LATEST NEWS
  ట్రంప్ అస‌లు బాధంతా ఇదే. గ‌త అధ్య‌క్షుల‌కు కేవ‌లం ర‌ష్యా మాత్ర‌మే అతి పెద్ద అడ్డంకి. రెండో ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత ఇరు దేశాల మ‌ధ్య‌ ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం మొద‌లైంది. అప్ప‌టి వ‌ర‌కూ ఆయుధం ప‌ట్ట‌ని అమెరికా..  పెర్ల్ హార్బ‌ర్ ఘ‌ట‌న త‌ర్వాత అణుబాంబు వ‌ర‌కూ ఆయుధాల త‌యారీ నేర్చుకుంది. ఆపై ర‌ష్యాతో పోటీ  ప‌డుతూ.. ఇటు ఆయుధాల‌తో పాటు అటు స్పేస్ లోనూ మున్ముందుకు వెళ్తూ వ‌చ్చింది. ఫైన‌ల్ గా ఇప్పుడు నాసా పేరు ఎక్కువ‌గా  వినిపిస్తోంది ప్ర‌పంచంలో. ర‌ష్య‌న్ స్పేస్ గురించి ఎక్క‌డా ఊసే ఉండ‌దు. దీనంత‌టికీ కార‌ణం పోటీ. ఆపై చైనాతో పోటీప‌డ్డం మొద‌లైంది అమెరికా. చైనా వ‌రల్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ గా ఉంది. పిన్నీసు నుంచి రాకెట్ల వ‌ర‌కూ చైనాపై ఆధార‌ప‌డ‌కుండా ఈ ప్ర‌పంచం ఏదీ చేయ‌లేదు. ముందుకు వెళ్ల‌లేదు. మొన్న రాహుల్ గాంధీ ఒక స్మార్ట్ టీవీ యూనిట్లోకి వెళ్లి చూడ‌గా తెలిసిందేంటంటే.. కేవ‌లం పై డ‌బ్బాలు త‌యారు చేయ‌డం స్టిక్క‌ర్లు వేయ‌డం త‌ప్ప మ‌న మేకిన్ ఇండియా ఏమంత ఎఫెక్టివ్ గా లేద‌ని తేల్చి చెప్పారాయ‌న‌. దానర్ధం ఏంటంటే  చైనాను కాద‌ని మ‌న‌మేం చేయ‌లేక పోతున్నామ‌ని. మ‌న‌మే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి. ఈ విష‌యంలో ట్రంప్ ఎలాగైనా స‌రే చైనాతో పోటీ ప‌డ‌దామ‌ని ట్రై చేస్తున్నారు. ఇప్ప‌టికే చైనా ఆర్మీ  ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌ది. దాని త్రివిధ ద‌ళాల‌తో పోల్చితే అమెరికన్ ఆర్మీ జుజుబీ. దీంతో స్మార్ట్ వార్ చేయ‌డ‌మెలా?. అన్న‌ది ప్రాక్టీస్ చేస్తూ వ‌స్తోంది. గ‌త కాల‌పు అధ్య‌క్షుడు రొనాల్డ్ రీగ‌న్ ప్ర‌వేశ పెట్టిన స్టార్ వార్ త‌ర‌హాలో గోల్డ‌న్ డోమ్ అనే సేఫ్టీ లైన్ ప్ర‌వేశ పెట్టే యోచ‌న చేస్తున్నారు ట్రంప్ నాయ‌క‌త్వంలోని అమెరిక‌న్ ర‌క్ష‌ణ రంగ నిపుణులు. ఇదే ర‌ష్యా సంగ‌తి చూస్తే ర‌ష్యా మొత్తం నాశ‌న‌మైనా కూడా ఆటోమేటిక్ ట్రిగ‌రింగ్ ద్వారా ప్ర‌పంచాన్ని నామ‌రూపాల్లేకుండా చేయ‌గ‌లిగే స‌త్తా త‌మ సొంత‌మ‌ని గుర్తు చేస్తోంది ఆ దేశం. ఇక భార‌త్ విష‌యానికి వ‌స్తే.. ఈ దేశాన్ని పాక్ ఉగ్ర‌వాదులు సాయంతో.. కెలికి ఆపై యుధ్దానికి ప్రేరేపించి అటు పిమ్మ‌ట ఆయుధ కొనుగోళ్లు చేయిద్దామ‌ని చూసింది యూఎస్. తెలివి మీరిన భార‌త్ ప‌క్కా వ్యూహ‌ర‌చ‌న‌తో హండ్ర‌డ్ ప‌ర్సంట్ స్ట్రయిక్ రేట్ తో.. ఇటు ఉగ్ర‌వాదుల‌ను అటు చైనా  పీఎల్ 15లు, ఆపైన అమెరిక‌న్ ఎఫ్  16 ల‌ను ప‌డ‌గొట్టి దుమ్ము దులిపేసింది. దీనంత‌టికీ కార‌ణం వ్యూహ‌ర‌చ‌న‌. స‌రిగ్గా పాక్ అణు నిల్వ‌లున్న కిరానా కొండ‌ల‌పై బ్ర‌హ్మోస్ ల‌ను వ‌ద‌ల‌డంతో.. అక్క‌డ ప‌డ్డ దెబ్బ ఇటు పాక్ కి అటు అమెరికాకి  కూడా దిమ్మ తిరిగి బొమ్మ క‌నిపించింది. దీంతో జ‌డుసుకున్న పాక్ అమెరికా కాళ్లు ప‌ట్టుకుని.. కాల్పుల విర‌మ‌ణ బేరానికి వ‌చ్చింది. ఇలా ఎటు నుంచి ఎటు చూసినా ఈ మూడు అగ్ర‌దేశాలు ఒక్కొక్క‌రూ ఒక్కో ర‌కంగా అమెరికాతో ఢీ అంటే ఢీ అంటున్న‌వారే. మొన్న‌టికి మొన్న‌.. అమెరిక‌న్ ఎఫ్- 35ల‌ను వ‌ద్ద‌ని  రిజెక్ట్ చేసింది భార‌త్. మ‌నం కూడా దాని ప‌నితీరు కేర‌ళ ట్రివేండ్రం ఎయిర్ పోర్టులో ఆగిన‌పుడు చూసే ఉంటాం. 40 మంది మెకానిక్ లు వ‌చ్చినా కూడా దాన్ని రిపేర్ చేయ‌లేక పోవ‌డంతో.. గ్లోబ్ మాస్ట‌ర్ సాయంతో బ్రిట‌న్ కి ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వ‌చ్చింది. ఇక 2018లో తాడ్ ల‌ను కొన‌మ‌ని ప్రెష‌ర్ చేసింది యూఎస్. మాకొద్దా ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్ అని తెగేసి చెప్పి.. ఎస్ 400 ల‌ను కొనుగోలు చేసింది భార‌త్. కార‌ణం అమెరికా న‌మ్మ‌ద‌గిన దేశ‌మేం కాదు. అదే ర‌ష్యా ఇటు బ్రహ్మోస్ వంటి మిస్సైళ్ల‌ త‌యారీకి సాంకేతిక సాయం చేస్తూనే.. అటు తాము యుద్ధంలో ఉండ‌గా కూడా ఎస్ 400 డెలివ‌రీ చేసింది. అంతేనా ఏ చిన్న సైనిక సాయం కావాల‌న్నా చేస్తుంది. అదే అమెరికా మ‌నం కార్గిల్ వార్ లో ఉండ‌గా.. జీపీఎస్ సిస్ట‌మ్ ని ఆపి హ్యాండ్ ఇచ్చింది. .ఇలాంటి న‌మ్మ‌క ద్రోహ దేశం వ‌ద్ద ఏం కొన్నా స‌రే మ‌న‌కేం పెద్ద యూజ్ అవ‌దు.  గ‌తంలో పెంట‌గాన్ రిపోర్టుల‌ను బ‌ట్టీ చూస్తే ప్ర‌పంచంలోనే అమెరికా ద‌గ్గ‌ర  ఆయుధాలు కొనే దేశాల్లో మ‌నం థ‌ర్డ్ ప్లేస్ లో ఉండేవారం. కానీ అమెరికా దాని నీచ బుద్ధి బ‌య‌ట ప‌డుతూ వ‌చ్చాక‌.. మ‌నం ఆయుధాల ప‌రంగా దూరం జ‌రుగుతూ వ‌స్తున్నాం. ప్ర‌స్తుతం ట్రంప్ కోపం కూడా అందుకే. భార‌త్ ర‌ష్యాకు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతుంటే ప‌రిస్థితి.. అమెరికాకి మైండ్ పోతోంది. దానికి తోడు మ‌నం ప్ర‌తిదానికీ ర‌ష్యా స‌హ‌కారంతో సొంత సిస్ట‌మ్ త‌యారు చేసుకుంటూ వ‌స్తున్నాం. ఎస్ 400 త‌ర‌హాలో ప్రాజెక్ట్ కుషా. ఆపై ఎఫ్ 35 ల లాంటి ఫిఫ్త్ జెన్ ఫైట‌ర్ జెట్స్.. ఇలా ఓన్ ప్రొడ‌క్ష‌న్ మొద‌లు పెట్టాం. ఎందుకంటే గ‌త ఆప‌రేష‌న్ సిందూర్ లోపాక్ ఇటు అమెరికా అటు చైనా, ట‌ర్కీల‌ నుంచి పెద్ద ఎత్తున ఆయుధ సాయం పొందింది. వారంత‌ట వారు త‌యారు చేసుకోలేక పోవ‌డం వ‌ల్ల‌.. ఆ దేశం చివ‌ర్లో బోల్తా కొట్టింది. మ‌న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చెప్పిన‌ట్టు.. ఆయుధం ఉండ‌గానే స‌రిపోదు. దాన్ని వాడే సామ‌ర్ధ్యం కూడా అత్య‌వ‌స‌రం. అదెప్పుడు సాధ్య‌మంటే వాటిని మ‌న‌మే త‌యారు చేసుకోవ‌డం వ‌ల్ల స‌గానికి  స‌గం త‌ర్పీదు అయి ఉంటామ‌ని అంటారాయ‌న‌. దానికి తోడు ఆయుధ త‌యారీలో ర‌ష్యన్ మేడ్ మోస్ట్ ప‌ర్ఫెక్ట్ క‌మ్ ప‌వ‌ర్ఫుల్. మొన్న‌టి యుద్ధంలో పాక్ ని మ‌నం క‌ట్ట‌డి చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించింది ఎస్ 400 లు. ఈ విష‌యాన్ని తాజాగా మ‌న ఎయిర్ చీఫ్ ఏపీ సీంగ్ సైతం చెప్పుకొచ్చారు.. మ‌నం ఎఫ్ 16ల‌తో స‌హా ఆరు యుద్ధ విమానాలు ప‌డ‌గొట్టామంటే కార‌ణ‌మ‌దే. ఈ విష‌యం పాక్ ఒప్పుకోకున్నా ట్రంప్ సైతం అవును నిజ‌మేన‌న్నారు.   అలాంటి కండీష‌న్లో ర‌ష్యా- భార‌త్- చైనా అనే ఈ మూడు దేశాలు క‌లిస్తే స‌గం ప్ర‌పంచం అటు వైపు మొగ్గుతుంది. మ‌రో స‌మ‌స్య  ఏంటంటే భార‌త్ కి ఈ మూడు దేశాల్లోనే కాస్త మ‌ర్యాద‌రామ‌న్న ల‌క్ష‌ణాలు అధికం. మ‌నం ఎవ‌రినీ యుధానికి ప్రేరేపించం. ఎవ‌రితోనూ యుద్ధం కావాల‌ని కోరుకోం. ఎవ‌రినీ ట‌క్క‌రి బుద్ధుల‌తో దెబ్బ తీయాల‌ని చూడ్డం. దీంతో ఇప్ప‌టికే భార‌త్ ని స‌గం దేశాలు అగ్ర నాయ‌క‌త్వం వ‌హించ‌మ‌ని కోరుకుంటున్నాయ్. ఇదే ట్రంప్ చూడండీ.. ర‌ష్యాతో యుద్ధంలో ఉన్న దేశ‌మ‌ని కూడా వ‌ద‌ల‌కుండా ఉక్రెయిన్ తో ఏ విదంగా ఖ‌నిజ త‌వ్వ‌కాల ఒప్పందం చేసుకున్నారో. ఆపై భార‌త్ తో ఘ‌ర్ష‌ణ‌లో ఉన్న టైంలోనే పాక్ ద్వారా త‌మ కుటుంబ కంపెనీలో పెట్టుబ‌డులు పెట్టించుకున్నారు. ఇదంతా ప్ర‌పంచం చూస్తూనే ఉంది.  దానికి తోడు బ్రిక్ దేశాలన్నీటికీ ఒక భ‌రోసా అందించేలా అత్యంత చౌక ధ‌ర‌ల‌కే మ‌నం ఆయుధాల త‌యారీతో పాటు స‌ర‌ఫ‌రా కూడా చేస్తున్నాం. ఇక్క‌డే ట్రంప్ కి భార‌త్ అంటే ఒళ్లు మండిపోతోంది. ఆయా అమెరిక‌న్ కంపెనీల నుంచి మ‌న వాళ్ల‌ను వాష్ అవుట్ చేయ‌మంటున్నారాయ‌న‌. ఇంకా సుంకాల మోత మోగిస్తామ‌ని చెప్పుకొస్తున్నారు.  ప్ర‌పంచ‌మంతా ట్రంప్ భార‌త్ ని ఏదో భ‌య‌పెట్టి ఇర‌కాటంలో పెడుతున్నాడ‌ని అంటున్నారుగానీ.. దీని ప్ర‌భావం వ‌చ్చే రోజుల్లో బ‌లంగా ఉండ‌నుంది. డాల‌ర్ ద్వారా లావాదేవీల‌ను మానేసి బ్రిక్ దేశాలు త‌మ‌కు తాము స్వ‌యంగా ఒక క‌రెన్సీ ఏర్పాటు చేసుకుని త‌ద్వారా.. చెల్లింపులు చేసుకునేలా తెలుస్తోంది. దీంతో స‌గం ప్ర‌పంచం డాల‌ర్ ని వాడ్డం త‌గ్గించేస్తాయి. దీంతో అమెరికా న‌డ్డి విరిగి న‌ట్టేట్లో ప‌డ్డం ఖాయం. ఇప్ప‌టికే అమెరికా ఒక క‌న్జ్యూమ‌ర్ బేస్డ్ కంట్రీ.. ఆ దేశ ప్ర‌జ‌ల్లో అత్య‌ధిక శాతం క్రెడిట్ కార్డుల‌ను బేస్ చేసుకుని బ‌తుకుతుంటారు. అంతే కాదు.. ప్ర‌భుత్వాలు కూడా య‌ధేచ్చ‌గా రుణాల మాఫీ చేస్తూ ఉంటుంది. ఇంత వెస‌లుబాటుకు కార‌ణం అమెరిక‌న్ డాల‌ర్ లో ప్ర‌పంచంలోని ప్ర‌తి చెల్లింపు జ‌రుగుతుంది కాబ‌ట్టి.. ఆ నిల్వ‌లు ఆ దేశం చెంత అంత ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి. దానికి తోడు ప్ర‌పంచంలో ఉన్న ప్ర‌తి వ‌న‌రుపై గుత్తాధిప‌త్యం వ‌హించి ఆపై ఆయా దేశాల‌కు ఇవ్వాల్సిన మొత్తాలు కూడా.. త‌మ ట్రెజ‌రీల్లో దాచుకుంటుంది యూఎస్.  ఒక వేళ డాల‌ర్ చెల్లింపుల‌ను కంట్రోల్ చేయ‌గ‌లిగితే.. దెబ్బ‌కు అమెరికా ఆర్ధిక వ్య‌వ‌స్థ మొత్తం కుప్ప‌కూలిపోతుంది. ఈ విష‌యం గుర్తించిన బిజినెస్ మెన్ ట్రంప్.. ఒక‌టే సుంకాల బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు. కానీ ఈ ప్ర‌భావం భార‌త జీడీపీపై ప‌డేది కేవ‌లం పాయింట్ టూ ప‌ర్సంటేజీ మాత్ర‌మే.. కాబ‌ట్టి ఏం పెద్ద భ‌య‌ప‌డ‌కూడ‌ద‌న్న కృత నిశ్చ‌యంతో ఉంది. దీంతో పెద్ద‌న్న ట్రంప్ కి లోలోన అణుబాంబులు ప‌డుత‌న్న చ‌ప్పుడు వినిపిస్తోంది..  ఉన్న సిట్యువేష‌న్ కి తోడు.. ఈ మూడు దేశాల క‌ల‌యిక అంటేనే హ‌డలెత్తి పోతోంది ట్రంప్ నాయ‌క‌త్వంలోని అమెరికా.
  పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు  హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు.  ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు  ఎల్బీ నగర్ నుంచి కేపీహెచ్ బీ  వరకు ప్రయాణించిన ఆయన తోటి ప్రయాణీకులతో ముచ్చటించారు. ప్రత్యేకంగా  చిన్నారులతో మాట్లాడారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న మెట్రోలో వెళ్లారు.
  హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. బల్కంపేట, అమీర్ పేట్ గంగూభాయి బస్తీల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాలను  పరిశీలించారు. బస్తీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మంచి నీరు ఎలా వస్తుంది.. అందులో ఏమైనా మురుగు నీరు కలుస్తుందా? అంటూ వారిని స్వయంగా అడిగి సీఎం తెలుసుకున్నారు.  వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను వెంటనే యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై సీఎం రేవంత్ ఆరా తీశారు. ఈ వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ సహా ఇతర అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా డ్రైనేజీ వ్యవస్థను సైతం ఆయన పరిశీలించారు.  ముంపు సమస్య రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దవుతుంది. వరుసగా ప్రతి రోజు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో భారీ వర్షం కురుస్తునే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. రోడ్లుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోతుంది. డ్రైనేజీలోని మురుగు నీరు సైతం రహదారులపైకి వచ్చి భారీగా చేరుతుంది. అలాగే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. వరద పరిస్థితిని ముఖ్యమంత్రికి  బాలుడు వివరించాడు. బుద్ధ నగర్‌లో  జశ్వంత్ అనే బాలుడిని పిలిచి వరద పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. కాలనీలో నడుస్తూ జశ్వంత్ నుంచి వివరాలు తెలుసుకున్నరు. తను 7వ తరగతి చదువుతున్నట్లు సీఎంకు  జశ్వంత్ వివరించారు. వరద నీరు ఇంట్లోకి చేరడంతో పుస్తకాలు తడిసిపోయాయని చెప్పిని ముఖ్యమంత్రికి బాలుడు తెలిపాడు. భవిష్యత్ లో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తానని బాలుడికి సీఎం రేవంత్  ధైర్యం చెప్పారు.  మరోవైపు వర్షాలు, సీజనల్ వ్యాధులపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. నీరు నిలిచే ప్రాంతాల్లో వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు మ్యాన్‌హోల్స్‌, విద్యుత్‌ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రజలు బయటకి రావొద్దని సూచించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, వాటర్ బోర్డు, హైడ్రా అధికారులు పాల్గోన్నారు.  
  ఓ యువకుడు టిక్ టాక్ గా తయారు అయ్యి... తన లగేజ్ తీసుకొని... బ్యాంకాక్ నుండి ఢిల్లీకి విమానంలో బయలుదేరాడు. అనంతరం సదరు యువకుడు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి నడుచుకుంటూ వెళుతున్న సమ యంలో కస్టమ్స్ అధికారులు అతని లగేజ్ను చెక్ చేసి... ఒక్కసారిగా ఆశ్చర్య చకితు లయ్యారు. బ్యాగ్ నిండా కవర్లు వాటిని విప్పి చూసిన అధికా రులు నూరేళ్లు పెట్టారు.  అధికా రులు వెంటనే అప్రమత్తమై యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు... ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ యువకుడు ఫ్లైట్ దిగి నడుచుకుంటూ వెళ్తున్న సమయం లో కస్టమ్స్ అధికారులకు అతని కదలికలపై అనుమా నం వచ్చి.... అతని బ్యాగ్ తనిఖీలు చేశారు... కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం కలగకుండా గంజాయిని ప్లాస్టిక్ కవర్స్ లలో ప్యాకింగ్ చేసి... వాటిని లగేజ్ బ్యాగ్ అడుగు భాగంలో పెట్టి... దాని పైన దుస్తులు పెట్టుకుని వచ్చాడు. ప్లాస్టిక్ కవర్స్లలో ఉన్న ప్యాకేజీలను తెరిచి చూసిన అధికా రులు ఒక్క సారిగా షాక్ గురయ్యారు.  వీడు మామూలోడు కాదురా బాబోయ్.. ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా 20కోట్లు విలువ చేసే గంజా యిని... ప్లాస్టిక్ కవర్లో ప్యాకింగ్ చేసి దర్జాగా తీసుకెళ్తు న్నాడు.అధికారులు వెంటనే ఆ యువ కుడ్ని అదుపులోకి తీసుకొని అతని వద్దనున్న 20 కోట్ల విలువచేసే 19.87 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని యువకుడిపై ఎన్డీపీ ఎస్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసు కొని...  అసలు ఈ గంజాయి ఎక్కడి నుండి తీసుకొస్తు న్నాడు. ఢిల్లీలో ఎవరికి ఈ గంజాయి చేరవేయనున్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
  నంద్యాల జిల్లా శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్డులో భక్తులు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడకుండా త్వరితగతిన శ్రీశైలం వచ్చి దర్శనం చేసుకుని ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు తిరిగి గమ్య స్థలాలకు  వెళ్లే విధంగా ట్రాఫిక్ జామ్ పై డ్రోన్ కెమెరాతో పోలీసుల పర్యవేక్షణ చేపట్టారు . నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ జామ్ పై డ్రోన్ కెమెరాలతో శ్రీశైలం టూ టౌన్ సీఐ చంద్రబాబు  ఆధ్వర్యంలో పర్యవేక్షించారు.   వరుస సెలవులు రావడంతో శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సి ఐ చంద్రబాబు  ప్రత్యేక చర్యలు చేపట్టారు. డ్రోన్ కెమెరాతో శ్రీశైలం హైదరాబాద్ డ్యామ్ పరిసరాలను ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిందా రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపి ట్రాఫిక్ జామ్ కు ఏమైనా అవుతుందా అని మొబైల్ పార్టీని అనుసంధానం చేస్తూ శ్రీశైలం టూ టౌన్ సీఐ చంద్రబాబు ఆధ్వర్యంలో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
ఎన్టీఆర్‌, హృతిక్‌రోషన్‌ హీరోలుగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మించిన ‘వార్‌2’ ఆగస్ట్‌ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా ఆగస్ట్‌ 10న హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. వేలాది అభిమానుల మధ్య, సినీ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగిన ఈ ఫంక్షన్‌లో హృతిక్‌రోషన్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ‘ఇక్కడికి వచ్చిన టైగర్‌ ఫ్యాన్స్‌కి థాంక్స్‌. ఎన్టీఆర్‌ మీ అందరికీ అన్న, నాకు మాత్రం తమ్ముడు. మనందరం ఒకే కుటుంబం. నా తమ్ముడ్ని ఇప్పటివరకు ఎంతగా ఆదరించారో ఎప్పటికీ అలాగే మీ ప్రేమను అందిస్తారని ఆశిస్తున్నాను. ఎన్టీఆర్‌ను సెట్‌లో యాక్ట్‌ చేస్తున్నప్పుడు అతనిలో నన్ను నేను చూసుకున్నాను. అంతగా నన్ను ఇంప్రెస్‌ చేశాడు. అతని నుంచి నిజంగా చాలా నేర్చుకున్నాను. సింగిల్‌ టేక్‌ ఫైనల్‌ టేక్‌ హీరో ఎన్టీఆర్‌.   షాట్‌ చేసేటపు దాన్ని 100 పర్సెంట్‌ పర్‌ఫెక్ట్‌ చెయ్యడానికి ట్రై చేస్తాడు. అలాంటి విషయాలు ఎన్నో ఎన్టీఆర్‌ దగ్గర నేర్చుకున్నాను. నా తర్వాతి సినిమాలో వాటిని తప్పకుండా వాడతాను. నేను చాలా కాలం క్రితం క్రిష్‌ షూటింగ్‌ కోసం ఇక్కడికి వచ్చాను. తెలుగు వారు ఎంతో ప్రేమ చూపిస్తారు. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను, ఎన్టీఆర్‌ దాదాపు ఒకేసారి కెరీర్‌ స్టార్ట్‌ చేశాం. ఇప్పుడు కోస్టార్స్‌గా నటించాం. అయితే రియల్‌ లైఫ్‌లో బ్రదర్స్‌గా మారిపోయాం. మేం మళ్లీ కలిసి సినిమా చేసినా చెయ్యకపోయినా, మా బంధం ఇలాగే ఉంటుంది. ఎన్టీఆర్‌ మంచి చెఫ్‌ కూడా. అతని చేతితో వండిన బిర్యాని తినడానికైనా మళ్లీ కలుస్తాను. అంతటి అనుబంధం మా మధ్య పెరిగింది’ అన్నారు హృతిక్‌ రోషన్‌. 
ఎన్టీఆర్‌, హృతిక్‌రోషన్‌ హీరోలుగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మించిన ‘వార్‌2’ ఆగస్ట్‌ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా ఆగస్ట్‌ 10న హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. వేలాది అభిమానుల మధ్య, సినీ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగిన ఈ ఫంక్షన్‌లో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ  ‘ఇంత అద్భుతంగా ఈ ఫంక్షన్‌ జరగడానికి, అసలు ఈ ఫంక్షన్‌ చేయాలని ఆలోచన చేసిన నాగవంశీ కారణం. నన్ను బలవంతం చేసి ఈ ఫంక్షన్‌ ఏర్పాటు చేశాడు. ముందుగా అతనికి థాంక్స్‌. మీకు తెలుసు బాద్‌షా ఫంక్షన్‌ జరిగినపుడు వరంగల్‌కి చెందిన ఒక అభిమాని తొక్కిసలాటలో చనిపోయాడు. అది నన్నెంతో బాధించింది. అందుకే ఇలాంటి పబ్లిక్‌ ఈవెంట్స్‌ అంటే నాకు భయం. మీ అందరూ ఫంక్షన్‌ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా, క్షేమంగా ఇంటికి వెళ్ళండి. మీకోసం మీ ఇంట్లో ఎదురుచూసేవాళ్లుంటారు. ఇక సినిమా విషయానికి వస్తే.. ‘వార్‌2’ చెయ్యడానికి నిర్మాత ఆదిత్య చోప్రాగారు కారణం. ఇది ఒక అద్భుతమైన సినిమా అవుతుంది. నన్ను నమ్ము అన్నారు. ఆరోజు ఆయన మాటను నేను నమ్మకపోతే.. ఈరోజు ఇంత మంచి సినిమా వచ్చేది కాదు.  హృతిక్‌ రోషన్‌ సర్‌ చేసిన కహోనా ప్యార్‌ హై సినిమా చూసినపుడు అందులో ఆయన చేసిన డాన్స్‌ నన్నెంతో ఇన్‌స్పైర్‌ చేసింది. బెస్ట్‌ డాన్సర్‌ అంటే మైఖేల్‌ జాక్సన్‌ అనుకునేవాడిని. కానీ, హృతిక్‌ సర్‌ డాన్స్‌ చూసి మెస్మరైజ్‌ అయిపోయాను. 25 సంవత్సరాలకు ఆయనతో కలిసి నటించడం, డాన్స్‌ చేయడం నిజంగా గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌. నేను చెబుతున్నాను ఇండియాలో నెంబర్‌ వన్‌ డాన్సర్‌ హృతిక్‌రోషన్‌.  నాకు జన్మనిచ్చిన తండ్రి హరికృష్ణగారితో నేను ఒకటే చెప్పాను. మీరు నాకు జన్మనిచ్చారు. కానీ, నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకునే అభిమానులే నాకు ఎక్కువ అని. నా మొదటి సినిమా రామోజీరావుగారి ప్రొడక్షన్‌లో నిన్ను చూడాలని చేశాను. ఈ సినిమా రిలీజ్‌ అవ్వకముందే ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి నేను మీ అభిమానిని అని చెప్పాడు. నా సినిమా ఒక్కటి కూడా రిలీజ్‌ అవ్వలేదు కదా నువ్వెలా నా అభిమానివయ్యావు అని అడిగాను. అవన్నీ నాకు తెలీదండీ.. ఇక నుంచ నేను మీ వెంటే ఉంటాను అన్నాడు. అతని పేరు ముజీబ్‌. అతనితో మొదలైన నా అభిమానులు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు.  ‘వార్‌2’ అనేది హిందీ సినిమా కాదు, తెలుగు సినిమా కూడా. నేను హిందీకి వెళ్ళడం కాదు, హృతిక్‌ సర్‌ తెలుగుకి వచ్చారు. సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. మీరంతా ఎంజాయ్‌ చేసే ఎలిమెంట్స్‌ చాలా వున్నాయి. కాకపోతే ఆ ట్విస్టులేమిటో మీరు రివీల్‌ చెయ్యకుండా ఉంటే బాగుంటుంది. ఈ సినిమా ఎలా ఉంటుందంటే... అంటూ రెండు కాలర్స్‌ ఎత్తి చూపించారు ఎన్టీఆర్‌. ఆ వెంటనే హృతిక్‌ కూడా వచ్చి రెండు కాలర్స్‌ ఎత్తిపట్టుకున్నారు. సినిమాను అందరూ ఎంజాయ్‌ చెయ్యండి, డబుల్‌ కాలర్‌ ఎత్తాను. అవకాశం ఉంటే మళ్ళీ సక్సెస్‌ మీట్‌లో కలుద్దాం. అలాగే మిమ్మల్నందర్నీ ఒకసారి కలుస్తాను. పోటో సెషన్‌ చేద్దాం. అందరితోనూ ఫోటోలు దిగుతాను’ అన్నారు ఎన్టీఆర్‌. 
ప్రభాస్‌, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రాజా సాబ్‌’ చిత్రాన్ని డిసెంబర్‌ 5న విడుదల చేయబోతున్నట్టు ఆల్రెడీ ఎనౌన్స్‌ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ విడుదలై సినిమాపై భారీ అంచనాలను ఏర్పరిచింది. ప్రభాస్‌కి బాలీవుడ్‌ మార్కెట్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రభాస్‌ చేసిన కొన్ని సినిమాలు తెలుగు కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువ కలెక్ట్‌ చేశాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణవీర్‌సింగ్‌ తాజా సినిమా ‘దురంధర్‌’ చిత్రాన్ని కూడా డిసెంబర్‌ 5నే విడుదల చేయబోతున్నట్టు ఎనౌన్స్‌ చేశారు. ఒకేరోజు ఈ రెండు భారీ సినిమాలు రాబోతున్నాయి. అయితే ‘రాజాసాబ్‌’ డిసెంబర్‌ 5న రిలీజ్‌ కాకపోవచ్చని, సంక్రాంతికి మారే అవకాశం ఉందనే వార్త కూడా ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టు తెలుగు రాష్ట్రాల బయ్యర్లు కూడా సంక్రాంతికి వస్తేనే బాగుంటుందని నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే సినిమాను వాయిదా వేశారా లేదా అనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  డిసెంబర్‌ 5న విడుదల కాబోతున్న ‘దురంధర్‌’ సినిమాపై ‘రాజా సాబ్‌’ ప్రభావం పడే అవకాశం ఉందని బాలీవుడ్‌ ట్రేడ్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రభాస్‌ లాంటి పాన్‌ ఇండియా స్టార్‌తో పోటీకి దిగితే  ఓపెనింగ్స్‌ దెబ్బతింటాయని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు. అందుకే డిసెంబర్‌ కంటే ముందుగా గానీ, ఆ తర్వాతగానీ ‘దురంధర్‌’ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తే బాగుంటుందని నిర్మాతలకు సూచిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి పూర్తి చేయాల్సిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ఇంకా ఉంది. కాబట్టి ముందుగా రిలీజ్‌ చేసే అవకాశం లేదు. దురంధర్‌ సినిమా యానిమల్‌ తరహాలో వైలెంట్‌గా ఉంటుందట. అందుకే రిలీజ్‌ విషయంలో తొందరపడకుండా ఏం జరుగుతుందో చూద్దామన్న ధోరణిలో ఆ చిత్ర నిర్మాతలు ఉన్నారు. 
తమ వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు గత 8 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా షూటింగ్స్‌ కూడా ఆగిపోయాయి. వేతనాల పెంపుకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ విషయంలో కార్మికులు పట్టు వీడడం లేదు, అలాగే నిర్మాతలు దిగి రావడం లేదు. ఫిలిం ఛాంబర్‌, నిర్మాతల వ్యవహార శైలిపై ఫెడరేషన్‌ అధ్యక్షుడు అనిల్‌ వల్లభనేని స్పందించారు. ‘గత ఎనిమిది రోజులుతగా సమ్మె చేస్తున్నాం. ఎవరైతే 30 శాతం వేతనాలు పెంచి ఇస్తున్నారో వారి సినిమాలకే పనిచేస్తున్నాం. ఫిలిం ఛాంబర్‌తో నిన్న జరిగిన చర్చలతో సమస్య పరిష్కారం అయిపోతుందని నమ్మాం. మేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మొదట 20 శాతం పెంచండి, ఆ తర్వాత రెండేళ్ళకు 10 పర్సెంట్‌ పెంచండి అని అడిగాము. వాళ్ళు మాత్రం ఏడాదికో పర్సెంటేజ్‌ చెప్పారు. అది కూడా కొన్ని యూనియన్లకు అసలు పెంచం అని చెప్పారు. ఫైటర్స్‌, డాన్సర్స్‌లకు కూడా వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. వేతనాల పెంపు విషయంలో నిర్మాతలు నిర్లిప్తంగా ఉన్నారు. పొట్ట కాలితే వాళ్ళే దారికొస్తారు అనే ధోరణిలో వాళ్లున్నారు. కార్మికులందరి వేతనాలు పెంచాలి. ఇదే మా డిమాండ్‌. ఛాంబర్‌తో చర్చలు జరిపి రెండు రోజుల్లో లేబర్‌ కమిషనర్‌ దగ్గరకు రమ్మన్నారు. ఛాంబర్‌తో చర్చలు సఫలం కాకపోతే సమ్మె కొనసాగుతుంది.  అలాగే విశ్వప్రసాద్‌ ఇచ్చిన నోటీసులపై లీగల్‌గా వెళతాం. ఆయన్నుంచి మాకు 90 లక్షల బకాయిలు రావాల్సి ఉన్నాయి. విశ్వప్రసాద్‌ మాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మా కార్మికులు కోరుకుంటున్నారు. ఎందుకంటే వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే ఛాంబర్‌కి చెప్పాలి. అంతేగానీ, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. గత ఎనిమిది రోజులుగా చిరంజీవిగారు ఎప్పటికప్పుడు మా వివరాలు తెలుసుకుంటున్నారు. మా కార్మికుల పక్షాన నిలబడిన కోమటిరెడ్డిగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్వరలోనే వారిని కలుస్తాం. దీనిలో ప్రభుత్వం జోక్యం కూడా ఉంటే కొన్ని వారు కొన్ని సూచనలు చేస్తారు. ఏదైనా ఛాంబర్‌ నిర్ణయం ఫైనల్‌. ఫ్రభుత్వం జొక్యం అంటే వారి సూచనలు చేస్తారు, ఎదైనా ఛాంబర్‌ డెషిషనే ఫైనల్‌. మా వేతనాల పెంపు విషయంలో మేం చిత్తశుద్దితో పోరాటం చేస్తున్నాం. మొత్తం 24,000 మంది కార్మికులు ఉన్నారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఫిలిం ఛాంబర్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటున్నాం. పిలుపొస్తే వెళ్లి మాట్లాడతాం’ అన్నారు అనిల్‌ వల్లభనేని.
గత కొన్ని సంవత్సరాలుగా అల్లు అర్జున్‌ లుక్‌ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. పుష్ప రిలీజ్‌ ముందు నుంచి ఇప్పటివరకు గడ్డంతోనే ఉంటున్నాడు. అలాంటిది ఒక్కసారిగా లుక్‌ మారిపోయింది. ప్రస్తుతం అట్లీ కాంబినేషన్‌లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం బన్నీ లుక్‌ పూర్తిగా మార్చేశాడు అట్లీ. పుష్పకు ముందు ఎలా ఉండేవాడో.. మళ్ళీ ఆ లుక్‌ తీసుకొచ్చాడు. ఇప్పుడా లుక్‌ వల్ల అల్లు అర్జున్‌కి ఘోరమైన అవమానం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మెగా ఫ్యాన్స్‌, బన్నీ ఫ్యాన్స్‌ మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. అల్లు అర్జున్‌కి అవమానం జరిగితే ఫ్యాన్స్‌ ఎందుకు యుద్ధానికి దిగారు అనే విషయం తెలుసుకుందాం. అట్లీ కాంబినేషన్‌లో చేస్తున్న సినిమాకి సంబంధించిన షూటింగ్‌ కోసం గత నెల ముంబాయి వెళ్లాడు బన్నీ. తన షెడ్యూల్‌ పూర్తి చేసుకొని హైదరాబాద్‌ రిటర్న్‌ అయ్యారు.  ముంబాయి విమానాశ్రయంలోకి మాస్క్‌తో వచ్చారు అల్లు అర్జున్‌. సెక్యూరిటీ చెక్‌లో భాగంగా బన్నీని మాస్క్‌ తియ్యమన్నారు. బన్నీతో వున్న వ్యక్తి అతను అల్లు అర్జున్‌ అని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, సెక్యూరిటీ ఆఫీసర్‌ మాత్రం ఫేస్‌ చూపించాలని అడిగారు. తప్పని పరిస్థితిలో బన్నీ తన మాస్క్‌ తీసి ఫేస్‌ చూపించారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. ‘ఒక హీరోని గుర్తు పట్టలేకపోయారు.. అల్లు అర్జున్‌ పరువు పోయిందిగా’, ‘మాస్క్‌ ఎందుకు పెట్టుకున్నట్టు.. ఏమైనా జబ్బులు ఉన్నాయా’, ‘వాళ్ళ డ్యూటీ వాళ్లు చేస్తున్నారు.. ఎందుకంత బిల్డప్‌’, ‘అల్లు అర్జున్‌కి పొగరు ఏమాత్రం తగ్గలేదు’.. కామెంట్స్‌ వస్తున్నాయి. వాళ్ళంతా మెగా ఫ్యాన్స్‌ అని అర్థమవుతూనే ఉంది. ‘మాస్క్‌ ఉంటే ఎవరినైనా గుర్తు పట్టడం కష్టం.. అందులో పరువుపోయేది ఏముంది?’, ‘సెక్యూరిటీకి సహకరించడం తప్పు ఎలా అవుతుంది అంటూ బన్నీ ఫ్యాన్స్‌ రిప్లయ్‌ ఇస్తున్నారు. 
సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ లేటెస్ట్‌ మూవీ ‘కూలీ’ ఆగస్ట్‌ 14న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. అంతేకాదు, రజినీకాంత్‌ సినీ జీవితం ప్రారంభించి 50 సంవత్సరాలు కాబోతోంది. ఈ రెండు సందర్భాలను అభిమానులు పండగలా జరుపుకోబోతున్నారు. అభిమానులే కాదు, కొన్ని సంస్థలు కూడా రజినీ గోల్డెన్‌ జూబ్లీ ఇయర్‌ను సెలబ్రేట్‌ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఆగస్ట్‌ 14ని సెలవు దినంగా ప్రకటించాయి. ఇదిలా ఉంటే, యుఎన్‌ఓ ఆక్వా సంస్థ అధికారికంగా ఒక లెటర్‌ను విడుదల చేసింది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు సెలవుతోపాటు ‘కూలీ’ సినిమా చూసేందుకు ఉచిత టికెట్లను కూడా అందజేయబోతోంది. చెన్నయ్‌తోపాటు బెంగళూరు, తిరుచ్చి, తిరునెల్వేలి, చెంగల్పట్టు, మట్టుతావని, అలపాలయం తదితర బ్రాంచిల్లోని ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుందని కంపెనీ విడుదల చేసిన లెటర్‌లో పేర్కొంది.  సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘కూలీ’ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ నిర్మించింది. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఆమిర్‌్‌ఖాన్‌, ఉపేంద్ర వంటి స్టార్లు కూడా నటించారు. ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ హీరోలుగా ‘వార్‌2’ కూడా అదే రోజు రిలీజ్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలకూ భారీ హైప్‌ ఉంది. అయితే ఏ సినిమా ఎంతటి ఘనవిజయం సాధిస్తుంది అనేది ఆసక్తిదాయకంగా మారింది. 
Following the completion of his highly anticipated film Ustad Bhagat Singh with Pawan Kalyan, director Harish Shankar is set to collaborate with Sri Venkateswara Creations (SVC) for his next project. This marks a significant reunion for the director with the production house, for whom he previously helmed blockbusters like Subramanyam For Sale and Duvvada Jagannadham. According to the makers, the upcoming film will be a lavishly mounted, pan-India production featuring a major star. The project is described as an exciting venture for the banner and a celebrated homecoming for the director. Details regarding the star cast, title, and other key crew members are being kept under wraps for now, with an official announcement expected at an appropriate time. Currently, Harish Shankar is busy with production and post production works of Ustad Bhagat Singh. The shoot of this huge film will conclude by end of September and there are chances for the film to release in Summer or even for Sankranti next year, as per the best available date. Mythri Movie Makers are producing it. 
The Film Federation has announced that workers will only return to shooting if a flat 30% wage increase is implemented. The union leaders stated that the tiered percentage system proposed by the producers is unacceptable. While expressing openness to negotiating on the producers' conditions, they clarified that a phased acceptance of these terms is possible and not a major obstacle. The Federation also insisted that any wage increase must be applied equally across all unions, alleging that producers are attempting to create divisions among the various worker groups. To press their demands, the unions have announced a protest program scheduled for tomorrow at 8:30 AM. They have stated that they would not agree for divide and rule policy of producers. We want clarity on how they will work towards solving the issues amicably.  They stated that they will discuss with all unions and every member representative tomorrow. They stated that 8 film shootings and other 3 are happening as those producers have given 30% hikes. If they will also strike against these or not will be announced after their general body meeting. 
The Active Producers of the Telugu Film Chamber have provided clarity on a proposed wage hike for film industry workers. At a recent media conference, producers agreed to a tiered wage increase contingent upon the Federation accepting certain conditions they have stipulated. For workers earning up to ₹2,000 per day, the proposed increase is 15% in the first year, followed by a 5% increase in both the second and third years. For those with a daily wage of ₹1,000 or less, a 20% hike is proposed for the first year, followed by a 5% increase in the third year, with no change in the second year. Chamber Secretary Damodar Prasad stated that these hikes are only valid if the Federation accepts the producers' terms. The event was attended by prominent producers including Vishwa Prasad, Nagavamsi, Mythri Naveen, Sudhakar Cherukuri, Radhamohan, Sahu Garapati, S.K.N., Bapineedu, and Cherry.
  అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'పరదా'. ఆనంద మీడియా బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకుడు. ఆగస్టు 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ట్రైలర్ విడుదలైంది. (Paradha Trailer)   ట్రైలర్ లో ఊరి ఆచారం అంటూ ముఖానికి పరదా వేసుకొని అనుపమ దర్శనమిచ్చింది. అసలు ఆ పరదా వెనుకున్న కథ ఏంటనే ఆసక్తిని కలిగిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. మెసేజ్ తో కూడిన ఓ ఎమోషనల్ రైడ్ ను చూడబోతున్నామనే హామీని ట్రైలర్ ఇస్తోంది. టెక్నికల్ గానూ బాగుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ మెప్పించాయి. "మగవాళ్ళు చేయలేనిది, ఆడవాళ్ళు చేయగలిగేది.. పిల్లల్ని కనడమే" వంటి డైలాగ్ లు కూడా ఆకట్టుకున్నాయి. మొత్తానికి 'పరదా' ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది.    ఈమధ్య ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో 'పరదా' మూవీ బాక్సాఫీస్ దగ్గర సర్ ప్రైజ్ చేస్తుందేమో చూడాలి.   గోపీసుందర్ సంగీతం అందిస్తున్న 'పరదా' చిత్రంలో దర్శన, సంగీత, రాజేంద్రప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా మృదుల్ సుజిత్ సేన్, ఎడిటర్ గా  ధర్మేంద్ర వ్యవహరిస్తున్నారు.  
రక్షా బంధన్ ఆగస్టు 9వ తేదీన వచ్చింది. ఈ రోజు కోసం కొందరు  ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుంటారు. కొందరు అక్కాచెల్లెళ్ళు  ఇప్పటికే కొత్త ఆలోచనలతో రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి రెఢీ అవుతున్నారు. కొత్త బట్టలు, రాఖీ  సిద్ధం చేసుకోవడం పరిపాటి. ప్రతిసారీ  పండుగను ఇంకాస్త మెరుగ్గా చేసుకోవాలని అనుకుంటారు.  కానీ ఇంకా మెరుగ్గా అంటే ఏం చేయాలో చాలామందికి తెలియదు.  మెరుగ్గా చేసుకోవడం అంటే కాస్త ఖరీదైన రాఖీ కట్టడం,  ఖరీదైన స్వీట్లు తెచ్చి పంచుకుని తినడం అని అనుకుంటారు చాలా మంది. కానీ ఇది తప్పు.. చాలామంది చేసేది కూడా రాఖీ కట్టడం, స్వీట్లు తినడం.. దీంతో రాఖీ సెలబ్రేషన్ అయిపోయింది అనుకుంటారు. కానీ రాఖీ పండుగ ఏడాది మొత్తం గుర్తుండిపోవాలి అంటే.. కాస్త డిఫరెంట్ గా ఆలోచించాలి.  ప్రణాళిక మార్చాలి.  ఇందుకోసం ఏమేమి చేయవచ్చు తెలుసుకుంటే.. సరదా రోజు.. రక్షా బంధన్ ను స్పెషల్ గా  చేసుకోవాలనుకుంటే  ఆ రోజును సరదాగా మార్చేయాలి. ఇందులో భాగంగా   సినిమా చూడటానికి వెళ్ళవచ్చు. ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు,   తోబుట్టువులందరితో కలిసి సినిమా వెళ్లడం చాలా మంచి అనుభూతి ఇస్తుంది.  అందరూ కలసి ఇంట్లో అయినా ఒక మంచి సినిమా చూసేయవచ్చు.  సినిమా చూస్తూ ఆస్వాదించడానికి  అందరూ కలసి స్నాక్స్ రెఢీ చేసుకోవడం,  లేదా ఆర్డర్ చేసుకుని అయినా సరే.. అందరూ కలిసి కాసింత సమయం గడపడం మంచి అనుభూతిని ఇస్తుంది. అట్లాగే గేమ్స్ ఆడటం,  సరదాగా గడపడం ద్వారా రోజును గుర్తుండిపోయేలా చేసుకోవచ్చు. ఫ్యామిలీ టూర్.. కుటుంబం మొత్తం ఒకే చోట కలవడం చాలా మంచి జ్ఞాపకం అవుతుంది.  కుటుంబంతో కలిసి పిక్నిక్ ప్లాన్ చేసుకోవచ్చు.  కుటుంబ సభ్యులందరూ ఒకరితో ఒకరు సమయం గడపగలుగుతారు. కుటుంబం అంతా ఒకే చోట కలిసేలా మీరు ఒక గొప్ప రోజును ప్లాన్ చేసుకున్నట్లుగా ఉంటుంది.  అందమైన గార్డెన్ లో  లేదా మీకు ఇష్టమైన ప్రదేశాలలో ఏదైనా పిక్నిక్ ప్లాన్ చేసుకోవచ్చు. దీని కోసం స్నాక్స్, స్వీట్లు, పానీయాలు మొదలైనవి ఏర్పాటు చేసుకుంటే ఇబ్బంది లేకుండా టూర్ ఎంజాయ్ చేయవచ్చు. అందరూ కలసి గేమ్స్ ఆడుకోవడం లాంటివి కూడా భలే మజా ఇస్తాయి. కలిసి వంట చేయడం.. రక్షా బంధన్ రోజు  అన్నా చెల్లెళ్లు కలిసి ఇష్టమైన ఆహారాన్ని వండటం, దాన్ని ఇంటిల్లిపాదికి వడ్డించడం చేయవచ్చు. ఇది చాలా మంచి మెమరీ గా మిగులుతుంది.    మంచిగా మాట్లాడాలి.. సాధారణంగా అన్నా చెల్లెళ్లు అంటే గొడవ పడటం,  కొట్టుకోవడం, అల్లరి చేయడం.. ఇదే ఎక్కువ ఉంటుంది.  కానీ రాఖీ పండుగ రోజు ఇద్దరూ ఆప్యాయంగా ఉండటం, ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడటం, ఒకరికి మరొకరు ధైర్యం ఇచ్చుకోవడం వంటివి చేయాలి.  ఇదే వారి జీవితాంతం కొనసాగితే  వారి జీవితం ఎంత అదంగా, ఎంత ధైర్యవంతంగా ఉంటుందో అర్థమైతే అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల బంధం పదికాలాల పాటు ఆనందమయంగా ఉంటుంది.                                  *రూపశ్రీ.  
తెలుగు పంచాంగంలో ఒకో మాసంలో వచ్చే పూర్ణిమకు ఒకో ప్రత్యేకత ఉంటుందనే విషయం బాగా గమనిస్తే అర్థమవుతుంది. మాఘ పూర్ణిమ, ఆషాడ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, వీటిని బుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని జరుపుకుంటారు.  ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తోంది. శ్రావణ మాసం అంతా సందడిగానూ ప్రత్యేకంగానూ ఉంటుంది.  అయితే పెళ్లిళ్లు, శుభకార్యాలు, వ్రతాలు వీటితో ఉండే సందడి వేరు. ఈ మాసంలో అన్నా, చెల్లెళ్లను పలకరించే రాఖీ పూర్ణిమ వేరు.  అన్నాచెల్లెళ్ల అనురాగాన్ని, వారి మధ్య ఒకరిమీద మరొకరికి ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేసేది రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమినే రక్షా బంధన్ అని కూడా అంటారు. రక్ష అంటే ఎలాంటి ఆపదలు, సమస్యలు రాకుండా కాపాడేది. బంధన్ అంటే కట్టి ఉంచేది. రక్షా బంధన్ అంటే ఎలాంటి సమస్యలు రాకుండా కట్టి ఉంచే బంధనం. ఆ బంధనమే రాఖీ. అందరూ తమ సోదరులకు రాఖీ కట్టడం వల్ల  వాడుక భాషలో అందరూ రాఖీ పండుగ అంటున్నారు. రాఖీ పండుగ వెనుక కథనాలు!! ఈ పండుగకు వెనుక విభిన్న కథనాలు ప్రచారంలో  ఉన్నాయి. వాటిలో ఎక్కువగా చెప్పుకునేది ఇంద్రుడి కథనం. ఇంద్రుడి కథ!! పూర్వం రాక్షసులు రెచ్చిపోయి మూడు లోకాల మీద దండయాత్ర చేసి మూడు లోకాలను సొంతం చేసుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన పరివారం, తన లోకంలో ఉన్న వాళ్ళందరితో కలసి తన నివాసమైన అమరావతిలో దాక్కున్నాడు. ఇంద్రుడి పరిస్థితి చూసి ఆయన భార్య శచీదేవికి బాధ కలిగింది. దేవాదిదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి ప్రార్థించి, నా భర్తను సమస్య నుండి గట్టెక్కించు అని అడిగింది. సరే అయితే నీ భర్తకు ఎరుపు రంగు దారంతో  రక్ష తయారుచేసి దాన్ని చేతికి కట్టు, అతను విజయం సాధిస్తాడు అని చెబుతాడు. శచీదేవి విష్ణుమూర్తి చెప్పినట్టు ఎరుపురంగు దారంతో రక్ష తయారుచేసి ఇంద్రుడికి కట్టి ఆ తరువాత హారతి ఇచ్చి, నుదుటన వీరతిలకం దిద్ది యుద్ధానికి వెళ్లమంది. అది తెలిసి అమరావతిలో ఉన్న మిగిలిన వారు కూడా రక్షలు తయారుచేసి ఇంద్రుడికి కట్టి, వీరతిలకం దిద్దారు. ఆ యుద్ధంలో ఇంద్రుడు గెలిచి తిరిగి మూడు లోకాల ఆధిపత్యాన్ని సంపాదించాడు. దీనికి గుర్తుగా రక్షా బంధన్ జరుపుకుంటున్నారని చెబుతారు. దీని వెనుక ఉన్న మరొక కథ ద్రౌపతి, కృష్ణుల కథ!! కృష్ణుడు శిశుపాలుడు వంద తప్పులు చేసిన తరువాత శిశుపాలుడిని వధిస్తాడు. ఆ సమయంలో కృష్ణుడి వేలు తెగితే ద్రౌపతి తన చీర కొంగు చింపి కట్టు కడుతుందట. అప్పుడు కృష్ణుడు ద్రౌపతితో నీ సమస్యలలో నేను అన్నగా తోడుంటాను అని చెబుతాడు. ఆ కారణంతోనే ద్రౌపతి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆమెను కాపాడాడు అని చెబుతారు. పురుషోత్తముడి కథ!! అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని అన్నగా భావించి రాఖీ కడుతుంది. అలెగ్జాండర్ ప్రపంచానికి అధిపతి కావాలనే అత్యాశతో తక్షశిల మీద దండెత్తినప్పుడు పురుషోత్తముడు యుద్ధంలో గెలిచినా అలెగ్జాండర్ ని చంపకుండా వదిలేసాడు. రాఖీ కట్టినవారికి భయం దొరుకుతుందని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఇలా చరిత్రలో రాఖీ పౌర్ణమి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. మొత్తానికి ఇందులో ఉన్న అర్థం చెల్లెలు కట్టే రక్ష అన్నకు ఆరోగ్యాన్ని, ఆయుష్షును, అన్నిటికీ మించి క్షేమాన్ని కోరుకుంటే, అన్న చేతిలో ఉండే రక్ష అన్నకు తన చెల్లి విషయంలో ఉండాల్సిన బాధ్యత, చెల్లికి ఇవ్వాల్సిన రక్షణ, భరోసాను స్పష్టం చేస్తాయి. ఇదీ రాఖీ వెనుక ఉన్న అనుబంధం.                                    ◆నిశ్శబ్ద.
చేనేత చాలా గొప్ప కళ.. ఒక దారం కలుస్తుంది, ఆకారం తీసుకుంటుంది, మలుపులు తిరుగుతుంది, కొన్నిసార్లు విప్పుతుంది, విరిగిపోతుంది,  తరువాత మళ్ళీ కలుస్తుంది.  అంతా అయ్యాక ఒక అద్బుతం ఆవిష్కారం అవుతుంది.  అదే చేనేత అందం. జాతీయ చేనేత దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా కనిపించే విభిన్న స్వదేశీ వస్త్రాల గురించి,  చేనేత నైుణ్యం గురించి, భారతదేశానికి చేనేత తెచ్చిపెట్టిన ప్రత్యేక గుర్తింపు గురించి తెలుసుకుంటే.. పెళ్లి, పండుగ, శుభకార్యం.. ప్రత్యేక సందర్భం ఏదైనా పట్టు వస్త్రాలు కట్టుకోవాలి అనుకుంటారు. అయితే మిషన్ వస్త్ర పనితనానికంటే.. చేత పనితనం చాలా అద్బుతాలను ఆవిష్కరిస్తుంది.  ఇది వ్యక్తిలో సృజనాత్మకతను, కళను, పనితనాన్ని వెలికితీస్తుంది. నిజానికి చేనేత అనేది ఒక అద్బుతమైన కళ. కేవలం దారాలతో వస్త్రాలు నేయడం కాదు.. రంగులు,  డిజైన్లు ఇందులో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి.  చేనేత అనేది దేశం యావత్తు ఆవరించి ఉంది. పశ్చిమ భారతదేశంలో  గుజరాత్‌లోని దంగాసియా,  భార్వాడ్ కమ్యూనిటీలు తంగాలియా నేతను ఆచరిస్తారు. ఇది వార్ప్ దారాల చుట్టూ చుట్టబడిన అదనపు దారాలను ఉపయోగించి సృష్టించబడిన చుక్కల నమూనాలకు ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్రలో విదర్భ..  క్లిష్టమైన కార్వతి కినార్ నేత  చాలా ప్రత్యేక కలిగి ఉంది. నేత కళాకారిణి శ్రుతి సాంచెటికి ఈ కళను కాపాడుకుంటూ వస్తోంది. తాను ఈ చేనేత పనిని సంరక్షించడం తన బాధ్యత అనుకుంటోంది. "ఈ కళారూపం నాకు చాలా విలువైనది" అని ఆమె చెబుతుంది. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ నుండి వచ్చిన ఇకత్-రంగు వేసిన, నూనెతో  చేయబడిన టెలియా రుమల్ ఫాబ్రిక్ ఎరుపు, నలుపు,  తెలుపు రేఖాగణిత,  పూల నమూనాలను కలిగి ఉంటుంది. ఇక ధర్మవరం పట్టు,  బనారస్,  కంచి,  ఉప్పాడ వంటివి వస్త్రాలలో చీరల స్థానాన్ని ఎప్పుడూ ఒక మెట్టు కాదు.. వంద మెట్లు పైన ఉంచుతున్నాయి. నిజానికి చీర అనే వస్త్రం కూడా తరతరాలుగా ఇట్లా నిలబడటానికి కారణం పట్టు వస్త్రాలు.. అందులోనూ సాంప్రదాయత, భారతీయతనం ఈ చీరలలో ఉట్టిపడటమే.. ఈ కారణంగానే ఎన్ని రకాల వస్త్రాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చినా  చీరకు ఒక స్పెషల్ స్టేటస్ ఉండనే ఉంది. కేవలం చీరలు అనే కాదు.. పురుషుల వస్త్రాలు,  పిల్లల వస్త్రాలను సాంప్రదాయంగా ఉంచడంలో చేనేత వస్త్రాలు ఎప్పుడూ ముందుంటాయి. అందుకే చేనేతలను ఎప్పుడూ గౌరవించాలి. ఆదరించాలి, ప్రోత్సహించాలి.                                            *రూపశ్రీ.
  ఉప్పు లేని వంట, సారం లేని జీవితం వ్యర్థం అని అంటారు. వంటల్లో పులుపు, కారం కు జతగా ఉప్పు కూడా తగిన పరిమాణంలో ఉండాలి. లేకపోతే అస్సలు తినలేం. అయితే ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఆరోగ్యానికి బోలెడు ముప్పులు తప్పుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందంటే.. ఉప్పు నీటిలో సోడియం, పొటాషియం,  క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది.  ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఈ ఎలక్ట్రోలైట్లు శరీర ఆర్థ్రీకరణ, నరాల పనితీరు, కండరాల సంకోచాలు మొదలైన కార్యకలాపాలకు సహాయపడుతుంది. ఉప్పు నీరులో ఉండే సమ్మేళనాలు కడుపులో ఉండే జీర్ణ ఎంజైములు,  హైడ్రోక్లోరిక యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.  జీర్ణక్రియ,  పోషకాల శోషణకు సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఉప్పు నీటిలో మినరల్స్ కంటెంట్  ఎక్కువగా ఉంటుంది.  ఇది తామర, సొరియాసిస్ వంటి చర్మ సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. గొంతు నొప్పి,  గొంతు సంబంధ సమస్యలు తగ్గడానికి చాలామంది ఉప్పు నీటితో పుక్కిలిస్తుంటారు. అయితే ఉప్పు నీటితో పుక్కిలించడం,  ఉప్పు నీటిని ఉదయాన్నే తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు,  గొంతులో శ్లేష్మం వంటివి తగ్గడమే కాకుండా అలెర్జీలు,  శ్వాసకోశ ఆరోగ్యం,  జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో ఉండే సూక్ష్మ వ్యర్థాలు,  విష పదార్థాలను శరీరం నుండి బయటకు పంపడంలో ఉప్పు నీరు సహాయపడుతుంది.  ఈ కారణంగా ఇది శరీరాన్ని శుద్ది చేస్తుంది. ఏ ఉప్పు వాడితే మంచిదంటే.. నీటిలో ఉప్పు కలుపుకుని ఉదయాన్నే తాగడం మంచిదే అయినా  అన్ని రకాల ఉప్పుడు ఇందుకు మంచివి కావు. ఉప్పు నీరు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు లభించాలంటే.. హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా శుధ్ది చేయని ఉప్పును ఎంపిక చేసుకోవాలి. ఉప్పు నీరు ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ మోతాదులో ఉప్పు కలిపి తాగకూడదు.  తగినంత మోతాదులో ఉప్పు కలిపి తాగడం అన్ని రకాల వ్యక్తులకు మంచిదే అయినా అధిక రక్తపోటు,  గుండె సంబంధ జబ్బులు ఉన్నవారు  ఉప్పు నీరు తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.                                           *రూపశ్రీ.  
  మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ విషయాన్ని వైద్యులు చెప్పడమే కాకుండా ఆరోగ్యం మీద స్పుహ ఉన్న ప్రతి ఒక్కరూ అదే చెబుతారు.   ఏది తిన్నా అది  ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు తీసుకునే ఆహారం పోషకాలతో సమతుల్యంగా ఉండాలని చెబుతారు. అంతేకాదు.. తీసుకునే ఆహారమే కాకుండా ఆహారం తీసుకునే  సమయం  కూడా అంతే ముఖ్యమని చాలా మంది చెబుతారు. కానీ అధిక శాతం మంది తీసుకునే ఆహారం విషయంలో చూపించిన శ్రద్ద ఆహారం తీసుకునే సమయం విషయంలో అస్సలు చూపించరు. నేటి బిజీ లైఫ్ లో రోజంతా హడావిడిగా పనులు చేయడమే కాదు.. హడావిడిగా తినడం కూడా జరుగుతోంది. రాత్రి సమయంలో  కొన్నిసార్లు  9 గంటలకు, కొన్నిసార్లు 10 లేదా 11 గంటలకు తింటుంటారు.  తిన్న  వెంటనే నిద్రపోతారు. కానీ  రాత్రి 7 నుండి 8 గంటల మధ్య ఆహారం తీసుకుంటే ఆరోగ్య పరంగా అద్భుతాలు జరుగుతాయని అంటున్నారు వైద్యులు.  దీని గురించి తెలుసుకుంటే.. 7-8 మధ్య భోజనం ఎందుకంటే.. 7-8 గంటల మధ్య భోజనం చేయడం వల్ల  మొత్తం ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. త్వరగా భోజనం చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా నిద్ర, గుండె, జీర్ణక్రియ,  చక్కెర నియంత్రణకు కూడా చాలా మంచిది.  త్వరగా భోజనం చేసేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 27% తక్కువగా ఉంటుందని,  అధిక కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం 19% తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనితో పాటు, బరువు తగ్గడం, జీర్ణ ఆరోగ్యం,  నిద్ర నాణ్యతకు కూడా ఇది 7-8 మధ్య రాత్రి భోజనం చేయడం మంచిది.   రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల షుగర్ సమస్య వచ్చే ప్రమాదం సాధారణం కంటే 20 శాతం ఎక్కువ ఉంటుందట. జీర్ణశక్తి.. త్వరగా భోజనం చేయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే అది జీర్ణక్రియను చక్కగా ఉంచుతుంది. రాత్రి 8 గంటల ముందు భోజనం చేసినప్పుడు, శరీరం దానిని జీర్ణం చేసుకోవడానికి తగినంత సమయం తీసుకుంటుంది. ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి దాదాపు 2 నుండి 4 గంటలు పడుతుంది. ఆహారం తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది,  గ్యాస్, మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలు ఏర్పడతాయి. త్వరగా భోజనం చేయడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ (గుండెల్లో మంట) ప్రమాదం 50% తగ్గుతుంది. సూర్యాస్తమయం తర్వాత జీర్ణక్రియ మందగిస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది, కాబట్టి రాత్రిపూట తేలికగా,  త్వరగా తినాలి. నిద్ర.. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంలో బిజీగా ఉండటం వల్ల విశ్రాంతి లభించదు. దీని ప్రభావం నిద్రపై కూడా కనిపిస్తుంది.  నిద్రపోవడానికి 2-3 గంటల ముందు తినడం వల్ల శరీరం ప్రశాంతంగా ఉంటుంది.  నిద్ర గాఢంగా పడుతుంది. 7-8 మధ్య రాత్రి భోజనం చేసేవారికి నిద్రలో గ్యాస్, గుండెల్లో మంట లేదా భారం తక్కువగా ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మంచి నిద్ర మానసిక,  శారీరక ఆరోగ్యానికి మంచిది. బరువు.. బరువు తగ్గాలనుకునేవారు ఆహారం మాత్రమే కాదు, తినే సమయం కూడా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీ (2013) ప్రకారం, సాయంత్రం 7 గంటలకు ముందు తినేవారిలో శరీరం కేలరీలను శక్తిగా మార్చగలదు కాబట్టి బరువు తగ్గడం వేగంగా ఉంటుంది. రాత్రి ఆలస్యంగా  భోజనం చేయడం వల్ల ఆహారం కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. త్వరగా తినడం వల్ల జీవక్రియ చురుకుగా ఉంటుంది.  ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. అలాగే రాత్రి భోజనం తర్వాత  శారీరక శ్రమ లేదా కాస్త వాకింగ్ చేయడానికి కూడా సమయం దొరుకుతుంది. ఇది కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులు సమయానికి రాత్రి భోజనం చేయడం  చాలా ముఖ్యం. ఆలస్యంగా భోజనం చేసేవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరం  సిర్కాడియన్ సైకిల్ కు భంగం కలుగుతుంది, ఇది హార్మోన్ల అసమతుల్యత ప్రమాదాన్ని పెంచుతుంది.                              *రూపశ్రీ.
  కళ్ళు మన శరీరంలో అతి ముఖ్యమైన,  సున్నితమైన భాగం. ప్రపంచాన్ని చూడటానికి, అర్థం చేసుకోవడానికి,  అనుభూతి చెందడానికి, అర్థం చేసుకోవడానికి కళ్లే ఆధారం. అయితే నేటి కాలంలో కంటి సమస్యలు పెరుగుతున్నాయి, వీటిలో కంటి చూపు మందగించడం, కంటి ఒత్తిడి, చికాకు, ఎరుపు వంటివి ఉన్నాయి. స్క్రీన్ సమయం పెరగడం వల్ల కూడా ఈ కంటి సమస్యలు వస్తున్నాయి. పెద్దల  నుండి పిల్లల  వరకు ప్రతిదానికీ డిజిటల్ పరికరాలు చాలా అవసరం అయ్యాయి. గంటల తరబడి వాటి ముందు గడపడం వల్ల కళ్ళపై చాలా ఒత్తిడి వస్తుంది,  కళ్ళు అలసిపోతాయి. వీటి వల్ల కంటి ఒత్తిడి, కంటి చూపు మందగించడం వంటి సమస్యలు వస్తాయి.  దీని నుండి ఉపశమనం కలగడానికి, కంటి చూపు మెరుగవ్వడానికి 20-20-20 టెక్నిక్ భలే సహాయపడుతుంది.  దీని ప్రయోజనాల గురించి తెలుసుకుంటే.. 20-20-20 టెక్నిక్.. స్క్రీన్ చూస్తున్నప్పుడు కంటి ఒత్తిడిని నివారించడానికి 20-20-20 నియమం ఒక గొప్ప మార్గం . ఈ నియమంలో   స్క్రీన్ నుండి 20 సెకన్ల విరామం తీసుకుంటారు.  ఇది కళ్ళకు విశ్రాంతిని ఇస్తుంది. ప్రతి 20 నిమిషాలకు కనీసం 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న దేనినైనా చూడాలి. ఇది ఎక్కువసేపు డిజిటల్ స్క్రీన్‌లను చూడటం వల్ల కలిగే కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రయోజనాలు.. ప్రతిరోజూ 20-20-20 నియమాన్ని పాటించడం ద్వారా, కంటి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు లేదా నిరోధించవచ్చు. దీనికి సంబంధించిన ఆధారాలు అనేక అధ్యయనాలలో కూడా కనుగొనబడ్డాయి. 20-20-20 నియమం కంప్యూటర్ విజన్ సిండ్రోమ్‌ను నివారించడానికి,  దీర్ఘకాలిక కంప్యూటర్ లేదా డిజిటల్ పరికర వినియోగం వల్ల కలిగే డిజిటల్ కంటి ఒత్తిడి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడే సరళమైన,  ప్రభావవంతమైన టెక్నిక్. స్క్రీన్ ను చూస్తున్నప్పుడు ఇటువంటి చిన్న విరామాలు తీసుకోవడం వల్ల కంటి దృష్టి కేంద్రీకరించే కండరాలు సడలించబడతాయి. ఇది కంటి ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇతర మార్గాలు.. కంటి ఒత్తిడిని కొన్ని ఇతర మార్గాల ద్వారా కూడా తగ్గించవచ్చు.  స్క్రీన్ చూస్తున్నప్పుడు లైటింగ్ ను అడ్జెస్ట్ చేసుకోవాలి.  టీవీ, ఫోన్, ల్యాప్‌టాప్ చూడటం చాలా మసక వెలుతురు లేదా లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు   కంటి ఒత్తిడిని పెంచుతుంది.  కంప్యూటర్‌ను ఉపయోగించడం లేదా చదవడానికి వైద్యులు సూచించిన  అద్దాలు ధరించడం వల్ల కంటి ఒత్తిడి తగ్గుతుంది. పెద్దలు స్క్రీన్ సమయాన్ని కంట్రోల్ పెట్టుకుంటే పిల్లలకు కూడా దాన్ని అలవాటు చేయవచ్చు. తాము ఆచరిస్తూ పిల్లలకు చెప్పడం మంచిది.   ఎక్కువసేపు స్క్రీన్ వాడటం వల్ల కంటి ఒత్తిడి,  నొప్పి వస్తుంది. దీన్ని పై చిట్కా తో అధిగమించవచ్చు. కంటి సమస్యలు ఉన్నవారు  క్రమం తప్పకుండా కంటి వ్యాయామాలు చేయాలి.  ఇది కంటి ఒత్తిడిని తగ్గించగలదు.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...