Home

»

Latest News

పద్మశ్రీ 'షావుకారు జానకి' కన్నుమూత: చిరంజీవి భావోద్వేగ నివాళి.!

Aug 21, 2026 4:24PM

భారతీయ చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో ఏడు దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ నటి, పద్మశ్రీ షావుకారు జానకి కన్నుమూశారు. ఆమె మరణవార్త పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

చిరంజీవి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగమైన సందేశాన్ని పోస్ట్ చేస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. "ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి గారు ఇకలేరనే వార్త ఎంతో బాధ కలిగించింది. ‘షావుకారు’ చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాల పాటు కొనసాగింది" అంటూ ఆమె ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.

"వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి." అంటూ చిరంజీవి నివాళులర్పించారు.

 

 

 

Sowcar Janaki, Chiranjeevi, Shavukaru Janaki

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com