LATEST NEWS
  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులెత్తేశాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పులు ఇచ్చేవారు లేరని, నన్ను ఎవరు నమ్మేవాడు లేడని  చేతులెత్తేశాడని కేంద్ర మంత్రి అన్నారు. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఎన్నో పోరాటాలు చేసి స్వ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం.. త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, ఒక కుటుంబం బారినపడి ఏ రకంగా బలి అయ్యామో మనకు తెలుసన్నారు. ధనిక రాష్ట్రంగా మొదలైన తెలంగాణ.. లక్షల కోట్లు అప్పుల పాలైందని కిషన్ రెడ్డి అన్నారు.  ఇక గడిచిన ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే  ఆరు గ్యారెంటీల పేరుతో మోసిందన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులు, దళితులకు డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.  పరిపాలన చేతకాక, హామాలు అమలు చేయలేక కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో చేతులెత్తేసిందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.అవినీతి పాలనతో, దోపిడీ, కుంభకోణాలతో, అహంకారంతో, కుటుంబ పాలనతో తెలంగాణను దెబ్బతీశారో చూశామన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్​ఎస్​ పార్టీ ఏ రకంగా పనిచేసిందో మనం చూశామని చెప్పుకొచ్చారు.  
  స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రేపు జరిగే మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్, ఫోన్ ట్యాపింగ్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన  ట్యాపింగ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రమేయంతోనే ట్యాపింగ్ జరిగినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కు గురైన బాధితుల పేర్లను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తక్షణమే బయటపెట్టాలని ఆయన స్పష్టం చేశారు. "ఈ వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని గౌడ్ స్పష్టం చేశారు. ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరూ చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిందేనని, దోషులు ఎంతటి వారైనా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. కోట్ల ప్రజాధనాన్ని నీళ్లలో పోసిందని ఆరోపిస్తూ ఆర్థిక దుర్వినియోగంపై తీవ్ర విమర్శలు చేశారు.  బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ హక్కుల కోసం వెనక్కి తగ్గమని, ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగినప్పటికీ బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా రాజకీయ నేతలు, సినీ తారలు, జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని మండిపడ్డారు. 2022 నుంచి 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయని, ఈ విషయంలో సిట్ ముందు సాక్షిగా వాంగ్మూలం ఇచ్చానని ఆయన తెలిపారు
  వైసీపీ అధినేత జగన్ కారు డ్రైవర్‌ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి నల్లపాడు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కారు కింద పడిన వ్యక్తిని గుర్తించారా? ఆ సమాచారాన్ని జగన్‌కు తెలియజేశారా? ప్రమాదం జరిగిన వెంటనే వాహనం ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారు? తదితర విషయాలపై జగన్‌ కారు డ్రైవర్‌ నుంచి సమాచారాన్ని పోలీసులు తెలుసుకుంటున్నారు. మరోవైపు జగన్‌ పర్యటనకు సంబంధించి వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయన పర్యటనను ఎవరెవరు వీడియోలు తీశారనే దానిపై ఆరా తీస్తున్నారు.  వారి నుంచి ఫుటేజీని సేకరిస్తున్నారు. కాగా జగన్ పల్నాడు పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కారు టైరు కింద పడి మృతి  చెందిన వీడియో వైరల్ అవుతుంది. ఈ కేసులో A1గా కారు డ్రైవర్ రమణారెడ్డిని, A2గా వైఎస్ జగన్‌ను, A3గా కారు యజమానిని చేర్చాలని పోలీసులు నిర్ణయించారు.ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్‌లో అదనంగా 304 పార్ట్ 2 సెక్షన్ వర్తించే అవకాశం ఉంది. బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. ఎఫ్ఐఆర్‌లో సెక్షన్స్ మార్చి కోర్ట్ మెమో పంపాలని అధికారులు నిర్ణయించారు. 
  హైదరాబాద్‌‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో  సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆస్పత్రి ఛైర్మన్‌ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి దామోదర  మాట్లాడారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, మేనేజ్‌మెంట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. క్యాన్సర్‌ వ్యాధితో మరణించిన ఎన్‌టీఆర్‌ సతీమణి బసవతారకం పేరు మీద 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ ఆస్పత్రి.. ఇప్పటివరకు లక్షల మంది రోగులకు వైద్య సేవలు‌ అందించిందని గుర్తుచేశారు.ఎన్టీఆర్ ఐకానిక్ లీడరని, లెజెండరీ యాక్టరని మంత్రి కొనియాడారు. ఈ సందర్బంగా ఆస్పత్రి ఛైర్మన్‌ బాలయ్య మాట్లాడుతు తన తల్లి బసవతారకం కోరిక మేరకు ఈ క్యాన్సర్‌ ఆస్పత్రి స్థాపించటం జరిందని అన్నారు.  క్యాన్సర్‌ పేషెంట్స్‌కు అండగా ఉండటం కోసం ఎంతో మంది దాతలు ఆస్పత్రికి సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనో లేక లాభాలు పొందాలనే ఆశతోనో ఈ ఆస్పత్రిని ప్రారంభించలేదని ఈ సందర్భంగా బాలకృష్ణ చెప్పారు. తనకు దామోదర రాజ నరసింహ పేరుతో ఒక సినిమా చేయాలని ఉందన్నారు. 110 పడకలతో మొదలై.. నేడు దేశంలోనే అత్యున్నత ఆస్పత్రుల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే 1000 పడకలతో అమరావతిలోనూ క్యాన్సర్‌ వైద్యశాల ఏర్పాటు చేస్తాం. మొదటి దశలో 300 పడకలతో ప్రారంభిస్తాం. మాకు అన్నివిధాలుగా సహకారం అందిస్తోన్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు’’ అని బాలయ్య అన్నారు.  బాలకృష్ణ దాతృత్వం కలిగిన నటుడు, నేత. పేదలకు మంచి వైద్యం అందించాలనేదే బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి లక్ష్యమని గవర్నర్ జిష్ణుదేవ్ అన్నారు . రానున్న కాలంలోనూ పేదలకు మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. తెలంగాణలో ప్రతి ఏటా 50 నుంచి 55 వేల మంది కొత్తగా క్యాన్సర్‌ బారిన పడుతున్నారని మంత్రి రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొబైల్ క్యాన్సర్‌ స్క్రీనింగ్ యూనిట్లను ప్రారంభించబోతున్నామని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో క్యాన్సర్‌ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. త్వరలోనే వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, క్యాన్సర్‌ స్క్రీనింగ్, డయాగ్నొస్టిక్‌, డే కేర్ కీమోథెరపి, పాలియేటివ్ కేర్ వంటి సేవలన్నీ ఈ సెంటర్లలో‌ అందిస్తామని అన్నారు.  
  టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండపై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై గిరిజన సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాక్ మీద ఇండియా ఎటాక్ చేయాల్సిన పనే లేదని.. అక్కడి ప్రజలకు విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం వాళ్లే మీద ఎటాక్ చేస్తారన్నారు. కరెంట్, నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే..500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా, పని లేకుండా కొట్లాడుతారన్నారు. మనమంతా సమష్టిగా కలిసి ఉండాలి’ అని అన్నారు. విజయ్‌ దేవరకొండ ఆదివాసులను అవమానించేలా మాట్లాడారని ట్రైబల్స్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ బాపూనగర్‌ అధ్యక్షుడు కిషన్‌రాజ్‌ చౌహాన్‌ కిషన్ సహా గిరిజన సంఘాలు తప్పుబట్టాయి.
ALSO ON TELUGUONE N E W S
  'బాహుబలి'తో పాన్ ఇండియా మార్కెట్ కి గేట్లు ఓపెన్ చేసిన దర్శకధీరుడు రాజమౌళి.. దానికి ముందు తీసిన 'ఈగ'తో పాన్ ఇండియా వైడ్ గా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. వారాహి చలన చిత్రం నిర్మించిన ఈ మూవీ 2012 లో విడుదలై ఘన విజయం సాధించింది. అయితే ఈగ వచ్చిన 13 ఏళ్ళ తర్వాత.. తాజాగా ఈ చిత్ర నిర్మాతలు ఓ మలయాళ మూవీ టీమ్ కి నోటీసులు పంపడం సంచలనంగా మారింది.   ఇటీవల మలయాళంలో 'లవ్లీ' అనే సినిమా వచ్చింది. ఇది ఈగకు, ఓ యువకుడికి మధ్య జరిగిన కథగా తెరకెక్కింది. అయితే ఇది తమ కాన్సెప్ట్ అంటూ ఈగ మేకర్స్ 'లవ్లీ' టీమ్ లీగల్ నోటీసులు పంపించారు. ఈగ పాత్రను, దాని రూపాన్ని, కదలికలను కాపీ చేశారని ఈగ నిర్మాతలు చెబుతున్నారు. ప్రచార చిత్రాలతో పాటు సినిమాలోనూ ఈగ పాత్రను ఉపయోగించడం ఆపాలని డిమాండ్ చేశారు. అయితే ఈగ నిర్మాతల ఆరోపణలను 'లవ్లీ' టీమ్ ఖండించింది. తాము సొంతంగా డిజైన్ చేశామని, అందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మరి మునుముందు ఈ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.  
  విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో తరుణ్ భాస్కర్ నిర్మించిన చిత్రం 'ఈ నగరానికి ఏమైంది'. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం 2018 జూన్ 29న విడుదలై యువతను మెప్పించింది. ఈ తరం యూత్ ఎంతగానో ఇష్టపడే సినిమాల్లో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ మీమ్స్ గా ఈ సినిమా డైలాగ్స్ తెగ ఉపయోగిస్తుంటారు. అందుకే 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టీం కూడా సీక్వెల్ ఉందంటూ ఊరిస్తూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది.   విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ కోసం చేతులు కలపబోతున్నారు. స్క్రిప్ట్ పూర్తయినట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా హింట్ ఇచ్చాడు తరుణ్. ఇక ఇప్పుడు అనౌన్స్ మెంట్ డేట్ లాక్ అయినట్లు సమాచారం. ఈ జూన్ 29 కి 'ఈ నగరానికి ఏమైంది' విడుదలై ఏడేళ్లు పూర్తవుతుంది. అందుకే అదే రోజు సీక్వెల్ ను ప్రకటించబోతున్నట్లు వినికిడి. మరి ఈ సీక్వెల్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.  
  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో మైథలాజికల్ ఫిల్మ్ చేయాల్సి ఉండగా.. అది జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్ళిపోయింది. దీంతో అట్లీ తర్వాత బన్నీ ఏ దర్శకుడితో చేతులు కలుపుతాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ పేరు తెరపైకి వచ్చింది.    బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్, డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ 'శక్తిమాన్' మూవీ ప్రకటన వచ్చింది. అయితే అదే ప్రాజెక్ట్ ని రణ్ వీర్ కి బదులుగా బన్నీతో బాసిల్ జోసెఫ్ ప్లాన్ చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. తమ హీరోని శక్తిమాన్ రోల్ లో చూడబోతున్నామని సంబరపడ్డారు. అయితే అల్లు అర్జున్ అభిమానులకు నిరాశ కలిగించే విషయాన్ని తాజాగా జోసెఫ్ చెప్పాడు. అల్లు అర్జున్ తో 'శక్తిమాన్' చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపాడు. 'శక్తిమాన్' సినిమా రణ్ వీర్ తోనే ఉంటుందని, అందులో ఎటువంటి మార్పు లేదని పేర్కొన్నాడు.  
  నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కుబేర'. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న కుబేర.. అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.   కుబేర మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్ల గ్రాస్ రాబట్టగా, రెండో రోజు కూడా అదే జోరు చూపిస్తూ దాదాపు రూ.23 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా సుమారు రూ.53 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మూడు రోజు ఆదివారం కావడంతో మరో రూ.25 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం జోరు చూస్తుంటే మొదటి వారంలోనే వంద కోట్ల క్లబ్ లో చేరుతుంది అనడంలో సందేహం లేదు.   అయితే తెలుగుతో పోలిస్తే తమిళ కలెక్షన్స్ డిజప్పాయింట్ గా ఉన్నాయి. తమిళ హీరో ధనుష్ నటించినప్పటికీ.. అక్కడి ప్రేక్షకులు తమ సినిమాలా దానిని పూర్తిగా ఓన్ చేసుకోవట్లేదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లోనే రూ.24 కోట్లు రాబడితే.. తమిళనాట రూ.9 కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకుంది. అంటే తెలుగు వసూళ్ళలో కనీసం సగం కూడా లేవు.  
  హీరో విజయ్ దేవరకొండ చిక్కుల్లో పడ్డారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయనపై చేసిన వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయంటూ గిరిజన సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా రాయదుర్గం పోలీసులు విజయ్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.   సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'రెట్రో'. ఏప్రిల్ 26న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ట్రైబ్ అనే పదాన్ని ఉపయోగించాడు. అయితే ఆయన వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయంటూ పలువురు ఫిర్యాదు చేశారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ విజయ్ గతంలోనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ విజయ్ పై కేసు నమోదైంది.  
  In what is being hailed as a landmark cinematic moment, the makers of Jana Nayakudu have unveiled the much-anticipated First Roar — a commanding first glimpse of Thalapathy Vijay from what will be his final film. Dropped on the occasion of the superstar’s birthday, the video is already creating waves across the internet, setting the tone for what promises to be a legendary swansong.   The 65-second teaser opens with Vijay’s voice saying, “You guys will live in my heart”, followed by a striking visual of him walking in a police uniform, lathi in hand, through what resembles a war-torn battlefield. It’s a shot that blends power, calm, and consequence — a signal that this farewell will be anything but ordinary.   Complementing the video is a newly released birthday poster that features Thalapathy Vijay seated regally on a leather throne, gripping a sword against a smoky, intense backdrop. The imagery speaks volumes — a king, a warrior, a leader — all rolled into one commanding presence.   Jana Nayakudu carries immense emotional significance as Vijay’s final on-screen appearance. More than just a film, it marks the culmination of a career that redefined stardom — a tribute to the man who became a movement.   Directed by H. Vinoth, known for his compelling narratives and nuanced storytelling, the film also boasts music by Anirudh Ravichander, whose association with Vijay has consistently delivered blockbuster tracks.   Backed by Venkat K. Narayana under KVN Productions, Jana Nayakudu is set for a grand worldwide release on January 9, 2026, perfectly timed for the festive Pongal weekend. With anticipation already at fever pitch, the film promises to be a spectacular send-off — a cinematic celebration of a legacy three decades in the making.   As the First Roar echoes across platforms, fans are uniting for one final journey with their beloved Thalapathy — a farewell soaked in power, pride, and unparalleled emotion.  
ఈమధ్యకాలంలో కంటెంట్‌ ఉన్న సినిమాలు ఏ రేంజ్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కూడా అలాంటి కోవలోకే వెళ్తుంది అని చెప్పచ్చు. ఫ్యామిలీ మ్యాన్‌ అనిపించుకుంటున్న కథానాయకుడు ఫ్యామిలీనీ హేట్‌ చేస్తూ కనిపించిన ఈ టీజర్‌తో కథ తాలూకు కొత్తదనం చెప్పకనే చెప్పారు దర్శక రచయిత ఉదయ్‌శర్మ. మణిశర్మ సంగీతం అందించిన ఈ సరికొత్త కుటుంబ కథా చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, రామ్‌కిరణ్‌, మేఘా ఆకాష్‌, బ్రహ్మానందం, సత్య, గిరి, భద్రం ముఖ్య తారాగణంగా.. ప్రేక్షకులని అలరించబోతున్నారు.  ఈ చిత్ర టీజర్‌ విషయానికి వస్తే ఒక పక్క నుండి అర్జున్‌ రెడ్డి లాంటి వైబ్స్‌ కనిపిస్తూనే మరోపక్క కుటుంబ సమేతంగా చూసే చిత్రం అని అర్థమవుతుంది. టీజర్‌ లోని ప్రతి డైలాగ్‌, విజువల్‌ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అలాగే సత్య, బ్రహ్మానందం హాస్యం చిత్రంలో బాగా పండుతుందని అనిపిస్తుంది. మేఘా ఆకాష్‌ మంచి క్యారెక్టర్‌ ప్లే చేసినట్లు అర్థమవుతుంది. రామ్‌ కిరణ్‌ ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో ఒక మార్క్‌ సృష్టిస్తారు అనిపించేలా తన ప్రజెన్స్‌, పెర్‌ఫార్మెన్స్‌ కనిపిస్తుంది. కుటుంబం విషయాలలో హీరో ఉద్దేశం అందరిలా సహజంగా ప్రేమగా కాకుండా కాస్త కొత్తగా ఉంటుందని ఈ చిత్ర టీజర్‌ చూస్తే అనిపిస్తుంది. టీజర్‌లోని సంగీతం చాలా బాగుంది. త్వరలోనే విడుదల అవనున్న ఈ చిత్రం ప్రేక్షకులకు చక్కటి తెలుగింటి భోజనం అందించనుంది. రామ్‌కిరణ్‌, మేఘా ఆకాష్‌, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్‌, రాజశ్రీ నాయర్‌, రచ్చ రవి, గిరిధర్‌, తాగుబోతు రమేష్‌, భద్రం తదితరులు నటించిన ఈ సినిమాకి రచన, దర్శకత్వం: ఉదయ్‌శర్మ, నిర్మాత: హెచ్‌.మహదేవగౌడ్‌, సంగీతం: మణిశర్మ, డిఓపి: మధు దాసరి, ఎడిటర్‌: శశాంక్‌ మలి, కొరియోగ్రాఫర్‌: చిన్ని ప్రకాష్‌, భాను, విజయ్‌ పొలాకి, సాహిత్యం: అనంత శ్రీరామ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: పి.ఎస్‌.వర్మ, ఫైట్స్‌: అంజి, కార్తీక్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : రోహిత్‌ కుమార్‌ పద్మనాభ. 
వైష్ణవ్ తేజ్(Vaishnav Tej)హీరోగా, బుచ్చిబాబు(Buchibabu)దర్శకత్వంలో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mytri Movie Makers)నిర్మించిన చిత్రం 'ఉప్పెన' ఈ మూవీ ద్వారా తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేసిన కన్నడ భామ 'కృతిశెట్టి'. మొదటి సినిమాలోనే ఎలాంటి బెరుకు లేకుండా సీనియర్ హీరోలకి  ధీటుగా నటించి అశేష ప్రేక్షకాభిమానాన్ని పొందింది. ముఖ్యంగా తండ్రి క్యారెక్టర్  విజయ్ సేతుపతి తో వచ్చిన సీన్స్ లో ఆమె పెర్ఫార్మెన్సు ని ఎవరు మర్చిపోలేరు. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత వరుసగా చేసిన మాచర్ల నియోజక వర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే వంటి చిత్రాల పరాజయంతో, తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. కృతి శెట్టి ప్రస్తుతం తమిళ సినీ పరిశమ్రలో తన జోరు కొనసాగిస్తోంది. లవ్ టుడే ఫేమ్ 'ప్రదీప్ రంగనాధన్'(Pradeep Ranganathan)తో చేస్తున్న 'లవ్ ఇన్సూరెన్స్' కంపెనీ సెప్టెంబర్ 25 న విడుదల కానుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి 'నయనతార' భర్త 'విగ్నేష్ శివన్'(Vignesh Shivan)దర్శకుడు. దీంతో లవ్ ఇన్సూరెన్స్ పై అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి. అగ్ర హీరో కార్తీ(Kathi)తో చేసిన 'వా వాతియార్' విడుదలకి సిద్ధం కాబోతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ పై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. జయం రవి(Jayam Ravi)తో 'జీని' అనే మూవీ చేస్తుంది. ఈ మూవీ కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.   మలయాళ చిత్ర రంగంలోకి అడుగుపెట్టి అగ్ర హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)తో 'ఖలీఫా' అనే చిత్రంలో చెయ్యబోతుందనే వార్తలు వస్తున్నాయి. పృథ్వీ రాజ్ సుకుమారన్ లాంటి స్టార్ హీరోతో చెయ్యడం ఖాయమైతే కనుక,  మలయాళంలో కృతికి మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతో మలయాళ, తమిళ చిత్ర రంగాల్లో కృతి ఫుల్ బిజీయస్ట్ హీరోయిన్ గా మారే అవకాశం ఉంది. దీంతో  ఆమె తెలుగుకి దాదాపుగా గుడ్ బై చెప్పినట్టే అనే వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వినపడుతున్నాయి.  
Mohanlal has made Georgekutty, a household name in Kerala, with his impactful portrayal in Drishyam. While the final twist in the tale, made it a shocking thriller, the emotional portrayal has made it an instant classic. The movie's Telugu version and Hindi version with same name have also become huge blockbusters.  Drishyam 2 got a direct OTT release and created a sensation all over. Still, Ajay Devgn's Hindi version, where he plays Vijay Salgaonkar, has become the biggest blockbuster for the actor till that time in his career. Now, he is starting the third part even before Malayalam version announces the shoot starting date.  From 2nd October 2025, Drishyam 3 Hindi version is going to start shooting. While Mohanlal stated that Jeethu Joseph and he have been working on the script and will start shoot as sonn as possible, probably, by the end of this year, it seems like Ajay is ready to take it on floors before the original.  Already, he is building on his horror franchise inspired by Shaitaan success. His wife Kajol played leading role in MAA and his other franchise film Raid 2, did achieve moderate success. So, he is looking to take forward the franchises even faster, says bollywood media.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ఈమధ్యకాలంలో ఏ సినిమాకీ లేనన్ని ట్విస్టులు హరిహర వీరమల్లు సినిమాకి కనిపిస్తున్నాయి. దాదాపు ఐదు సంవత్సరాల క్రితం ఈ సినిమాను ఎనౌన్స్‌ చేశారు. ఎన్నో గ్యాప్‌ల మధ్య షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. కానీ, ఇప్పటికే చాలాసార్లు రిలీజ్‌ డేట్‌ను పోస్ట్‌ పోన్‌ చేస్తూ రావడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతోందా అనిపిస్తోంది. అనేక సార్లు ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసి చివరికి జూన్‌ 12 అన్నారు. కానీ, ఆ డేట్‌కి కూడా రిలీజ్‌ చెయ్యలేకపోయారు. ఇప్పుడు మరో కొత్త డేట్‌తో వచ్చారు. అది జూలై 24.  హరిహర వీరమల్లు జూలై 24న రిలీజ్‌ కాబోతోందని తెలియజేస్తూ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ వంటి స్టార్‌ హీరో సినిమాకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీ సంస్థలే. సినిమా రిలీజ్‌ డేట్‌లను ఓటీటీ సంస్థలు నిర్ణయిస్తున్నాయన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. దానికి హరిహర వీరమల్లు కూడా మినహాయింపు కాదు అని తాజా పరిణామాల వల్ల తెలుస్తోంది. అయితే ఓటీటీలపై నిర్మాతలు ఆధార పడడంలో తప్పులేదు. ఎందుకంటే రిలీజ్‌ అయిన తర్వాత థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయం గురించి ముందుగానే చెప్పలేరు. అదే ఓటీటీకి రైట్స్‌ ఇచ్చేస్తే పెద్ద ఎమౌంట్‌ నిర్మాతల కంటికి కనిపిస్తుంది. దాంతో వారు చెప్పినట్టుగానే నిర్మాతలు నడుచుకోవాల్సి వస్తోంది.  ఇక విజయ్‌ దేవరకొండ సినిమా కింగ్‌డమ్‌ పరిస్థితి కూడా అదే. ఈ సినిమా రిలీజ్‌ కూడా అనేక సార్లు వాయిదా పడింది. తాజా రిలీజ్‌ డేట్‌ కోసం ఓటీటీ సంస్థతో చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చే వారం ప్రకటిస్తారని తెలుస్తోంది. హరిహర వీరమల్లు, కింగ్‌డమ్‌.. ఈ రెండు సినిమాలు జూలై 25న ఒకేరోజు రిలీజ్‌ అవుతాయని గతంలో వార్తలు వచ్చాయి. అయితే రిలీజ్‌ డేట్స్‌ అఫీషియల్‌గా ఎనౌన్స్‌ చేస్తే గానీ క్లారిటీ రాదు అని అంతా అనుకున్నారు. హరిహర వీరమల్లు డేట్‌ వచ్చేసింది. ఇప్పుడు కింగ్‌డమ్‌ గురించే అందరూ ఆలోచిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ సినిమాకి, తమ సినిమాకి మధ్య ఒక వారం గ్యాప్‌ ఉంటే బాగుంటుందని కింగ్‌డమ్‌ నిర్మాతలు భావిస్తున్నారు. కానీ, అలా జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఒకే వారంలో రెండు రోజుల గ్యాప్‌ రిలీజ్‌ చేసే చాన్స్‌ ఉందని సమాచారం. ఇప్పటికే హరిహర వీరమల్లు ప్రమోషన్‌ కొంత చేశారు. ఇప్పుడు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది కాబట్టి ఇప్పటి నుంచి ప్రమోషన్‌ మరింత స్పీడప్‌ చేస్తారు. అయితే ఇప్పటికే అనేకసార్లు ఈ సినిమా రిలీజ్‌ వాయిదా పడింది. దాంతో ప్రేక్షకుల్లో సినిమా రిలీజ్‌ అవుతుందన్న నమ్మకం లేనట్టుగా కనిపిస్తోంది. కొత్త పోస్టర్‌ వచ్చినప్పటికీ దీనిపై సోషల్‌ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 
  ఈ రోజు యోగా డే అంటూ చాలా ఆడంబరంగా ఉత్సవాలలా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ప్రధాని మోడీ గారు అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా ఈసారి యోగా డే దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. అందులోనూ అన్ని రాష్ట్రాల చూపులు విశాఖపట్నం ఆర్.కె బీచ్ వైపై ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఈ రోజు యోగా అనేది విదేశీయులను కూడా ఆకర్షించే అంశం అయిపోయింది.  ఇది మనిషి ఆరోగ్యానికి జీవనాడి అయ్యింది.  అయితే ఈ యోగాను భారతీయులకు అందించినది పతంజలి మహర్షి. అందుకే యోగా డే  సందర్బంగా ఆ మహనీయుడిని గుర్తుచేసుకోవడం భారతీయుల కర్తవ్యం. అలాగే..  యోగా కోసం పతంజలి మహర్షి చేసిన కృషి,  ఆయన చరిత్ర తెలుసుకుంటే.. పతంజలి మహర్షి చరిత్ర వృత్తాంతం  భారత సంస్కృతిలో ఒక గంభీరమైన, ఆధ్యాత్మికంగా ప్రేరణాత్మకమైన గాథ. ఇది పురాణ, ఇతిహాస, ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా వచ్చిందని చెప్పవచ్చు. ఆయన ఒక భగవద్భక్తుడు, తత్త్వవేత్త, గొప్ప పండితుడు. ఆయన్ను మూడు ముఖ్యశాస్త్రాలలో విపులమైన కృషి చేసినవాడిగా గుర్తిస్తారు . ఆ మూడు ఏమిటంటే.. యోగశాస్త్రం, వ్యాకరణం (సంస్కృత వ్యాకరణం),  ఆయుర్వేదం.  ఆయన చరిత్ర వృత్తాంతం..  ఆదిశేషునిగా అవతారం.. పతంజలి మహర్షి, విష్ణుమూర్తికి సేవ చేసే ఆదిశేషుని అవతారంగా పరిగణించబడతారు. ఒక సందర్భంలో, విష్ణుడు తన హృదయంలో శివుని ఆనందతాండవాన్ని దర్శించుకుంటుండగా, ఆదిశేషునికీ ఆ తాండవాన్ని చూడాలనే కోరిక కలిగిందట. అందుకు అనుగుణంగా  విష్ణుమూర్తి ఆదిశేషునికి భూలోకంలో అవతరించాల్సిందిగా సూచించాడు. గోనికా తపస్సు & పతంజలి అవతారం.. విష్ణుమూర్తి ఆదిశేవును భూలోకంలో అవతరించమని ఆదేశించి  సమయంలో గోనికా అనే పతివ్రత స్త్రీ, సూర్య భగవానుని ప్రార్థిస్తూ  లోకానికి ఉపయోగపడే బిడ్డ కావాలని తపస్సు చేస్తూ, చేతులలో నిండుగా నీటిని తీసుకుని అంజలి ఘటిస్తూ అంటే నమస్కారం చేస్తూ అర్చించుకుంటున్న  సమయంలో పాము రూపంలో ఆదిశేషుడు ఆమె చేతుల్లోకి పడిపోయాడట. అందువల్ల ఆ బాలుని పేరు పతంజలి (పతనము + అంజలి) అని ఉద్భవించింది. నటరాజుని తాండవ దర్శనం.. పతంజలి మహర్షి తన తల్లిదండ్రుల వద్ద పెరిగి, తర్వాత చిదంబరం వచ్చినాడు.  అక్కడ శివుడు నటరాజు రూపంలో తాండవం చేస్తున్నాడని తెలిసి. అతనికి శివుని తాండవాన్ని చూసే అవకాశం లభించింది. నంది, భృంగిలు అతని శరీరాకృతిపై హేళన చేసినా, అతను నోరుతో “నటరాజ నవకం” అనే స్తోత్రాన్ని గానం చేసి శివుని ఆనందింపజేశాడు. ఈ నటరాజ నవకం అనేది పూర్తీగా డమరుక శబ్దంతో ఉంటుంది. నటరాజ నవకం విని సంతోషించిన శివుడు నిన్నునాట్యంలో భాగం చేస్తాను బాధపడకు అని చెప్పి  శివుడు అతనిని తన పాదాల చుట్టూ చుట్టి తాండవంలో భాగస్వామిని చేశాడు.  ఇది పతంజలి మహర్షి  భగవత్‌ ప్రేమకు సంకేతం.  త్రికరణ శుద్ధి లక్ష్యంగా విద్యాబోధన.. శివుని ఆశీర్వాదంతో పతంజలి, భూలోకానికి త్రికరణ శుద్ధి  అంటే మనస్సు, వాక్కు, కర్మ అనేవి  సాధించేందుకు మూడు శాస్త్రాలను అందించాడు. యోగశాస్త్రం – మనస్సు శుద్ధి కోసం వ్యాకరణం – వాక్కు శుద్ధి కోసం ఆయుర్వేదం – శరీర శుద్ధి కోసం శిష్యులకు బోధన.. పతంజలి 1000 మందికి బోధన ఇవ్వాలనుకున్నాడు. అందరి అర్హతలు భిన్నంగా ఉండటంతో, ఓ తెర వెనుక ఆదిశేషురూపంలో బోధించాడు. తెర ఎత్తవద్దని చెప్పినా ఒక శిష్యుడు అతని నియమాన్ని ఉల్లంఘించి తెర తీసేశాడు. దీంతో 999 మంది విద్యార్థులు కాలిపోయారు. మిగిలిన శిష్యుడికి పతంజలి మొత్తం విద్యను బోధించాడు, కాని అతను శాపగ్రస్తుడై బ్రహ్మ రాక్షసుడయ్యాడు. శిష్యుడిని శాప విముక్తుడిని చేసిన ఘట్టం.. ఆ బ్రహ్మ రాక్షసుడు జ్ఞానాన్ని బోధించగల అర్హుడిని వెతుకుతూ, సరైన జవాబు చెప్పని వారిని మింగేవాడు. చివరికి పతంజలి మహర్షి స్వయంగా శిష్యుడి రూపంలో (చంద్రశర్మగా) వచ్చి, సరైన సమాధానం ఇచ్చి, జ్ఞానం తీసుకొని శిష్యుడిని శాపం నుండి విముక్తుణ్ని చేశాడు. ఆ రాక్షసుడు తరువాత గౌడపాదాచార్యుడుగా అవతరించాడు. ఆయన రచనలు.. యోగ సూత్రాలు (196 సూత్రాలు) – యోగ దార్శనికశాస్త్రానికి ప్రామాణిక గ్రంథం. మహాభాష్యం – పాణినీ వ్యాకరణంపై వ్యాఖ్యాన గ్రంథం. ఆయుర్వేదానికి సంబంధించిన రచనలకూ ఆయనకు ఆపాదించబడింది, కానీ ఆధారాల పరంగా స్పష్టత లేదు.  జీవసమాధి స్థలం.. పతంజలి మహర్షి జీవసమాధి స్థలం తమిళనాడు, తిరుపత్తూరు (త్రిచీ దగ్గర)లోని బ్రహ్మపురీశ్వర ఆలయంలో ఉంది.  ప్రార్థన శ్లోకం.. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన। యోఽపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోఽస్మి॥ మనస్సు, వాక్కు, శరీరం శుద్ధి కోసం పతంజలిని ప్రణమిస్తాను అని ఈ ప్రార్థన అర్థం.                                     *రూపశ్రీ
    ఎవరినైనా ఎక్కువగా ప్రేమించడం అనేది సహజమైన భావోద్వేగ ప్రక్రియ. కానీ ఈ ప్రేమ "అతిగా", "అనుదినం అతి ఆసక్తితో", లేదా "అత్యంత అనుభూతులతో" కొనసాగితే, కొన్ని సానుకూలతలతో పాటు ప్రతికూల పరిణామాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని భావోద్వేగ, మానసిక, సంబంధ నైపుణ్యాలు, జీవిత నిర్వాహణ దృష్టికోణాల్లో విపులంగా విశ్లేషిస్తే ఇలా ఎవరినైననా ఎక్కువగా ప్రేమించడం ఎంత వరకు మంచిది అనే విషయం అర్థమవుతుంది.  ఇందులో సానుకూల, ప్రతికూల ప్రభావాలు రెండూ ఉంటాయి కాబట్టి ఈ రెండింటి గురించి తెలుసుకోవాలి. సానుకూల ప్రభావాలు. బంధం బలపడుతుంది.. ఇతరుల మీద  చూపే ప్రేమతో ఎదుటి వ్యక్తికి భద్రత, ఆదరణ, విలువ అనే భావనలు కలుగుతాయి. ఎక్కువ ప్రేమ చూపించడం వల్ల ఇద్దరి మధ్య అవగాహన, విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. ఇద్దరూ ఒకరిపట్ల మరొకరు ప్రేమగా ఉండే వాతావరణం పెరుగుతుంది. సహనశీలత పెరుగుతుంది..  ఎవరినైనా బాగా ప్రేమిస్తే వారి లోపాలను సహించగలగడం, వారిని మార్చుకునే అవకాశం ఇవ్వడం సులభమవుతుంది.  దీని వల్ల బంధాలు నిలబడతాయి.  ఇలాగే మనుషులలో మార్పు సాధ్యమవుతుంది.  నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు కదా వారి కోసం మారితే తప్పేంటి అనే ఆలోచన పుడుతుంది. అలాగే వారికోసం త్యాగాలు చేయడంలో తృప్తి కలుగుతుంది.  ఆ వ్యక్తి కోసం  చేసే త్యాగాలు బాధించవు. ప్రేమించే వ్యక్తి ఆనందంగా ఉండటం చూసి  సంతోషపడటంలో తన సంతోషం చూసుకుంటారు.  ప్రతికూల పరిణామాలు. ఎక్కువగా ప్రేమించడం వల్ల సానుకూల పరిణామాలే కాకుండా ప్రతికూల పరిణామాలు కూడా ఉంటాయి.  స్వీయ గౌరవం తగ్గిపోవడం..  పూర్తిగా ఎదుటివారిని ప్రేమిస్తూ, ఎదుటి వారి కోసం జీవిస్తూ, వారిని సంతుష్టిపరిచే ప్రయత్నంలో  తమ  వ్యక్తిత్వం మరిచిపోవడం జరుగుతుంది. ఇలా తమను తాము పట్టించుకోకుండా ఎదుటివారికే ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల  ఎదుటివారి దృష్టిలో తక్కువయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. తాము ఎదుటివారి కంటే ఎప్పుడూ తక్కువే అనే ఫీలింగ్ ప్రేమించే వ్యక్తులలో కూడా ఏర్పడుతుంది.  అధిక ఆసక్తి.. ప్రేమ అనే భావన క్రమంగా అధిక ఆకర్షణగా మారి, తట్టుకోలేని అసహనంగా, నియంత్రణ కోల్పోయే స్థితికి చేరవచ్చు. ఇది ఎదుటివారికి అసౌకర్యంగా, బంధంలో ఒత్తిడిగా భావించడానికి దారి తీస్తుంది. ఆత్మనిబ్బరత కోల్పోవడం.. తమ నిర్ణయాలు, సంతోషాలు, భావోద్వేగాలు అన్నింటినీ ఒకే వ్యక్తిపై ఆధారపడి చూసే విధంగా మారిపోతారు.  వారు  లేకుండా జీవించలేని స్థితి ఏర్పడుతుంది. ఇది మానసికంగా ప్రమాదకరం. వైఫల్యం.. ఎక్కువగా చూపించే ప్రేమకు తగినట్టు అవతలి వ్యక్తులు  సమానంగా స్పందించకపోతే, తీవ్రమైన హృదయవేదన, నిరాశ, కోపం, డిప్రెషన్ వంటి భావాలు రావచ్చు. కొందరికి ఈ జీవితం వద్దు అని ఆత్మహత్య ఆలోచనలు ఏర్పడే స్థితికి దారితీయవచ్చు. సంబంధంలో అసమతుల్యత.. ఒకరు ఎక్కువగా ప్రేమిస్తే, మరొకరు తక్కువగా స్పందిస్తే, ఈ అసమతుల్యత బంధం అసంతృప్తికరంగా మార్చుతుంది. సమతుల్యంగా ప్రేమించడం ఎలా? స్వీయ గౌరవాన్ని నిలుపుకోవాలి.. ప్రేమించడమే కాదు, తానేంటో గుర్తుంచుకోవాలి. వ్యక్తిగత  విలువను మరువకూడు. ప్రేమించిన వారి కోసం  జీవితవిధానాలను పక్కన పెట్టవద్దు.  కెరీర్, కుటుంబం, ఇతర హక్కులు, అభిరుచుల్ని కొనసాగించాలి. ఎక్కువ మందితో  ప్రేమ చెలామణీ కాకుండా, అవగాహనతో ప్రేమించాలి.  వారి స్వేచ్ఛకు అడ్డుపడకుండా ప్రేమ చూపించాలి. స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరం.  మీరు ఎంత ప్రేమిస్తున్నారో చెప్పారు, అలాగే ఎదుటివారి భావనలకూ గౌరవం ఇవ్వాలి. సంతృప్తితో ప్రేమించాలి. సమాధానాల కోసం కాదు. ఎదుటివారు  ప్రేమను తిరిగి ఇవ్వకపోయినా  ప్రేమలో అంతరంగిక తృప్తి ఉండాలి.                     *రూపశ్రీ.
  యోగా గురించి ఆయుర్వేదం చాలా ప్రాముఖ్యంగా చెబుతుంది. ఇది శరీరం, మనసు,  ఆత్మ మధ్య సమతుల్యతను ఏర్పరచే సాధనంగా పరిగణించబడుతుంది. ఆయుర్వేదం,  యోగా రెండూ భారతీయ సంప్రదాయ వైద్యం,  ఆధ్యాత్మికతకు మూల స్తంభాలుగా ఉన్నాయి. ఇవి పరస్పరం అనుసంధానంగా ఉండి, ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ,  శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా  మెరుగుపరచే విధానాలను అందిస్తాయి. ఆయుర్వేదంలో యోగ స్థానం ఇదే.. త్రిదోష సిద్ధాంతానికి అనుగుణంగా... ఆయుర్వేదం ప్రకారం మన ఆరోగ్యం మూడు దోషాలపై ఆధారపడి ఉంటుంది.  వాత, పిత్త, కఫ అనే దోషాలు ప్రతి మనిషిలో ఉంటాయి. ఇవి సమతుల్యంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది.  ఈ త్రిగుణాలను సమతుల్యంలో ఉంచడానికి యోగా సహాయపడుతుంది. ఉదాహరణకు.. ప్రాణాయామం వాత దోషాన్ని నియంత్రించగలదు, ఆసనాలు కఫ దోషాన్ని క్రమంలోకి తేస్తాయి. ధ్యానం పిత్త దోషాన్ని శాంతపరచగలదు. ఆహార, ఆచార నియమాలకు తోడుగా.. ఆయుర్వేదం మనిషి జీవన విధానాన్ని సమతుల్యంలో ఉంచే విధంగా ఆహార నియమాలు , జీవన శైలి ,  మానసిక ఆరోగ్యం  ఉండాలని చెబుతుంది.  వీటిని ఆహార, విహార, మనోవ్యాపార నియమాలు అని అంటుంది.  యోగా వీటిని స్థిరంగా పాటించడంలో శరీరానికీ మనస్సుకీ స్థిరత్వాన్ని ఇస్తుంది. యోగ ప్రాముఖ్యత ఇదే.. శరీరశుద్ధి .. యోగిక శుద్ధిక్రియలు  ముఖ్యంగా కపాలభాతి, జలనేతి, శంఖ ప్రక్షాలన మొదలైనవి శరీరంలో తామసిక,  రజసిక సంకలితాలను తొలగించి, సత్వగుణాన్ని పెంచుతాయి. ఇది ఆయుర్వేదంలో చెప్పే "పంచకర్మ" విధానాలకు సహాయకం. ఆత్మ నియంత్రణ .. యోగాభ్యాసం వల్ల శీలం, నియమం, ధైర్యం, సామర్థ్యం వంటి లక్షణాలు పెరుగుతాయి. ఇవి ఆయుర్వేదంలో స్వస్థవ్యక్తి లక్షణాలుగా పేర్కొనబడ్డాయి. మనోవ్యాధుల నివారణ.. ఆయుర్వేదంలో మనోవ్యాధులు (మానసిక రుగ్మతలు) కోసం సత్త్వవజయ చికిత్స అనే ప్రత్యేక విభాగం ఉంది. ఇందులో ధ్యానం, ప్రాణాయామం,  మనస్సు పై నియంత్రణ సాధనాలుగా యోగను ఉపయోగిస్తారు. ఒజస్సు వృద్ధి.. యోగా ఆయుర్వేదంలో ముఖ్యంగా చెప్పే "ఒజస్సు" (శరీర రక్షణశక్తి)ని పెంచుతుంది. దీర్ఘకాలికంగా యోగ సాధన వల్ల దీర్ఘాయువు, యోచనా స్పష్టత, జీవశక్తి పెరుగుతాయి. అంతర్వేద కాలం నుంచి ఆధునిక యోగం వరకు.. ఆయుర్వేద గ్రంథాల్లో  ముఖ్యంగా అష్టాంగ హృదయం, చరక సంహిత, సుశ్రుత సంహిత మొదలైన గ్రంథాలలో  యోగ గురించి ప్రత్యక్షంగా ప్రత్యేక అధ్యాయాలు లేవు కానీ, జీవన నియమాలలో, దినచర్య, ఋతుచర్యల్లో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి సాధనలు సూచించబడ్డాయి. ఆయుర్వేదంలోని "స్వస్థవృత్తం" అనే విభాగం యోగానికి ప్రాధాన్యతను సూచిస్తుంది. ఆయుర్వేదంలో యోగ ప్రాముఖ్యత.. శరీర ఆరోగ్యం దోష సమతుల్యం, శుద్ధిక్రియలు మానసిక శాంతి ధ్యానం, మనోవ్యాధుల నివారణ జీవశక్తి ఒజస్సు వృద్ధి, జీవన శైలి దినచర్య, ఋతుచర్యలో భాగంగా ఆత్మీయ వికాసం ధ్యానం ద్వారా ఆత్మ గమనం మొదలైనవి సాధించడానికి సహాయపడుతుందని యోగ గురించి ఆయుర్వేదం చెబుతుంది.                       *రూపశ్రీ.
యోగ శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. యోగాలో చాలా రకాల ఆసనాలు ఉంటాయి. వాటిలో కొన్ని చాలా శక్తివంతమైనవి కూడా ఉన్నాయి.  యోగాలో శక్తివంతమైన (Powerful) ఆసనాలు  శరీరానికి శక్తిని, స్థిరతను, సౌష్టవాన్ని, ధైర్యాన్ని ఇచ్చే ఆసనాలు. ఇవి శారీరకంగా గట్టిగా ఉండటంతో పాటు మానసిక శాంతిని కూడా అందిస్తాయి. ఇవి శక్తి, సహనం, స్తైర్యం, ఫోకస్, ప్రాణశక్తి పెంచే విధంగా పనిచేస్తాయి. అలాంటి శక్తివంతమైన యోగాసనాలు ఏవో తెలుసుకుంటే.. శక్తివంతమైన యోగాసనాలు.. వీరభద్రాసనాలు..   వీరభద్రాసనాలలో మూడు రకాలు ఉన్నాయి.   ఇవి వేస్తుంటే శరీరానికి ధైర్యం, స్థైర్యం కలుగుతుంది. కాళ్ళు, చేతులు, వెన్నెముక బలపడతాయి. మనస్సు కేంద్రీకృతం అవుతుంది.  నౌకాసన (Boat Pose).. నౌకాసనం వస్తుంటే శరీరంలో మధ్య భాగం (core) శక్తివంతంగా తయారవుతుంది. అబ్డోమినల్ మసిల్స్, స్పైన్ బలపడతాయి. మానసిక దృఢత పెరుగుతుంది. బకాసన (Crow Pose).. బలమైన చేతులు, మోకాలుకు సపోర్ట్ కావాలంటే బకాసన వేయడం చాలా మంచిది. ఈ ఆసనం వేయడం వల్ల  ఫోకస్, సమతుల్యత అభివృద్ధి చేస్తుంది.  ధైర్యాన్ని పెంచుతుంది.  ఉర్ధ్వ ధనురాసనం (Upward Bow or Wheel Pose).. ఊర్థ్వ ధనురాసనం వేస్తే వెన్నెముక, గుండె, ఛాతీ తెరుచుకుంటాయి. ఇది  శక్తిని పంచుతుంది, ఉత్సాహం పెంచుతుంది. పరివ్రుత్త పర్వతాసన (Revolved Triangle Pose ) పరివృత్త పర్వతాసన వేయడం ద్వారా శరీరానికి లవణత (flexibility),  బలం ఇస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. శరీరాన్ని డిటాక్స్  చేయడంలో సహాయం చేస్తుంది.  అధో ముఖ శ్వానాసన (Downward Facing Dog).. అధోముఖ శ్వానాస వేయడం వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ప్రభావం పడుతుంది.  ఇది శక్తిని పునరుత్తేజితం చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. చతురంగ దండాసన (Low Plank).. చేతులు, భుజాలు, మధ్య భాగం బలంగా తయారవుతాయి. శక్తిని కేంద్రీకరించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రాణాయామం తో కలిపితే.. శక్తివంతమైన ఆసనాలకు ప్రాణాయామం (విశేషంగా కపాలభాతి, బస్ట్రికా) తోడైతే శక్తి స్థాయి మరింత పెరుగుతుంది. సూచనలు: ఆసనాలు సాధన చేయడానికి ముందుగా మైల్డ్ వార్మప్ చేయాలి. శ్వాసపై దృష్టి పెట్టడం ముఖ్యం. మొదట్లో శిక్షణ పొందిన గురువు సూచనతో చేయడం ఉత్తమం.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
  కిడ్నీలో రాళ్ల సమస్య చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య. ఇవి సాధారణంగా యూరిన్‌లో ఉండే ఖనిజాలు, లవణాలు కలిసి కఠిన పదార్థాలుగా ఏర్పడటం వల్ల ఏర్పడతాయి. ఈ రాళ్ల రకాన్ని బట్టి (క్యాల్షియం ఆక్సలేట్, యూరిక్ ఆసిడ్, స్ట్రవైట్, సిస్టైన్ రాళ్లు) ఆహార నియమాలు మారవచ్చు. అయితే సాధారణంగా తీసుకోవాల్సిన, నివారించాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. తినాల్సినవి .. నీరు (Water) కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నవారు రోజుకు 3-4 లీటర్లు నీరు తాగాలి. అధిక యూరిన్ ఉత్పత్తి ద్వారా రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. అందుకే కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నవారు నీరు బాగా తాగాలని వైద్యులు కూడా చెబుతారు. పళ్లు (Fruits): నిమ్మకాయ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లు  బాగా తీసుకోవాలి. ఇవి సిట్రేట్ అనే పదార్థాన్ని ఇచ్చి రాళ్ల ఏర్పాటును అడ్డుకుంటాయి. అలాగే నీరు ఎక్కువగా ఉండే పళ్లు  కర్భూజ,  పుచ్చకాయ వంటివి కూడా చాలా మంచిది. కూరగాయలు.. తక్కువ ఆక్సలేట్ కలిగిన కూరగాయలైన దొండకాయ, దోసకాయ, బీరకాయ, కొబ్బరికాయ మొదలైనవి తీసుకోవడం మంచిది. ఆకుకూరలలో తోటకూర బాగా  తినాలి కానీ  ఎక్కువగా తినకూడదు. ధాన్యాలు.. బ్రౌన్ రైస్, గోదుమ రొట్టెలు, రాగి, జొన్న వంటి ఫైబర్ సమృద్ధిగా ఉండే ధాన్యాలు మంచివి. తక్కువగా తీసుకోవాల్సినవి.. తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు, పెరుగు.. తీసుకోవాలి. ముఖ్యంగా క్యాల్షియం బాగా తీసుకుంటే క్యాల్షియం ఆక్సలేట్ కారణంగా రాళ్లు తగ్గే అవకాశం ఉంటుంది. తినకూడని/నివారించాల్సినవి .. ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలు అయిన  మెంతి, బీట్రూట్ , పాలకూర, శనగలు, మామిడికాయలు తీసుకోకూడదు. అలాగే  నాచురల్ ఆక్సలేట్ అధికంగా ఉండే పళ్ళు, కూరగాయలకు దూరంగా ఉండటం మంచిది చెక్కెర,  ఉప్పు: అధిక మోతాదులో సాధారణ ఉప్పు  తీసుకుంటే అది  కిడ్నీలో రాళ్లను ప్రోత్సహిస్తుంది. తీపి పదార్థాలు కూడా నివారించాలి.  ముఖ్యంగా సోడాలు, క్యాండీలు, కేకులు మొదలైన తీపి ఆహారాలకు దూరంగా ఉండాలి. మాంసాహారం .. ఎక్కువ మోతాదులో మటన్, చికెన్, ఎగ్స్ తీసుకోవడం వలన యూరిక్ ఆసిడ్ స్థాయి పెరుగుతుంది. అలాగే మాంసాహారం వండటానికి ఉపయోగించే మసాలా దినుసులు తగ్గించాలి. సాఫ్ట్ డ్రింక్స్.. కోలా, సోడా, ఎనర్జీ డ్రింక్స్  తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో ఫాస్ఫేట్లు అధికంగా ఉంటాయి.  ఇవి కిడ్నీలో  రాళ్లను ప్రోత్సహిస్తాయి. విటమిన్ C అధిక మోతాదు.. రోజు 500 mg కంటే ఎక్కువగా విటమిన్-సి ని తీసుకోవడం వల్ల   ఆక్సలేట్ స్థాయిని పెరుగుతుంది. ఇతర చిట్కాలు.. మూత్రాన్ని నిర్ధారంగా రోజుకి 2 లీటర్లకు పైగా ఉత్పత్తి అయ్యేలా చూసుకోవాలి. ఆహారం బట్టే రాళ్ల రకాన్ని గుర్తించి ఆహార నియమాలు మార్చుకోవడం అవసరం. ఉదాహరణకు: క్యాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఉంటే ఆక్సలేట్ తగ్గించాలి. యూరిక్ ఆసిడ్ రాళ్లు ఉంటే ప్యూరిన్స్ తగ్గించాలి.  మాంసం, కప్పు టీలో ఉండే పదార్థాలు యూరిక్ ఆసిడ్ రాళ్లకు కారణం అవుతాయి.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా లాభదాయకం. ఇది యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు, ఫ్లేవనాయిడ్లు,  క్యాటెచిన్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరాన్ని డిటాక్స్  చేయడంలో, మెటబాలిజం పెంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అసలు గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటి? అలాగే ఎలాంటి గ్రీన్ టీ తీసుకోవాలి అన్న విషయాలు వివరంగా తెలుసుకుంటే.. గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే లాభాలు.. యాంటీఆక్సిడెంట్లు.. గ్రీన్ టీ లో ఉండే క్యాటెచిన్ అనే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా EGCG (Epigallocatechin gallate) కేన్సర్ కారక కణాల ఎదుగుదలని అడ్డుకుంటుంది. మెటబాలిజాన్ని పెంచుతుంది.. రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల బాడీ మెటబాలిజం పెరిగి కొవ్వు కాలే ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గడంలో సహాయం.. ముఖ్యంగా పొట్ట భాగం కొవ్వు కరిగించడంలో గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. వ్యాయామంతో పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. హృదయ ఆరోగ్యం.. గ్రీన్ టీ లో ఉండే పొటాషియం, ఫ్లేవనాయిడ్లు రక్తపోటు (BP) ని నియంత్రిస్తాయి, చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెదడు ఆరోగ్యం.. గ్రీన్ టీ లో ఉండే చిన్న మొత్తంలో కేఫిన్ మరియు L-theanine మానసిక ఉత్తేజకంగా పనిచేస్తాయి. ఇది మెమరీ, ఫోకస్ పెరగడానికి సహాయపడుతుంది.  టైప్ 2 డయబెటిస్.. గ్రీన్ టీ శరీరంలో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది, thereby షుగర్ లెవల్స్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది.  చర్మం & వెంట్రుకల ఆరోగ్యం.. గ్రీన్ టీ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు వయస్సు ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇది చర్మాన్ని మెరుగు పరచడంతో పాటు పింపుల్స్ ను  తగ్గిస్తుంది. డీటాక్స్.. గ్రీన్ టీ ప్రాకృతికంగా శరీరాన్ని టాక్సిన్స్  నుండి శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. ఎలాంటి గ్రీన్ టీ ఎంచుకోవాలి? ఆర్గానిక్ గ్రీన్ టీ.. కీటకనాశకాలూ, కెమికల్స్ లేని ఆర్గానిక్ వేరియంట్లు తీసుకోవడం ఉత్తమం. ఇప్పట్లో చాలా ఆర్గానిక్ గ్రీన్ లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. లూజ్ లీఫ్ గ్రీన్ టీ,  టీ బ్యాగ్స్.. లూజ్ లీఫ్ గ్రీన్ టీలో ఎక్కువగా యాక్టివ్ పదార్థాలు ఉంటాయి. టీ బ్యాగ్స్ కొన్నిటిలో నానోప్లాస్టిక్ పదార్ధాలు ఉంటాయి . అందుకే  చూసి ఎంచుకోవాలి. ఫ్లేవర్ కలిపిన గ్రీన్ టీ..  జాగ్రత్తగా.. జింజర్, లెమన్, తులసి, మింట్ వంటి సహజమైన ఫ్లేవర్స్ ఉన్న గ్రీన్ టీ సరే. అయితే అతి తక్కువ శాతం టీ ఉండే, ఎక్కువ artificial flavor ఉన్నవి తీసుకోకూడదు. ఎప్పుడు తాగాలి? ఉదయం ఖాళీ కడుపు మీద తాగకూడదు. ఎందుకంటే ఇది ఆమ్లత్వం (acidity) కలిగించవచ్చు.  భోజనం తరువాత 30 నిమిషాల లోపల లేదా సాయంత్రం తక్కువ ఆకలిగా ఉన్నప్పుడు గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. జాగ్రత్త.. రోజుకు 2–3 కప్పులు గ్రీన్ టీ సరిపోతుంది. మించితే నిద్రలేమి, అధిక ఆమ్లత్వం వంటి దుష్ప్రభావాలు రావచ్చు. గర్భిణీలు, ముదురు వయస్సు వారికి గ్రీన్ టీ తీసుకునే ముందు డాక్టర్ సలహా అవసరం. షుగర్  లేదా తీపి పదార్థాలు కలిపి తాగకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల గ్రీన్ టీ వల్ల లభించాల్సిన  అసలు ప్రయోజనం తగ్గిపోతుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...