LATEST NEWS
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిచాణా ఎత్తేసే సూచనలు కనిపించడంతో ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రూటు మార్చాడు.  దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం వ్యూహం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితంలో చోటు చేసుకొన్న సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.  ఏపీ రాజకీయాలపై తెరకెక్కించిన చిత్రమిది.వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత  తనయుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన పరిణామాలపై చిత్రం నిర్మించారు. పూర్తి అవాస్తవాలతో తెరకెక్కిన చిత్రం ఇది. .  జగన్ పెట్టుబడితో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించలేదు. తాజాగా ఎపిలో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని తేలిపోయింది. త్రికూటమి ప్రభుత్వం అధికారంలో వస్తుందన్న వార్తలు వస్తున్నాయి.  ఎలాంటి నైతిక విలువలు లేని రాంగోపాల్ వర్మ  డైరక్టర్ల అసోసియేషన్ అంటూ  ఈ కొత్త డ్రామాకు తెరతీశాడు.  కొంత మందితో కల్సి  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లారు. పబ్లిసిటీ  పిచ్చిబాగా ఉన్న రాంగోపాల్ వర్మ రేవంత్ రెడ్డితో ఫోటో దిగి దాన్ని అన్ని మీడియాల్లో వచ్చేలా  చూసుకున్నారు. గతంలో  డైరక్టర్ల అసోసియేషన్ కార్యక్రమాల్లో కనిపించని వర్మ సడెన్ గా ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశమైంది.  డైరెక్టర్ల అసోసియేషన్ నుంచి వచ్చి  ఎవరైనా కలిస్తే కించ పరిచేవారు. మరి అలాంటిది ఎందుకు ఆర్జీవీ డైరక్టర్ల అసోసియేషన్ పేరుతో రేవంత్ వద్దకు ఎందుకు వెళ్లారు ?   ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న టెన్షన్ ఆర్జీవీలో పెరిగిపోయిందని తెలుస్తోంది. 
పల్నాటి పౌరుషం గురించి మనం కథలు కథలుగా విని వుంటాం. పలనాటి వీర చరిత్రలో బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ, బాలచంద్రుడి పౌరుషం గురించి తెలుసుకుని పులకరించిపోయి వుంటాం. ‘పల్నాటి యుద్ధం’, ‘పల్నాటి పౌరుషం’ సినిమాలు చూసి మన తెలుగువారికి ఇంత గొప్ప చరిత్ర వుందని హ్యాపీగా ఫీలై వుంటాం. తెలుగువారందరి మనసులలో ‘పల్నాడు’ అనే మాట వింటేనే పౌరుషంతో పిడికిళ్ళు బిగుసుకునే ఒక ఫీల్....! ఆ ఫీల్ ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది.. అంతటి పౌరుషం గడ్డ మీద పుట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అరెస్టు అయిపోతామనే భయంతో పిల్లిలాగా గోడ దూకి హైదరాబాద్ పారిపోయారన్న విషయం తెలుసుకుని, వీళ్ళిద్దరి విషయంలో ‘పల్నాటి పౌరుషం’ అనే మాటని పక్కన పెట్టి... ‘పల్నాటి పిరికితనం’ అనే మాటని ఉపయోగించాలని అనిపించడం న్యాయమే. ఈ బ్రదర్స్ ఇద్దరూ పోలింగ్ సందర్భంగా ఎన్ని దారుణాలు చేయాలో అన్ని దారుణాలూ చేశారు. రౌడీ మూకల సహకారంతో రక్తాన్ని పారించారు. ఎదుటి వారి మీద దాడి చేయడం పౌరుషం అవదు.. పిరికితనం అవుతుంది. పోలింగ్ సందర్భంగా వీరిద్దరూ భారీ స్థాయిలో పిరికితనం ప్రదర్శించారు. వీరి నేరాలు, ఘోరాలు బయటపడి హౌస్ అరెస్ట్ అయ్యారు. చివరికి అరెస్టు అయి జైల్లో పడే అవకాశం వుందని తెలుసుకుని, ఇంటి వెనుక గోడదూకి హైదరాబాద్‌కి పారిపోయారు. వీళ్ళిద్దరూ పిరికివాళ్ళని తెలుస్తుందిగానీ, మరీ ఇంత పిరికివాళ్ళని ఎవరూ అనుకోలేదు. వీళ్ళిద్దరి ఇంటి పేరు ‘పిన్నెల్లి’ అని కాకుండా ‘పిల్లి’ అని మార్చుకోవడం మంచిది. ఇలాంటి పిరికి పిల్లులు పల్నాటి గడ్డ మీద భవిష్యత్తులో పుడతారని తెలిసుంటే బ్రహ్మనాయుడు, నాగమ్మ, బాలచంద్రుడు ఈ ప్రాంతం వదిలి పారిపోయి వుండేవారు.. వీళ్ళ నాయకుడు జగన్ ఓడిపోతానని భయపడిపోయి లండన్ పారిపోయారు. వీళ్ళిద్దరూ అరెస్టు అవుతామని భయపడి హైదరాబాద్ పారిపోయారు. వీళ్ళిద్దరూ తిరిగి పల్నాడులో అడుగు పెట్టకుండా వుంటే ఆ ప్రాంతానికి గౌరవం. ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ‘పల్నాటి పిల్లి’ అనే బిరుదును, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి ‘పల్నాటి పిల్ల పిల్లి’ అనే బిరుదులు ప్రదానం చేయడమైనది.
ఏపీలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పల్నాడులో  ఎన్నికల అనంతరం కూడా కొనసాగుతున్న హింసాకాండ దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. కేంద్ర ఎన్నికల సంఘం పల్నాడు హింసాకాండపై చాలా సీరియస్ అయ్యింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీ పిలిపించుకుని మరీ వివరణ కోరింది. వారిచ్చిన నివేదిక ఆధారంగా పలువురు ఎస్పీలు, పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంది. పల్నాడు కలెక్టర్ పై కూడా బదిలీ వేటు వేసింది. అంతటితో ఆగకుండా  ఏపీలో అల్లర్లపై ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం 13 మంది సభ్యులతో   స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ (సిట్) ఏర్పాటు చేసింది.  నేరుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కొందరు పోలీసులు తమ పై అధికారుల సూచనలు, ఆదేశాలు కూడా ఖాతరు చేయకుండా అల్లర్లను ప్రేరేపించే విధంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సిట్ నివేదిక పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.  అధికార పార్టీతో అంటకాగుతున్న కొందరు పోలీసులు వైసీపీ మూకలు చెలరేగిపోవడానికి పరోక్షంగా కారణమయ్యారన్న అనుమానాలూ ఉన్నాయి.  పోలింగ్ అనంతరం పల్నాడు జిల్లాలో జరిగిన హింస, ప్రతిపక్షాలపై దాడుల వెనుక  జగన్ అనుకూల పోలీసు అధికారుల పాత్ర ఉందన్న చర్చ పోలీసు అధికారుల్లోనే జోరుగా సాగుతోంది. ఆ అధికారులు ఎన్నికల విధుల్లో లేరనీ, కానీ తమ పలుకుబడిని ఉపయోగించి కింది స్థాయి పోలీసు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించేలా చేశారని అంటున్నారు.     ఇక సరిగ్గా ఎన్నికలకు రోజుల ముందు రాష్ట్రానికి కొత్త డీజీపీగా వచ్చిన హరీష్ కుమార్ గుప్తా పూర్తి క్రియారహితంగా వ్యవహరించారనీ, ఆయన సీఎస్ ఆదేశాల మేరకే పని చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి తన వైసీపీ అనుకూల వైఖరితో ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూల వాతావరణం ఏర్పడేలా చేశారని తెలుగుదేశం కూటమి విమర్శలు గుప్పిస్తోంది. ఇక తాజాగా ఏర్పాటైన సిట్ నివేదిక ఆధారంగా సీఎస్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని కొందరు అంటుంటే.. సిట్ పై తెలుగుదేశం కూటమి సభ్యులు మాత్రం పెదవి విరుస్తున్నారు. 13 మంది సిట్ బృందంలో అత్యధికులు ఏసీబీ నుంచే ఉన్నారనీ ఇటీవలే ఎన్నికల విధుల నుంచి ఉద్వాసనకు గురైన మాజీ డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డి ఏసీబీ చీఫ్ గా ఉన్నారని కూటమి నేతలు అంటున్నారు. ఎన్నికల విధుల్లో లేని నిజాయితీ పరులైన పలువురు   పోలీసు అధికారులు ఉండగా సిట్ లో ఏసీబీ అధికారులకే ప్రాథాన్యత ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు.  
యూకే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజు పోటీ చేయబోతున్నారు. లేబర్ పార్టీ తరపున ఆయన బరిలో నిలవనున్నారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ ఎంపీ అభ్యర్థిగా నాగరాజును లేబర్ పార్టీ ప్రకటించింది. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది.  నాగరాజుది కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామం. ఆయన తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మలాదేవి. చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం కలిగిన నాగరాజు ప్రఖ్యాత యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ లో పాలనాశాస్త్రంలో పీజీ చేశారు. భవిష్యత్ తరాలపై ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని ముందుగానే పసికట్టిన నాగరాజు... ఏఐ పాలసీ ల్యాబ్స్ అనే థింక్ ట్యాంక్ ను నెలకొల్పారు. అంతర్జాతీయ స్థాయి వక్తగా, రచయితగా ఆయనకు మంచి పేరు ఉంది. దశాబ్దకాలంగా రాజకీయ ప్రచారకుడిగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారంలో పాల్గొంటూ సామాన్యుల కష్టాలపై మంచి అవగాహన సాధించారు. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధిస్తుందని సర్వేలు చెపుతున్నాయి. నాగరాజు కూడా గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు బ్రిటన్ లోనూ ఎన్నికల హడావిడి జోరందుకుంది. భారత దేశంలో ఇప్పటికే ఎన్నికలు జరుగుతుండగా ఈ సంవత్సరంలోనే బ్రిటన్, అమెరికాలో ఎన్నికలు జరుగనున్నాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ - పాలస్తీనా సంఘర్షణ, పప్రంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో బ్రిటన్ , అమెరికా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.   
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హడావుడి ముగిసీముగియగానే పాలనపై దృష్టి పెట్టారు. శనివారం ఆయన అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ముఖ్యంగా  రుణమాఫీకి నిధుల సమీకరణ విషయంపై చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. అంతే కాకుండా కేబినెట్ విస్తరణపై కూడా రేవంత్ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. తొలి నుంచీ కూడా లోక్ సభ ఎన్నికల తరువాత కేబినెట్ విస్తరణ చేపడతానని రేవంత్ చెబుతున్న సంగతి తెలిసిందే.  రేవంత్ కేబినెట్ లో ఆయనతో సహా 12 మంది ఉన్నారు. మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను బేరీజు వేసుకుని వాటిని భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లలకు ప్రాతినిథ్యం లేదు.  ఈ నేపథ్యంలోనే  కేబినెట్ విస్తరణలో రేవంత్ ఈ జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.   కేబినెట్ విస్తరణపై కూడా  మంత్రవర్గ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.    బీసీ, ముదిరాజ్‌‌, మైనార్టీ వర్గాలకు  ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే రేవంత్ కేబినెట్ లో  నల్లగొండ, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల నుంచి ఇద్దరు  మంత్రులుండగా ఖమ్మం నుంచి ఏకంగా ముగ్గురు  ఉన్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి అయితే  సీఎంతో పాటు మరొక మంత్రి ఉన్నారు. మెదక్ జిల్లా నుంచి ఒక మినిస్టర్ ఉన్నారు.  ఒక సామాజికవర్గాల వారీగా చూస్తే రేవంత్ కేబినెట్ లో   ఏడుగురు ఓసీ, ఇద్దరు బీసీ, ఇద్దరు ఎస్సీ, ఒకరు ఎస్టీ ఉన్నారు.   మొత్తంగా కేబినెట్ భేటీలో మంత్రివర్గ విస్తరణతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ప్రధానంగా వచ్చే జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా  ఇరు రాష్ట్రాల మధ్యా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న  అంశాలపైనా,   ఆగస్టు 15 లోగా చేయాల్సిన రుణమాఫీకి నిధుల సమీకరణపైనా కేబినెట్ సమావేశం విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.  అలాగే అకాలవర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంపైనా,   ఖరీఫ్ పంటల సాగు ప్రణాళికపైనా కూడా కేబినెట్ చర్చిస్తుందని అంటున్నారు.   
ALSO ON TELUGUONE N E W S
సీరియల్ నటుడు చందు నిన్న హైదరాబాద్ లో ఆత్మ హత్య చేసుకొని చనిపోయాడు. త్రినయని సీరియల్  నటి పవిత్ర  మరణాన్ని తట్టుకోలేకే  ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో చందు భార్య చెప్పిన మాటలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి చందు భార్య పేరు శిల్ప. 2015 లో వారివురికి వివాహం జరిగింది. స్కూల్ డేస్ నుంచే వాళ్ళ మధ్య ప్రేమ మొదలయ్యింది. తొలుత చందునే శిల్ప ని ప్రేమించమని వెంటపడ్డాడు. ఆ తర్వాత శిల్ప కూడా చందు ప్రేమకి ఓకే చెప్పింది. అలా 12  సంవత్సరాలు ప్రేమించుకొని  పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరకీ ఒక బాబు పాప కూడా ఉన్నారు. కొన్నాళ్ల వరకు చక్కగానే సాగిన వాళ్ల కాపురంలో చనిపోయిన  పవిత్ర రాకతో కలతలు మొదలయ్యాయి. ఫలితంగా  నాలుగు సంవత్సరాల నుంచి  దూరంగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య మాటలు కూడ లేవు. కేవలం పిల్లలతోనే కాంటాక్ట్ లో ఉండే వాడు. కానీ ఏ రోజుకైనా మారి తన దగ్గరకి వస్తాడు అని శిల్ప  అనుకుంది. చనిపోయే ముందు కూడా చందు కి  ఫోన్ చేసి మాట్లాడింది. ఇంటికి రమ్మని బతిమాలింది కూడా. ఇప్పుడు శిల్ప చెప్పిన ఈ మాటలన్నీ హాట్ టాపిక్ గా నిలిచాయి కార్తీక దీపం, రాధమ్మ పెళ్లి, త్రినయని లాంటి సీరియల్స్ చందుకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. తాజాగా ప్రముఖ సినీ, టీవీ  నటి కరాటే కళ్యాణి తనకి  చందు కి మధ్య జరిగిన వాట్స్ అప్ చాట్ ని బయటపెట్టింది.నాకు ఇంక ఈ జన్మ చాలు. నేను చనిపోవడమే కరెక్ట్ అనే  చందు మెసేజ్ ఉంది   
తెలుగుతోపాటు పలు సౌతిండియన్‌ భాషల్లో సినిమాలతో, సీరియల్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న రాధిక కాలికి గాయం కావడంతో ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటూ విశ్రాంతి తీసుకుంటోంది. తమిళ్‌లో సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లో కూడా నటించారు రాధిక. అంతేకాదు, రాడాన్‌ పేరుతో ఓ సంస్థ స్థాపించి దాని ద్వారా ఎన్నో సీరియల్స్‌ నిర్మించారు. సినిమాల కంటే సీరియల్స్‌ ద్వారానే తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది రాధిక. ఇటీవల ఈమెను పరామర్శించేందుకు ప్రముఖ తమిళ నటుడు శివకుమార్‌ ఆమె నివాసానికి వెళ్లారు. తమిళ్‌ హీరోలు సూర్య, కార్తీ ఇద్దరూ శివకుమార్‌ తనయులేనన్న విషయం తెలిసిందే.  శివకుమార్‌ను అన్నయ్యగా భావించే రాధిక.. ఆయన తన ఇంటికి రావడంతో ఎంతో ఎమోషనల్‌ అయ్యారు. రాధిక తండ్రి ఎం.ఆర్‌.రాధ కూడా ప్రముఖ నటుడేనన్న విషయం తెలిసిందే. శివకుమార్‌కి సమకాలీనుడైన ఎం.ఆర్‌.రాధ కుమార్తె రాధిక అంటే శివకుమార్‌కి కూడా ఎంతో అభిమానం. ఈ ఇద్దరూ కలిసి ఎన్నో సీరియల్స్‌లో నటించారు. ఎక్కువగా అన్నాచెల్లెళ్ళ క్యారెక్టర్స్‌లోనే కలిసి నటించారు. దీంతో తనను కలిసేందుకు శివకుమార్‌ రావడంతో తన అన్న ఇంటికి వచ్చాడంటూ ట్వీట్‌ చేశారు రాధిక. ఆయన ఉన్న కాసేపు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, ఫోటో ఆల్బమ్స్‌ చూస్తూ గడిపారు. దీనికి సంబంధించి రాధిక వేసిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  
ఈషా రెబ్బా.. అచ్చ తెలుగు నటి .. అందానికి అందం, అంతే అందమైన నటనతో ప్రేక్షక హృదయాల్లో చాలా బలంగానే నాటుకుపోయింది. 2012 నుంచి సినిమాలు చేసుకుంటు వస్తుంది. సుమారు పద్దెనిమిది సినిమాల దాకా తన ఖాతాలో ఉన్నాయి.  ఈమె తాజాగా ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ అరవింద సమేత గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ కాంబో లో 2018 లో అరవింద సమేత వచ్చింది. ఎన్టీఆర్ నట విశ్వరూపానికి త్రివిక్రమ్ మ్యాజిక్ తోడవ్వడంతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో ఈషా నటించింది. హీరోయిన్ గా చేసిన పూజాహెగ్డే  చెల్లెలు సునంద క్యారక్టర్ ని పోషించింది. అంతగా ప్రాధాన్యత లేని ఆ క్యారక్టర్ లో తన వరకు బాగానే చేసింది. ఇప్పుడు ఆ విషయం మీదే ఒక ఇంటర్వ్యూ లో  మాట్లాడింది. అరవింద సమేత  లో యాక్ట్‌ చేసేందుకు తొలుత  ఆసక్తి చూపలేదు. కానీ కొన్ని కారణాల వల్ల ఓకే చెప్పాను. నాది  ప్రధాన పాత్రే  అని దర్శక నిర్మాతలు చెప్పారు. పైగా సినిమాలో సెకండ్ లీడ్ క్యారక్టర్ అని చెప్పారు.ఈ విషయాన్ని  రిలీజ్ కి ముందు అనౌన్స్ కూడా చేస్తామన్నారు.ఆ విధంగా జరిగి ఉంటే నా కెరీర్ కి అరవింద హెల్ప్ అయ్యి ఉండేది. పైగా నాతో తెరకెక్కించిన కొన్ని సీన్స్ కూడా కట్ చేసారు. ఎన్టీఆర్ కి నాకు ఒక సాంగ్ కూడా ఉంటుందని చెప్పారు. అది కూడా జరగలేదని చెప్పింది.అయితే వీటన్నింటికి  కారణమేంటో తనకు తెలియదని, ఈ రోజుకి  బాధ పడుతున్నాను. అయితే ఎన్టీఆర్‌తో  త్రివిక్రమ్‌ లతో  పని చేయడం మాత్రం ఆనందాన్ని ఇచ్చిందని చెప్పింది   ఇక ఈషా రెబ్బా తన పన్నెండేళ్ల కెరీర్ లో చేసిన మొట్టమొదటి పెద్ద సినిమా అరవింద సమేత నే. మూవీ కోసం  బైక్‌ రైడింగ్‌ కూడా నేర్చుకుంది. మూవీ  చూస్తున్నంత సేపు కూడా పూజా చెల్లెలుగా ఈషా చెయ్యడం ఏంటని అనిపిస్తుంది.ఎందుకంటే హీరోయిన్ గా అప్పుడప్పుడే సినిమాలు చేసుకుంటు వెళ్తుంది. ఏది ఏమైనా ఒప్పుకొని  చేసింది తనే.గత సంవత్సరం మామ మచ్చింద్ర తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరికొన్ని అప్ కమింగ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. వెబ్ సిరీస్ లోను తన సత్తా చాటుతు ముందుకు దూసుకెళ్తుంది. సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో టచ్ లో ఉంది  
నిన్నగాక మొన్న బుల్లితెర నటి పవిత్ర జయరామ్ రోడ్ ఆక్సిడెంట్ లో మరణించిన విషయం తెలిసిందే. పవిత్ర చనిపోయిన ఐదు రోజులకే తన ప్రియుడు, సీరియల్ నటుడు చంద్రకాంత్ అల్కాపూర్ కాలనీలో ఉన్న తన నివాసంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.  పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రకాంత్ కి  భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా ఆరేళ్లుగా త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్‌తో సహజీవనం చేస్తున్నాడు . ఆదివారం  తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో  పవిత్ర జయరామ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన కారులో చంద్రకాంత్  కూడా ఉన్నాడు. ఐతే అతను గాయాలతో బయటపడ్డాడు. కానీ పవిత్ర తన కళ్ల ముందే ప్రాణాలు వదలటాన్ని జీర్ణించుకోలేక మనోవేదనకు గురయ్యాడు. అప్పటినుంచి డిప్రెషన్ లోకి వెళ్లిన చంద్రకాంత్ ఆమె ఎడబాటును తట్టుకోలేకపోయాడు. రెండు రోజుల కిందట పవిత్ర పుట్టినరోజు కావడంతో చంద్రకాంత్ డిప్రెషన్‌ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ ఆమె జ్ఞాపకాలను ఇన్ స్టాలో పోస్ట్ చేసి బాధపడుతూనే ఉన్నాడు చంద్రకాంత్. ఇక ఈరోజు కూడా.. "గుడ్ మార్నింగ్ నాన్న.. ఇట్స్ టైమ్ ఫర్ జిమ్.. మన జిమ్ కోచ్ ఇప్పుడే కాల్ చేశాడు.. లవ్ యూ పాపా.." అంటూ చందు వరుస పోస్టులు పెడుతూ వస్తున్నాడు.  పవిత్ర చనిపోలేదని.. తమ మధ్యే ఉందని ఎమోషనల్ అయ్యాడు ఒక ఇంటర్వ్యూలో . ఐదారేళ్లుగా పవిత్ర, చంద్రకాంత్ కలిసే ఉంటున్నారు. అయితే.. తమ మధ్య ఉన్న ఈ బంధాన్ని త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేద్దామని ప్లాన్ చేసుకున్నామని.. ఐతే ఇంతలోనే ఇలా జరిగిందంటూ చంద్రకాంత్ భావోద్వేగానికి లోనయ్యాడు. 
  విజయ్ దేవరకొండ కి హిట్ లు ఎంత ఫాస్ట్ గా వచ్చాయో..ప్లాప్ లు కూడా అంతే ఫాస్ట్ గా వచ్చాయి. 2018 లో వచ్చిన గీత గోవిందం, టాక్సీ వాలా  తర్వాత నో హిట్స్. అంటే విజయ్ హిట్ కొట్టి సిక్స్ ఇయర్స్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో చాలా డిజప్పాయింట్  గా ఉన్నారు. ఎందుకు మా విజయ్ కి హిట్ రావడం లేదని మదన పడుతున్నారు. కొంత మంది అయితే నువ్వు పలానా  సినిమా చెయ్యి అని సలహాలు కూడా ఇస్తున్నారు. వాళ్ళ సలహాలకి తగ్గట్టే ఫుల్ మాస్ సబ్జట్స్ తో కూడిన  రెండు భారీ ప్రాజెక్ట్ లు అనౌన్స్ చేసాడు.వాటిల్లోని  ఒక మూవీ  హీరోయిన్ విషయం టూ డే టాక్ అఫ్ ది డే గా నిలిచింది రాహుల్ సంక్రుత్యన్, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ సినిమాలు చేయబోతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన రెండు సినిమాల పోస్టర్స్ అయితే ఒక దానిని మించి ఒకటి ఉన్నాయి. దీంతో  ఎప్పుడెప్పుడు ఆ సినిమాలు కంప్లీట్ అవుతాయా అని  ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.ఇక  రవి కిరణ్ మూవీ పక్కా రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. హీరోయిన్ కి ఎంతో ప్రాధాన్యత ఉండబోతుంది. సమంత, సాయి పల్లవి ల పేర్లు వినిపిస్తున్నాయి. దిల్ రాజు సమంత కి మాట ఇచ్చాడని ఖుషి కాంబో మళ్ళీ రిపీట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. పైగా సమంత కి రూరల్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కిన రంగ స్థలంలో నటించిన అనుభవం కూడా  ఉదని అంటున్నారు. ఇక కొంత మంది అయితే సాయి పల్లవి అయితే బాగుంటుందని పైగా విజయ్, సాయి పల్లవి ఫస్ట్ కాంబో ఆడియెన్స్ కి ఫ్రెష్ నెస్ ని తెస్తుందని అంటున్నారు.  పైగా సాయిపల్లవి చేస్తున్న తండేల్ ,గతంలో చేసిన విరాట పర్వం  ఆ కోవలోకే వస్తాయని  అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు విజయ్ కి జోడి కడతారో చూడాలి.  మూవీ అయితే  తర్వలోనే షూటింగ్ కి వెళ్లనుంది.  విజయ్ కెరీర్లోనే అత్యంత భారీ  బడ్జట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో మొన్న ఏప్రిల్ లో వచ్చిన ఫ్యామిలీ స్టార్ పరాజయం పాలయ్యింది    
సీరియల్ నటుడు చందు నిన్న హైదరాబాద్ లోని త్రినయని నటి పవిత్ర ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.పవిత్ర చందు గత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారు. ఇక  పవిత్ర కొన్ని రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ లో చనిపోయింది. ఆమె మరణాన్ని తట్టుకోలేకే  చందు  ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో  తాజాగా ప్రముఖ నటి కరాటే కళ్యాణి చందు  వాట్స్ అప్ చాట్ ని బయటపెట్టింది రాత్రి పదకొండు గంటలకి చందు నుంచి కరాటే కల్యాణికి మెసేజ్ వచ్చింది.  నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడే ఉంటే పిచ్చొడ్ని అయిపోతాను.  ముందుకు అలవాటు పడి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాను. ఇంక  చాలు ఈ జన్మ.నా ఆత్మహత్య విషయం  ఎవరకి చెప్పకండి అని మెసేజ్ చేసాడు. కరాటే కళ్యాణి చందుకి దైర్యం చెప్పడానికి చాలా ట్రై చేసింది. మేమంతా నీకు ఉన్నాం. ఎలాంటి తొందర పాటు  నిర్ణయాలు తీసుకోవద్దు. ఆత్మహత్య చేసుకోవడం పాపం. యాదవ్ అంటేనే దైర్యం.. పవిత్ర పిల్లలు కూడా నీతో ఉన్నారుగా అని చెప్పింది. వాయిస్ కాల్ లో కూడా ఇద్దరు మాట్లాడారు చందు, కరాటే కళ్యాణి లు కలిసి కొన్ని సీరియల్స్ లో నటించారు. ఇద్దరి మధ్య అక్కా తమ్ముడి అనుఅంధం ఉంది.  చందు కి ఒక భార్య,  చిన్న వయసు కలిగిన  కూతురు,కొడుకు ఉన్నారు.     
NEELAM Productions is excited to unveil a pioneering cinematic collaboration between Papua New Guinea and India, aimed at showcasing the rich cultural heritage and exquisite landscapes of Papua New Guinea to a global audience. This film marks the first major co-production project between the two nations. NEELAM Productions along with SILICON MEDIA Co-Producing the film with NAFA productions in Papua New Guinea. The film will be directed by the acclaimed Indian Director Dr. Bijukumar Damodaran, a three-time recipient of India's National Film Award whose works have been celebrated at numerous international film festivals. Cathy Angeline Mereun Sike, Pa Ranjith and Prakash will be the producers of the film with the execution managed by Parul Agrawal and Adhya Prasad. The cast of the film includes celebrated Hindi/Bengali actress Ritabari Chakraborty and renowned South Indian actor Prakash Bare, alongside prominent talents from Papua New Guinea. The score will be composed by three-time Grammy Award winner Ricky Kej, further elevating the film's appeal. The project was officially announced by the Honorable Shri. Inbasekar Sundaramurti, High Commissioner to Papua New Guinea and Solomon Islands. Principal photography of the film is scheduled to commence in mid-July 2024 in Papua New Guinea.
Tamil director Vikraman’s son Vijay Kanishka starred and Samudrakhani, Sarath Kumar and Gautham Vasudeva Menon in the main roles of the film Hit List. Directed by Surya Kathir Kakkallar , K.Karthikeyan under R.K. Celluloids and produced by Director K.S. Ravi Kumar. In the past, the first look posters of this movie raised the expectations of the movie. Today the teaser of this movie was launched by versatile hero Surya. Coming in action, suspense, crime genre, the teaser of this movie is very good. The present audience is mostly attracted by crime and suspense genre movies. This movie is also getting into the same genre is also teaser increasing the expectations on the movie. After watching the teaser, hero Surya said: The teaser is very good and I hope the movie will be even better. I definitely wish this film to give good success to Vijay Kanishka and this team.
The much anticipated action film starring Man of the Masses NTR and blockbuster director Prashanth Neel was announced a long time ago. NTR fans have been hoping to see NTR through Prasanth Neel's mass vision who gave massive blockbusters like KGF & KGF2. Long back, Prasanth Neel revealed idea of NTRNeel. The director called it a new story for him and the film has its own emotion. "It'll be a different film with different emotions. I don't want to get into the genre, but I'm sure people will assume it's an action movie. I want to call it a very new story for me, which I want to tell my audience. It has its own emotion, and I hope people can connect with it." But Prasanth Neel is currently busy with Salaar 2 pre production. The movie shoot will begin in May end. The director wants to complete the entire second part shoot by October or November without any delays. The NTR31 shoot will begin in the in December 2024. Latest we hear is that, this much awaited project is titled as "Dragon." This powerful title is suggested by Bollywood big producer Karan Johar. This film, which will be produced by prominent production houses Mythri Movie Makers and NTR Arts.
Man of Masses NTR’s most awaited pan-Indian project, ‘Devara,’ directed by Koratala Siva, is being eagerly awaited by the fans. They were eagerly awaiting the film's first single, as Rockstar Anirudh Ravichander, known for viral chartbusters, is scoring the music. Delighting fans and music lovers, the film's first song, titled "Fear Song," will be released on May 19th to amplify NTR's birthday celebration. Everyone is expecting a viral chartbuster from Anirudh, and the title suggests a mass number. Today, makers dropped a surprise promo which lives upto the hype. The promo filled with the visuals of Anirudh and NTR elevation moments will make you hyped up for the full song coming on May 19th. Looks like Anirudh will be dropping another viral chartbuster. Janhvi Kapoor is the heroine, while Saif Ali Khan will be seen as Bhaira in this movie. Heralded as India's most anticipated action epic in 2024, the film is set for a grand nationwide release on October 10th. Kalyan Ram presents this movie under ‘NTR Arts’ while Sudhakar Mikkilineni and Kosaraju Harikrishna are the producers. NTR Arts and Yuvasudha arts banrkolling the film. The film also stars Prakash Raj, Srikanth, Shine Tom Chacko and others in key roles. Anirudh Ravichander scoring the music.
పొగిడి చెడినవాడు లేడు. సమయోచితంగా పొగడలేని వారు అన్ని చోట్లా చెడిపోతారు. జీవితంలో కొందరికి జ్ఞానం ఒక దశలో వస్తుంది. అంతకు క్రితం నష్టమైపోయిన కాలాన్ని కూడదీసుకోవడానికి అన్నట్లుగా జ్ఞానోదయమైన మరుక్షణం నుండి అవతలివారిని అమితంగా, భరించలేనంతగా పొగడడం నేర్చుకుంటారు. ఇలాంటి వ్యక్తి తాను పొగిడేవాణ్ణి ఆకాశానికి ఎత్తేస్తాడు. 'ది స్కై ఈజ్ ది లిమిట్” అని రుజువు చేస్తాడు. అవతలి వ్యక్తి అలిసిపోయేంత వరకూ, లేక తాను అలిసేంత వరకూ పొగుడుతాడు.  ఒక్కొక్కసారి అక్కడ పొగడడానికి తగినంత విషయం లేనప్పుడు అతడి ఇంట్లో తనకు ఆతిథ్యమిచ్చిన ఆయన సతీమణి అమృతహస్తాన్ని, ఆవిడ వండి వడ్డించిన పదార్థాలు ఎంత రుచికరంగా వుంటాయో ఇలాంటి విషయాలను ఇరికించి మరీ చెప్తాడు. ఇలాంటి సబ్జక్టును గురించి ఎంతైనా చెప్పే వీలుంది. ఆ వంకాయ కూర, ఆ పాయసం, వారింటి నెయ్యి ఘుమఘుమలు, ఇట్లా చెప్పుకుపోతూ వుంటే దీనికి అంతుందా అనిపిస్తుంది. అక్కడ సన్మానంలో సన్మానితుడూ, ఉపన్యాసకుడూ అలసి పోయేలోగా శ్రోతలమైన మనం అలసిపోవడం ఖాయం. ఇలా ప్రసంగించేవాడికి సన్మానితుడు అసలెవరో తెలీని సందర్భాలు కూడా ఎదురావుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ ప్రాసంగికుడు ఏ మాత్రం జంకడు. ఎవర్ని సన్మానిస్తున్నారో వారిని గురించి చీటిమీద మూడు ముక్కలు వ్రాసి ఇలా ఇవ్వండి. మూడునిమిషాల్లో ప్రసంగ పాఠంతో రెడీ అయిపోతాను. మీరు వేదికమీద ఆహ్వానితులు నలుగురికీ పూలమాలలు వేసేలోగా నా చెవిలో నాలుగుముక్కలు ఊదితే దంచి పారేస్తాను. ఎవరిని గురించి చెప్పే వాక్యాలైనా నాకు కంఠస్థమే, తడుము కోవలసిన అవసరముండదు. రాజకీయ, పారిశ్రామిక, విద్యావేత్తలెవరైనా సరే, కళాకారులు, సినిమా స్టారులైనా సరే. ఎవరికి తగిన సన్మాన వాక్యాలు వారికి వప్పజెప్పడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగానే వుంటాను. గుటికెడు కాఫీ సేవించి గొంతు సవరించానంటే ఇక ఆ తర్వాత ఉపన్యాసం అనర్గళంగా సాగిపోతుంది" అని హామీ ఇస్తాడు. అన్ని రంగాల్లోనూ స్పెషలైజేషన్ చోటు చేసుకున్న నేటి కాలంలో పొగిడే కళలో కొందర్ని తర్ఫీదు చేసి, వారికి లైసెన్స్ మంజూరు చేయడంలో తప్పేమీ కనిపించదు అనిపిస్తుంది. ఈ లలితకళను శాస్త్రీయంగా ఎక్కడా అభ్యసించకపోయినా, అనేక సంవత్సరాల అలవాటు కొద్దీ దీనిని క్షుణ్ణంగా నేర్చినవారు మన రాష్ట్రంలో ఎందరో వున్నారు. ఇలాంటివి నేర్పటానికి  నెలకొల్పే సంస్థల్లో ప్రస్తుతానికి వీరిని అధ్యాపకులు గానూ, శిక్షకులుగానూ నియమించవచ్చు. ఒక బాచ్ విద్యార్థులు శిక్షణ పొందితే ఇక ఆ తర్వాత కావలసినంత మంది అధ్యాపకులు. సమోవా అనే చిన్న రాజ్యానికి ఒక రాజుండేవాడు. అతడి రాజ్యంలో డాక్టర్ విన్సెంట్ హైనర్ అనే పెద్దమనిషి కొన్నాళ్ళుండి కొంత ప్రజాసేవ చేశాడు. డాక్టరు మహాశయుడు ఆ రాజ్యాన్ని వదలి వెళ్ళే తరుణంలో ఆ రాజుగారు ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేశాడు. ఆ సందర్భంగా రాజు డాక్టర్ను గురించి నాలుగు వాక్యాలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కాని రాజు కుర్చీలో కదలకుండా కూచున్నాడు. రాజు లేచి నుంచోని ప్రసంగించకుండా అలానే కూచోనుండటం డాక్టర్ హైనర్కు ఆశ్చర్యం కలిగించింది. ఈలోగా పొగడ్తనే వృత్తిగా చేసుకున్న ఒక వక్త వచ్చి రాజు తరపున డాక్టర్ హైనర్ గురించి బ్రహ్మాండమైన వాక్యాలతో దంచి పారేశాడు. సుదీర్ఘమైన ఆ ప్రశంసా వాక్యాల తర్వాత హైనర్ కొంత కింధా మీదై. ఉచిత రీతిని సమాధానం చెప్పడానికి లేచి నుంచోబోయాడు. రాజుగారు హైనర్ను వారిస్తూ కూచోమంటూ సౌంజ్ఞ చేశాడు. "మీ తరపున ప్రసంగించటానికి కూడా ఒక వక్తను నియమించాను. ఇక్కడ మా రాజ్యంలో ఇలాంటి ప్రసంగాలు ఆ వృత్తి స్వీకరించిన వారే చేస్తారు. ఔత్సాహికుల్ని ప్రోత్సహించడం మా పద్ధతి కాదు" అని వివరించాడు. ఇది పొగడటానికి కూడా ఎంత ప్రతిభ ఉండాలో తెలియజేస్తుంది. వాక్చాతుర్యం మనిషికి ఎంత ముఖ్యమో స్పష్టపరుస్తుంది.                                    ◆నిశ్శబ్ద.
ఎవరైనా తమ వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టాలి అనుకున్నప్పుడు మనల్ని మనం కొంత మెరుగుపరచుకోవాల్సి వుంటుంది. ఒక పద్ధతిలో ప్రయత్నిస్తే అది అసాధ్యమేమీ కాదు. ‘కష్టపడటం’ ఒక్కటే కాదు.. ఒక క్రమపద్ధతిలో ప్రయత్నించడం అవసరం. అందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ సూచనల్లో మొట్టమొదటి సూచన... సమాచార సేకరణ. కేవలం చదువుకునే విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికే ‘సమాచారాన్నిసేకరించే’ అవసరం వుంటుంది అనుకోవటం పొరపాటు అంటున్నారు నిపుణులు. పత్రికలు, ఇంటర్నెట్ వంటివి ‘విశ్వవ్యాప్త సమాచారాన్ని’ మన ముందు వుంచుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని తెలుసుకుంటూ అప్‌డేట్‌గా వుంటటం మనల్ని, మన వ్యక్తిత్వాన్ని, మన అవకాశాలని మెరుగుపరిచే మొట్టమొదటి అంశం అట. ‘అసాధ్యాలు’ అంటూ ప్రపంచం ముద్రవేసి వదిలేసిన వాటిని కూడా ఛాలెంజ్ చేసి సాధించినవారి కోసం వింటూంటాం. ఏంటి వాళ్ళ ధైర్యం అనిపిస్తుంది. వాళ్ళ ధైర్యమల్లా వారి బలాలని వారు  కరక్టుగా అంచనా వేయటమే. ఎప్పుడూ మన బలాలు, బలహీనతల గురించి సరైన అవగాహన కలిగి వుండాలన్నది నిపుణులు చేస్తున్న రెండో సూచన. ఓ పేపర్ పైన మన బలం, సామర్థ్యం వంటి వాటిని రాసిపెట్టుకోవాలి. అలాగే మన బలహీనతలు, భయాలు వంటి వాటిని ఇంకో కాగితం మీద రాసి పెట్టుకోవాలి. దగ్గరి వ్యక్తులకి ఈ రెండు కాగితాలనీ చూపించి వారి సూచనలు అడగండి. అప్పుడు బలాలు, బలహీనలతని సమీక్షించుకుని... ఏం చేయొచ్చో.. ఏం చేయగలమో నిర్ణయించుకోవడం సులువవుతుంది. మనల్ని మనం మెరుగుపరచుకోవటానికి పెద్ద అడ్డంకి మన ‘భయాలు’. కొత్త వ్యక్తులతో మాట్లాడటమన్నా, నలుగురిలో తిరగడమన్నా, కొత్తపని మొదలుపెట్టడమన్నా భయపడేవాళ్ళు వుంటారు. ఆ భయాలని వదిలించుకోవటం ఏమాత్రం ఇష్టంలేదన్నట్టు పట్టుకుంటారు. అయితే మనల్ని మనం గెలవలేనప్పుడు ప్రపంచాన్ని ఏం గెలవగలం చెప్పండి? అందుకే ముందు మీలోని ఒక భయాన్ని గుర్తించి దాన్ని ఎదుర్కోవటం మొదలుపెట్టండి. నలుగురిలో తిరగటం భయమనుకోండి.. కష్టంగా అనిపించినా నలుగురిలో కలవటం మొదలుపెట్టాలి. కొన్ని రోజులపాటు ఇబ్బంది అనిపిస్తుంది. పారిపోవాలనిపిస్తుంది. అయినా వెనక్కి తగ్గక ప్రయత్నిస్తే ఒకరోజున అది అలవాటుగా మారిపోతుంది. ఒక భయాన్ని దాటగలిగినా చాలు- ఆ అనుభం, దాని నుంచి లభించిన ఆత్మవిశ్వాసం మిగిలిన భయాలని సులువుగా దాటేలా చేస్తాయి. మన మాటలు సూటిగా, స్పష్టంగా వుండాలి. అవి సూటిగా, స్పష్టంగా వుండాలంటే మన ఆలోచనలు కూడా స్పష్టంగా వుండాలి. మన ఆలోచనలు గజిబిజిగా వున్నప్పుడు సూటిగా మాట్లాడలేం. సూటిగా మాట్లాడని వ్యక్తుల మాటలకు సమాజంలో గౌరవం వుండదు. అందుకే మన పరిసరాలని శుభ్రం చేసుకున్నట్టు మన ఆలోచనలనీ క్లియర్‌గా పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. అలాగే మన పనితీరు కూడా గజిబిజిగా కాకుండా ఒక పద్ధతిగా వుండాలి. అది మనల్ని రిలాక్స్‌గా వుంచుతుంది. అలాగే చూసేవారికీ మనపట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. నమ్మకం కుదురుతుంది. ఒత్తిడిని దూరంగా ఉంచగలిగితే చాలు... మన సామర్థ్యం రెండురెట్లు పెరుగుతుందట. అలా ఒత్తిడికి దూరంగా వుండాలంటే పనితీరు, సమయపాలన, పని విభజన వంటి వాటి పట్ల దృష్టి పెట్టాలి. అప్పుడు మన సామర్థ్యాన్ని వందశాతం వినియోగించుకోగలుగుతాం. అలాగే ఏ సమయంలోనైనా ఆత్మవిశ్వాసంతో, చెరగని చిరునవ్వుతో కనిపించే వ్యక్తులని ఇష్టపడని వారుండరు. చుట్టూ మనల్ని ఇష్టపడేవారి సంఖ్య పెరిగినకొద్దీ మన జీవితం ఆనందంగా మారిపోతుంది. కాబట్టి మనల్ని మనం ‘సరికొత్తగా’ ఆవిష్కరించుకోవడం అసాధ్యమేమీ కాదు. దీనికోసం నిపుణులు చేసిన సూచనలని తెలుసుకున్నారుగా.. ఇక ప్రయత్నించడమే మిగిలి వుంది. .....రమ  
నిస్సహాయత ఏమీ చేయలేని, చేయాలనే ఆరాటం ఉన్నా చేయడానికి అవకాశం లేని ఒకానొక ఒంటరి స్థితి. మనిషిని నిలువునా ఒత్తిడిలోకి తోసి, ఆత్మన్యూనతా భావాన్ని పెంచే పరిస్థితి. ప్రపంచంలో ఇలాంటి నిస్సహాయులు ఎందరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ తిండి కోసం, ఉండటానికి నీడ కోసం ఎవరిని అడగాలో తెలియక, తమకు ఏమీ చేసే అవకాశాలు లేక అలా శూన్యం నిండిపోయినట్టు ఉండే స్థితి నిస్సహాయత. ఎందుకీ నిస్సహాయత?? ప్రపంచంలో మనిషి చేసుకుంటే ఎన్ని పనులు ఉండవు అని అనుకుంటారంతా. కానీ కొన్ని సార్లు అన్ని వైపుల నుండి తలుపులు మూసుకుపోయి చీకటిలో పడిపోయినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏదో ఒక చెయ్యి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ తలుపులు ఎక్కడున్నాయో కనబడక, ఎవరైనా ఆ తలుపులు తీస్తారేమో అనే ఆశతో ఉంటారు. అందుకే ఏమీ చేతకానితనంతో అట్లా ఉండిపోతారు.  ఎక్కడెక్కడ?? నిస్సహాయతకు చోటు లేని ప్రదేశమంటూ లేదు. చోటివ్వని మనిషంటూ లేడు. చిన్న పిల్లాడి నుండి పెద్దవాళ్ళ దాకా ఎంతోమంది ఉంటారు. అయితే చాలా వరకు యూత్ లోనూ, మహిళల్లోనూ ఈ నిస్సహాయత బాధితులు ఎక్కువగా ఉంటున్నారు అనేది నమ్మితీరాల్సిన నిజం. మరీ ముఖ్యంగా కట్టుబాట్ల కంచెల మధ్య నలిగిపోతున్న ఎంతో మంది మహిళలు ఏదో చెయ్యాలని, తమ జీవితాలను మార్చుకోవాలని ఉన్నా అందరికీ పైపైన కనబడే విషయాలు వీళ్ళకేం బాగున్నారులే అనిపించేలా చేస్తున్నాయి. కానీ పైకి కనిపించేది వేరు, లోపల వాళ్ళ సంఘర్షణ వేరు. చేయూత!! నిస్సహాయంగా ఉన్న ఇలాంటి వాళ్ళ సంఘర్షణను గుర్తించే కొన్ని మహిళా స్వచ్చంధ చేయూత సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. అయితే ఇలాంటివి అందరికీ అందుబాటులో ఉండటం లేదు. కొన్ని మహానగరాలకు పరిమితమైతే మరికొన్ని దూరప్రాంతాలలో ఉండటం వల్ల ఎంతోమంది ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే దిగువ తరగతి  కులాల మహిళల కంటే, ఉన్నత కులాల మహిళలలో ఇలాంటి నిస్సహాయులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పరువు, సమాజం, గౌరవం అనే గీతల వెనుక నిస్సహాయంగా నిలబడుకుని శూన్యపు చూపులు చూస్తుంటారు. మధ్యలోనే చదువు ఆగిపోయి, సంప్రదాయాలలో చిక్కుకుపోయి, గడప దాటి బయటకు వెళ్లే స్వేచ్ఛ లేని స్త్రీ సమాజం ఎంతో ఉంది. ఒక్క తలుపు తెరవండి!! ఇలాంటి సమస్యలో చిక్కుకుని మానసికంగా నలిగిపోయేవాళ్లకు సొంత ఆలోచన క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఏమి చేయలేకపోతున్నామనే చేతగాని తనమే అలాంటి అజ్ఞానపు వృత్తంలో పడిపోవడానికి కారణం అవుతుంది. అయితే నీ చుట్టూ బోలెడు ప్రపంచం ఉందని, అవకాశాలు ఉన్నాయని, దారి కూడా ఉందని చెబుతూ నువ్వున్నది ఓ చిన్న గది  మాత్రమే ఒక్కసారి మొత్తం తరచిచూస్తే ఎక్కడో ఒకచోట తలుపులు చేతికి దొరుకుతాయి అని మాటలతో భరోసా నింపితే ఆంజనేయుడికి  గుర్తుచేయగానే శరీరం పెరిగినట్టు వీళ్లకు కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలా మెల్లిగా మీ మాటలతోనే ఒక తలుపు తెరిచి వాళ్లకు చూపించినట్టవుతుంది కూడా.  ప్రపంచం పెద్దది!! మనుషులే చిన్నతనంతో ఉన్నారు!! ఆలోచిస్తే ఇదే నిజమని అనిపిస్తుంది. నిజానికి ఒకమనిషి బాగుపడితే చూసి సంతోషించేవాళ్ళు ఎక్కువ లేరు ఈ ప్రపంచంలో. ఎప్పుడూ అవతలి వాడిని ఎలా ముంచుదామా, వాడిది ఎలా లాక్కుందామా అనే ఆలోచనే తప్ప  అయ్యో ఇలా చేస్తే దారి కనబడుతుంది కదా వెళ్లి చెబుదాం అనుకునేవాళ్ళు ఎవరూ ఉండటం లేదు. ఎక్కడో, ఎవరో నూటికి ఒక్కరు ఉన్నా వాళ్ళ సాయం అందుకునే వాళ్ళు ఏ కొద్దీ మందో అంతే. మిగిలినవాళ్లకు పైన చెప్పుకున్నట్టు సంఘర్షణే మిగుల్తోంది. అందుకే మనుషులు తమ మనసును కాసింత పెద్దగా చేసుకోవాలి. అందులో ఎన్నో హృదయాలకు ప్రేమను పంచాలి. ఆ ప్రేమను అందుకున్న వాళ్ళు నిస్సహాయత నుండి బయటకొస్తారు నేస్తాల్లారా!! ◆వెంకటేష్ పువ్వాడ.
ఎండుద్రాక్ష సాధారణంగా పాయసం, స్వీట్ల తయారీలో ఉపయోగిస్తారు. కొన్నిచోట్ల వంటకాలలోనూ, స్పైసీ స్నాక్స్ లో కూడా వీటిని జత చేస్తుంటారు. అయితే ఎండుద్రాక్షను నానబెట్టి తినమని అమ్మమ్మల మొదలు అమ్మలు కూడా చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఎండుద్రాక్ష నానబెట్టుకుని తినడం వల్ల చాలా ఆరోగ్యమని అంటారు.  ఎండుద్రాక్షను నానబెట్టి ప్రతిరోజూ తింటే  కలిగే అద్భుత ఫలితాలు ఇవే.. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.. రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం   గుండెకు చాలా మంచిది.  నానబెట్టన ఎండు ద్రాక్ష  శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి  మంచి కొలెస్ట్రాల్ ను  ప్రోత్సహిస్తుంది . ఇది  ధమనులలో ఏర్పడే  ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిని తినడం వల్ల ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి ఇది స్ట్రోక్,  గుండె జబ్బుల నుండి  రక్షించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. యాంటీ ఆక్సిడెంట్లు  శరీరంలో ఫ్రీ రాడికల్స్ డ్యామేజీని తగ్గిస్తాయి. ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు త్వరగా విడుదలవుతాయి. యాంటీ-ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి  రక్షించడంలో సహాయపడతాయి. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.. ఎండు ద్రాక్ష  బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎండుద్రాక్ష తినడం వల్ల  చాలా శక్తి లభిస్తుంది, దీని వల్ల  పదే పదే ఆకలి అనిపించదు.   ఆహారం ఎక్కువగా తినాలనే  కోరికలు కూడా తగ్గుతాయి. ఆహారం నియంత్రణ కారణంగా  బరువు పెరిగే అవకాశాలు తగ్గుతాయి.  తద్వారా  బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. రక్తపోటును నిర్వహిస్తుంది.. ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది రక్త నాళాలు గట్టిపడకుండా నిరోధిస్తుంది. దీని కారణంగా రక్తపోటు ఎక్కువగా ఉండదు. ఒకవేళ రక్తపోటు ఎక్కవగా ఉంటే దాని ప్రభావం తగ్గిస్తుంది.  అంతేకాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది, ఇది అధిక రక్తపోటును కూడా నివారిస్తుంది. కాబట్టి రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల  రక్తపోటు అదుపులో ఉంటుంది. జీర్ణక్రియకు ప్రయోజనకరం.. ఆహారం జీర్ణం కావడానికి,  మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి ఫైబర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండుద్రాక్షలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల  పేగు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ప్రేగులలో ఆహారాన్ని తరలించడంలో సహాయపడుతుంది, ఇది ఉబ్బరం,  మలబద్ధకాన్ని నివారిస్తుంది. కాలేయానికి మంచిది.. బయోఫ్లావనాయిడ్స్ ఎండుద్రాక్షలో ఉంటాయి. ఇవి  రక్తం,  కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి . యాంటీ-ఆక్సిడెంట్లు  కూడా ఎండుద్రాక్షలో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కాలేయానికి మేలు చేస్తాయి. శరీరం నుండి విషాన్ని తొలగించడానికి ఆరోగ్యకరమైన కాలేయాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల ప్రతిరోజూ రాత్రిపూట ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి తినడం  కాలేయానికి ప్రయోజనకరంగా ఉంటుంది.                                                     *నిశ్శబ్ద.
ఐస్ యాపిల్  అని ఇంగ్లీషులో అంటుంటారు.  వీటిని తెలుగు రాష్ట్రాలలో తాటిముంజలు అంటారు.  లేతగా ఉన్న తాటి ముంజలు తియ్యగా, మృదువుగా, లోపల కాసిన్ని తియ్యని నీళ్లలో తినడానికి ఎంతో బాగుంటాయి. వేసవి కాలంలో మాత్రమే అందుబాటులోకి రావడంతో అందరికీ వీటికి డిమాండ్ కూడా ఎక్కువే.. తాటిముంజలను ఈ వేసవి కాలంలో తప్పకుండా ఎందుకు తినాలో చెప్పే కారణాలు బోలెడు ఉన్నాయి. ఈ కారణాలు తెలిస్తే అస్సలు వదలకుండా తాటిముంజలను ఈ సీజన్ లో రుచి చూస్తారు. తాటిముంజలు తింటే శరీరానికి కలిగే లాభాలేంటో తెలుసుకుంటే.. హైడ్రేట్.. మండిపోతున్న ఎండల కారణంగా వేడి కూడా అధికంగా ఉంటుంది.  ఈ వేడి శరీరం మీద ప్రభావం చూపిస్తుంది.  దీని కారణంగా  శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీన్నే శరీరం డీహైడ్రేట్ అవ్వడం అంటారు. తాటిముంజలు  తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ నుండి బయటపడవచ్చు. తాటిముంజలు తింటే శరీరం కోల్పోయిన తేమ శాతం తిరిగి భర్తీ అవుతుంది. ఉదర సమస్యలు.. ఈ మండే వేసవి కాలంలో చాలామంది ఉదర సంబంధ సమస్యలు ఎదుర్కుంటారు. చాలామందికి కడుపులో వేడి పుట్టి అది కడుపు నొప్పి, విరేచనాలు, అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుంది.   అయితే తాటిముంజలు తింటే పొట్టకు చల్లదనాన్ని అందిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల  జీర్ణవ్యవస్థ బలపడుతుంది.  మలబద్ధకం, అజీర్ణం,  గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.   రోగనిరోధక శక్తి.. చాలామందిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే వ్యాధులు, జబ్బులు తొందరగా వస్తాయి. అంతేకాదు ఇలా వచ్చిన జబ్బులు అంత తొందరగా తగ్గవు కూడా. కానీ తాటి ముంజలు తింటే  రోగనిరోధక శక్తి  బలపడుతుంది. తాటిముంజలలో ఉండే  విటమిన్ సి  రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జీవక్రియను..   జీవక్రియ బలహీనంగా ఉంటే ఆహారం సరిగా జీర్ణం కాక శరీరంలో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీని కారణంగా  బరువు పెరుగుతారు.   ఊబకాయం బాధితులుగా మారతారు. అయితే ఫైబర్ అధికంగా ఉండే తాటిముంజలను  తీసుకోవడం వల్ల జీవక్రియ వేగంగా పెరుగుతుంది.  ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ను ఇస్తాయి. తద్వారా అధికంగా తినకుండా కూడా నివారిస్తుంది. డయాబెటిస్‌.. తాటిముంజలు  మధుమేహ రోగులకు కూడా మేలు చేస్తుంది. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్  ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను  నియంత్రిస్తుంది.                                                                   *రూపశ్రీ.  
ఉల్లిపాయ బోలెడు వంటకాల్లో కనిపించే ఒక ముఖ్యమైన పదార్ధం. ఉల్లిపాయ పసుపు, తెలుపు, ఎరుపు వంటి రంగులలో లభిస్తుంది. ఉల్లిపాయ రుచి మాత్రమే కాకుండా, ఇందులో ఉన్న పోషకాల కంటెంట్ కారణంగా ఆహారంలో ప్రముఖంగా నిలిచింది. పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అలవాటు లేనివారు కూడా తినడం మొదలు పెడతారు. పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల కలిగే 10 ప్రయోజనాలు.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. పచ్చి ఉల్లిపాయలు విటమిన్ సి కి అద్భుతమైన మూలం, ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి బాక్టీరియా, వైరస్‌ల నుండి శరీరాన్ని రక్షించే తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది, జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులను నివారించడంలో పచ్చి ఉల్లిపాయలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయల తీసుకోవడం వల్ల  రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, అధిక రక్తపోటును తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది.. పచ్చి ఉల్లిపాయలలో డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది సరైన జీర్ణక్రియకు మరియు శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి అవసరమైనది. ఫైబర్ పోషకాల శోషణను పెంచుతుంది. మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, హేమోరాయిడ్స్ వంటి వ్యాధులను నివారిస్తుంది. వాపును తగ్గిస్తుంది.. క్వెర్సెటిన్ అధికంగా ఉండే పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో మంట స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి పరిస్థితులను నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడే సల్ఫర్-రిచ్ కాంపౌండ్స్ యొక్క బాగా కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు కాల్షియం శోషణను ప్రోత్సహించడంలో, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును పెంచుతుంది.. పచ్చి ఉల్లిపాయలు సల్ఫర్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ఇవి మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతాయి, ఇది మెరుగైన జ్ఞాపకశక్తి, శ్రద్ధ, ఏకాగ్రత స్థాయిలకు దారితీస్తుంది.  క్యాన్సర్ నివారిస్తుంది.. పచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉండే సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్స్ మరియు అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.. పచ్చి ఉల్లిపాయలు అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి కలిగి ఉంటాయి, ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల ముడతలు, వయస్సు మచ్చలు, పిగ్మెంటేషన్ స్థాయిలు తగ్గుతాయి.  ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి ఇది దోహదపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.. పచ్చి ఉల్లిపాయల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన క్రోమియం అనే ఖనిజం ఉంటుంది. క్రోమియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దారితీస్తుంది, తద్వారా మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది పచ్చి ఉల్లిపాయలు తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. అతిగా తినే పరిస్థితులను ఉల్లిపాయల్లో ఉండే ఫైబర్ తగ్గిస్తుంది. కేలరీలను భర్తీ చేస్తుంది.  చివరికి బరువు తగ్గడానికి. సహాయపడుతుంది.                                   ◆నిశ్శబ్ద.