LATEST NEWS
హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు గుమికూడడంతో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సీరియస్ గా స్పందించింది. భారీ జనసమీకరణ జరుగుతోందని సమాచారం అందించలేదనే కారణంతో ఇద్దరు కానిస్టేబుల్స్ పై చర్యలకు ఆదేశించింది. ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఎస్బీ కానిస్టేబుళ్లు స్వామి నాయక్, నాగరాజులను ఉన్నతాధికారులు వీఆర్ కు పంపించారు. ఈమేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అల్లు అర్జున్ పైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.  నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి అల్లు అర్జున్ ఈ నెల 11న తన భార్యతో కలిసి నంద్యాల వెళ్లారు. హీరో వస్తున్నాడని తెలిసి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు శిల్పా రవిచంద్ర ఇంటికి చేరుకున్నారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో శిల్పా రవిచంద్ర నివాస ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఓవైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా భారీ ఎత్తున జనం గుమికూడడంపై ఈసీ సీరియస్ గా స్పందించింది.విషయం ఉన్నతాధికారులకు తెలియజేయడంలో, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావడంలో విఫలమైన పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈమేరకు ఈసీ నుంచి నోటీసులు అందుకున్న ఎస్పీ, డీఎస్పీ.. ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. దీనిపై స్థానిక రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేయడంతో హీరో అల్లు అర్జున్ తో పాటు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు అధికారంలోకి వస్తారు. ఏ పార్టీ పరాజయాన్ని మూటకట్టుకుంటుంది అన్న చర్చలతో పాటు మరో వ్యక్తి గురించి కూడా రాజకీయ, సినీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ఆ వ్యక్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీకి దగ్గర బంధువు.. అలా చెప్పే కంటే.. మెగాస్టార్ చిరంజీవికి స్వయానా మేనల్లుడు. అటువంటి అల్లు అర్జున్   ఎన్నికల సందర్భంగా తన మిత్రుడు అంటూ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా చంద్ర కిషోర్ రెడ్డి కి మద్దతుగా నంద్యాల వెళ్లి మరీ ర్యాలీలో పాల్గొన్నారు.  మరో వైపు జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసినప్పటికీ ఆయనకు ఒక ట్వీట్ ద్వారా మద్దతు ప్రకటించి ఊరుకున్న అల్లు అర్జున్ పనిమాలా నంద్యాల వరకూ వెళ్లి మరీ వైసీపీ అభ్యర్థి శిల్పాకు మద్దతు ప్రకటించి రావడం సంచలనం సృష్టించింది. దీంతో మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కు పొసగడం లేదా అన్న అనుమానాలు సైతం సర్వత్రా వ్యక్తం అయ్యాయి. ఈ విషయంలో మెగా అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సామాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో మాటల యుద్ధం కూడా జరిగింది. అది పక్కన పెడితే ఓట్ల లెక్కింపు జరిగి, ఫలితాలు ప్రకటించే జూన్ 4వ తేదీ సమీపిస్తున్న కొద్దీ అల్లు అర్జున్ పై రాజకీయ సినీ రంగాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.     ఒక వేళ శిల్పా ఓడిపోతే అల్లు అర్జున్ పరిస్థితి ఏమిటి అన్నదే ఈ చర్చ. ఎందుకంటే పోలింగ్ సరళిని చూసిన తరువాత రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం కూటమే అన్న భావన సర్వత్రా బలపడింది. అందుకు తగ్గట్టుగా వైసీపీ శ్రేణులు, నేతల ప్రకటనలు కూడా ఓటమిని అంగీకరించేసినట్లుగానే ఉన్నాయి.  దీంతో  వైసీపీ అధికారం కోల్పోయినా, గెలిచే  కొన్ని సీట్లలో నంద్యాల లేకపోతే అల్లు అర్జున్ ఇమేజ్  బాగా డ్యామేజ్ అవుతుందని అంటున్నారు.  అదే సమ యంలో  జూనియర్ ఎన్టీఆర్  కున్న   సంయమనం కూడా అల్లు అర్జున్   పాటించలేదని అంటు న్నారు.  ఎందుకంటే వైసీపీ తరఫున గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ లు ఎన్టీఆర్ కు చాలా సన్నిహిత స్నేహితులు. వారిరువురూ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు కూడా చేశారు.  అయితే ఆ ఇద్దరి తరఫునా ప్రచారం చేయడానికి కానీ, మద్దతు పలకడానికి కానీ ఎన్టీఆర్ ముందుకు రాలేదు. అసలు తన స్నేహితులు ఇద్దరూ వైసీపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ వారికి అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు అటువైపు చూడనే లేదు. అయితే అందుకు భిన్నంగా బన్ని అనవసర ఆర్భాటం చేసి మరీ శిల్పాకు మద్దతుగా నంద్యాల వెళ్లారని సినీ రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. బన్నీ తీరు కచ్చితంగా ఆయన కెరీర్ పై ప్రభావం తప్పకుండా పడుతుందని చర్చించుకుంటున్నారు.  
కర్నూలు జిల్లాలో ఓ రైతు పంటపడింది. పొలంలో అతడికి విలువైన వజ్రం దొరికింది.  ఇటీవల కురిసిన వర్షాలకు వజ్రం బయటపడింది. పొలం పనులు చేస్తుండగా కంటపడిన వజ్రాన్ని రైతు భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. విషయం తెలిసి వ్యాపారులు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు. ఆ వజ్రాన్ని సొంతం చేసుకోవడానికి వ్యాపారులు పోటీ పడడంతో వేలం నిర్వహించారు. ఇందులో పెరవల్లికి చెందిన ఓ వ్యాపారస్థుడు రూ.5 లక్షల నగదు, 2 తులాల బంగారం ఇచ్చి ఆ రైతు నుంచి వజ్రాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే, బహిరంగ మార్కెట్ లో ఆ వజ్రం విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఏటా వర్షాకాలం తొలకరి సమయంలో కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం పొలాల్లో రైతులు, కూలీలు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు వెతుకుతుంటారు. దీనికోసం ప్రత్యేకంగా భూమిని లీజుకు తీసుకుని, కూలీలను పెట్టి వెతికించే వాళ్లు కూడా ఉన్నారు. ఒక్క విలువైన వజ్రం దొరికితే దశ మారిపోయే అవకాశం కావడంతో రైతులు కూడా తమ పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతుంటారు. ఈ సంవత్సరం కురుస్తున్న తొలకరి వర్షాలతోనూ వజ్రాలు లభిస్తున్న కొందరు రైతుల పంట పండుతోంది.  రాయలసీమ జిల్లాలలో ఈ సీజన్ అదృష్టాన్ని పరీక్షించుకునే సీజన్. ప్రతి ఒక్కరూ పొలాలలో వజ్రాల వేట కొనసాగిస్తారు. ఇక నక్క తోక తొక్కిన అదృష్టవంతులకు వజ్రాలు దొరుకుతాయి. ఎంతోమందిని ఇక్కడ దొరికే వజ్రాలు బికారుల నుండి అమీర్ లుగా మారుస్తున్నాయి. తొలకరి వర్షాల సమయంలో రాయలసీమ జిల్లాలలో ఎంతోమంది వ్యవసాయ కూలీలు, కొందరు గొర్రెల కాపరులు, వ్యవసాయం చేసుకునే రైతులకు వజ్రాలు దొరికిన అనేక ఉదంతాలు ప్రతీ సంవత్సరం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. భూమిలో దొరికే విలువైన వజ్రాలు, గుప్త నిధులు వంటివి చట్టప్రకారం ప్రభుత్వ ఖజానాకు చేర్చాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూముల్లో దొరికినా సరే అది ప్రభుత్వ ఆస్తేనని చట్టాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రైతుకు దొరికిన వజ్రాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన అధికారులు.. తమకు పట్టనట్టు ఉండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. - ఎం.కె.ఫ‌జ‌ల్‌  
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది... నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు... ఇదీ ఇప్పటి వరకు చాలామంది చూస్తున్న దృక్కోణం! కానీ,  ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జాతీయ స్థాయిలో ఆలోచిస్తున్న కోణం మరొకటి వుంది.. అదే ‘‘చంద్రబాబు.. వైనాట్ ప్రైమ్ మినిస్టర్?’’ ఈసారి ఎన్నికలలో నాలుగు వందల స్థానాలు సాధించాలని బీజేపీ ఊహల పల్లకీలో విహరిస్తోందిగానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని విడతల పోలింగ్ సందర్భంగా బీజేపీ సొంతగా దుమ్ముదులిపేసింది అని చెప్పుకునే స్థాయిలో ఓట్లు పడలేదు. ఎన్డీయేలో భాగస్వాములుగా వున్న పార్టీలు కొన్ని తమ సత్తాను చాటగలిగాయిగానీ, బీజేపీకి తాను ఊహిస్తున్న స్థాయిలో సీట్లు వస్తాయన్న ఆశ కనిపించడం లేదు.. ఒక వేళ బీజేపీకి రావలసిన మెజారిటీ కంటే చాలా తక్కువ స్థానాలు వచ్చిన పరిస్థితుల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఈసారి ప్రధానమంత్రి పదవి మోడీకి, బీజేపీ నాయకుడికి కాకుండా ఎన్డీయేలో భాగస్వాములుగా వున్న మిగతా పక్షాల్లో వున్న సమర్థుడైన నాయకుడికి ప్రధానమంత్రిగా అవకాశం ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించే అవకాశం వుంది. ఆ నాయకుడు చంద్రబాబు ఎందుకు కాకూడదు? దేశ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతోపాటు, ఇండియా భాగస్వామ్య పక్షాలతోపాటు, ఈ రెండు కూటములలోనూ లేని పార్టీల నుంచి కూడా మద్దతు కూడగట్టగల శక్తి వున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆమాటకొస్తే బీజేపీలో కూడా మోడీ, అమిత్ షా మినహా చాలామంది చంద్రబాబు అభిమానులు వున్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడిన చంద్రబాబు చరిత్రను గుజరాత్ బ్యాచ్ మరచిపోయి వుండొచ్చేమోగానీ, బీజేపీ మరచిపోదు. ఒకవేళ ప్రధానమంత్రి అభ్యర్థి మారాల్సి వచ్చిన పక్షంలో చంద్రబాబును మించిన వ్యక్తి మరొకరు లేరు. ఈ మాట అంటే కొంతమందికి కోపాలు వస్తే వచ్చాయిగానీ, అందర్నీ కలుపుకుని వెళ్ళే విషయంలోగానీ, నీతివంతమైన రాజకీయాలు నడపడంలోగానీ, ప్రజాస్వామిక విలువలను, లౌకిక విలువలను పాటించడంలోగానీ, సుదీర్ఘ అనుభవం విషయంలోగానీ, దేశాన్ని ముందుకు నడిపే విజన్‌లోగానీ, ట్రబుల్ షూటింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్‌లోగానీ నరేంద్ర మోడీ కంటే చంద్రబాబు ఒక మెట్టు పైనే వుంటారు. అందుకే ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ అవ్వాల్సిన ఒక కీలక అంశం.. ‘చంద్రబాబు.. వైనాట్ ప్రైమ్ మినిస్టర్’!
కాంబోడియా, భారత్ మధ్య  అక్రమ మాన‌వ‌ రవాణా రాకెట్ నడుస్తోంది. ఉద్యోగాల పేరిట ఎర వేసి 150 మందికి పైగా తెలుగు యువతను అక్రమ రవాణా చేశారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఇక్క‌డి నుంచి తీసుకెళ్ళి, ఆన్ లైన్ స్కాం ఎలా చేయాలో వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారు. బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  మన యువతను మోసం చేస్తూ, వారి జీవితాలతో ఆడుకుంటున్న నకిలీ ఏజెంట్ల ఆటకట్టించాలని, ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ను కూడా చంద్రబాబు తన ట్వీట్ లో ట్యాగ్ చేశారు. వీలైనంత త్వరగా బాధితులను కాంబోడియా నుంచి తిరిగి తీసుకువచ్చేందుకు సాయపడాలని జైశంకర్ కు విజ్ఞప్తి చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట కాంబోడియాకు మానవ అక్రమ రవాణా పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ్యభిచారం కోసం మహిళల అక్రమ రవాణా అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో మహిళలు, బాలలు, వృద్ధులపై నేరాలు విపరీతంగా పెరిగాయి. ఆర్థిక, సైబర్‌ నేరాలు ఎక్కువయ్యాయి. హత్యాయత్నాలు, అపహరణలు పెరిగాయి. జాతీయ నేర గణాంక సంస్థ గణాంకాలు విశ్లేషిస్తే మన రాష్ట్రంలోని దారుణ పరిస్థితులు కళ్లకు కడుతున్నాయ‌ని చంద్ర‌బాబునాయుడు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుతోంది. ఏపీ నుంచి 150 మందికి పైగా తరలించినట్టు పోలీసులు గుర్తించారు. దాదాపు 5 వేల మంది వివిధ దేశాల్లో యువత ఆ ముఠా చేతిలో బందిగా వుంది. ఫెడెక్స్ , టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలు చేయడంలో ఈ అమాయకులని వాడుకుంటున్నారు. ఐటీ ఉద్యోగం పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షన్నర వరకు వసూలు చేసి  కంబోడియాకు త‌ర‌లిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగం అనగానే యువ‌త ట్రాప్‌లో ప‌డిపోతోంది.  కంబోడియాలో రక్షించిన దాదాపు 60 మంది భారతీయులతో కూడిన మొదటి బ్యాచ్‌ స్వదేశానికి చేరుకుంది.  అందులో పలువురు ఏపీ వాసులు ఉన్నారు. కంబోడియా సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుంచి బయటపడి స్వరాష్ట్రానికి చేరుకున్న పలువురికి విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో విశాఖపట్నం పోలీసులు స్వాగతం పలికారు. త‌మ‌ను చైనీస్ ఆపరేటర్లకు విక్రయించి,  హింసించారు.సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడేలా ఒత్తిడి చేశారు, చీకటి గదులలో ఉంచి పనిచేయాలని హింసించిన‌ట్లు బాధితులు చెప్పారు.    అక్రమ రవాణాకు గురైన యువకుల విడుదల కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిందని, హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసిందని, దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు కొనసాగించడానికి ప్రత్యేక అధికారులను కూడా నియమించింది.   - ఎం.కె. ఫ‌జ‌ల్‌
ALSO ON TELUGUONE N E W S
జబర్దస్త్ తో తెలుగు ప్రజల అభిమాన నటుడుగా మారిన హీరో  గెటప్ శ్రీను(getup srinu)హీరో అని ఎందుకు అంటున్నానంటే రీసెంట్ గా  రాజు యాదవ్ తో  సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిన్న  రెండు తెలుగు రాష్ట్రాల్లో  అత్యధిక థియేటర్స్ లో విడుదలయ్యింది.మరి  కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రాజు యాదవ్ (raju yadav) తొలి ఆట నుంచే  బాగుందనే టాక్ సంపాదించుకుంది. రాజు యాదవ్ క్యారక్టర్ లో  గెటప్ శ్రీను సూపర్ గా నటించాడని కొన్ని సీన్స్ లో కన్నీళ్లు కూడా తెప్పించాడనే మాటలు ప్రేక్షకుల దగ్గరనుంచి వినిపిస్తున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి రోజు ఎనభై ఐదు లక్షలు సాధించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర సీడెడ్ లో కలుపుకొని నలబై ఏడు లక్షలు, నైజాం లో నలభై లక్షలు రాబట్టింది. మౌత్ టాక్ తో ఈ కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అలాగే మూవీ చూసిన వారందరు థియేటర్స్ లోనే రాజు యాదవ్ ని చూడండంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు  గెటప్ శ్రీను సరసన నూతన కధానాయిక అంకిత కారత్ చెయ్యగా వకీల్ సాబ్ ఫేమ్ ఆనంద్ చక్రపాణి ,నమని ప్రశాంత్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రశాంత్ రెడ్డి, రాజేష్, స్వాతి లు కలిసి సంయుక్తంగా నిర్మించగా కృష్ణమా చారి రచనా దర్శకత్వాన్ని అందించాడు.సురేష్ బొబ్బిలి, సంగీతాన్ని అందించగా చంద్రబోస్, కాకర్ల శ్యాం సాహిత్య రచన చేసారు  
అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ సినిమా ఎంతో ప్రత్యేకం. అంతేకాదు, అక్కినేని అభిమానులు కూడా ఆ సినిమాని ఎవర్‌గ్రీన్‌ మూవీగా భావిస్తారు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత, అక్కినేని నాగేశ్వరరావు, అఖిల్‌.. ఇలా ఫ్యామిలీలోని వారంతా కలిసి నటించిన ఈ సినిమాని అపురూపంగా భావిస్తారు అభిమానులు. ఈ సినిమా రిలీజ్‌ అయి పదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఇటీవల రిరిలీజ్‌ చేశారు. హైదరాబాద్‌ క్రాస్‌ రోడ్స్‌లోని దేవి థియేటర్‌లో ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాను మరోసారి వీక్షించేందుకు అక్కినేని ఫ్యామిలీతోపాటు అభిమానులు కూడా వచ్చారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున, నాగచైతన్య, సుప్రియ హాజరయ్యారు.  ఆల్రెడీ చూసిన సినిమానే అయినా మూవీని మళ్లీ చూస్తూ అందరూ ఎమోషనల్‌ అయ్యారు. ముఖ్యంగా సుప్రియ తాతని స్క్రీన్‌పై చూసి  పెట్టుకుంది. దీనికి సంబంధంచిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే నాగచైతన్య, సమంత రొమాంటిక్‌ సీన్స్‌కి థియేటర్‌లో అద్భుతమైన స్పందన వచ్చింది. అభిమానులు ఆ సీన్స్‌ వచ్చినపుడు రెచ్చిపోయారు. విజిల్స్‌ వేస్తూ, పేపర్స్‌ జల్లుతూ హడావిడి చేశారు. ఇది చూసిన నాగచైతన్య అసహనం వ్యక్తం చేస్తూ సీరియస్‌ అయ్యారు. ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 
ఎని లాంగ్వేజ్ హీరోయిన్ ని తీసుకోండి. అందరకి లక్ష్యం ఒక్కటే.. బాలీవుడ్ లో కూడా తమ సత్తా చాటాలని. తద్వారా నేషనల్ హీరోయిన్ అనిపించుకోవాలనే ఆశతో ఉంటారు. అది అత్యాశ కిందకి కూడా రాదు. నటిగా వాళ్ళకి ఉన్న హక్కు. రీసెంట్ గా సంయుక్త మీనన్ (Samyuktha Menon)కి కూడా బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. ఈ నేపథ్యంలో  ఆమె పోషిస్తున్న క్యారక్టర్ చర్చినీయాంశ మయ్యింది ప్రభుదేవా, ఒకప్పటి మాజీ హీరోయిన్  కాజోల్ ల కాంబోలో ఒక నూతన చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో  సంయుక్త మీనన్ కూడా నటించబోతుంది.దీంతో ఆమె తన అందచందాలని ఒక రేంజ్ లో ప్రదర్శించడం ఖాయమని అందరు అనుకున్నారు. ఎందుకంటే బాలీవుడ్ అంటేనే గ్లామర్ షో కి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు సంయుక్త ఎటువంటి గ్లామర్ రోల్ లో కనిపించడం లేదు.ప్యూర్ పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారక్టర్ లో కనిపించబోతుంది.దీంతో మొదటి సినిమాకే బాలీవుడ్ కి తన నటనలో ఉన్న సత్తా చూపించే అవకాశం వచ్చింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష లో ఆమె ప్రదర్శించిన నటనని ఎవరు అంత త్వరగా మర్చిపోరు.     2016 లో పాప్ కార్న్ అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత  పవన్ కళ్యాణ్ (pawan kalyan)హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ లో రానా కి జోడిగా నటించి తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరయింది.అక్కడనుంచి ఆమె సినీ ప్రస్థానం చాలా ఫాస్ట్ గా సాగింది.  టాప్ హీరోయిలకే సినిమాలు సరిగా లేకపోతుంటే తనకి  మాత్రం చేతి నిండా సినిమాలు. . తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలో కలిసి ఇప్పటి  వరకు ఇరవై సినిమాలకు పైనే చేసింది.  సార్,  విరూపాక్ష, బింబి సార,డెవిల్ లాంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నిఖిల్ న్యూ మూవీ స్వయంభూ లోను చేస్తుంది    
Talented hero Varun Sandesh will next be seen in a unique thriller ‘Nindha’ directed and produced by Rajesh Jagannadham under the banner of The Fervent Indie Productions. The movie that unfolds Kandrakota Mystery is gearing up for release. The makers who earlier released an engaging teaser have started the musical promotions by unveiling the first single Sankellu. Kids from Ganamas Special School released the song. Santhu Omkar scored a perfect song with hard-hitting lines penned by Kittu Vissapragada. Sreeram Chandra crooned the song dynamically. As the teaser and now the song defines Nindha is not a regular commercial movie. it has a strong message and unexpected thrills in the narrative. ShreyaRani ,Annie and Q madhu are female leads, while Tanikella Bharani, Bhadram, Surya Kumar, Chatrapati Shekar, Mime Madhu and Siddharth Gollapudi will be seen in crucial roles in the movie. Sreeramsiddharth Krishna is playing an important role in the movie  Ramiz Naveeth is the cinematographer, while Anil Kumar is the editor. The makers will announce the film’s release date soon.
రామ్‌గోపాల్‌వర్మ హీరోయిన్ల విషయంలో ఎంత కేర్‌ తీసుకుంటాడో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు తన కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లను పరిచయం చేసిన ఆర్జీవీ ఎప్పటికప్పుడు కొత్త అందాలను అన్వేషిస్తుంటాడు. ఆమధ్య సోషల్‌ మీడియాలో శ్రీలక్ష్మీ సతీష్‌ అనే ఓ భామ వీడియో చూసి ఆమె గురించి ఆరా తీసి మొత్తానికి ఆమెను కాంటాక్ట్‌ చేశాడు. తన నెక్స్‌ట్‌ సినిమాలో ఆమెను హీరోయిన్‌గా బుక్‌ చేసేశాడు. అంతేకాదు, ఆమె పేరును ఆరాధ్యదేవిగా మార్చేశాడు. ఆ సినిమా పేరు ‘శారీ’. అంతకుముందు అంతంత మాత్రంగా ఉన్న ఆమె ఫాలోవర్స్‌ వర్మ ట్వీట్‌ తర్వాత లక్షల్లోకి చేరిపోయారు.  ఈ ‘శారీ’ హీరోయిన్‌ ఆరాధ్యదేవి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫాలోవర్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఆమె వారితో చాట్‌ చేస్తూ ఉంటుంది. తన ఫాలోవర్స్‌ అందరూ తన అందాల గురించే అడుగుతుంటారని, తన అందాలను అప్రిషియేట్‌ చేస్తుంటారని చెబుతుంది. ఎక్కువగా ఆమె కళ్లు, నడుము, వయసు, షేపులు, ఆ ఒంపుసొంపుల గురించే కామెంట్‌ చేస్తుంటారట. తనకు ఆ ఒంపుసొపులు ఎలా వచ్చాయనే ప్రశ్నలే ఆమెకు ఎక్కువగా ఎదురవుతున్నాయని చెబుతోంది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా జవాబులిస్తూ.. తన వయసు 22 అనీ, హైట్‌ 5 అడుగుల 8 అంగుళాలని చెప్పింది. అయితే మీరు పొగుడుతున్న ఈ అందాలు అంత ఈజీగా నాకు రాలేదని, వాటి కోసం ఎన్నో త్యాగాలు చేశానని, మరెంతో వర్కవుట్‌ చేసానని చెబుతూ.. వాటి వెనుక ఎంతో కష్టం ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న ఆరాధ్య.. వర్మ ‘శారీ’ షూటింగ్‌తో బిజీగా ఉంది. ఆమధ్య కూర్గ్‌లోని ఓ జలపాతం దగ్గర ఆరాధ్య అందాలను ఎక్స్‌పోజ్‌ చేస్తూ ఓ పాటను కూడా చిత్రీకరించారు. 
కొన్ని సినిమాల తీరు ఎలా ఉంటుందంటే..ఇండియన్ సినిమా గర్వించదగ్గ  టెక్నీషియన్స్ పని చేస్తున్నా కూడా ఎలాంటి హడావిడి  లేకుండా షూటింగ్ ని జరుపుకుంటు ఉంటాయి. అలాంటి వాటిల్లో చరణ్ తేజ్ ఉప్పలపాటి  మూవీ  కూడా ఒకటి. ఈయన  రెబల్ స్టార్ ప్రభాస్ కి  కజిన్ అవుతారు.  నిఖిల్ హీరోగా వచ్చిన స్పై అండ్ సుమంత్ హీరోగా వచ్చిన మళ్ళీ మొదలయ్యింది సినిమాలకి వన్ ఆఫ్ ది  నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పుడు  ఏకంగా బాలీవుడ్ కే దర్శకుడుగా   పరిచయం అవుతున్నాడు    ఒకప్పటి  బాలీవుడ్ అగ్ర హీరోయిన్  కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్  ప్రభుదేవా కాంబో లో  ఒక చిత్రం తెరకెక్కుతుంది. యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ద్వారానే  చరణ్ తేజ్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.  తెలుగులో డైరెక్టర్ గా ప్రూఫ్ అయిన తర్వాతే బాలీవుడ్ ఆఫర్ వస్తుంది ,కానీ  ఒక్క సినిమా కూడా చెయ్యకుండా  చరణ్ కి ఈ ఆఫర్ రావడం లక్ అనే చెప్పాలి. పైగా కాజోల్, ప్రభుదేవా లాంటి సీనియర్స్ ని మొదటి సినిమాకే   డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. ఇది చాలా మంచి అవకాశం కూడా.ఇక  ప్రభుదేవా,కాజోల్ కాంబో లో  ఇరవై ఏడు సంవత్సరాల క్రితం మెరుపుకలలు అనే మూవీ వచ్చింది.దీంతో ప్రేక్షకుల్లో ఆ జంట మీద క్యూరియాసిటీ ఏర్పడింది.మూవీ మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. అతి త్వరలోనే  టీజర్ రాబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారకంగా ప్రకటించారు.  నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ లాంటి స్టార్ కాస్టింగ్   స్క్రీన్ షేర్ చేసుకోనుంది అలాగే  ఇండియన్ సినిమా గర్వించదగ్గ టాప్  టెక్నీషియన్స్ తమ తమ శాఖల్లో పని చేస్తున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ లేటెస్ట్ హిట్  జవాన్ కి  సినిమాటోగ్రాఫర్‌గా చేసిన జికె విష్ణు,  అదే విధంగా  లేటెస్ట్  సంచలనం  యానిమల్ మూవీకి మ్యూజిక్ ని ఇచ్చిన  హర్షవర్ధన్ రామేశ్వర్, అల్లు అర్జున్ పుష్ప  2  ఎడిటర్‌  నవీన్ నూలి,  మై నేమ్ ఈజ్ ఖాన్, వేక్ అప్ సిద్  లాంటి భారీ హిట్స్ మూవీస్ కి  స్క్రీన్ ప్లే ని అందించిన నిరంజన్ అయ్యంగార్, జెస్సికా ఖురానా లు ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు  
ఎన్నాళ్ళ కెన్నాళ్ళ  కెన్నాళ్లకు  వెన్నెల్లు  తిరిగొచ్చే మా కళ్ళకు అనే పాటలా  ఎట్టకేలకు బెల్లం కొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda sai Sreenivas)న్యూ  మూవీ అప్ డేట్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)తో భీమ్లా నాయక్ ని తెరకెక్కించిన  సాగర్ చంద్ర దర్శకుడు అయితే విక్టరీ వెంకటేష్ తో  నమోవెంకటేశ, బాలకృష్ణ లెజండ్,  రామ్ రెడీ,  వరుణ్ తేజ్ వాల్మీకి లాంటి సినిమాలని నిర్మించిన ఫోర్ టీన్ రీల్స్ సంస్థ. కొన్ని రోజులుగా మూవీ గురించి  ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు రావడంతో తెలుగు సినిమాకి పండుగ వాతావరణం వచ్చినట్టయ్యింది. టైసన్ నాయుడు(tyson naidu)టైటిల్ చూస్తుంటేనే థియేటర్స్ కి పరుగులు పెట్టేలా  అనిపిస్తుంది కదు. బెల్లంకొండ హీరోగా వస్తున్న ఈ మూవీ చాలా రోజుల కిందటే షూటింగ్ ని ప్రారంభించుకుంది. జనవరి 3  బెల్లంకొండ  పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్‌ రాగా అభిమానులు,ప్రేక్షకుల నుంచి  మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం  రాజస్థాన్‌ కోట లో ఒక కీలక షెడ్యూల్ ని జరుపుకుంటుంది.  ఫైట్ మాస్టర్ స్టన్ శివ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. రేపు థియేటర్స్ లో ఈ ఫైట్స్ పూనకాలు తెప్పించే విధంగా ఉంటాయని యూనిట్ విశ్వసిస్తుంది. రెండు వారాల పాటు కంటిన్యూగా  జరిగే ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సన్నివేశాలే కాకుండా టాకీ పార్ట్ కూడా చిత్రీకరించనున్నారు. మూవీకి సంబంధించిన మిగతా తారాగణం ఇందులో పాల్గొననుంది  బెల్లంకొండ  సరసన ఇస్మార్ట్ భామ నబానటేష్ (naba natesh)జతకడుతుంది. ప్రొడ్యూసర్ రామ్ ఆచంట(Ram Achanta) బెల్లంకొండ సినీ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నాడు. బాక్సింగ్ లో కింగ్ అయిన టైసన్ పేరు మూవీకి ఎందుకు పెట్టారనేది అందరిలో ఆసక్తిగా మారింది. ప్రెజంట్ మంచి ఫామ్ లో ఉన్న  భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తుండగా  భారీ తారా గణమే మూవీలో మెరవనుంది  
కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో శశికిరణ్‌ తిక్క సమర్పణలో ఆరమ్‌ ఆర్ట్స్‌ పతాకంపై సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో శ్రీనివాసరావు తక్కలపల్లి, బాబి తిక్క నిర్మించిన సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘సత్యభామ’. ఈ సినిమాలో నవీన్‌ చంద్ర కూడా ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం మే 24న హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు నటసింహ నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై ‘సత్యభామ’ ట్రైలర్‌ను విడుదల చేశారు.  ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఈ సినిమా ట్రైలర్‌లో కాజల్‌ని చూసి చాలా ఆశ్చర్యపోయాను. మా భగవంత్‌ కేసరి సినిమాలో చేసింది. ఆ అమ్మాయి, ఈ అమ్మాయి ఒకరేనా అనిపించేంత వేరియేషన్‌ చూపించింది. సినిమాలో ఆమె చేసిన ఫైట్స్‌, యాటిట్యూడ్‌ అద్భుతం. ఆర్టిస్ట్‌ అన్న తర్వాత అన్ని రకాల పాత్రలు చేయాలి. ఈరోజు నారద జయంతి. నాన్నగారు అన్ని రకాల పాత్రలు పోషించారు ఒక్క నారదుడు తప్ప. ఆ పాత్ర శ్రీనివాసకళ్యాణం చిత్రంలో చేసే అవకాశం నాకు వచ్చింది. అది నా అదృష్టం. నాన్నగారు చేయని పాత్ర నేను చేసాననే తృప్తి ఉంది. ‘సత్యభామ’ చిత్రాన్ని నిర్మించిన వారికి చాలా అనుభవం ఉంది. శశికిరణ్‌ సినిమాలకు డైరెక్షన్‌ చేశారు. అలాగే నిర్మాతలకు పంపిణీ రంగంలో కూడా అనుభవం ఉంది. వీరందరి అనుభవంతో సినిమాని అద్భుతంగానే తీసి ఉంటారు. తప్పకుండా ఇది అందరికీ నచ్చుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ భారతదేశంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో ఉంది. మనం అందించే సినిమాలకు, మనం ఇచ్చే సందేశాలకు యావద్‌ భారతదేశమే తలవంచింది. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలి. ‘సత్యభామ’ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.  
ప్రస్తుతం టాలీవుడ్‌ని కుదిపేస్తున్న అంశం బెంగళూరు రేవ్‌ పార్టీ. దీనిపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. శుక్రవారం ఒక వెబ్‌సిరీస్‌కి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న మంచు లక్ష్మీని రేవ్‌ పార్టీ వ్యవహారంపై స్పందించాల్సిందిగా పాత్రికేయులు కోరగా దానికి తనదైన స్టైల్‌లో సమాధానం చెప్పారు.  ‘అసలు అక్కడ ఏం జరిగిందో తెలీదు.. ఇది సందర్భం కూడా కాదు. చాలా రోజుల తర్వాత ఒక వెబ్‌ సిరీస్‌ వచ్చింది. దాని గురించి మాట్లాడుతున్నాను. ఎవరో ఎక్కడికో వెళ్లింది.. అంటే నాకేమిటి సంబంధం అండీ.. అది వారి సమస్య. నాది కాదు’ అంటూ స్పష్టం చేశారు మంచు లక్ష్మీ. 
Promising young hero Bellamkonda Sai Srinivas’s unique action entertainer being helmed by Saagar K Chandra is produced by 14 Reels Plus. The movie titled Tyson Naidu had its title and glimpse unveiled on Bellamkonda Srinivas’ birthday and received a stupendous response. Today, the makers have begun a new crucial 2 week long schedule of the movie in Rajasthan. The team will be canning breathtaking action block which is very significant for the movie for 10 nights in Rajasthan forts under the super vision of Stun Shiva which will be one of the major highlight in the movie.In this 2-week long schedule, the makers will also shoot some talkie part. The movie is being made in an un-compromised way as the team is super confident on the subject. Bellamkonda sports a massy and bulky look in the movie, as shown in the glimpse. Saagar K Chandra is presenting him in a never-before-seen action-packed character as a cop. Some prominent technicians are taking care of different crafts of the movie. Mukessh Gnanesh/Anith are the lensman, while the in form sensational composer Bheems Ceciroleo provides the music. Kotagiri Venkateswara Rao is the editor of the movie, while Avinash Kolla are the art directors. Stun Shiva, Vijay, Venkat, and Real Satish oversee the action part of the movie.
  నేటి కాలంలో చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. కొందరి ప్రేమకథ పెళ్లికి దారితీయదు. ఏదైనా ప్రేమ బంధం దృఢంగా ఉండాలంటే సద్గురువు చెప్పిన ఈ మాటలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.  కొన్నిసార్లు ఇది బంధాన్ని విజయవంతం చేయడానికి సరిపోదు. బంధంలో నివసిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య అలాంటి కొన్ని సమస్యలు తలెత్తుతాయి. వారు తమ కోసం వేర్వేరు మార్గాలను ఎంచుకోవాలి.  వివాహాన్ని ప్రేమకు గమ్యస్థానంగా పరిగణించనప్పటికీ, జీవితాంతం కలిసి ఉండటమే అత్యంత అందమైన, పవిత్రమైన బంధం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు తమ ప్రేమికుడితో కలిసి కుటుంబాన్ని గడపాలని కలలు కంటారు. కానీ మీ ప్రేమను పెళ్లి దశకు ఎలా తీసుకురావాలో మీకు తెలియదు. అలాంటి వారికి సద్గురు సలహా ఉపయోగపడుతుంది. సంబంధాన్ని కాపాడుకోవడానికి సద్గురు సలహా: ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన సద్గురు, యువ తరం సమస్యలను బాగా అర్థం చేసుకుని, వారికి బాధ కలిగించకుండా వాటిని ఎలా పరిష్కరించాలో తెలిసిన మత గురువులలో ఒకరిగా పరిగణిస్తున్నారు. ప్రేమ సంబంధాన్ని మెరుగుపరచడానికి.. అతను ఇచ్చిన చిట్కాలను అనుసరించడం ద్వారా, మీరు మీ సంబంధాన్ని ప్రతి సమస్య నుండి కాపాడుకోవచ్చు. దానిని విజయవంతం చేయవచ్చు. ఈ విషయం మాత్రమే ప్రేమ సంబంధాన్ని విజయవంతం చేస్తుంది: సద్గురు చెప్పినట్లుగా, మీలో ఉన్న ప్రేమ సఫలీకృతం కావాలంటే, మీరు ముందుగా ఓడిపోవడం నేర్చుకోవాలి, ఎక్కువ కాలం ఉండకూడదు లేదా అంతం కాదు. మీ సంబంధాన్ని గెలవాలంటే మీరు ప్రేమలో ఓడిపోయిన వ్యక్తి అయి ఉండాలి. సంబంధంలో జీవిస్తున్న ఇద్దరూ దీనిని అర్థం చేసుకున్నప్పుడు, వారి జీవితమంతా ఏదీ వారిని వేరు చేయదు. వారి ప్రేమ అజరామరం. ప్రేమలో ఓడిపోవడం అంటే ఏమిటి? జీవితంలో ఎప్పుడూ ఓడిపోకండి, కానీ మీ ప్రేమికుడితో మీ సంబంధాన్ని చిరస్థాయిగా మార్చుకోవడానికి మీరు ఓడిపోవడం మంచిది. యుద్ధాల్లో గెలవాలంటే ఓడిపోయినట్లే, ప్రేమ కూడా వీటిలో ఒకటి మాత్రమే. అయితే అంతకు ముందు రిలేషన్ షిప్ లో లూజర్ అంటే అర్థం తెలుసుకోండి. మీ భాగస్వామి కోసం ఏదైనా చేయండి: ప్రతి ఒక్కరూ ప్రేమలో లావాదేవీల గురించి మాట్లాడుతారని సద్గురు చెప్పారు. అయితే అందులో ఓడిపోయిన వారిని ఎంచుకుంటేనే మీరు మీ ప్రేమ వ్యవహారాన్ని విజయవంతం చేయగలరు. దీని కోసం మీరు కోల్పోయేది ఏమీ లేదు. మీ భాగస్వామి నుండి మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ చేయడం అంటే. ఇలా చేయడం వల్ల మాత్రమే ప్రేమ పెరుగుతుంది. సంబంధాలు చిరస్థాయిగా ఉంటాయి. అటువంటి వ్యక్తుల సంబంధం విజయవంతం కాదు: ఇతరులు మీ నుండి తీసుకోవాలని మీరు ఎల్లప్పుడూ ఆశించినట్లయితే, ఎవరూ మీతో సంబంధాన్ని కలిగి ఉండకూడదని సద్గురు వివరిస్తున్నారు. మీరు ఎల్లప్పుడూ మీ గురించి ఆలోచించకూడదు: రిలేషన్‌షిప్‌లో ప్రతి ఒక్కరికీ కొన్ని అంచనాలు ఉంటాయి. భాగస్వామి మీతో నిజాయితీగా ఉండాలి, మిమ్మల్ని గౌరవించాలి, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు. అంతే కాకుండా అనవసరమైన అంచనాల భారాన్ని వారి భుజాలపై వేసుకోవడం సరికాదు. ఇది మీ సంబంధాన్ని నాశనం చేస్తుంది. విజయవంతమైన ప్రేమ సంబంధం అంటే ఏమిటి? ప్రేమ సంబంధం  విజయం ప్రతి జంటకు భిన్నంగా ఉంటుంది. కొందరు వివాహ దశకు చేరుకోవడం ద్వారా తమ సంబంధాన్ని విజయవంతంగా భావిస్తారు, కొందరు దీనిని ఎల్లప్పుడూ ఒకరికొకరు సుఖంగా ఉన్నట్లు భావిస్తారు, తద్వారా మూడవ వ్యక్తి రాక వారి సంబంధాన్ని మార్చదు.
ఈ ప్రపంచంలో వ్యక్తులకు న్యాయం జరిగేలా చూసేది న్యాయవ్యవస్థ. స్వాతంత్య్రం పొందిన ప్రతి దేశంలో న్యాయవ్యవస్థ ఉంది. ఈ న్యాయ వ్యవస్థ అనేది ఈనాటిది కాదు. ఒకప్పుడు రాజ్యాల పేరుతో ఈ భూమండలాన్ని పాలించిన రాజులు, రాణులు కూడా న్యాయవ్యవస్థను పాటించారు. ఎక్కడో కొందరు నియంతలు మాత్రం తాము చెప్పిందే వేదమనే ధోరణిలో రాజ్యపాలన చేశారు. అయితే ఇదంతా అధికారం చేతిలో ఉన్నవాళ్లకే తప్ప సాధారణ పౌరులు తలవంచుకుని పోయే పరిస్థితులే ఉండేవి.  దేశాలు నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టినా, ఎంత అభివృద్ధి సాధించినా మహిళలకు న్యాయం అనేది విభిన్నంగానే ఉండేది, బడుగు బలహీన వర్గాలకు బానిసత్వం తప్ప న్యాయం అనే పదానికి తావుండేది కాదు. ఈక్రమంలో ఎన్నో పోరాటాలు, మరెన్నో నిరసనలు, ప్రపంచం మీద కాలుతున్న కత్తిపై సమ్మెట దెబ్బల్లా మారాయి. ఫలితంగా న్యాయవ్యవస్థలోని వివిధ స్థాయిలలో మహిళలకు సమాన మరియు సంపూర్ణ భాగస్వామ్యం వైపు అడుగులు పడ్డాయి.   ప్రతి సంవత్సరం మార్చి 10న అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. న్యాయస్థానాలు మహిళా న్యాయమూర్తులకు తగిన ప్రాధాన్యత ఇస్తూ.. మగవారితో సమానంగా ఆడవారు ఉండాలని భావించారు. జనాభాకు ప్రాతినిధ్యం వహించడానికి, వారి ఆందోళనలకు ప్రతిస్పందించడానికి, సమర్థ నిర్ణయాలను జారీ చేయడానికి న్యాయవ్యవస్థలో మహిళల పాత్ర చాలా కీలకం. మహిళా న్యాయమూర్తులు తమ విధులకు హాజరు కావడం ద్వారా న్యాయస్థానాల విశ్వసనీయతను పెంచుతారు, వారు బహిరంగంగా న్యాయం కోరుకునే ఎవరికైనా అందుబాటులో ఉంటామనే బలమైన సందేశాన్ని, భరోసాను ఇస్తారు.  సహజంగా ఓ కుటుంబంలో మహిళల నిర్ణయాల కంటే పురుషుల అభిప్రాయాలకు ప్రాధాన్యత, వారి నిర్ణయాలే పైచేయిగా ఉంటాయి. సమాజంలో ఇక మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. స్త్రీలు ఎప్పుడూ పురుషుల కంటే తక్కువ అని భావించబడుతున్నారు, అందువల్ల జీవితంలోని వివిధ రంగాలలో సమాన ప్రాతినిధ్యం ఇవ్వబడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కానీ అవి అలానే కొనసాగుతున్నాయి. గత సంవత్సరం, దోహాలో జరిగిన UNODC గ్లోబల్ జ్యుడీషియల్ ఇంటెగ్రిటీ నెట్‌వర్క్ యొక్క రెండవ ఉన్నత-స్థాయి సమావేశంలో, ప్రెసిడెంట్ వెనెస్సా రూయిజ్, ఖతార్ ప్రధాన న్యాయమూర్తి సంయుక్తంగా మహిళా న్యాయమూర్తుల విజయాలను గౌరవించే అంతర్జాతీయ దినోత్సవ ఆలోచనను ప్రతిపాదించారు.  కోర్టు బెంచ్‌లో సమాన సంఖ్యలో పురుషులు మరియు మహిళలు ఉండటం న్యాయవ్యవస్థ  నిష్పాక్షిక తీర్పుల సామర్థ్యాన్ని పెంచుతుంది. మహిళా న్యాయమూర్తులు ధర్మాసనానికి విభిన్న దృక్కోణాలను అనుభవాలను అందిస్తారు, వారు సేవ చేసే సమాజాన్ని చిత్రీకరిస్తూ మానవ హక్కులు, చట్ట నియమాలను రక్షించే న్యాయవ్యవస్థ సామర్థ్యంపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేస్తారు. నాయకత్వ స్థానాల్లో ఉన్న మహిళలు అవినీతిని ఎదుర్కోవడానికి, కుట్రలను నాశనం చేయడానికి కూడా సహాయపడతారు. మహిళా న్యాయమూర్తులను గతంలో నిషేధించారు కానీ తరువాత వీటిని తిరిగి చేర్చడం ద్వారా న్యాయ వ్యవస్థలను మరింత పారదర్శకంగా వారు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. న్యాయ వ్యవస్థలు, నిర్వాహక నాయకత్వ సంస్థలు, ఇతర స్థాయిలలో మహిళల అభివృద్ధి కోసం సంబంధిత విజయవంతమైన జాతీయ విధానాలు, ప్రణాళికలను స్థాపించడానికి మరియు అమలు చేయడానికి నిబద్ధత ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క మహిళ చేయాల్సిన కొన్ని పనులను చూస్తే.. •ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కుల కోసం ఒక స్టాండ్ తీసుకోండి మీరు ప్రస్తుతం మహిళల కోసం మాట్లాడటానికి మీ వాయిస్‌ని ఉపయోగించవచ్చు. ఈ రోజున, సోషల్ మీడియాలో లింగసమానత్వం మీకు ఎందుకు ముఖ్యమైనదో షేర్ చేయవచ్చు.   •మహిళా శక్తిని ప్రోత్సహించండి మహిళలు తమ హక్కుల కోసం తమ మద్దతును చూపించడానికి మరిన్ని అవకాశాలను ప్రోత్సహించండి. మహిళా సాధికారతను పెంపొందించడానికి కొన్ని ఆలోచనలు మహిళల కోసం మాత్రమే ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను రూపొందించవచ్చు. •అణగారిన మహిళలకు న్యాయవాది ప్రాథమిక అవసరాలు లేదా హక్కుల విషయానికి వస్తే అందరికీ సమాన హక్కు లేదు. సమాజం ద్వారా వారి ప్రాథమిక అవసరాలు ఏర్పాటయ్యేలా చేయడం, మానవ హక్కులను కోల్పోతున్న మహిళల కోసం మీరు ఎక్కడెక్కడికో వెళ్లి సహాయం చేయలేకపోయినా మీ చుట్టూ  ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. న్యాయం విస్తృతమవ్వాలంటే.. న్యాయవ్యవస్థలో మహిళల సంఖ్య పెరగాలి. ◆నిశ్శబ్ద.
ఈరోజుల్లో యువతలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పెరగడం బాధాకర విషయం. ఇంచుమించు వార్తా పత్రికలలో ప్రతిరోజూ ఆత్మహత్య సంఘటల్ని చూస్తున్నాము. ఆత్మహత్య గురించి ఆలోచించడం చాలా తెలివి తక్కువ పని. మానవ శరీరం దేవుడిచ్చిన విలువైన బహుమతి. చిన్న చిన్న విషయాల కోసం ప్రాణాలను విడవటం మంచిదికాదు. పిరికిపందలు,బలహీన మనష్కులే జీవితపు సవాళ్ళను ఎదుర్కోవడానికి భయపడతారు. అటువంటివారే ఇటువంటి తెలివితక్కువ పనులకు ఒడిగడతారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా సవాళ్లను ఎదుర్కునేవాడు ఎప్పుడూ ఇలాంటి ఆలోచన చేయడు. ఆ సవాళ్లకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తాడు. చాలామంది తమ కోరికలు నెరవేరలేదు అని నిస్పృహ చెంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మనకు ఏది ప్రాప్తమో అదే దక్కుతుంది అనే సత్యాన్ని గ్రహించుకోలేరు. చిత్తశుద్ధితో, నిజాయితీతో పనిచేసి మనకు ఆ అర్హత కలిగించే శక్తిని ఎందుకు పెంచుకోకూడదు. ఓ క్షణం ఆలోచిస్తే ప్రాణం తీసుకోవడానికి మించిన ధైర్యం ఈ లోకంలో ఇంకోటి ఉందని నేను భావించను. అలాంటి నీ ధైర్యాన్ని కొంచెం నీ జ్ఞానికి జత చేసి సమస్యపై పోరాటం చేస్తే అసాధ్యమైనా సుసాధ్యం కాగలదు. కష్టాల్లో మన మనసు ఆలోచనా విధానం రాకెట్ వేగంతో ఉండాలి. మన నిర్ణయాలు,కార్యాచరణ మిస్సైల్ లా సాగాలి. మనో నిబ్బరాన్ని మించిన ఆయుధం ఇంకోటి లేదు. అది ఎప్పుడూ కోల్పోకూడదు. కనుక చిన్న చిన్న విషయాలకు ప్రాణాలను త్యజించి ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోయి దేవుడు ఇచ్చిన దేహాన్ని హత్య చేసి వెళ్లిపోతే దేవుడు కూడా క్షమించడు. ◆ వెంకటేష్ పువ్వాడ  
సీజన్ల వారిగా లభించే పండ్లలో నేరేడు పండ్లు కూడా ప్రముఖమైనవి.  వేసవి కాలం ఇక ముగుస్తుందనగా మార్కెట్లలోకి చొచ్చుకువచ్చి సందడి చేసే నేరేడు పండ్లు రుచిగా ఉండటమే కాదు, బోలెడు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. వైలెట్ కలర్ లో ఉంటూ ఉప్పగా, వగరుగా ఉండే ఈ నేరేడు కాయలు  క్రమంగా నల్లగా మారి నిగనిగలాడుతూ చెప్పలేనంత తియ్యదనంగా మారుతాయి.  జామూన్ ఫ్రూట్ గా పిలిచే ఈ నేరేడు లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యం దీనికున్న ప్రత్యేక లక్షణం. అయితే నేరేడు పండ్లు అందరూ తింటారు. కానీ గింజలు ఉపయోగించే వారు తక్కువ. నేరేడు పండ్లలానే వాటి గింజలు కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే అవి మధుమేహం నియంత్రించడంలో అద్భుతాలు చేయడమే కాకుండా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. నేరేడు గింజల పొడి ప్రయోజనాలను తెలుసుకుంటే నేరేడు పండ్లు తినగానే ఆ విత్తనాలను ఇకమీదట పడెయ్యరు. నేరేడు గింజలు పొడి తీసుకోవడం ద్వారా కలిగే అయిదు అద్భుత ప్రయోజనాలు ఏమిటంటే.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి, గ్లైకోసూరియాను తగ్గించడానికి నేరేడు విత్తనాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పండు గింజలు జంబోలిన్ మరియు జాంబోసిన్ అనే క్రియాశీల పదార్ధాలను కలిగి ఉంటాయి, ఇవి రక్తంలోకి విడుదలయ్యే చక్కెర రేటును నెమ్మదిస్తాయి. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. శాస్త్రీయంగా, ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంది, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఫలితంగా  మూత్రవిసర్జన, చెమటలను సహజంగా నిర్వహించడంలో సహాయపడుతుంది.  నేరేడు విత్తనాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణం కారణంగా, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టానికి వ్యతిరేకంగా పోరాడుతాయి, కాలేయ కణాలను రక్షిస్తాయి. ఇంకా ఈ గింజలు పొడిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇది కాలేయంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.  నేరేడు గింజల పొడిలో ఎల్లాజిక్ యాసిడ్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి రక్తపోటు వేగవంతమైన హెచ్చుతగ్గులను నియంత్రించడంలో  సహాయపడతాయి. నేరేడు గింజలు ఫ్లేవనాయిడ్లు, ఫినాలిక్ సమ్మేళనాల వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ అయిదు ప్రయోజనాలు పొందడానికి నేరేడు గింజల పొడిని తీసుకోవడం మంచిది. ◆నిశ్శబ్ద
ద్రాక్ష ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనది. దీని రుచి చాలా బాగుంటుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ద్రాక్షలో అనేక రకాలు ఉన్నాయి.  ఎరుపు, నలుపు,  ఆకుపచ్చ రంగులలో లభిస్తుంది. వీటిలో ఎర్ర ద్రాక్ష కాస్త ప్రత్యేకం. ఎర్ర ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ఎర్ర ద్రాక్షలో విటమిన్ ఎ,  సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం, కాపర్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ  శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు. ఎర్ర ద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓ లుక్కేస్తే...  రోగనిరోధక వ్యవస్థ.. ఎర్ర ద్రాక్షను క్రమం తప్పకుండా తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు ఎముకలతో పాటు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. కంటి ఆరోగ్యం.. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎర్ర ద్రాక్ష మంచి ఎంపిక. ఎర్ర ద్రాక్ష ఆక్సీకరణ ఒత్తిడిని,  కళ్ల మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎర్ర ద్రాక్షను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కంటిశుక్లం రాకుండా చేస్తుంది. బీపీ పై నియంత్రణ.. ఎర్ర ద్రాక్ష తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్,  ఫినోలిక్ యాసిడ్లు గుండెను వ్యాధుల నుండి రక్షించడానికి పని చేస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని  మెరుగుపరుస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యం.. ఎర్ర ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్,  యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కిడ్నీ సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి.  కిడ్నీ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియ.. ఎర్ర ద్రాక్షలో ఉండే పొటాషియం,  ఫైబర్  జీర్ణక్రియకు సహాయపడతాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా ఎర్ర ద్రాక్షను ఆహారంలో చేర్చుకోవాలి. కొలెస్ట్రాల్‌.. ఎర్ర ద్రాక్ష కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.  ఆహారంలో ఎర్ర ద్రాక్షను చేర్చుకోవడం ద్వారా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఇది జ్ఞాపకశక్తిని,  మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.                                                    *నిశ్శబ్ద.
ఆ స్ప్రిరిన్ ,వార్ ఫారిన్ మందులతో రక్త శ్రావం నిపుణుల పరిశోదనలో వెల్లడి.. ఒకవేళ మీరు రక్తం పల్చబడేందుకు వాడే మందులు అవసరం లేదని.వాస్తవానికి సహజంగా రోగులకు ఇచ్చే బ్లడ్ తిన్నర్స్ అస్టిలిన్ ను తీసుకోవడం మానాలని దీనివల్ల అధిక రక్తశ్రావం  జరగడం వల్ల వచ్చే పరిణామాలు నియంత్రించ కుంటే ముప్పే.7౦౦ మందిపై జరిపిన పరిశోదనలో మిచిగన్ లోని క్లినిక్ లో వీనస్ త్రాంబో  ఎంబాలిజం లేదా గడ్డ కట్టడం లేదా ఆర్టియాల్ ఫైబ్రి లేషన్ లో గుండె సరిగా కొట్టు కోక పోవడం వల్ల గుండె పోటు వస్తుంది. రోగులకు సాధారణంగా లభించ్గే బ్లడ్ తిన్నేర్స్ వార్న్ ఫారిన్ గుండె సమస్య లేకపోయినా ఆస్ప్రిన్ తీసుకునే వారు అని పరిశోదనలో వెల్లడించారు.మనకు తెలిసిన విషయం  ఏమిటి అంటే ఆస్ప్రిరిన్  పెనేషియా డ్రగ్ కాదని కొంతమందిలో ఎక్కువశాతం రక్త్గ శ్రావం జరిగింది.అయితే క్లినిక్స్ లో అస్ప్రిరిన్ వినియోగం  తగ్గించే ప్రయాత్నం చేశామని పేర్కొన్నారు.  ఎవరికి అయితే అవసరం లేదో వారికి అస్ప్రిరిన్ ఇవ్వలేదని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన కార్దియలజిస్ట్ హెల్త్ ఫ్రాంకల్ కార్డియో వాస్క్యులార్ సెంటర్ కర్దియలజిస్ట్ డాక్టర్ జాఫ్రీ బార్నేస్ అన్నారు.పరిశోదనలో ఎస్ప్రిరిన్ వినియోగం తగ్గించామని 46.6 % తగ్గించడం వల్ల రక్త శ్రావం తగ్గించగలిగామని రక్తశ్రావం ౩2.౩% వినియోగం తగ్గిందని వివరించారు. ప్రతి వెయ్యి మందిలో ఆస్పిరిన్ మానివేయడం వల్ల రక్త స్రావం తగ్గిందని పేర్కొన్నారు.అస్పిరిన్ ఆపడం వల్ల వచ్చిన ఫలితాలను జామా నెట్వర్క్ లో ప్రచురించారు.మేము పరిశోదన ప్రారంభించగానే అప్పటికే వైద్యులు అస్ప్రిరిన్ వినియోగం తగ్గించారని మాపరిశోదనలో రక్త శ్రావం వంటి సంఘటనలు పరిణామాలు తీవ్ర రక్త శ్రావం ఆపడం ద్వారారోగులను కాపాడగలిగా మని ఇంటర్నల్ మెడిసిన్ స్కూల్ జనరల్ ఫిజీషియన్లకు ఆరోగ్య శాఖ సిబ్బందికి  రోగుల కు బ్లడ్ తిన్నర్ గా అస్టిలిన్ ను వినియోగించరాదనిపరిశోధకులు సూచించారు. ఆస్టిలిన్ వాడే వారి కొంతమేర తక్కువ స్థాయిలో తగ్గించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు వెల్లడించారు.ఇందులో  రక్తం పల్చబడితే ఇతర మందులతో పాటు ఎస్ప్రిరిన్ ను పరిసీలించినట్లు తెలుస్తోంది.మరో పరిశోదనలో వార్ ఫారిన్ తీసుకుంటున్న రోగులలో అస్పిరిన్ అర్తియాల్ ఫైబిలేషణ్,వి టి ఇ వీనస్ త్రాంబో ఎంబాలిజం లో రక్త శ్రావం ఎక్కువగా ఉందని వార్ ఫారిన్ తీసుకున్న వారిలోనూ రక్తశ్రావం జరగడం గమనించారు.అస్పిరిన్ తీసుకునే వారిలో ఇలాంటి సమస్యలు గమనించమని అయితే రక్తం గడ్డకట్టడం కన్నా రక్త శ్రావం ఎక్కువజరిగిందని పరిశోధకులు వెల్లడించారు.కొంత మందికి అస్టిలిన్ ప్రాణాలు రక్షిస్తే కొంతమందికి ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చిన చరిత్ర ఉందని గుండెపోటు అవసరమైన సమయంలో గుండెకు స్టంట్ పెట్టాల్సిన  పరిస్థితి వచ్చిందని రక్త ప్రవాహం పెరగడం గుండె సంబంధిత రక్త్గానాళా లలో సమస్యలు ఉన్నవారికి అందించడం అత్యవరం లాభం. మనం ఎదుర్కున్న సవాలు ఏమిటి అంటే గుండె సంబందిత సమస్యలు లేనివారు సైతం అస్పిరిన్ తీసుకుంటే యాంటి కాగులెంట్ గా సూచించవచ్చని ప్రముఖ హేపటాలజిస్ట్ ప్రొఫెసర్ జోడాన్ స్చేఫెర్ జనరల్ మెడిసిన్ వివరించారు.ప్రాధమిక స్థాయిలో నివారణకు అస్పిరిన్ వాడతారని గుండెపోటుకు చాలా తక్కువ ప్రభావం ఉంటుందని వార్ ఫారిన్ వాడినట్లైతే గుండె పోటును ఎదుర్కునేందుకు వాడరాదని అస్పిరిన్ పై సమీక్షించాలని మీసంరక్షణ చూసేవారు లేదా మీ ఫ్యామిలీ డాక్టర్ వీటి ప్రభావం నుండి బయట పడితే కొంతమేరా ప్రాణ హాని తీవ్ర రక్త్గశ్రావాని నివారించవచ్చు.