LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, ఆయన పార్టీ నేతలు, శ్రేణుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి.  అవన్నీ పక్కన పెడితే  తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన  ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని  తాడేపల్లిలోని జగన్ నివాసం అదేనండి తాడేపల్లి ప్యాలెస్ వద్ద పెద్ద ఎత్తున బ్యానర్లు, హోర్డింగ్ లు, కటౌట్ లు వెలిశాయి.  వీటిలో ఒక బ్యానర్ మాత్రం అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది.  ఆ భారీ కటౌల్ లో జగన్, కేసీఆర్, కేటీఆర్ చిత్రాలు ఉండటమే అందుకు కార ణం. ఈ బ్యానర్ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ బ్యానర్ బీఆర్ఎస్, వైసీపీ బంధానికి నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో జగన్ కేటీఆర్ తో భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.  
  ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు. నాంపల్లి సెంట్రల్ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.  అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆమని మాట్లాడుతు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ప్రగతిని చూసి గర్వపడుతున్నాని తెలిపారు. ప్రధాని చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితురాలినై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.  ఆయన సనాతన ధర్మం కోసం మోదీ ఎంతో పాటుపడుతున్నారు" అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పోరాటాలపై నెమ్మదిగా స్పందిస్తున్న బీజేపీ, ఇప్పుడు అనూహ్యంగా సినీ తారలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా విజయశాంతి, జయసుధ, జీవితా రాజశేఖర్ వంటి వారిని పార్టీలోకి ఆహ్వానించింది. కొందరు అగ్ర హీరోలతో బీజేపీ జాతీయ నేతలు భేటీ కావడం, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి  
వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి హిందుత్వ అనుకూల వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సన్యాసం తీసుకుని వ్యవసాయమే వ్యాపకమంటూ ప్రకటించిన ఆయన అడపాదడపా రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే.  అన్నిటికీ మించి ఆయన ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు ఆయన కమలం గూటికి చేరువ అవుతున్నారన్న సంకేతాలు ఇస్తున్నాయి. విజయసాయి కాషాయ మంత్రం జగన్ కు కషాయం కావడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ఒక సందర్భంగా ఆయన హిందూమతంపై కుట్రలు జరుగుతున్నాయంటూ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు ఆశ చూపి మతమార్పిడులకు పాల్పడుతున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అక్కడితో ఆగకుండా గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై ఓ కమిటీ వేసి మరీ విచారణ జరపాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. దీంతో ఆయన జగన్ అండ్ వైసీపీ టార్గెట్ గా రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ పరిశీలకులు విశ్లేషించారు. ఇప్పుడు తాజాగా  బంగ్లాదేశ్ లో ఆందోళనలు హింసాకాండపై ఎక్స్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి.. బంగ్లాదేశ్ లో హిందువులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నా యన్నారు. ఈ దాడులను ఆయన నరమేధంగా అభివర్ణించారు. ఈ దాడులను ఖండించని వారు అసలు హిందువులే కారనీ, వారికసలు దేశ భక్తే లేదంటూ విమర్శలు గుప్పించారు.  బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అమానుష దాడులను ఖండించకుండా మౌనంగా ఉన్న రాజకీయ పార్టీలకు, నాయకులకు ఈ దేశంలో కొనసాగే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు.   భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై  స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో ఆయన తన రాజకీయ పున: ప్రవేశానికి కమలదళం గొంతుకను సిద్ధం చేసుకుంటున్నారని పరిశీలకులు అంటు న్నారు.  
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని రాజకీయం చేయడానికి అష్ఠకష్టాలు పడిన వైసీపీ.. కోటి సంతకాలంటూ చేసిన హడావుడి ముగిసింది. గవర్నర్ కు వినతిపత్రంలో ఆ ప్రహసనం దాదాపు ముగిసిపోయినట్లే. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల పట్ల ప్రజల వ్యతిరేకత పెద్దగా కనిపించలేదని స్పష్టమైంది. దీంతో ఇప్పుడు కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. ఈ విషయంలో కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడానికి సన్నాహాలు చేస్తున్నది. అయితే ఇక్కడే ఆ పార్టీకి పెద్ద ఇబ్బంది వచ్చి పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పీపీపీ విధానం వద్దు అంటూ కోర్టును ఆశ్రయిస్టే ఆ పిటిషన్ అడ్మిషన్ స్థాయిలోనే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు న్యాయ నిపుణులు. ఎందుకంటే పీపీపీ విధానం అన్ని పరీక్షలకూ తట్టుకుని నిలబడిన అంశం. కేంద్రం నుంచి పలు రాష్ట్రాలలో ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ మెంట్ అన్నది ఈ పీపీపీ విధానంలోనే జరుగుతోంది. సరే అది కాదని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది.  దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు. అది పక్కన పెడితే తాము సేకరించిన కోటి సంతకాలనూ కోర్టు ముందు ఉంచుతామన్న వాదనను వైసీపీ తెరపైకి తీసుకువస్తున్నది. అయితే అదీ అంత తేలిక కాదు. నిజంగా వైసీపీ కోటి సంతకాలు సేకరించి, వాటిని కోర్టుకు సమర్పించాలంటే, ఆ కోటి సంతకాలు చేసిన వారి గుర్తింపును కూడా కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి సంతకాల సేకరణ కార్యక్రమం ఎలా జరుగుతుందన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సంతకాలు చేసిన కోటి మంది ఐడెంటిటీని కోర్టు ముందు ఉంచడం అంటే అయ్యే పని కాదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రైవేటు కాలేజీలకు వ్యతిరేకంగా న్యాయపోరాటానికి ఎలా ముందుకు వెడుతుందన్నది ఆసక్తిగా మారింది. 
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఇప్పుడు ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు.   సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడనీ, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరిస్తున్నాయి. అయితే నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత తేలిగ్గా రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న కుట్రలు జరిగాయి. పప్పు అంటూ బాడీ షేమింగ్,  హేళనలు ఇలా ఎన్నో ఎదుర్కొన్నారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నాలు జరిగాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ , మీమ్స్ తో లోకేష్ రాజకీయ ఎదుగుదనలను ఆరంభంలోనే అణచివేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ విషయాలన్నిటినీ మంత్రి నారా లోకేష్ రాజమహేంద్ర వరంలో శుక్రవారం (డిసెంబర్ 19) విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు. వాటన్నిటినీ అధిగమించడానికి తాను ఏం చేశారో పంచుకున్నారు.   తన శక్తిని అటువంటి ట్రోలింగ్స్, మీమ్లను ఖండించడానికీ, బుదలు ఇవ్వడానికీ వృధా చేయ కూడదని అందుకు బదులుగా  రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగడంపైనే దృష్టి సారించాననీ వివరించారు. తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో  పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.  తనకు ఎదురైన ప్రతి సవాలును సానుకూల దృక్ఫ థంతో ఎదుర్కొన్నానని చెప్పారు.  ఒక అడుగు వెనక్కి వేస్తే సరిదిద్దుకోవడానికి సంవత్సరాలు పట్టవచ్చని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు చెప్పారు.   
ALSO ON TELUGUONE N E W S
After a three-year hiatus following his previous success, Roshan Meka returns to the silver screen with Champion, a compelling period drama set against the historical backdrop of 1948 Bhairanpally. Produced by Priyanka Dutt under the prestigious Swapna Cinema banner and directed by Pradeep Advaitam, the film is slated for a worldwide release on December 25, 2025. During a recent media interaction, Roshan shared his excitement regarding the overwhelming response to the film’s teaser and soundtrack. He particularly lauded Mickey J. Meyer’s transformative background score, promising audiences a "new" musical dimension from the composer.  Roshan emphasized that the film’s authenticity was achieved through extensive workshops to master the local dialect and era-specific nuances. The actor described Champion as a powerful blend of intense action and deep human sentiment. He praised his co-star, Anaswara Rajan, noting that her character provides a vital emotional anchor and adds a layer of charm to the narrative.  Reflecting on his career break, Roshan stated that the time was essential for his personal and professional growth. He expressed immense confidence that the passion invested by every craft will make Champion one of the most significant releases in recent Telugu cinema, proving that his three-year wait was well worth the effort. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
        -ఈ సారి పాన్ ఇండియా ప్రేక్షకులకి పండగే  -నెట్ ఫ్లిక్స్ వెల్లడి -పెర్ ఫార్మెన్స్ విషయంలో తగ్గేదేలే          రామ్ పోతినేని(Ram Pothineni),భాగ్య శ్రీ బోర్సే(Bhagyashri Borse)జంటగా తెరకెక్కిన 'ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra King Taluka)గత నెల 27 న సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్ కామెడీ మూవీగా తెరకెక్కగా సాగర్ అనే క్యారక్టర్ లో రామ్ పోతినేని పెర్ఫార్మ్ ఒక రేంజ్ లో సాగుతుంది. ముఖ్యంగా తాను అభిమానుంచే హీరోకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన ప్రేయసిని సైతం వదులుకోవడానికి సిద్దపడటంతో పాటు, తన ఊరి బాగుకోసం పరితపించే వ్యక్తిగా సాగర్ క్యారక్టర్ లో రామ్ జీవించాడని చెప్పవచ్చు.     ఇప్పుడు ఈ మూవీ ఓటిటి వేదికగా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. డిసెంబర్ 25 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి రెడీ చేస్తున్నట్టుగా సదరు సంస్థ అధికారంగా  వెల్లడి చేసింది. ఓటిటి మూవీ లవర్స్ కి ఆనందం కలిగించే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే  పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నెట్ ఫ్లిక్స్ అందుబాటులో ఉంచనుంది. దీంతో పాన్ ఇండియా ఓటిటి ప్రేమికులకి ఈ క్రిస్మస్ నూతన ఉత్సాహాన్ని తీసుకురావడం ఖాయమని చెప్పుకోవచ్చు.     Also Read:   అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!     తెలుగు సినిమా టాప్ హీరో సూర్య కుమార్ గా ఉపేంద్ర(Upendra)నటన కూడా ఎంతగానో మెప్పిస్తుంది. కథ, కధనాలు కూడా ఎంతో ఆసక్తికరంగా సాగడంతో పాటు ఆ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతగానో మెప్పిస్తాయి. భాగ్యశ్రీ బోర్సే  పోషించిన మహాలక్ష్మి, సాగర్ మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా మెస్మరైజ్ చేస్తాయి. సాంగ్స్ కొంచం ఇబ్బందిగా అనిపించినా నేపధ్య సంగీతం బాగుంటుంది. మిగతా క్యారెక్టర్స్ లలో చేసిన నటులు కూడా పెర్ఫార్మ్ విషయంలో తగ్గేదెలే అనే విధంగా చేసారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు సంస్థకి తగ్గట్టే హై రేంజ్ లో ఉంటాయి. మహేష్ కుమార్ దర్శకత్వ పని తీరు కూడా మెప్పిస్తుంది.                                                                                                      
The love and action entertainer Mowgli, starring Roshan Kanakala, has emerged as a significant commercial success, crossing its break-even point within the first week of its release. Produced by TG Vishwa Prasad and Krithi Prasad, the film has successfully transitioned into the profit zone as it enters its second week of theatrical screening. Crafted with high production standards on a sensible budget of ₹8 crores, Mowgli has garnered nearly ₹10 crores in total revenue through combined theatrical and non-theatrical rights. This financial achievement marks Roshan Kanakala’s first major success as a lead actor, with critics and audiences alike praising his impressive performance in both action and emotional sequences.  Director Sandeep Raj has received accolades for his disciplined filmmaking, delivering a premium cinematic experience while maintaining strict budget control. The film's success is further bolstered by a strong supporting cast, particularly Bandi Saroj Kumar, whose performance in a negative role resonated well with the audience. At a time when small and medium-budget films often struggle to maintain a theatrical presence, Mowgli serves as a vital morale booster for the industry. It reaffirms that content-driven cinema, backed by efficient production and compelling performances, continues to have a dedicated audience in the modern market. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Suriya starrer Karuppu being directed by RJ Balaji has been struggling with financial issues even though movie is 95% complete. A song and few scenes needs to be shot and the makers are planning to complete the shoot in January. Now, the makers are planning to release on 19th March 2026.  Already, the movie has been facing huge troubles with low asking price from OTT platforms which makers are not happy with. Suriya has been facing huge downtime in his career, so he is expecting Karuppu to be his major comeback at the box office. Meanwhile, he moved on to his next Suriya46 with Venky Atluri.  Sithara Entertainments is producing the film and Mamitha Baiju is playing a leading role in it. The makers have wrapped up shoot completely and they have started post-production works locking May date. Hence, Karuppu cannot go for a further date than Atluri's film.  Meanwhile, Jithu Madhavan's cop film with Suriya will complete shoot by May and the actor, who is producing it himself, doesn't want to take it to 2027, unless works are pending or slowed down it seems.   So, Karuppu makers need to lock March date and so, despite competition with Dhurandhar and Yash's Toxic, they might for the date, say sources. With Dhurandhar being such a massive hit, Part-2 will shatter all box office records in opening weekend for sure. Going against it would be a suicide but makers have no choice, it seems. Let's wait for official confirmation.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
      సినిమా పేరు: గుర్రం పాపిరెడ్డి తారాగణం: నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగిబాబు, జీవన్, రాక్ కుమార్ కసిరెడ్డి, వంశీధర్ గౌడ్, జాన్ విజయ్ తదితరులు  తదితరులు  ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ మ్యూజిక్: కృష్ణ సౌరభ్  రచన, దర్శకత్వం: మురళీ మనోహర్ సినిమాటోగ్రాఫర్: అర్జున్ రాజా బ్యానర్: బురా అండ్ సద్ది క్రియేటివ్ ఆర్ట్స్ ఎల్ ఎల్ పి, ఎంజెఎం మోషన్ పిక్చర్స్   నిర్మాతలు: వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్, విడుదల తేదీ: డిసెంబర్ 20 ,2025      మత్తు వదలరా మూవీతో నటుడుగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నరేష్ అగస్త్య(Naresh Agastya)హీరోగా మారి ఈ ఏడాది ఇప్పటికే 'మేఘాలు చెప్పిన ప్రేమకథ' తో వచ్చాడు. ఇప్పుడు మరోసారి గుర్రం పాపిరెడ్డి(Gurram Paapireddy)అనే మూవీతో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా తో కలిసి థియేటర్స్ లో అడుగుపెట్టాడు. ప్రచార చిత్రాలతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న    గుర్రం పాపిరెడ్డి ఏ మేర ఆకట్టుకున్నాడో చూద్దాం.     కథ గుర్రం పాపిరెడ్డి (న‌రేష్ ఆగ‌స్త్య) ఒక మధ్య తరగతి యువకుడు. కొంచం అమాయకత్వాన్ని  కూడా కలగలసిన పాపిరెడ్డికి డబ్బు సంపాదించడమే లక్ష్యం. ఈ క్రమంలో ఒకసారి  బ్యాంకు రాబడికి ప్రయత్నించి విఫలమవుతాడు. సౌదామిని(ఫరియా అబ్దుల్లా)  హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తుంది. సౌదామిని కి కూడా గుర్రం పాపిరెడ్డి లాగా డబ్బు సంపాదించడమే ధ్యేయం. ఈ ఇద్దరు శ్రీశైలం పరిసర ప్రాంతాల్లోని ఒక సమాధిలో ఉన్న శవాన్ని బయటకి తీసి వేరే ఏరియాలో ఉన్న సమాధిలోకి మార్చాలని నిర్ణయించుకుంటారు. అందుకు గొయ్యి (జీవ‌న్), మిల‌ట‌రీ (క‌సిరెడ్డి), చిలిపి (వంశీధ‌ర్ గౌడ్‌) అనే మరో ముగ్గురుకి డబ్బు ఆశ చూపించి తమతో కలుపుకుంటారు. మరో వైపు భారతదేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచి ఉన్న కళింగ సంస్థాన రాజకుటుంబీకులు హైగ్రీవ (జాన్ విజయ్), నీలగ్రీవ (ప్రదీప్ రుద్ర) పాపిరెడ్డి కోసం వెతుకుతు ఉంటారు. రాజ కుటుంబీకులు పాపిరెడ్డి కోసం ఎందుకు వెతుకుతున్నారు? డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్న పాపిరెడ్డి,  సౌదామిని శ్రీశైలం సమీప ప్రాంతంలో ఉన్న శవాన్ని తీసుకురావడానికి ఎందుకు పూనుకున్నారు? ఆ శవాన్ని ఎక్కడికి మార్చాలి? మార్చితే వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటి? ఆ ప్రయాణంలో వాళ్ళు సక్సెస్ అయ్యారా? ఆ శవం వెనక ఉన్న కథ ఏంటి? చివరిగా పాపిరెడ్డి,  సౌదామిని అండ్ బ్యాచ్  కథ ఎలా ముగిసింది? అనేదే పాపిరెడ్డి చిత్రకథ.     ఎనాలసిస్  సినిమా ప్రారంభం నుంచే ఎంటర్ టైన్ మెంట్ ప్రధాన లక్ష్యంగా డార్క్ కామెడీ తో  గుర్రం పాపిరెడ్డి  తెరకెక్కిందనే విషయం అర్ధమవుతుంది. పైగా శవాల మార్పిడి కాన్సెప్ట్ కూడా కొత్తదే. అందుకోసం పాపిరెడ్డి ముగ్గురు తెలివితక్కువ వాళ్ళ సాయం తీసుకోవ‌డం, దాని వెనుక `కోడి బుర్ర‌` రీజ‌నింగ్ చెప్ప‌డం బాగుంది. కానీ సినిమాలోకి వెళ్లే కొద్దీ సన్నివేశాల్లో పస లోపించింది. పైగా డార్క్ కామెడీలో  ఉండాల్సిన కామెడీ, థ్రిల్స్ కూడా మిస్సయ్యాయి. అదే పాపిరెడ్డి కి మైనస్ గా పరిగణించే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే గోల్డ్ షాప్ దొంగ‌త‌నంతో మూవీ ప్రారంభమయ్యింది. మిగతా     కథ మొత్తానికి రన్నింగ్ కావడానికి కావాల్సిన క్యారక్టర్ లన్నింటినీ గోల్డ్ షాప్ దగ్గరే   పరిచయం చేయడంతో పాటు డైరెక్ట్ గా కథలోకి వెళ్లడం బాగుంది.     దీంతో మనం పాపిరెడ్డి టీం తో ట్రావెల్ అవుతాం. ఈ క్రమంలో వచ్చే సీన్స్ లాజిక్ కి భిన్నంగా ఉన్నా నవ్వుని మాత్రం తెప్పిస్తాయి. ముఖ్యంగా శవాల దొంగ‌త‌నలా సీన్స్ చాలా స‌ర‌దాగా ఉంటాయి. ఆ ప్రాసెస్ లో క్యారెక్టర్స్ మధ్య ఎదురయ్యే గంద‌ర‌గోళం, మిల‌ట్రీని గోతిలో క‌ప్పేయ్య‌డం న‌వ్వులు పంచుతాయి. గొయ్యిని క‌ళింగ వార‌సుడిగా కోర్టు మెట్లు ఎక్కిండం, ఆ తరువాత  అస‌లు క్యారక్టర్ లు రంగ ప్ర‌వేశం చేయ‌డంతో క‌థ‌నంలో పట్టు  వ‌స్తుంది. ఇంట్ర‌వెల్ ట్విస్ట్ కూడా బాగుండటంతో  పాటుసెకాంఫ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ కలిగించింది. కాకపోతే సెకండ్ హాఫ్ ఆశించినంతగా లేదు. దాదాపుగా కోర్టు డ్రామా చుట్టూనే కథ తిరగడంతో పాటు గొయ్యిని క‌ళింగ వార‌సుడిగా నిరూపించ‌డం చుట్టూనే తిరుగుతుంది.     దీంతో ఫస్ట్ హాఫ్ లో ఉన్న మజా సెకండ్ హాఫ్ లో రాలేదు, కోర్టులో వాదోపవాదనలు అయితే  మ‌రీ సిల్లీగా అనిపిస్తాయి. డీఎన్ఏ టెస్ట్ కోసం జ‌రిగిన ప్ర‌హ‌స‌నం అయితే ఎక్కువ లెంత్ లో ఉంది.  కళింగ సంస్థానానికి చెందిన సీన్స్ తో పాటు పురాణాల్ని కూడా ఆధునిక కథకి లింక్ చేసే సందర్భంగా వచ్చే సీన్స్ లాజిక్ లేని విధంగా ఉన్నాయి.ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.     నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు     ఒక్కరిని కాదు మూవీలో చేసిన నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, జీవన్, రాక్ కుమార్ కసిరెడ్డి, వంశీధర్ గౌడ్, జాన్ విజయ్ తమ క్యారక్టర్ ల పరిధి మేరకు అత్యద్భుతమైన ప్రదర్శన కనపర్చారు. ఇక బ్రహ్మానందం, యోగిబాబు పెర్ఫార్మ్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. తమ నటనతో మరోసారి మెప్పించారు. దర్శకుడిగా, రచయితగా మురళి(MUrali Manohar)పెద్దగా మెప్పించలేక పోయాడు. డార్క్ కామెడికి కావాల్సిన పర్ఫెక్ట్ సీన్స్ ని ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా ఆలోచించలేకపోయాడు. కృష్ణ సౌరభ్  నేపధ్య సంగీతం బాగుంది. అర్జున్ రాజా  ఫోటో గ్రఫీ కూడా పర్లేదు. నిర్మాణ విలువ‌లు నామ మాత్రమే.     ఫైనల్ గా చెప్పాలంటే కంటెంట్ చాలా కొత్తది. అందుకు తగ్గట్టుగా ఎగ్జాయిట్మెంట్ ని  తెప్పించే సన్నివేశాలు రాసుకోవడంలో మేకర్స్ విఫలమయ్యారు. ఫస్ట్ హాఫ్ బాగున్నా కూడా సెకండ్ హాఫ్ నామమాత్రంగా ఉంది.        rating 2.75/5                                                                                                                    అరుణాచలం                                                                                                                                               
  వెబ్ సిరీస్ : నయనం నటీనటులు: వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్, అలీ రజా, ఉత్తేజ్, రేఖా నిరోషా, హరీష్ తదితరులు ఎడిటింగ్: వెంకట క్రిష్ణ చిక్కల సినిమాటోగ్రఫీ: షోయబ్ సిద్దిఖి మ్యూజిక్: అజయ్ అరసాడ దర్శకత్వం: స్వాతి ప్రకాష్ ఓటీటీ : జీ5 కథ :  నయన్ అర్థరాత్రి తన హాస్పిటల్ లోపలికి వెళ్ళి అన్నీ వెతుకుతుంటాడు. ఇంతలో ఎవరో ఒకరు తన తలపై రాడ్ తో కొడతారు. అతను పడిపోవడంతో కథ అతని గతంలోకి వెళ్తుంది. నయన్ ఓ కంటి వైద్యడు. అతడికి చిన్నతనం నుండి అవతలి వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అందుకే ప్రతీ నెలా అతను ఉండే వాచ్ మెన్ అంకుల్ కి డబ్బులు ఇచ్చి మరీ అపార్ట్మెంట్ లో జరిగే గొడవలు తెలుసుకుంటాడు. అయితే అతడి హాస్పిటల్ లో ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది. దాని తాళం(కీ) అందులో పనిచేసే ఎవరికి ఇవ్వడు. అయితే నయన్ కంటి వైద్యుడు కాబట్టి సీక్రెట్ గా ఓ ప్రయోగం చేస్తుంటాడు. తన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కి కంటిలోకి ఓ ఇంజక్షన్ ఇస్తుంటాడు. దానివల్ల అవతలి వాళ్లు చూసేది అతను చూడగలుగుతాడు. అలా ఒకరోజు మాధవి(ప్రియాంక జైన్) తన భర్త గౌరీ శంకర్(ఉత్తేజ్) ని చంపడం నయన్ చూస్తాడు‌‌. దాంతో నయన్ ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. ఆ తర్వాత నయన్ లైఫ్ ఎలా మారింది. అసలు మాధవి ఎందుకు తన భర్తని చంపాలనుకుందనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: హీరో తలపై గుర్తుతెలియని వ్యక్తి తలపై కొట్టడంతో కథ ఆసక్తిగా మొదలైంది. నయన్ ఓ ప్రయోగం చేస్తుండటం.. అదే సమయంలో మాధవి తన భర్తని చంపడం..కేస్ ఇన్వెస్టిగేషన్ మరోవైపు ఇలా మూడు సాగుతుంటాయి. ప్రతీ ఎపిసోడ్ కి ఒక్కో ట్విస్ట్ తో ముందుకు సాగుతుంది.  ఈ సిరీస్ మొత్తంగా ఆరు ఎపిసోడ్ లు.. ఇందులో మొదటిది: ది ఐ హి బియోండ్(The Eye Beyond).. ఇందులో హీరో, హీరోయిన్ పరిచయం.. అలాగే హీరో హాస్పిటల్ స్టాఫ్ ని డీటేయిలింగ్ గా పరిచయం చేశాడు. ఇంకా రెండో ఎపిసోడ్: థ్రూ హార్ ఐస్(Through Her Eyes).. డాక్టర్ దగ్గరికి మాధవి రావడం.. తన భర్తకి కొత్త అద్దాలు ఇవ్వడం. ‌ అక్కడి నుండి ప్రతీరోజు తనని గమనించడం సాగుతుంది. ఇలా నయన్ ట్రీట్మెంట్ ఇచ్చిన ప్రతీ ఒక్కరి లైఫ్ లో ఏం జరుగుతుందో చూస్తుంటాడు. మూడో ఎపిసోడ్ : ది వాచర్ ఈజ్ వాచ్డ్(The watcher is watched). ఇందులో డాక్టర్ నయన్, మాధవి ఇద్దరి గురించి డీటేయిలింగ్ ఉంటుంది. నాల్గో ఎపిసోడ్ : ది ఎకోస్ ఆఫ్ డీసీట్(The echoes of Deceit).. ఇది ముప్పై నాలుగు నిమిషాలు ఉంటుంది. ఇందులో  డాక్టర్ ని ఇరికించడానికి ఎవరో తనకి ఫోటోలు పంపిస్తారు.. అలాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో నయన్ సస్పెక్ట్ అనేలా ప్రొసీడింగ్స్ ఉంటాయి.  అయిదో ఎపిసోడ్: ది డోర్ బిహైండ్ ది ఐ(The Door behind the eye)..  ఈ ఎపిసోడ్ ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది. మర్డర్ వెనుక అసలు కారణమేంటో రివీల్ అయ్యే ఎపిసోడ్ ఇది. ఆరో ఎపిసోడ్: ది స్కేర్స్ ఆఫ్ సైలెన్స్ ( The scares of silence) .. ఈ ఎపిసోడ్ ముప్పై ఎనిమిది నిమిషాలు ఉంటుంది. ఇందులో అన్ని ట్విస్ట్ లు రివీల్ అవుతాయి. ఫుల్ ప్యాకేజీ థ్రిల్ అండ్ ఎంగేజింగ్ గా ఈ ఎపిసోడ్ సాగుతుంది. సిరీస్ మొత్తం కలిపి ఒక్క గంటలో కుదించేయొచ్చు కానీ ఎపిసోడ్ లుగా చేసి.. అవసరం లేని సీన్లు చాలా జోడించారు.  అందరి లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేది డాక్టర్ క్యూరియాసిటీ.. అయితే అతని వెనుక ఓ సీక్రెట్ బాస్ ఉండటం.. మర్డర్ ని హీరో చూడటం అంతవరకు బాగుంది. కానీ ఈ ఎలిమెంట్స్ ని సరిగ్గా ఎంగేజింగ్ గా చూపించలేకపోయారు. గ్రిస్పింగ్ స్క్రీన్ ప్లే లేదు.‌ సైన్స్ ఫిక్షన్ ని కాస్త మర్డర్ మిస్టరీగా మార్చేశారు. చివరివరకు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా మార్చేశారు. అది కూడా ఫుల్ బోరింగ్ అండ్ సప్పగా సాగే ప్రెజెంటేషన్ తో వెళ్తుంటుంది ఒక్కో ఎపిసోడ్. డాక్టర్ చూసినదానిని నిరూపించలేనప్పుడు ఎందుకు ఆ ఇన్వఫర్ మేషన్.. అసలు డాక్టర్ క్యూరియాసిటీ గురించి ఫస్ట్ ఎపిసోడ్ తప్ప.. ఇంకా ఎక్కడా ప్రస్తావించలేదు.. ఇక క్లైమాక్స్ అయితే ఎవరైనా ఊహించేయొచ్చు. బిఎజిఎమ్ ఒకే. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. స్ట్రోరీ బాగుంది కానీ ప్రెజెంటేషన్ సాదాసీదాగా ఉంది. అశ్లీల దృశ్యాలు లేవు.. అసభ్య పదజాలం వాడలేదు.  నటీనటుల పనితీరు: నయన్ గా వరుణ్ సందేశ్ ఆకట్టుకునన్నాడు. మాధవిగా ప్రియాంక జైన్ హామ్లీగా కనపడింది. ఉత్తేజ్ ఆకట్టుకున్నాడు. మిగతావారంతా తమ పాత్రలకి న్యాయం చేశారు.   తెలుగువన్ పర్ స్పెక్టివ్ : గుడ్ కాన్సెప్ట్ బట్ వన్ టైమ్ వాచెబుల్.    రేటింగ్: 2.5 /5   ✍️. దాసరి మల్లేశ్
      -కలెక్షన్స్ ఎంత! -ఇండియాలో దెబ్బకొట్టింది ఎవరు -ప్రేక్షకులు ఏమంటున్నారు     జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.       ఈ చిత్రం తొలి రోజు వరల్డ్ వైడ్ గా 60 మిలియన్ల డాలర్స్ ని వసూలు చేసింది. మన ఇండియన్ కరెన్సీ లో 600 కోట్ల రూపాయలు. దీంతో ఓపెనింగ్ డే కలెక్షన్స్ విషయంలో మొదటి రెండు పార్ట్ ల కంటే ఫైర్ అండ్ యాష్ ఎక్కువ రాబట్టిందని చెప్పవచ్చు. కాకపోతే ఇండియన్ సినీ ప్రేమికులు మాత్రం ఫైర్ అండ్ యాష్ కి షాక్ ఇచ్చారు.అవతార్   రెండవ భాగం ఇండియాలో 40 కోట్లకి పైగా రాబట్టింది. కానీ ఫైర్ అండ్ యాష్ 20 కోట్ల ని మాత్రమే రాబట్టింది. ఈ మేరకు ట్రేడ్ వర్గాలు వారు ధృవీకరిస్తున్నారు. ధురంధర్ ప్రభావం అనే మాటల్నికూడా వాళ్ళు వ్యక్త పరుస్తున్నారు.     Also read:  ప్రముఖ అగ్ర నటుడి మృతి.. షాక్ లో అగ్ర హీరోలు         ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా 'ఫైర్ అండ్ యాష్' కి మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి.  విజువల్స్  బాగున్నా మూవీ చాలా స్లో గా ఉందనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫైర్ అండ్ యాష్ సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.    
‘పుష్ప’ సిరీస్‌తో సంచలన విజయాలు నమోదు చేసిన సుకుమార్‌ టీమ్‌ తమ తర్వాతి సినిమా కోసం పనులు మొదలుపెట్టేశారు. ‘పుష్ప2’ సాధించిన ఘనవిజయం తర్వాత ‘పుష్ప3’ కోసం ప్రేక్షకులు, బన్ని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభమవుతుందని ప్రచారం జరిగింది. అయితే దీనిపై మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు క్లారిటీ ఇచ్చారు.    అందరూ ఎదురుచూస్తున్నట్టు ‘పుష్ప3’ ఇప్పట్లో ఉండదు అనేది నిర్మాతలు ఇస్తున్న క్లారిటీ. ప్రస్తుతం బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ‘పెద్ది’ సినిమా చేస్తున్న చరణ్‌తో తమ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌ ఉంటుందని మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు తెలియజేస్తున్నారు. ‘పుష్ప3’ కంటే ముందే చరణ్‌తో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. 2018లో చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి సంస్థ నిర్మించిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే.    ‘పెద్ది’ షూటింగ్‌ పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది మే నెలలో చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో ఈ భారీ చిత్రం స్టార్ట్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ వార్త మెగాభిమానులకు సంతోషాన్ని కలిగించేదే. కానీ, బన్నీ అభిమానులు మాత్రం ‘పుష్ప3’ ప్రాజెక్ట్‌ ఇప్పట్లో లేదని తెలిసి డిజప్పాయింట్‌ అవుతున్నారని తెలుస్తోంది. మరి చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రాబోయే సినిమా ఏ జోనర్‌లో ఉంటుంది అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. 
        షాక్ లో సినీ పెద్దలు  మరణానికి కారణం ఏంటి ఎన్ని సినిమాలు చేసారు     రచయితగా, దర్శకుడుగా, నటుడుగా,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా తనదైన శైలిలో రాణించారు శ్రీనివాసన్. మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన శ్రీనివాసన్(Sreenivasan)ఆయా రంగాల ద్వారా ఎంతో మంది అభిమానుల్ని కూడా సంపాదించి మలయాళ చిత్ర సీమలో చాలా ప్రభావంతమైన సినీ పర్సనాలిటీ గా  కీర్తింపబడ్డాడు. అగ్ర నటులైన మోహన్ లాల్, మమ్ముట్టి నుంచి వచ్చిన చాలా చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకుని ఆ ఇద్దరికి ధీటైన పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించి మెస్మరైజ్ చేసాడు. శ్రీనివాసన్ కొంత కాలం నుంచి  అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కొచ్చి లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. చివరకి పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు.     1956 వ సంవత్సరంలో కన్నూరు జిల్లాలోని పట్టియోమ్ లో జన్మించిన శ్రీనివాసన్ 1976 వచ్చిన 'మణిముజుక్కం' అనే మూవీతో నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్నేహ యమున, ఓదరుతమ్మవా అలరియం , సన్మనస్సుల్లవర్క్కు సమాధానం, గాంధీనగర్ 2వ వీధి, నాడోడికట్టు , పట్టనప్రవేశం, వరవేల్పు, తాళయాన మంత్రం, సందేస్. మజాయేతుమ్ మున్పే , అజకియా రావణన్ ,ఒరు మరవత్తూర్ కనవు , ఉదయనను తరం, కథా పరయుంపోల్, నాన్ ప్రకాశన్ వంటి పలు చిత్రాలు ఆయన నుంచి వచ్చాయి.ఉత్తమ స్క్రీన్ ప్లే క్యాటగిరిలో  ఆరు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులుతో  పాటు జాతీయ చలనచిత్ర అవార్డు , రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్ మరియు కూడా అందుకున్నాడు . వడక్కునోకియంత్రం,చింతవిష్టాయ శ్యామల అనే చిత్రాలకి  దర్శకత్వం వహించాడు.     also read:  ధురంధర్ పై వర్మ కీలక వ్యాఖ్యలు.. చిన్న సూట్ కేసుతో ముంబై వెళ్ళింది ఎవరు!      మోహన్ లాల్, మమ్మూటీ తో సహా మలయాళ చిత్ర సీమ యావత్తు శ్రీనివాసన్ మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియచేసింది.శ్రీనివాసన్ కుమారుడు ధ్యాన్ శ్రీనివాసన్ మలయాళ రంగంలో హీరోగా తన సత్తా చాటుతూ వస్తున్నాడు. శ్రీనివాసన్ ఈ ఏడాది ఫిబ్రవరి లో ధ్యాన్ శ్రీనివాసన్ హీరోగానే వచ్చిన 'ఆప్ కైసోహో' అనే చిత్రంలో ముఖ్య పాత్ర పోషించి మెప్పించాడు. చివరిగా నాన్సీ రాణి లో కనిపించాడు.  సుమారు 220 చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.  
కొరియోగ్రాఫర్‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్న జానీ మాస్టర్‌పై 2024 సెప్టెంబర్‌ 11న లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం తెలిసిందే. అతని దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మైనర్‌ బాలిక.. తనను లైంగికంగా వేధించాడంటూ కేసు నమోదు చేయడంతో టాలీవుడ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడిరది. అయితే 2019లో ఇది జరిగింది. చాలా ఆలస్యంగా ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది బాధితురాలు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు జానీమాస్టర్‌పై ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేశారు. 36 రోజులు జైలులో ఉన్న జానీ.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇప్పుడు కేసు విచారణలో ఉంది. తాజాగా ఈ కేసులో బాధితురాలు టీఎఫ్‌టీడీడీఏ(TFTDDA) ప్రెసిడెంట్‌ వి.వి. సుమలతాదేవిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను వేధింపులకు గురిచేసిన జానీ మాస్టర్‌ను కాపాడేందుకు సుమలత ప్రయత్నిస్తున్నారని సోషల్‌ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. పోక్సో(POCSO) చట్టం కింద విచారణ ఎదుర్కొంటున్న నిందితుడ్ని కేసు నుంచి తప్పించేందుకు ఒక బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ప్రయత్నించడం ఎంతవరకు కరెక్ట్‌ అని బాధితురాలు ప్రశ్నిస్తోంది.  ‘ప్రస్తుతం నేను పనిచేస్తున్న ప్రదేశంలో సురక్షితంగా ఉన్నానా, ఒక నేరస్తుడ్ని కాపాడేందుకు నాపై ఇలాంటి ఆరోపణలు చేయడం అవసరమా?’ అని సోషల్‌ మీడియాలో చేసిన పోస్టులో బాధితురాలు ప్రశ్నించింది. ఈ పోస్టుకు సంబంధించిన వీడియోలు, స్క్రీన్‌ షాట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్ట్‌ అయి, కొన్నాళ్లు జైలులో ఉండి వచ్చిన జానీ మాస్టర్‌ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. తాజాగా బాధితురాలు చేసిన ఆరోపణలు మరోసారి ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. 
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది. అంతే కాదు.. ప్రేమ లేని బంధాలు ఎక్కువ కాలం నిలబడవు కూడా. ఇద్దరు వ్యక్తులను అన్ని పరిస్థితులలో నిలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  అయితే బార్యాభర్తల బందంలో చాలా మంది ప్రేమ లేదని అంటూ ఉంటారు.  కొందరేమో ప్రేమ లేకపోయినా కేవలం బందం కోసం ఒక యంత్రంలా బ్రతికేస్తుంటారు. అలా ఉన్న బంధాలలో జీవం ఉండదు. భార్యాభర్తల బందంలో ప్రేమ ఉన్నప్పుడు అది చాలా కాలం ఎంతో అన్యోన్యంగా ఉండేలా చేస్తుంది. అయితే భార్యాభర్తల బందాన్ని బలంగా ఉంచే చిట్కాలు కొన్ని ఉన్నాయి.  ఇవి ఇద్దరి మధ్య ప్రేమను పెంచి ఇద్దరిని మరింత దగ్గర చేస్తాయి.  ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..  నిజాయితీగా ఉండాలి.. నిజాయితీ అనేది సంబంధానికి బలమైన పునాది. చిన్న విషయాలకు కూడా అబద్ధం చెప్పడం వల్ల సంబంధం దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పుడూ నిజం చెప్పాలి.   లైప్ పార్ట్నర్ ఫీలింగ్స్ ను కూడా గౌరవించాలి.  నిజాయితీ నమ్మకాన్ని పెంచుతుంది,  ప్రేమను మరింత పెంచుతుంది. ప్రేమ.. మాటల్లో కాదు చేతల్లో.. చాలామంది మాటల్లో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి అదే నిజమైన ప్రేమ అనుకుంటారు. కానీ నిజమైన ప్రేమ అనేది చేతల్లో చూపించాలి. ఒకరికొకరు సమయం కేటాయించడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం,  చిన్న చిన్న విషయాలలో కూడా కేరింగ్ గా ఉండటం వంటివి ఇద్దరి మధ్య ప్రేమను బలపరుస్తుంది. చిన్న సంతోషాలు.. ప్రేమను, సంతోషాన్ని పంచుకోవడానికి పెద్ద పెద్ద విజయాలు, పెద్ద సమయాలు,  పెద్ద ప్లానింగ్ లు అవసరం లేదు.  చిన్న చిన్న సందర్భాలను కూడా ఇద్దరూ కలిసి సంతోషంగా ఎంజాయ్ చేయవచ్చు. అభిరుచులను షేర్ చేసుకోవడం,  చిన్న సర్‌ప్రైజ్ లు, చిన్న బహుమతులు లాంటివి ఇద్దరి మధ్య బంధాన్ని బలంగా మారుస్తాయి. కమ్యూనికేషన్.. నేటి కాలంలో సంబంధాలలో కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే చాలా పెద్ద గొడవలకు కారణం అవుతోంది.   ఆనందాలు, బాధలు, సమస్యలు,  సంతోషకరమైన విషయాలను  ఒకరితో ఒకరు పంచుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏ విషయాన్ని అయినా ఆరో్గ్యకరంగా డిస్కస్ చేసుకున్నప్పుడు ఇద్దరి మధ్య మంచి బంధం ఉంటుంది. ఇగో.. బందాలను దెబ్బ తీసే అతిపెద్ద శత్రువు ఇగో..  చిన్న కోపతాపాలు లేదా కోపంలో మాట్లాడే మాటలు కూడా సంబంధాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి క్షమించడం నేర్చుకోవాలి. భార్యాభర్తలు ఏ గొడవలు జరిగినా ఇద్దరూ ఒకరినొకరు క్షమించడం నేర్చుకున్నప్పుడే బంధం నిలబడుతుంది.  ఇగోను పక్కన పెట్టినప్పుడే ఇద్దరూ సంతోషంగా ఉండగలుగుతారు.                                                 *రూపశ్రీ.
మన జీవితంలో మనకు తెలియకుండానే చాలా తప్పులు చేస్తాం. కానీ ఆ తప్పుల వల్ల మనం డబ్బు పోగొట్టుకుంటాం. చాణక్యుడి ప్రకారం, కొన్ని తప్పులు ధనవంతులను కూడా పేదలుగా మారుస్తాయి. ఆ తప్పులేంటో చూద్దాం. ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేయడంలో అతని పాత్ర గొప్పది. చాణక్యుడి ఈ తత్వశాస్త్రం మన జీవితంలో చాలా ముఖ్యమైనది.ఆచార్య చాణక్యుడు రచించిన నీతిశాస్త్రంలో జీవితం, డబ్బు, సమాజం, సంబంధాలు, వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆలోచనలు ఇచ్చారు. ఆయన సూత్రాలను పాటిస్తూ జీవనం సాగిస్తే విజయం వరిస్తుంది.అలాగే, చాణక్యుడు ప్రకారం, జీవితంలో మనం చేసే తప్పులు డబ్బు నష్టానికి,  బాధకు దారితీస్తాయి. అదేవిధంగా మన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతాయి. ప్రధానంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బును కుటుంబ పోషణ,  ఇతరుల సంక్షేమం కోసం ఉపయోగించాలి.  మిగిలిన డబ్బును పెట్టుబడి పెట్టాలి.మీరు సంపాదించిన డబ్బును జూదం, బెట్టింగ్ మొదలైన వాటిపై ఎప్పుడూ వృధా చేయకండి. ఆనందం కోసం డబ్బును దుర్వినియోగం చేయడం సమీప భవిష్యత్తులో మిమ్మల్ని మరింత సమస్యగా మార్చే అవకాశం ఉంది.డబ్బు ఎప్పుడూ ఇతరుల మంచికే ఉపయోగించాలి. ఇతరులకు హాని కలిగించడానికి ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇది లక్ష్మీ దేవికి కోపం తెప్పిస్తుంది. తద్వారా మనం డబ్బును కోల్పోవచ్చు.మరీ ముఖ్యంగా డబ్బు ఆదా చేసే అలవాటు ఉండాలి. ఎంత డబ్బు వచ్చినా ఖర్చు పెట్టకూడదు. మనం వీలైనంత తక్కువ డబ్బు ఖర్చు చేయాలి. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.
  పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట మధ్య కొన్ని గొడవలు కామన్ గా జరుగుతాయని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు.పెళ్లయ్యాక ప్రతి జంట మధ్య జరిగే కామన్ గొడవలు ఏంటో తెలుసుకుంటే.. ఇవి అందరి మధ్యన జరుగుతాయి కాబట్టి వీటిని సీరియస్ గా తీసుకుని బంధాన్ని విచ్చిన్నం చేసుకోకూడదు అని ప్రతి జంట అర్థం చేసుకోగలుగుతుంది.  ఇంతకీ అందరు భార్యాభర్తల మధ్య కామన్ గా జరిగే గొడవలు ఏంటో తెలుసుకుంటే.. తల్లిదండ్రుల శైలి.. భార్యాభర్తల ఇద్దరి తల్లిదండ్రులు ఒకరి కుటుంబ విధానాన్ని మరొకరు విమర్శించుకోవడం చాలా కుటుంబాలలో కనిపిస్తుంది. ఒకరేమో చాలా నిర్లక్ష్యంగా పెంచారు అనే నిందలు వేస్తుంటారు, మరొకరు ఏమో ఏమీ చేత కాకుండా పెంచారని అంటారు, కొన్నిసార్లు చాలా స్ట్రిక్ట్ గా పెంచి పిరికివాళ్లుగా మార్చారని అంటారు.  ఇలా రెండు కుటుంబాలలో విబిన్న విధాలుగా పెంపకం ఉంటుంది.  పెళ్లైన తర్వాత వారికి చిన్నతనం నుండి అలవాటైన విధానం ఇప్పుడు కూడా కొనసాగాలని కోరుకుంటారు.   అంతేకాదు.. తమ చిన్నతనం ఎలా గడిచిందో అదే విధంగా తమ పిల్లలను కూడా పెంచాలని చూస్తారు. ఇది ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో సాగే గొడవ.  దీన్ని వీలైనంత చాకచక్యంగా పరిష్కరించుకోవాలి. డబ్బు.. డబ్బు చాలా ముఖ్యమైన అంశం.  కొన్ని కుటుంబాలు డబ్బుల విషయంలో చాలా ఆంక్షలు విధిస్తూ పెంచుతారు. మరికొన్ని కుటుంబాలు డబ్బు అనేది పిల్లల కోసమే కదా అనే ఆలోచనతో పిల్లలకు డబ్బు అలవాటు చేస్తారు, డబ్బు వల్ల వచ్చే సమస్యలు కొన్నిసార్లు చాలా తీవ్రమైన గొడవలకు కారణం అవుతాయి. భార్యాభర్తల అభిరుచులు డబ్బు విషయంలో ఒకటిగా ఉంటే పర్లేదు. కానీ ఒకరు పొదుపరి,  మరొకరు బాగా ఖర్చు పెట్టేవారు అయితే చాలా గొడవలు వస్తుంటాయి.  ముఖ్యంగా ఎప్పడైనా డబ్బు కారణంగా ఇంట్లో  ఆర్థిక సమస్యలు వస్తే జరిగే గొడవలు చాలా పెద్దగా ఉంటాయి. సాన్నిహిత్యం.. భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే వారి మధ్య సాన్నిహిత్యం కూడా చాలా బాగుండాలి. ఒకరు తమ ప్రేమను ఎక్స్పెస్ చేయగలిగితే మరొకరు అలా ప్రేమను ఎక్ప్రెస్ చేయకుండా తమలోనే దాచుకుంటారు.  దీని వల్ల ఒకరి మీద ఒకరికి విబిన్న అభిప్రాయాలు ఏర్పడతాయి.  ప్రేమించడం తెలియదు, ప్రేమ లేదు,  ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్నారు వంటి అపార్థాలు వస్తాయి.  ఎప్పుడు ప్రేమ గురించి తప్ప బాధ్యతగా ఉంటున్నానని ఆలోచించట్లేదు అని మరొకరు అనుకుంటారు. ఇలా చాలా విధాలుగా అపార్థాలు వస్తుంటాయి. భవిష్యత్తు.. పెళ్లైన ప్రతి జంటకు భవిష్యత్తు గురించి కొన్ని కలలు ఉంటాయి. పిల్లల కోసం ఒకరు కష్టపడతారు, మరొకరు కెరీర్ ను కూడా వదిలేసుకుంటారు.  జీవితంలో లక్ష్యాల కోసం ఒకరు ఆరాటపడతారు,  నేను ఎన్ని త్యాగాలు చేసినా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఒకరు అనుకుంటారు.  ఇలా చాలా విధాలుగా ఇద్దరూ తమలో తాము సంఘర్షణ పడుతుంటారు.  వీటి వల్ల కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. పైన పేర్కొన్న  ప్రతి గొడవ పెళ్లైన ప్రతి జంట మధ్య తప్పనిసరిగా జరుగుతుంది.  కేవలం తమ మద్య మాత్రమే గొడవ జరుగుతుందనే ఆలోచన చేస్తూ గొడవ జరిగినప్పుడు దానికి గల కారణాన్ని సమస్యగా చూసి దాన్ని పరిష్కరించుకోవాలి. అంతే కానీ భాగస్వామినే సమస్యగా చూస్తే ఆ బందం పెళుసుగా మారుతుంది.  అంతేకాదు.. భార్యాభర్తల మద్య గొడవలు జరిగినప్పుడు,  సమస్య వచ్చినప్పుడు రాజీ పడటం ప్రధానం.  ఎవరో ఒకరు రాజీ పడితే తప్ప బందం నిలవదు.  రాజీ పడటం అంటే తాము ఓడిపోవడం,  చిన్నతనం కావడం కాదు.. బంధాన్ని నిలబెట్టుకోవడం.                           *రూపశ్రీ. 
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు. అయినప్పటికీ వారి బీపి నార్మల్ గా కాకుండా ఎక్కువగా ఉంటుంది.  భారతదేశంలో ప్రతి ముగ్గురు వ్యక్తులలో ఒకరు హై బీపి తో బాధపడుతున్నారని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. అసలు ఆహారంతో తక్కువ ఉప్పు తీసుకున్నా బీపి ఎందుకు ఎక్కువ ఉంటుంది? అసలు శరీరంలో సోడియం పెరిగితే ఎందుకు ప్రమాదంగా మారుతుంది? ఆరోగ్య నిపుణులు  ఏం చెబుతున్నారు తెలుసుకుంటే.. ఉప్పు డేంజర్ ఇందుకే.. ఉప్పులోని సోడియం శరీరంలో నీటిని నిలుపుకుంటుంది. ఇది రక్త నాళాలలో ఒత్తిడిని పెంచుతుంది.  దీని కారణంగా గుండె కష్టపడి పనిచేయవలసి వస్తుంది. సోడియం ఎక్కువ కాలం శరీరంలో ఎక్కువగా ఉంటే రక్త నాళాలు దెబ్బతింటాయి.  గుండెపోటు, స్ట్రోక్, గుండె వైఫల్యం,  మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.  అన్నింటికంటే షాకింగ్ పాయింటే ఏంటంటే.. ఎక్కువ ఉప్పు తింటున్నాం అనే విషయం తెలియకుండానే శరీరంలోకి అధిక ఉప్పు వెళ్లిపోతుంది.  దీన్ని చాలామంది తెలియకుండానే చేస్తారు. బ్రెడ్, బన్.. బేకరీ.. రోజూ బ్రెడ్ లేదా బన్   వంటివి తినేవారు చాలామంది ఉంటారు.  ఇవి ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు.  మరీ ముఖ్యంగా చాలామంది మల్టిగ్రైన్ బ్రెడ్,  బ్రౌన్ బ్రెడ్ వంటివి ఆరోగ్యానికి చాలామంచివి అనుకుంటారు.  కానీ ఈ బ్రెడ్ లేదా బన్ లు  శరీరానికి చాలా సోడియంను అందిస్తాయి. అలాగే బేకరీలలో లభించే ప్రతి ఆహార పదార్థంలో చాలా సోడియం,  సుగర్ ఉంటాయి.  ఇవి మాత్రమే కాకుండా బయట ప్యాకెట్స్ లో లభించే స్నాక్స్, బిస్కెట్స్,  చిప్స్ వంటి ఆహారాలలో సోడియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇంట్లో వండే ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకున్నా,  బయటి ఆహారాల ద్వారా సోడియం ఎక్కువగా శరీరంలోకి వెళుతుంది. వీటిలో చాలా ఎక్కువ.. టొమాటో కెచప్, సోయా సాస్, చిల్లీ సాస్, శాండ్‌విచ్ స్ప్రెడ్‌లు,  ప్యాక్ చేసిన చట్నీలు,  ఏడాది పాటు నిల్వ ఉంచే భారతీయ సాంప్రదాయ పచ్చళ్లు..   వీటి షెల్ఫ్ లైఫ్‌ను పెంచడానికి ఉప్పు ఎక్కువ జోడి్స్తారు. వీటిని ఎంత తక్కువ మొత్తంలో తీసుకున్నా సరే.. శరీరంలోకి వెళ్లే సోడియం మాత్రం ఎక్కువగా  ఉంటుంది. అదేవిధంగా చిప్స్, భుజియా, సాల్టీ మిక్స్‌లు, క్రాకర్లు,  బేక్ చేసిన లేదా తేలికగా సాల్టెడ్ స్నాక్స్‌లో కూడా ఎక్కువ  మొత్తంలో ఉప్పు ఉంటుంది. ఇవి తిన్నప్పుడు ఉప్పు ఎక్కువ ఉన్నట్టు అనిపించవు. అందుకే తెలియకుండానే తినేస్తారు. చీజ్ ముక్కలు, చీజ్ స్ప్రెడ్‌లు,  ఫ్లేవర్డ్ బటర్ లో  కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తక్కువ మొత్తంలో తీసుకున్నా చాలు.. శరీరంలో సోడియం పెరుగుతుంది.   అది విదంగా రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో రుచి కోసం,  టెక్చర్ కోసం  కోసం ఎక్కువ ఉప్పును వాడతారు. నిమిషాలలో రెఢీ అయ్యే ఆహారాలలో కూడా ఉప్పు తో పాటు చాలా రకాల ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇవన్నీ కలిపి శరీరంలో సోడియం స్థాయిలను పెంచుతాయి.   కాబట్టి ఆహారంలో ఉప్పు అంటే కేవలం ఇంట్లో వండే ఆహారం గురించే కాదు.. బయట నుండి తీసుకునే ఆహారం గురించి కూడా ఆలోచించాలి. వీటితో జాగ్రత్తగా ఉంటే సోడియం స్థాయిలు కూడా తగ్గి బీపి తగ్గుముఖం పడుతుంది.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు, ప్రోటీన్ ఉంటాయి. వీటిని పేదవారి బాదం అని అంటారంటే వీటిలో ఎన్ని పోషకాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.  అయితే అతి సర్వత్ర వర్జయేత్ అనే మాటకు తగ్గట్టు పల్లీలు అయినా సరే.. ఎక్కువగా తినడం చాలా చెడ్డదని ఆహార నిపుణులు అంటున్నారు. రుచిగా ఉంటాయి కదా అని పల్లీలను అతిగా తింటే.. ఆరోగ్యానికి మేలు చేయకపోగా చేటు చేస్తాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా పల్లీలు అంటే తెగ ఇష్టపడేవారు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి.  పల్లీలను ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుంటే.. బరువు.. పల్లీలు అతిగా తింటే బరువు కూడా అతిగా పెరుగుతారట.  పల్లీలలో కేలరీలు, కొవ్వులు అధికంగా ఉంటాయి.  100గ్రాముల పల్లీలలో దాదాపు 567కేలరీలు ఉంటాయట.  ఎక్కువగా పల్లీలు తింటూ ఉంటే కేలరీలు కూడా పెరిగి బరువు పెరగడం కూడా వేగంగా జరుగుతుందట. జీర్ణ సమస్యలు.. పల్లీలు వేడి కలిగించే గుణం కలిగి ఉంటాయి. వీటిలో ఫైటేట్ లు ఉంటాయి.  పల్లీలు ఎక్కువగా తింటే ఉబ్బరం,  గ్యాస్,  కడుపులో యాసిడ్ ఫీలింగ్,  గుండెల్లో మంట వంటివి పెరుగుతాయి. పోషకాలు.. వేరుశనగలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే పోషకాల శోషణకు ఆటంకం కూడా కలుగుతుంది. ముఖ్యంగా వీటిలో పైటిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది.  దీన వల్ల శరీరంలో ఐరన్,  జింక్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎన్ని తినాలి.. ఆరోగ్య నిపుణులు,  ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు ఒక గుప్పెడు పల్లీలు తినడం మంచిది.  అంతకంటే ఎక్కువ తినడం వల్ల పైన చెప్పుకున్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు.  మానసికంగా బలంగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే ఆఫీసు ఒత్తిడులు,  జీవిత సమస్యలు, లక్ష్యాలు చేరుకోవడంలో పడే సంఘర్షణ.. ఇలా ఒకటేమిటి.. చాలా విషయాలు మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.  కానీ కొన్ని సాధారణ అలవాట్లు మానసిక ఆరోగ్యానికి శ్రీరామ రక్షలా పనిచేస్తాయి.  ఇంతకీ ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. కృతజ్ఞత.. కృతజ్ఞత భావం మనిషిని చాలా స్వచ్చంగా ఉంచుతుంది.  ప్రతి వ్యక్తి మొదటగా గడిచే ప్రతి రోజు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి.  రోజు తన జీవితంలో జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకోవాలి.  ఇలా చేస్తే చాలా పాజిటివ్ మైండ్ సెట్ అలవాటు అవుతుంది. ఇది మానసికంగా బలంగా ఉండటానికి సహాయపడుతుంది. వ్యాయామం.. శరీరంలో ఒత్తిడి హార్మోన్ తగ్గడానికి వ్యాయామం మంచి మార్గం.  ప్రతి రోజూ 20 నుండి 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి.  ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. శ్వాస వ్యాయామం.. శారీరక వ్యాయామమే కాకుండా మానసికంగా దృఢంగా ఉండటానికి శ్వాస వ్యాయామాలు కూడా చాలా బాగా సహాయపడతాయి. రోజూ కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది.  ఒత్తిడి కూడా తగ్గుతుంది. శ్రద్ద.. ఏ పని మీద అయినా దృష్టి పెట్టడాన్నే మైండ్ ఫుల్ నెస్ అని అంటున్నారు.  ఇంటి పని చేసినా,  వ్యాయామం చేసినా, ఆహారం తీసుకున్నా, ఆఫీసు పని చేసినా.. ఇలా ప్రతి పని చేసినప్పుడు ఆ పని మీద పూర్తిగా మనసు లగ్నం చేయాలి. ఇందుకోసం ధ్యానం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మెయింటైన్ స్కిల్స్ మెరుగవుతాయి. ప్రకృతి.. మనిషిలో ఒత్తిడిని తగ్గించే సూపర్ మెడిసిన్ ఏదైనా ఉందంటే అది ప్రకృతి.  తాజా గాలిలో,  సూర్యరశ్మిలో సమయం గడపడం,  మొక్కలు,  చెట్లు,  పక్షులు,  జంతువుల సమక్షంలో సమయాన్ని గడపడం వల్ల ఒత్తిడి తగ్గి మానసికంగా దృఢంగా మారతారు. మనసు విప్పడం.. ఎలాంటి విషయాలు అయినా కొందరితోనే మనసు విప్పి మాట్లాడగలుగుతారు.  వారిలో స్నేహితులు,  బంధువులు,  ఆత్మీయులు ఇట్లా చాలా ఉంటారు. అయితే ఎవరి దగ్గర ఏదైనా చెప్పుకోగల చనువు ఉంటుందో వారితో ఓపెన్ గా మాట్లాడాలి. దీనివల్ల చాలా విషయాలలో మంచి సలహాలు దొరకడమే కాకుండా క్లిష్ట పరిస్థితులలో మంచి సపోర్ట్ కూడా దొరుకుతుంది. బంధాలు.. స్నేహం అయినా, ప్రేమ అయినా,  వైవాహిక బంధం అయినా, కొలీగ్స్ తో పరిచయం అయినా.. వారితో ఉండే రిలేషన్ పదే పదే తెగిపోతూ ఉంటే అది మానసిక సమస్యలకు దారి తీస్తుంది.  అందుకే బంధాలను కాపాడుకోవాలి.  ఎక్కువకాలం బంధాలు నిలిచి ఉండేలా చూసుకోవాలి. ఎమోషనల్ గా బంధాలతో కనెక్ట్ అయి ఉండాలి. నచ్చిన పని.. మానసికంగా బాగుండాలంటే అన్నింటి కంటే ముఖ్యమైనది నచ్చిన పని చేయడం. చాలా వరకు ఇతరుల సలహాలు,  ఇతరుల కమాండింగ్ మీద చాలా మంది పని చేస్తూ ఉంటారు. కానీ నచ్చిన పని చేయడంలో చాలా తృప్తి ఉంటుంది. ఇది మానసికంగా బలంగా ఉంచుతుంది. ఆత్మ విమర్శ.. ప్రతి రోజూ పడుకునే ముందు ఉదయం నుండి జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకోవాలి.  ముఖ్యంగా మంచి విషయాలను గుర్తు చేసుకోవడం వల్ల చాలా పాజిటివ్ మైండ్ అలవాటు అవుతుంది. పాజిటివ్ మైండ్ ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని కూడా బలంగా ఉంచుతుంది.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...