విజయ్, రష్మిక రెండు సార్లు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు?
పెళ్లికి హాజరవుతున్న టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరు?
పెళ్లికి 100 మంది మాత్రమే అతిథులు.. ఎందుకని?
ఎంతోకాలంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వార్త బాగా ప్రచారంలో ఉంది. దానికి తెరదించుతూ ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వివాహబంధంతో వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. వీరి వివాహం ఎంతో ప్రైవేట్గా పరిమితమైన అతిథుదల మధ్య జరగబోతోంది. ఇప్పటికే ఇరు కుటుంబాల సభ్యులు ఉదయ్పూర్ చేరుకున్నారు. వందకు మించి అతిథులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫిబ్రవరి 24 సాయంత్రం జరిగే సంగీత్తో వివాహ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి.
విజయ్, రష్మికల వివాహ క్రతువులో తెలుగు సంప్రదాయాన్ని, కొడవ (కూర్గ్) పద్ధతులను మేళవిస్తుండడం విశేషంగా చెప్ప్పుకోవచ్చు. ఫిబ్రవరి 26 ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో, సాయంత్రం రష్మిక సొంత ఊరి పద్ధతి అయిన కొడవ పద్ధతిలో వివాహ వేడుక జరగనుంది. అంటే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి వీరి వివాహం జరగబోతోంది. వివాహం తర్వాత విజయ్, రష్మిక శుక్రవారం హైదరాబాద్ చేరుకుంటారు. చిత్ర పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ నాయకులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల కోసం మార్చి 3న బంజారా హిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్లో ఎంతో వైభవంగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.







