయిపోయింది అనుకుంటారు. కానీ రాఖీ పండుగ ఏడాది మొత్తం గుర్తుండిపోవాలి అంటే.. కాస్త డిఫరెంట్ గా ఆలోచించాలి.  ప్రణాళిక మార్చాలి.  ఇందుకోసం ఏమేమి చేయవచ్చు తెలుసుకుంటే.. సరదా రోజు.. రక్షా బంధన్ ను స్పెషల్ గా  చేసుకోవాలనుకుంటే  ఆ రోజును సరదాగా మార్చేయాలి. ఇందులో భాగంగా   సినిమా చూడటానికి వెళ్ళవచ్చు. ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు,   తోబుట్టువులందరితో కలిసి సినిమా వెళ్లడం చాలా మంచి అనుభూతి ఇస్తుంది.  అందరూ కలసి ఇంట్లో అయినా ఒక మంచి సినిమా చూసేయవచ్చు.  సినిమా చూస్తూ ఆస్వాదించడానికి  అందరూ కలసి స్నాక్స్ రెఢీ చేసుకోవడం,  లేదా ఆర్డర్ చేసుకుని అయినా సరే.. అందరూ కలిసి కాసింత సమయం గడపడం మంచి అనుభూతిని ఇస్తుంది. అట్లాగే గేమ్స్ ఆడటం,  సరదాగా గడపడం ద్వారా రోజును గుర్తుండిపోయేలా చేసుకోవచ్చు. ఫ్యామిలీ టూర్.. కుటుంబం మొత్తం ఒకే చోట కలవడం చాలా మంచి జ్ఞాపకం అవుతుంది.  కుటుంబంతో కలిసి పిక్నిక్ ప్లాన్ చేసుకోవచ్చు.  కుటుంబ సభ్యులందరూ ఒకరితో ఒకరు సమయం గడపగలుగుతారు. కుటుంబం అంతా ఒకే చోట కలిసేలా మీరు ఒక గొప్ప రోజును ప్లాన్ చేసుకున్నట్లుగా ఉంటుంది.  అందమైన గార్డెన్ లో  లేదా మీకు ఇష్టమైన ప్రదేశాలలో ఏదైనా పిక్నిక్ ప్లాన్ చేసుకోవచ్చు. దీని కోసం స్నాక్స్, స్వీట్లు, పానీయాలు మొదలైనవి ఏర్పాటు చేసుకుంటే ఇబ్బంది లేకుండా టూర్ ఎంజాయ్ చేయవచ్చు. అందరూ కలసి గేమ్స్ ఆడుకోవడం లాంటివి కూడా భలే మజా ఇస్తాయి. కలిసి వంట చేయడం.. రక్షా బంధన్ రోజు  అన్నా చెల్లెళ్లు కలిసి ఇష్టమైన ఆహారాన్ని వండటం, దాన్ని ఇంటిల్లిపాదికి వడ్డించడం చేయవచ్చు. ఇది చాలా మంచి మెమరీ గా మిగులుతుంది.    మంచిగా మాట్లాడాలి.. సాధారణంగా అన్నా చెల్లెళ్లు అంటే గొడవ పడటం,  కొట్టుకోవడం, అల్లరి చేయడం.. ఇదే ఎక్కువ ఉంటుంది.  కానీ రాఖీ పండుగ రోజు ఇద్దరూ ఆప్యాయంగా ఉండటం, ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడటం, ఒకరికి మరొకరు ధైర్యం ఇచ్చుకోవడం వంటివి చేయాలి.  ఇదే వారి జీవితాంతం కొనసాగితే  వారి జీవితం ఎంత అదంగా, ఎంత ధైర్యవంతంగా ఉంటుందో అర్థమైతే అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల బంధం పదికాలాల పాటు ఆనందమయంగా ఉంటుంది.                                  *రూపశ్రీ.  
తెలుగు పంచాంగంలో ఒకో మాసంలో వచ్చే పూర్ణిమకు ఒకో ప్రత్యేకత ఉంటుందనే విషయం బాగా గమనిస్తే అర్థమవుతుంది. మాఘ పూర్ణిమ, ఆషాడ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, వీటిని బుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని జరుపుకుంటారు.  ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తోంది. శ్రావణ మాసం అంతా సందడిగానూ ప్రత్యేకంగానూ ఉంటుంది.  అయితే పెళ్లిళ్లు, శుభకార్యాలు, వ్రతాలు వీటితో ఉండే సందడి వేరు. ఈ మాసంలో అన్నా, చెల్లెళ్లను పలకరించే రాఖీ పూర్ణిమ వేరు.  అన్నాచెల్లెళ్ల అనురాగాన్ని, వారి మధ్య ఒకరిమీద మరొకరికి ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేసేది రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమినే రక్షా బంధన్ అని కూడా అంటారు. రక్ష అంటే ఎలాంటి ఆపదలు, సమస్యలు రాకుండా కాపాడేది. బంధన్ అంటే కట్టి ఉంచేది. రక్షా బంధన్ అంటే ఎలాంటి సమస్యలు రాకుండా కట్టి ఉంచే బంధనం. ఆ బంధనమే రాఖీ. అందరూ తమ సోదరులకు రాఖీ కట్టడం వల్ల  వాడుక భాషలో అందరూ రాఖీ పండుగ అంటున్నారు. రాఖీ పండుగ వెనుక కథనాలు!! ఈ పండుగకు వెనుక విభిన్న కథనాలు ప్రచారంలో  ఉన్నాయి. వాటిలో ఎక్కువగా చెప్పుకునేది ఇంద్రుడి కథనం. ఇంద్రుడి కథ!! పూర్వం రాక్షసులు రెచ్చిపోయి మూడు లోకాల మీద దండయాత్ర చేసి మూడు లోకాలను సొంతం చేసుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన పరివారం, తన లోకంలో ఉన్న వాళ్ళందరితో కలసి తన నివాసమైన అమరావతిలో దాక్కున్నాడు. ఇంద్రుడి పరిస్థితి చూసి ఆయన భార్య శచీదేవికి బాధ కలిగింది. దేవాదిదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి ప్రార్థించి, నా భర్తను సమస్య నుండి గట్టెక్కించు అని అడిగింది. సరే అయితే నీ భర్తకు ఎరుపు రంగు దారంతో  రక్ష తయారుచేసి దాన్ని చేతికి కట్టు, అతను విజయం సాధిస్తాడు అని చెబుతాడు. శచీదేవి విష్ణుమూర్తి చెప్పినట్టు ఎరుపురంగు దారంతో రక్ష తయారుచేసి ఇంద్రుడికి కట్టి ఆ తరువాత హారతి ఇచ్చి, నుదుటన వీరతిలకం దిద్ది యుద్ధానికి వెళ్లమంది. అది తెలిసి అమరావతిలో ఉన్న మిగిలిన వారు కూడా రక్షలు తయారుచేసి ఇంద్రుడికి కట్టి, వీరతిలకం దిద్దారు. ఆ యుద్ధంలో ఇంద్రుడు గెలిచి తిరిగి మూడు లోకాల ఆధిపత్యాన్ని సంపాదించాడు. దీనికి గుర్తుగా రక్షా బంధన్ జరుపుకుంటున్నారని చెబుతారు. దీని వెనుక ఉన్న మరొక కథ ద్రౌపతి, కృష్ణుల కథ!! కృష్ణుడు శిశుపాలుడు వంద తప్పులు చేసిన తరువాత శిశుపాలుడిని వధిస్తాడు. ఆ సమయంలో కృష్ణుడి వేలు తెగితే ద్రౌపతి తన చీర కొంగు చింపి కట్టు కడుతుందట. అప్పుడు కృష్ణుడు ద్రౌపతితో నీ సమస్యలలో నేను అన్నగా తోడుంటాను అని చెబుతాడు. ఆ కారణంతోనే ద్రౌపతి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆమెను కాపాడాడు అని చెబుతారు. పురుషోత్తముడి కథ!! అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని అన్నగా భావించి రాఖీ కడుతుంది. అలెగ్జాండర్ ప్రపంచానికి అధిపతి కావాలనే అత్యాశతో తక్షశిల మీద దండెత్తినప్పుడు పురుషోత్తముడు యుద్ధంలో గెలిచినా అలెగ్జాండర్ ని చంపకుండా వదిలేసాడు. రాఖీ కట్టినవారికి భయం దొరుకుతుందని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఇలా చరిత్రలో రాఖీ పౌర్ణమి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. మొత్తానికి ఇందులో ఉన్న అర్థం చెల్లెలు కట్టే రక్ష అన్నకు ఆరోగ్యాన్ని, ఆయుష్షును, అన్నిటికీ మించి క్షేమాన్ని కోరుకుంటే, అన్న చేతిలో ఉండే రక్ష అన్నకు తన చెల్లి విషయంలో ఉండాల్సిన బాధ్యత, చెల్లికి ఇవ్వాల్సిన రక్షణ, భరోసాను స్పష్టం చేస్తాయి. ఇదీ రాఖీ వెనుక ఉన్న అనుబంధం.                                    ◆నిశ్శబ్ద.
  శరీరాన్ని శుద్ది చేసే పానీయాలను డీటాక్స్ జ్యూసులు అని అంటుంటారు. ఈ  డీటాక్స్ జ్యూస్లు లేదా పానీయాలు ఫ్యాటీ లివర్ వ్యాధి లేదా దీర్ఘకాలిక కాలేయ వ్యాధి వంటి తీవ్రమైన కాలేయ సమస్యలను నయం చేయగలవని నమ్ముతారు.  ఈ కారణంగానే డిటాక్స్ పానీయాలకు చాలా ఆదరణ ఉంది. కొందరైతే రోజు మొత్తం డిటాక్స్ నీటినే తాగుతూ ఉంటారు.  సుమారు ఒకటి నుండి రెండు లీటర్ల డీటాక్స్ నీటిని లేదా పానీయాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గడం, శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం వంటివి జరుగుతాయని నమ్ముతారు. కానీ ఈ డిటాక్స్ జ్యూసుల గురించి దిమ్మతిరిగే నిజాలను వెలిబుచ్చుతున్నారు వైద్యులు.  దీని గురించి తెలుసుకుంటే.. డిటాక్స్ జ్యూస్లు  కాలేయ సంబంధిత సమస్యలను తొలగించడంలో లేదా నయం చేయడంలో పెద్దగా సహాయపడవట. బయట అమ్మే డిటాక్స్ జ్యూస్లు లేదా హెర్బల్ డ్రింక్స్  తయారీలో ఉపయోగించే పదార్థాలు,  వాటి కూర్పు గురించి స్పష్టమైన సమాచారం ఉండదు. ఈ ద్రవాలలో కాలేయానికి హానికరమైన భారీ లోహాలు లేదా ఇతర పదార్థాలు ఉండవచ్చు. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనాల కంటే కాలేయానికి ఎక్కువ హాని కలిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. డీటాక్స్ పానీయాలు కొవ్వు కాలేయ సమస్యలను పెంచుతాయి.. నిజానికి ఈ జ్యూస్లను తీసుకోవడం వల్ల ఇప్పటికే ఉన్న కాలేయ సమస్య మరింత దిగజారిపోతుందట. ఫ్యాటీ లివర్ వ్యాధి నుండి క్రానిక్ లివర్ డిసీజ్,  క్రానిక్ లివర్ డిసీజ్ నుండి ఎండ్-స్టేజ్ లివర్ డిసీజ్ మారవచ్చట. కాబట్టి ఈ జ్యూస్లను తీసుకోకుండా ఉండటం మంచిది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏం తినాలి.. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి లేదా కాలేయ సమస్యలను నయం చేయడానికి  డీటాక్స్ జ్యూస్లను ఆశ్రయించే బదులు, ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులను అనుసరించడం మంచిదని ఆహార నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన, పోషకమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం. ప్రాసెస్ చేసిన,  కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకోవడాన్ని నివారించడం, తరచుగా బయట తినడాన్ని నిషేధించడం చేయాలి.  వీటికి బదులు  ఆరోగ్యకరమైన ఇంట్లో వండిన భోజనాన్ని ఎంచుకోవాలి. రెడ్ మీట్ లేదా ప్రాసెస్ చేసిన మాంసం మానేయాలి.  లేదా వీటిని  పరిమితం చేయాలి.  మాంసాహారం తినాలని ఉంటే   లీన్ మాంసాలను ఎంచుకోవడం ఉత్తమమట. ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.. ధూమపానం,  అధికంగా  మద్యం సేవించడం వంటి అలవాట్లను నివారించడం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కాలేయాన్ని రక్షించడంలో చాలా సహాయపడుతుంది. దీనితో పాటు కాలేయ ఆరోగ్యానికి హాని కలిగించే మధుమేహం,  కొలెస్ట్రాల్ వంటి ప్రమాద కారకాలను నియంత్రించడం కూడా చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, శారీరక వ్యాయామం,  ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ఈ ప్రమాద కారకాలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి.  కాలేయానికి నిజమైన 'డిటాక్స్' అంటే శుభ్రమైన,  పోషకమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, సకాలంలో వైద్య సలహా.  రోజువారీ ఎంపికలలో చిన్న మార్పులు కూడా దీర్ఘకాలంలో  కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా సహాయపడతాయి. కాలేయ ఆరోగ్యం కోసం డీటాక్స్ జ్యూస్లపై ఆధారపడటానికి బదులుగా, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం మరింత ప్రభావవంతమైన,  సురక్షితమైన విధానం.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  ఉప్పు లేని వంట, సారం లేని జీవితం వ్యర్థం అని అంటారు. వంటల్లో పులుపు, కారం కు జతగా ఉప్పు కూడా తగిన పరిమాణంలో ఉండాలి. లేకపోతే అస్సలు తినలేం. అయితే ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఆరోగ్యానికి బోలెడు ముప్పులు తప్పుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందంటే.. ఉప్పు నీటిలో సోడియం, పొటాషియం,  క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది.  ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఈ ఎలక్ట్రోలైట్లు శరీర ఆర్థ్రీకరణ, నరాల పనితీరు, కండరాల సంకోచాలు మొదలైన కార్యకలాపాలకు సహాయపడుతుంది. ఉప్పు నీరులో ఉండే సమ్మేళనాలు కడుపులో ఉండే జీర్ణ ఎంజైములు,  హైడ్రోక్లోరిక యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.  జీర్ణక్రియ,  పోషకాల శోషణకు సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఉప్పు నీటిలో మినరల్స్ కంటెంట్  ఎక్కువగా ఉంటుంది.  ఇది తామర, సొరియాసిస్ వంటి చర్మ సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. గొంతు నొప్పి,  గొంతు సంబంధ సమస్యలు తగ్గడానికి చాలామంది ఉప్పు నీటితో పుక్కిలిస్తుంటారు. అయితే ఉప్పు నీటితో పుక్కిలించడం,  ఉప్పు నీటిని ఉదయాన్నే తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు,  గొంతులో శ్లేష్మం వంటివి తగ్గడమే కాకుండా అలెర్జీలు,  శ్వాసకోశ ఆరోగ్యం,  జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో ఉండే సూక్ష్మ వ్యర్థాలు,  విష పదార్థాలను శరీరం నుండి బయటకు పంపడంలో ఉప్పు నీరు సహాయపడుతుంది.  ఈ కారణంగా ఇది శరీరాన్ని శుద్ది చేస్తుంది. ఏ ఉప్పు వాడితే మంచిదంటే.. నీటిలో ఉప్పు కలుపుకుని ఉదయాన్నే తాగడం మంచిదే అయినా  అన్ని రకాల ఉప్పుడు ఇందుకు మంచివి కావు. ఉప్పు నీరు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు లభించాలంటే.. హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా శుధ్ది చేయని ఉప్పును ఎంపిక చేసుకోవాలి. ఉప్పు నీరు ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ మోతాదులో ఉప్పు కలిపి తాగకూడదు.  తగినంత మోతాదులో ఉప్పు కలిపి తాగడం అన్ని రకాల వ్యక్తులకు మంచిదే అయినా అధిక రక్తపోటు,  గుండె సంబంధ జబ్బులు ఉన్నవారు  ఉప్పు నీరు తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.                                           *రూపశ్రీ.  
  మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ విషయాన్ని వైద్యులు చెప్పడమే కాకుండా ఆరోగ్యం మీద స్పుహ ఉన్న ప్రతి ఒక్కరూ అదే చెబుతారు.   ఏది తిన్నా అది  ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు తీసుకునే ఆహారం పోషకాలతో సమతుల్యంగా ఉండాలని చెబుతారు. అంతేకాదు.. తీసుకునే ఆహారమే కాకుండా ఆహారం తీసుకునే  సమయం  కూడా అంతే ముఖ్యమని చాలా మంది చెబుతారు. కానీ అధిక శాతం మంది తీసుకునే ఆహారం విషయంలో చూపించిన శ్రద్ద ఆహారం తీసుకునే సమయం విషయంలో అస్సలు చూపించరు. నేటి బిజీ లైఫ్ లో రోజంతా హడావిడిగా పనులు చేయడమే కాదు.. హడావిడిగా తినడం కూడా జరుగుతోంది. రాత్రి సమయంలో  కొన్నిసార్లు  9 గంటలకు, కొన్నిసార్లు 10 లేదా 11 గంటలకు తింటుంటారు.  తిన్న  వెంటనే నిద్రపోతారు. కానీ  రాత్రి 7 నుండి 8 గంటల మధ్య ఆహారం తీసుకుంటే ఆరోగ్య పరంగా అద్భుతాలు జరుగుతాయని అంటున్నారు వైద్యులు.  దీని గురించి తెలుసుకుంటే.. 7-8 మధ్య భోజనం ఎందుకంటే.. 7-8 గంటల మధ్య భోజనం చేయడం వల్ల  మొత్తం ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. త్వరగా భోజనం చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా నిద్ర, గుండె, జీర్ణక్రియ,  చక్కెర నియంత్రణకు కూడా చాలా మంచిది.  త్వరగా భోజనం చేసేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 27% తక్కువగా ఉంటుందని,  అధిక కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం 19% తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనితో పాటు, బరువు తగ్గడం, జీర్ణ ఆరోగ్యం,  నిద్ర నాణ్యతకు కూడా ఇది 7-8 మధ్య రాత్రి భోజనం చేయడం మంచిది.   రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల షుగర్ సమస్య వచ్చే ప్రమాదం సాధారణం కంటే 20 శాతం ఎక్కువ ఉంటుందట. జీర్ణశక్తి.. త్వరగా భోజనం చేయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే అది జీర్ణక్రియను చక్కగా ఉంచుతుంది. రాత్రి 8 గంటల ముందు భోజనం చేసినప్పుడు, శరీరం దానిని జీర్ణం చేసుకోవడానికి తగినంత సమయం తీసుకుంటుంది. ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి దాదాపు 2 నుండి 4 గంటలు పడుతుంది. ఆహారం తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది,  గ్యాస్, మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలు ఏర్పడతాయి. త్వరగా భోజనం చేయడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ (గుండెల్లో మంట) ప్రమాదం 50% తగ్గుతుంది. సూర్యాస్తమయం తర్వాత జీర్ణక్రియ మందగిస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది, కాబట్టి రాత్రిపూట తేలికగా,  త్వరగా తినాలి. నిద్ర.. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంలో బిజీగా ఉండటం వల్ల విశ్రాంతి లభించదు. దీని ప్రభావం నిద్రపై కూడా కనిపిస్తుంది.  నిద్రపోవడానికి 2-3 గంటల ముందు తినడం వల్ల శరీరం ప్రశాంతంగా ఉంటుంది.  నిద్ర గాఢంగా పడుతుంది. 7-8 మధ్య రాత్రి భోజనం చేసేవారికి నిద్రలో గ్యాస్, గుండెల్లో మంట లేదా భారం తక్కువగా ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మంచి నిద్ర మానసిక,  శారీరక ఆరోగ్యానికి మంచిది. బరువు.. బరువు తగ్గాలనుకునేవారు ఆహారం మాత్రమే కాదు, తినే సమయం కూడా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీ (2013) ప్రకారం, సాయంత్రం 7 గంటలకు ముందు తినేవారిలో శరీరం కేలరీలను శక్తిగా మార్చగలదు కాబట్టి బరువు తగ్గడం వేగంగా ఉంటుంది. రాత్రి ఆలస్యంగా  భోజనం చేయడం వల్ల ఆహారం కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. త్వరగా తినడం వల్ల జీవక్రియ చురుకుగా ఉంటుంది.  ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. అలాగే రాత్రి భోజనం తర్వాత  శారీరక శ్రమ లేదా కాస్త వాకింగ్ చేయడానికి కూడా సమయం దొరుకుతుంది. ఇది కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులు సమయానికి రాత్రి భోజనం చేయడం  చాలా ముఖ్యం. ఆలస్యంగా భోజనం చేసేవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరం  సిర్కాడియన్ సైకిల్ కు భంగం కలుగుతుంది, ఇది హార్మోన్ల అసమతుల్యత ప్రమాదాన్ని పెంచుతుంది.                              *రూపశ్రీ.